మూ॥ శ్రీనారాయణ ఉవాచ :
భీష్మక ఉవాచ :
అను!! శ్రీనారాయణుడిట్లన్నాడు :
ఇక విదర్భ రాజేంద్రుడు మహాబలపరాక్రమములు కలవాడు. విదర్భ దేశంలో పుణ్యాత్ముడు, సత్యశీలుడు, భీష్మకుడని పేరు. (1) ఆరాజు నారాయణుని అంశము. అన్ని సంపదలను ఇచ్చేవాడు. ధర్మిష్ణుడు, పెద్దవాడు, వరిష్ణుడు, పూజింపబడేవాడు. (2) ఆతని కన్య మహాలక్ష్మి, రుక్మిణి అని పేరు. స్త్రీలలో శ్రేష్ఠురాలు చాలా అందకత్తె, రమ్యమైనది. లక్ష్మీ, స్త్రీలలో పూజింపబడునది. (3) నవ యౌవ్వన వంతురాలు, రత్నాభరణములతో అలంకరింపబడినది. కాల్చిన బంగారం వంటి రంగు గలది. తేజస్సుతో వెలిగిపోతున్న స్త్రీ, సతి ఆమె. (4) ఆమె శుద్ధసత్వ స్వరూపురాలు, సత్యశీలురాలు, పతివ్రత. శాంతురాలు, మిక్కిలి బ్రహ్మచర్యాదితపః క్లేశమునోర్చునది, అత్యంతము మంచి గుణములు కలది. (5) ఇంద్రుని భార్య వరుణుని భార్య చంద్రుని భార్య రోహిణి, కుభేరుని భార్య, సూర్యుని భార్య, స్వాహా, శాంత, కలావతి (6) ఇంకా ఇతరులైన రమణీయమైన స్త్రీలలో శ్రేష్ఠురాలు, చాలా మనోహరమైనది. వీళ్ళందరూ భీష్ముని కన్యయైన రుక్మిణి యొక్క పదహారవ భాగపు కళకు గూడా పోలరు. (7) రాజరాజేంద్రుడు,బాలక్రీడలందు ఆసక్తి కలిగిన, పరురాలైన ఆమెను చూచాడు. ఆమె బాల, మంచి శోభగలది, మేఘములలో చంద్రకళలాగా ఉన్నది. (8) శరత్కాల మందలి ఆమె బాలమంచి శోభగలది, శరత్కాలమందలి కమలముల వంటి కళ్ళు గలది. వివాహ యోగ్యమైనది, యువతి, లజ్జతో తలవంచుకున్నది శుభురాలు. (9) సువ్రతుడు, ధర్మశీలుడైన ధర్ముడు (రాజు) త్వరగా ఆలోచించి కూతురును, కొడుకులను, బ్రాహ్మణులను, పురోహితులను అడిగాడు. (10) భీష్మకుడిట్లా - నాకూతురు కొరకు, వరుడుగా తగిన వానిని, శ్రేషుని, వరునిగా ఎవరిని ఎంచుకోవాలి. మునిపుత్రునా, దేవపుత్రునా, రాజేంద్ర సుతునా, కోరతగినవాడెవడు. (11) నా కూతురు వివాహ యోగ్యురాలైంది, పెరుగుతోంది, మనోహరంగా ఉంది. నవయౌవన మందున్న యోగ్యుడైన వరుని త్వరగా చూడండి.(12) ధర్మశీలుడు, సత్యసంధుడు, నారాయణ పరాయణుడు, వేదవేదాంగము లెరిగినవాడు పండితుడు, సుందరుడు, శుభుడు (13) శాంతుడు, దాంతుడు, క్షమాశీలుడు, గుణవంతుడు, చిరకాలం జీవించేవాడు. గొప్పకులంలో పుట్టినవాడు, అంతటా పేరు గలవాడు (14) రాజపుత్రుని చేస్తే వాడు రణశాస్త్ర విశారదుడు, మహారథుడు , ప్రతాపమునకు తగినవాడు, యుద్ధంలో తలమానికగా ఉండే వాడుకావాలి. (15) దేవపుత్రుని చేస్తే దేవుడు, మంచి గుణవంతుడు, కావాలి. మునిపుత్రుని చేస్తే ఆతడు నాలుగు వేదములందు విశారదుడై ఉండాలి.(16) మంచిగా మాట్లాడేవాడు, విచారం తెలిసినవాడు, సిద్ధాంతములందు ఆరితేరినవాడు, నృపేంద్రుని మాటను విని మునిసుతుడు ఆతనితో ఇట్లన్నాడు. (17)
