మూII శ్రీనారాయణ ఉవాచ:
బృహస్పతి రువాచ:
శ్రీమన్నారాయణుడిట్లన్నాడు: శచీస్తోత్రమును విని బృహస్పతి ఆనందించి, మధురంగా, శాంతుడై ఇంద్రుని భార్యతో ఇట్లా అన్నాడు, ఓ నారద! (1) బృహస్పతి వచనమిట్లా - ఓవత్స! భయాన్ని అంతా వదిలి పెట్టు. నేనుండగా నీకు భయమెందుకు. కచుని భార్యనాకు ఎట్లాగో నీవు కూడా అట్లాగే ఓ శోభన! (2) పుత్రుడెట్లాగో శిష్యుడట్లాగే, పుత్రశిష్యులకు భేదం లేదు, తర్పణ మందు, పిండదానమందు,పాలనమందు, సంతోష పెట్టుట యందును. (3) పుత్రుడు ఎట్లా అగ్నిదాతనో అట్లాగే శిష్యుడు కూడా నిశ్చయము, అని దీనిని కణ్వశాఖ యందు బ్రహ్మచెప్పాడు. (4) తండ్రి తల్లి, గురువు, భార్య, శిశువు, అనాథ, బాంధవులు, వీరిని పురుషుడు ఎల్లప్పుడు పోషించాలి, అని బ్రహ్మ అన్నాడు. (5) ఎవడైతే వీరిని పోషించడో, వాడికి బూడిదయ్యేదాక (తాను) సూతకము. దైవ, పితృకర్మలందు కర్మారుడుకాడు, వాడు కూడా అని మహేశ్వరుడన్నాడు. (6) తల్లి దండ్రులను గురువును మనుష్యమాత్రులుగా తలచేవానికి అంతటా అపకీర్తి, అడుగడుగునా విఘ్నమే. (7) సంపదవల్ల మత్తుడై ఎవడు తన గురువును అవమానిస్తాడో, వానికి త్వరలోనే సర్వనాశమౌతుంది, నిశ్చయము. (8) సభామధ్యలో నన్నుచూచి ఇంద్రుడులేవలేదు. ఆ ఫలితాన్ని సాక్షాత్తుగా అనుభవిస్తున్నాడు, అప్పుడే. ఇప్పుడు చూడు. (9) ఆతనికి విముక్తిని కల్గిస్తాను నేను. నీకు రక్షణను కూడా. నిశ్చయమిది. శాసించటానికి, రక్షించడానికి ఎవడు సమర్థుడో వాడే గురువు అనబడుతాడు. (10) హృదయంలో శుద్ధమైన స్త్రీ యొక్క సతీత్వమును చూడని వానికి, ఎవని మనస్సులో వికల్పముంటుందో వాని ధర్మము నశిస్తుంది. (11) ఓ సతి! నీ ప్రభావము, దుర్గప్రభావంతో సమమౌతుంది. లక్ష్మితో సమానమైన ప్రతిష్ఠ, కీర్తి కూడా ఆమె కీర్తితో సమంగా కల్గుతుంది. (12) సౌభాగ్యం రాధికకువలె సమానంగా, భర్తయందు ప్రేమ ఆమె సమంగా, కల్గుతుంది. ఈశ్వరుని యందు ఆమెకు వలె సమానంగా గౌరవం, మాన్యత, ప్రీతి, ప్రాధాన్యము కల్గుతాయి. (13) రోహిణితో సమానమైన అపేక్ష భారతికి గల పూజ్యతతో సమమైన పూజ్యత, ఎల్లప్పుడు సావిత్రికి సదృశ్యమైన శుద్ధత, నిరుపమానత్వము శాశ్వతంగా కలుగాయి (14)
దూత ఉవాచ :
గురురువాచ :
నహుష ఉవాచ :
ఋషయ ఊచుః