శతానంద ఉవాచ :
ఆమునిసుతుడు, గౌతముని కుమారుడైన శతానందుడు వేదవేదాంగ పారగుడు, ఆపుడు, మంచివక్త, విజుడు, ధర్మమెరిగినవాడు, కులపురోహితుడు. భూమి పై అన్ని తత్వముల నెరిగినవాడు, అన్ని పనులలో ఆరితేరినవాడు (18) శతానందుని వచనమిట్లా - ఓ రాజేంద్ర! నీవు ధర్మజ్ఞుడివి, ధర్మశాస్త్ర విశారదుడివి. (19) వేదములో చెప్పబడ్డ ప్రాచీనమైన ఆఖ్యానాన్ని చెబుతాను, విను. భూభారాన్ని తగ్గించే కొరకు నారాయణుడు స్వయంగా భూమి పై, (20) వసుదేవ సుతునిగా వచ్చాడు. శ్రీమంతుడు, పరిపూర్ణతముడు, ప్రభువు విధాతకు విధాత బ్రహ్మ ఈశుడు, శేషుడు వీరిచే నమస్కరింపబడేవాడు. (21) జ్యోతి స్వరూపుడు, పరముడు, భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తినవాడు. పరమాత్మ ప్రాణులన్నింటికన్న ప్రకృతికన్నపరుడు (22) నిర్లిప్తుడు, నిరీహుడు, అన్ని కర్మలకు సాక్షి. రాజేంద్ర! పరిపూర్ణతముడైన ఆతనికి కన్యను (23) ఇస్తే, నీ నూరుగురు పితరులతో సహా గోలోకానికి పోతావు. కన్యను ఇచ్చి, పైలోకంలో సారూప్య ముక్తిని పొందు. (24) ఇక్కడే అందరికి పూజ్యుడవై విశ్వగురువునకు గురువువుకమ్ము. నీ సర్వస్వము దక్షిణగా ఇచ్చి మహాలక్ష్మియైన రుక్మిణిని (25) సమర్పణ చేయి ఓవిభు! జన్మఖండనమును చేసుకో. ఓరాజ! ఈ సంబంధము బ్రహ్మ వ్రాశాడు. అందరికి ఇష్టమైంది. (26) ద్వారకానగరమందున్న కృష్ణునికై త్వరగా బ్రాహ్మణుని పంపు అందరికి నచ్చిన శుభ క్షణాన్ని త్వరగా నిర్ణయించు (27) భక్తులను అనుగ్రహించే కొరకు విగ్రహరూపుడైన పరమాత్మను తెచ్చి, ధ్యానమునకు అనురోధ హేతువైన (అనుసరించినడచుట), ఉత్తమమైన నిత్యదేహమును పొందు. (28) దృష్టి పడ్డంత మాత్రముననేనే జన్మ కర్మఖండనమును చేకూర్చుకో, ఓనృస! నాలుగు వేదములు, సజ్జనులు, దేవతలు ఆతనిని తెలుసుకోలేరు.సిద్ధేంద్రులు, మునీంద్రులు బ్రహ్మాదిదేవతలు అతనిని ధ్యానిస్తారు. ధ్యానముతో పవిత్రులైన యోగులు ఆపరమాత్మను గుర్తెరుగరు. (30) సరస్వతి జడురాలైంది, వేదములు శాస్త్రములు అవన్నీ, వేయితలలు గల శేషుడు, ఐదుతలలు గల సదాశివుడు (31) నాల్గుతలల బ్రహ్మ కుమారుడు కార్తికేయుడు ఋషులు, మునులు, భక్తులు, పరమవైష్ణవులు ఆ (32) పరమాత్మను స్తుతించుటకు అసమర్థులు, ఆ పరమాత్మ యోగులకు ధ్యానం వల్ల కూడా లభించడు. ఓ మహారాజ! నేను పిల్లవాణ్ణి, ఆతని గుణాలను గూర్చి ఏం చెప్పగలను అని (33) అన్న శతానందునిమాటలను విని, రాజు ముఖం వికసించింది. వేగంగా లేచి ఆతనిని కౌగిలించుకున్నాడు. (34)
రుక్మిరువాచ :
రకరకాల రత్నాలు, బంగారము, వస్త్రములు, రత్నభూషణములు అతనికిచ్చాడు, రాజు. ప్రసాద (అనుగ్రహం) ముతో, సుముఖుడైన రాజుబాగా దానం చేశాడు. (35) శ్రేష్ఠమైన ఏనుగ, గుఱ్ఱము, శ్రేష్ఠమైన మణులతో చేసిన రథము, రమ్యమైన రత్నసింహాసనము, అట్లాగే అధికంగా ధనము, (36) భూమిని, అన్ని పంటగలుగల దానిని, ఎప్పుడు వర్షపునీరు నిచ్చే భూమిని, శుభమైన దానిని, దున్నకుండానే పండే (శ్రమపడక అని)దానిని, పూజ్యమైన భూమిని, అన్ని విధముల ప్రశంసించ తగిన గ్రామమును, (37) ఇచ్చాడు. ఇంతలో రాకుమారుడైన రుక్మికోపగించాడు. కోపంతో వణుకుతూ, అధర్మంతో కూడి, ముఖం ఎర్రబడగా, కళ్ళు ఎర్రబడగా (38) తండ్రితో, బ్రాహ్మణునితో ఇట్లన్నాడు. అప్పుడు ఆతడు సభలో ఒక చోట స్థిరంగా లేడు, లేచి అందరు సభాసదుల ఎదుటనిలిచి (39) ఇట్లన్నాడు. రుక్మివచనమిట్లా - ఓ రాజేంద్ర! హితమైన, యధార్థమైన, ప్రశంసించతగిన, నామాటవిను. లోభులు, క్రోధులు, భిక్షుకుల మాటను విడిచి పెట్టు. (40) నర్తకుల, వైశ్యుల,భట్టుల, యాచకుల, కాయస్తుల (కరణము) మాట వినవద్దు. భిక్షుల మాట ఎప్పుడూ అసత్యమే (41) కూర్చేవాళ్ళ (తార్పుడు) నాటకుల, స్త్రీలుబుల కాముకుల, దరిద్రుల, మూర్ఖులమాటలు వినవద్దు. వారిమాట లెప్పుడూ పొగడ పూర్వకముగా ఉంటాయి. (42) రాజేంద్రుడైన కాలయవనుని, భయంతో దూరంగా చంపి, ఓ మహాబాహు! కృష్ణుడు, ఉపాయంగా వాని ధనాన్ని హరించాడు. (43) యవనుని ధనముతో కృష్ణుడు ద్వారకలో ధనవంతుడైనాడు. జరాసంధుని భయం వల్లనే సముద్రంతో గృహం నిర్మించుకున్నాడు. (44) జరాసంధుని వంటివారిని నూరుగురిని, క్షణకాంలో అవలీలగా, నేను ఒక్కణ్ణి చంపసమర్థుడిని. ఇతర రాజుల గురించి చెప్పేదేమున్నది. (45) దుర్వాసుని శిష్యుణ్ణనేను. రణశాస్త్రమందు విశారదుడను. ఓభీష్మక! అందువల్లనే విశ్వాన్నంతా సంహరించడానికి నేను సమర్థుడను, నిశ్చయము. (46) నాతో సమానమైనవాడు పరశురాముడు, శిశుపాలుడు. నాకు స్నేహితుడు, బలవంతుడు శూరుడు ఆతడు స్వర్గాన్ని జయించటానికైనా సమర్థుడు. (47) మహేంద్రుని, ఆతని గణములతో సహ క్షణంలో జయించడానికి నేను సమర్ధుణ్ణి. నృప! యుద్ధంలో జరాసంధుని జయించి అట్లాగే దుర్బలుడైన యోగిని జయించి (48) కృష్ణుడు అహంకారముతో ఉన్నాడు. బుద్ధిలో తనను వీరునిగా భావిస్తున్నాడు. ఒకవేళ మావూరికి వస్తే, వివాహం చేసుకోవాలని కోరిక ఉండి వస్తే, (49) క్షణంలో యమమందిరానికి పంపిస్తాను. నందుడు, వైశ్యుడు, ఆ గోరక్షకుడు (కృష్ణుడు) వానికి (50) ఆజారునకు సాక్షాత్తు గోపికల గోపాలుర ఎంగిలితినే వాడికి, దేవతలకు యోగ్యమైన రుక్మిణిని, కన్యను ఇచ్చే కొరకు ప్రయత్నిస్తున్నావు. (51) భిక్షుకుడైన బ్రాహ్మణుని మాట ప్రకారము ఇవ్వదలిచావు. ఓ రాజేంద్ర! గొంతెత్తి చెప్పినవాని మాట ప్రకారం