ఇంతలో అక్కడికి నహుషుని దగ్గర నుండి దూతవచ్చాడు. ఆ పిదప భయపడుతూవాడు, బృహస్పతికి ఎదురుగా నిలబడి ఈ మాట చెప్పాడు. (15) దూత వచన మిట్లా: ఓదేవి ! త్వరగాలే నీవు నహుషుని దగ్గరకు వెళ్ళు. రమ్యమైన నందన కాననమందు రహస్యంగా క్రీడించడానికి వెళ్ళు. (16) దూతమాటను విని బృహస్పతి వానితో ఇట్లన్నాడు. ఆతని అవయవాలన్ని కంపిస్తున్నాయి, కోపంతో కళ్ళు ఎర్రతామరల వలె అయినాయి. (17) గురువచనమిట్లా- నహుషుని దగ్గరకు వెళ్ళి నీవు ఇట్లా చెప్పు. శచిని అనుభవించుటకు కోరిక కలవాడవైతే, అపూర్వమైన పల్లకిని ఎక్కి రాత్రికి రా (18) నీ శుభమైన పల్లకిని సప్తర్పులు మోస్తుండగా దానిని ఎక్కి, మంచి వేషం ధరించి వెళ్ళవచ్చును. (19) అనిన బృహస్పతి మాటలను విని, వాడు అప్పుడు వెళ్ళి రాజుతో చెప్పాడు. దూతమాటలను విని, నవ్వికింకరునితో రాజిట్లన్నాడు. (20) వెళ్ళువెళ్ళు త్వరగా వెళ్ళు. సప్తరుషులను శీఘ్రంగా తీసుకురా. వాళ్ళతో కూడి ఇప్పుడు ఉపాయం ఆలోచిస్తాను, ఓ కింకర (21) అని రాజన్న మాటను విని, దూత వారిదగ్గరకు వెళ్ళి నహుషుడు చెప్పినట్లుగా, అందరితో, అక్కడచెప్పాడు. (22) దూతమాటను విని సప్తర్షులు ఆనందంతో రాజుదగ్గరకు వెళ్ళారు. రాజు వారందరినిచూసి నమస్కరించి, సాదరంగా ఇట్లన్నాడు. (23) నహుషుడిట్లా - మీరు బ్రహ్మపుత్రులు, బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నారు. అంతా బ్రహ్మసదృశులు, ఎప్పుడూ భక్తులయందు వాత్సల్యం కలవారు. (24) ఎల్లప్పుడు నారాయణ (ధ్యాన) పరులు. శుద్ధ సత్వస్వరూపులు. మోహమాత్సర్యములు లేనివారు. దర్పాహంకారములు లేనివారు. (25) తేజస్సులో, కీర్తిలోనూ ఎల్లప్పుడు అంతా మీరు నారాయణసములు. గుణంలో ప్రేమలో, దయచూపటంలో, వరము ఇవ్వటంలో, నిశ్చయంగా నారాయణసములు (26) అని పలికి నమస్కరించి రాజు ఆనందించాడు, ఏడ్చాడు. భయపడుతున్న రాజును చూచివారు పరహితైషులు కనుక ఇట్లన్నారు. (27) ఋషులిట్లా - ఓ వత్సా! నీ మనస్సులో ఏ కోరిక ఉందో వరం కోరుకో. అన్ని ఇవ్వటానికి మేము సమర్థులము. మాకు అసాధ్యమైనది లేదు. ఇవ్వరానిదిలేదు. (28) ఇంద్రత్వమా, మనుష్యత్వమా, చిరాయువా, ఆ పిదప సప్తద్వీపేశ్వరత్వమా, మిక్కిలి దీర్ఘకాలికమైన సుఖమా. (29) అటైనా అన్ని సిద్ధించడం, అంతా ఐశ్యర్యం లభించటం చాలా దుర్లభము. ముక్తి కావాలా హరిభక్తియా, తపస్సుతో దుర్లభమైన దేదైనా కావాలా (30) ఓవత్స! నీ కోరిక ఏమిటి. మాకు ఇప్పుడు ఆనందంగా చెప్పు. అంతా నీకిచ్చాకే తపస్సునకు సంతోషంగా వెళ్తాము. (31) కృష్ణార్చనలేని క్షణము లక్ష యుగములతో సమానము. ధ్యాన సేవనములు లేని దినము దుర్దినము. (32) హరి సేవ కాకుండా ఎవడైనా వేరే విషయాన్ని కోరితే 'వాడు' కోరతగిన