ఇవ్వదలిచావు. నీవు బుద్ధిహీనుడవు. (52) కృష్ణుడు రాజపుత్రుడుకాడు, శూరుడుకాడు, కులీనుడుకాడు, శుచిగలవాడు కాదు. దాతకాడు, ధనవంతుడుకాడు, యోగ్యుడుకాడు. జితేంద్రియుడు కాడు. (53) ఓభూమిప! మంచికొడుకైన శిశుపాలునకు నీకూతురును ఇవ్వు. బలంతో రుద్రుని సంతోషపరచిన గజేంద్ర తనయునకివ్వు. (54) ఓనృప! అనేకదేశములందున్న రాజులకు నియంత్రణమివ్వు. (ఆహ్వానం). బంధువులను, మునీంద్రులను పత్రిక ద్వారా, వేగంగా ఆహ్వానించు. (55)
అంగము కళింగము, మగధ సౌరాష్ట్రము, శ్రేష్ఠమైన వల్కలము, రాటము, ఉత్తమశ్రేష్ఠమైన వంగము, గుర్జరము, పేఠరము, (56) మహారాష్ట్రము, విరాటము, ముద్గలము, మురంగకము, భల్లకము, గల్లకము, ఖర్వము, దుర్గము, ఆయా దేశములకు బ్రాహ్మణుని పంపించు (57) వేయి నేతికాలువలు, తేనె కాలువలు వేయి, వేయి పెరుగు కాలువలు, వేయి పాలకాలువలు (58) ఐదు వందలనూనె కాలువలు,రెండు లక్షల బెల్లం కాలువలు, నూరు రాసుల శర్కర, దీనికి నాల్గింత లెక్కువ మధురాన్నరాసులు (59) యవలు, గోధుమలు వీటి పొడిపిండి రాశులు నూరు, నూరు అటుకుల రాసులు లక్ష దీనికి నాల్గింత లెక్కువ అన్నరాశి (60) లక్ష గోవులు, రెండు లక్షల హరిణములు వీనిని చంపాలి. కుందేళ్ళు నాలు లక్షలు, తాబేళ్ళు కూడా అన్నే చంపాలి. (61) పది లక్షలు మేకపోతులు, గొఱ్ఱలు వానికి నాల్గింతలు చంపాలి. పర్వమందు గ్రామదేవతకు భక్తితో బలి ఇవ్వాలి. (62) వీటి మాంసాన్ని వండి భోజనమునకు ఏర్పాటు చేయి. ఓరాజ! వ్యంజనముల సామాగ్రిని పరిపూర్ణము చేయి. (63) ఆమాటను విని రాజేంద్రుడు,పురోహితునితో కూడి, తన మంత్రితో కూడి త్వరగా ఆమంత్రణ పంపించాడు. (64) యోగ్యుడైన, కోరతగిన బ్రాహ్మణుని ద్వారకకు పంపాడు. అందరికిష్టమైన శుభలగ్నమును ఏర్పరచాడు. (65) రాజు త్వరగా ఆనందంతో సంభారములు కూర్చుకొనినాడు. కొడుకు ఆజ్ఞతో నియంత్రణము అందరికి పంపాడు. (66) సుధర్ముడు అను విప్రుడు ఉగ్రసేనరాజు వద్దకు వచ్చి, రాజులు, దేవతల మధ్యకూర్చున్న రాజునకు మంగళకరమైన పత్రికనిచ్చాడు. (67) సుమంగళమైన పత్రమును గూర్చి విని రాజుముఖం వికసించింది. ఆనందంతో రాజు బ్రాహ్మణులకు వేయి సువర్ణములిచ్చాడు. (68) ద్వారకలో అంతట దుందుభిని (వాద్యం) మ్రోగింపచేశాడు. దేవతలను మునులను,రాజులను, జ్ఞాతులను బంధువులను, (69) భట్టులు, భిక్షులు అందరికిని ఆదరంగా భోజనం పెట్టించాడు. రాజు శ్రీకృష్ణునకు మంచి వేషధారణ చేయించాడు. (70)
చాలా అందమైన, సాటిలేని, ముల్లోకములలో దుర్లభమైన యాత్రను, జగత్తునకు శ్రేష్ఠమైన, కోరతగిన యాత్రను చేయించాడు. (71) రమ్యమైన వేదమంత్రముతో, మనోహరమైన మ హేంద్రమందు తోలుత బ్రహ్మ సావిత్రి సహితుడై రథంలో వెళ్ళాడు. (72) మహా ఆనందంతో భవానితో కలిసి భవుడు స్వయంగా రథస్థుడై వెళ్ళాడు, శేషుడు, సూర్యుడు, ప్రసిద్ధుడైన గణేశుడు (73) మహేంద్రుడు, చంద్రుడు, వరుణుడు, పర్వతుడు, కుబేరుడు, యముడు, వహ్ని, ఈశానుడు వీరంతా ఆనందంతో వెళ్ళారు. (74) మూడుకోట్ల దేవతలు, ఆరు కోట్ల మునులు మూడు లక్షల ఏనుగలు, మూడు లక్షల తెల్లగొడుగులు వెళ్ళాయి. (75) నక్షత్రములలో చంద్రునివలె ఉగ్రసేన రాజున్నాడు. బలవంతుడైన ఆరాజు ప్రసన్నమైన వదనంతో కుండిన నగరానికి అభిముఖుడై వెళ్ళాడు. (76) రత్నములతో నిర్మించిన పల్లకిలో మహాబలుడైన బలరాముడు వెళ్ళాడు. వసుదేవుడు, ఉద్ధవుడు, నందుడు, అక్రూరుడు, సాత్యకి (77) గోపాలురు, యాదవేంద్రులు, చంద్రవంశము వారు వారంతా వెళ్ళారు. ధృతరాష్ట్రుని కొడుకులంతా దుర్యోధనుడు మొదలగు వారంతా వెళ్ళారు. (78) యుధిష్ఠిరుడు, భీముడు, ఫల్గునుడు, నకులుడు, సహదేవుడు వీరంతా ఈ ఐదురుగు యానముల పై వెళ్ళారు. (79) భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మహాబలుడు అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, శల్యుడు వీరంతా ఆనందంగా వెళ్ళారు. (80) మూడుకోట్ల భటులు, నూరుకోట్ల బ్రాహ్మణులు వేయిమంది సన్యాసులు, రెండువేల యతులు, బ్రహ్మచారులు (81) క్రోధమును జయించిన అవధూతలు అట్లాగే రెండువేలు, వేయి కలువపూలు, వేయిమంది మాలాకారులు (82) చిత్రవిచిత్రములు, రకరకాల శిల్పకారులు, వాయిద్యములు లక్ష, లక్ష నర్తకులు, (83) గంధర్వులు, గాయకులు లక్ష వెళ్ళారు, నారద! ఆ కల్పమందు గంధర్వుల వృద్ధి ఉంది కదా (84) ఏబది మంది స్త్రీలతో నీవు,వారి మధ్యనే ఉన్నావు. లక్ష విద్యాధరులు, లక్ష అప్సరసలు, (85) మూడు లక్షల కిన్నరులు, మూడు లక్షల గంధర్వులు, (86) ఉన్నారు.
అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు రుక్మిణి వివాహమందు నూట ఐదవ అధ్యాయము.
Summary of chapter 105 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Illustrating the necessity of utmost reverence toward divine personages, the text narrates the history of the Gandharva king Chitraratha. When Chitraratha made a subtle, improper comment while viewing Lord Śiva and Goddess Pārvatī seated together, Goddess Pārvatī cursed him to be born on earth as a demon, who later took birth as Vṛtrāsura. The narrative highlights how Chitraratha accepted the curse with profound humility, maintaining his pure devotion to Śrī Vishṇu even while in a demoniac form.