అమృతాన్ని వదలి తననాశనం కొరకు విషం తింటున్నట్లే. (33) బ్రహ్మ శివుడు, ధర్ముడు, విష్ణువు, మహావిరాట్టు, గణేశుడు, దినేశుడు(సూర్యుడు) శేషుడు, సనకాదులు. (34) వీరంతా రాత్రింబగళ్ళు ఆనందంతో ఎవని పాద పద్మములను ధ్యానిస్తున్నారో, ఏది జన్మమృత్యు జరా వ్యాధులను హరిస్తుందో, దాని యందాసక్తి కల వారము మేము. (35) వారి మాటలు విని నృపేశ్వరుడు వారితో ఇట్లన్నాడు. రాజుసిగ్గుపడుతూ, తలవంచుకొని, మాయతో మోహింపబడిన మనస్సుగల వాడై అన్నాడు. (36)
మూ॥ నహుషఉవాచ:
నహుషుడిట్లా: మీరు భక్తుల పై వాత్సల్యం కలవారు, అన్ని ఇవ్వటానికి సమర్థులు. ఇప్పుడు నాకిష్టమైన శచీదానాన్ని నాకు త్వరగా ఇవ్వండి (37) ఆ మహాసతి శచి మనోహరమైన సప్తర్పులు (మోషే) వాహనాన్ని కోరుతోంది. ఇదే నా వరము. త్వరగా త్వరగా జరిగేట్టు చూడండి. (38) నహుషుని మాటవిని మునులు పరస్పరము చూచుకొని అందరు కుతూహలంగా చాలా పెద్దగా నవ్వారు, ఓ నారద! (39) రాజు విష్ణుమాయతో ఆవహింపబడి, మోహితుడైనాడని తలచి, కృపతో, దీనవత్సలులైన వారు మోయుటకు ప్రతిజ్ఞ చేశారు. (40) ముత్యములు మాణిక్యములు వీనితో అలంకరింపబడిన ఆ పల్లకిని భుజమందుంచుకున్నారు. రత్నభూషణములతో అలంకరించుకొని మంచి వేషంతో రాజువెళ్ళాడు. (41) చాలా ఆలస్యమవటం చూసి రాజువారిని భయ పెట్టాడు. దారిలో, ముందు వెళ్ళే దుర్వాసుడు కోపంతో శపించాడు. (42) ఓ మూఢమనస్కుడ! గొప్ప అజగరమనే సర్పానిపై పడిపో, ధర్మపుత్రుని దర్శనంతో నీకు మోక్షం కలుగుతుంది. (43) రత్నములతో చేసిన వాహనంలో వైకుంఠమునకు వెళ్ళి వైకుంఠుని సేవ చేస్తావు. ఓ మహారాజ! కర్మ నిష్ఫలంకాదు. (44) అని పలికి మునులంతా,నవ్వుతూ వెళ్ళారు. ఓ మహాముని! ఆశాపంతో మహారాజుగారు సర్పమై పడిపోయాడు. (45) దానిని విని శచి గురువునకు నమస్కరించి అమరావతికి వెళ్ళింది. బృహస్పతి కూడా, ఇంద్రుడెక్కడైతే పద్మతంతువులలో (దారాలు) ఉన్నాడో అక్కడికి శీఘ్రంగా వెళ్ళాడు. (46) సరోవర సమీపమునకు వెళ్ళి సురేశ్వరుని పిలిచాడు. కృపానిధి, కృపతో, అతిప్రసన్న వదనుడై పిలిచాడు. (47)
మూII బృహస్పతి రువాచ :
నారద ఉవాచ:
నారాయణఉవాచ:
బృహస్పతి వచనమిట్లా:
ఓ వత్స! నీవు రా. నేనుండగా నీకు భయమెందుకు. భయం వదిలి ఇక్కడికి రా. నేను నీ గురువును బృహస్పతిని. (48) తన గురువు స్వరాన్ని విని మ హేంద్రుడు ఆనందించిన మనస్సుగలవాడై సూక్ష్మ రూపాన్ని వదిలి, తన స్వరూపంతో వచ్చాడు. (49) దండములాగా తలతో, గురుపాదముల పై భక్తితో పడ్డాడు. బాగా భయపడుతున్న ఏడుస్తున్న వానిని ఆతడు ఆనందంతో ఎద పై ఉంచుకున్నాడు. (50) ప్రాయశ్చిత్తం కొరకు సోమయాగం చేయించి అందమైన రత్న సింహాసనమందు ఆతనిని గురువు కూర్చోబెట్టాడు. (51) ముందుకన్న నాల్గింత లెక్కువగా గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆనందంతో దేవతలంతా వచ్చి సేవ చేశారు. (52) త్రిదశేశ్వరుడైన మహేంద్రుని భర్తను శచిపొందింది, (53) అని ఈ విధంగా మహేంద్ర దర్పభంజనమును చెప్పాను. ఓ వత్స! శచీదేవి, సతీత్వ రక్షను కూడా చెప్పాను. ఇంకా ఏమి వినదలచావు. (54) నారదుడన్నాడిట్లా - ఓ మునిసత్తమ! నాకు సోమయాగ విధానాన్ని చెప్పు. గురువు దాన్ని ఎట్లా చేయించాడు, ఆతనితో, పరమమైన ఫలమేమి (55) నారాయణుడిట్లా - ఓ ముని! సోమయాగ ఫలము, బ్రహ్మహత్యను శమింపచేయటము. యజమానుడు ఒక సంవత్సరము సోమలత రసమును తాగుతాడు. ఒక సంవత్సరము పండు తింటాడు. ఒక సంవత్సరము ఆనందంతో జలం తాగుతాడు.ఇది మూడు సంవత్సరాల వ్రతము. అన్ని పాపములను శమింప చేసేది. (57) ప్రాణికోటి వృద్ధి కోరకు మూడు సంవత్సరాలకు సరిపడ ధాన్యం ఎక్కడుందో లేదా ఎక్కువగా కూడా ఉన్నా ఆతడు సోమముతాగుటకు అరుడు . (58) మహారాజు కాని దేవుడు కాని యాగం చేయటానికి సమర్థులు, ఓ ముని! ఈ యజ్ఞము అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. బాగా అన్నదానము, అధిక దక్షిణలు ఇవ్వాలి. (59) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు ఇంద్రదర్ప భంగప్రకరణ మందు శక్రునకు మోక్షము అని చెప్పే ఇది అరవైయవ అధ్యాయం సమాప్తం II
Summary of chapter 60 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
As tensions mounted between the Pāṇḍavas and the Kauravas over the kingdom of Hastinapura, leading inexorably toward the epic Mahābhārata war, Lord Kṛshṇa acted as the supreme peace envoy on behalf of the Pāṇḍavas, traveling to the court of Dhritarāshtra. Despite Kṛshṇa's eloquent exposition on righteousness, duty, and the disastrous consequences of war, the arrogant Duryodhana rejected the peace proposal and attempted to arrest Kṛshṇa in open court, whereupon the Lord revealed His dazzling universal form, blinding the assembly with blinding cosmic light before departing to prepare the Pāṇḍavas for righteous victory.