శ్రీరాధికోవాచ - రాధాదేవి పలికెను :
ఈ నియమము వలననే బ్రహ్మ మోహినిని త్యజించెను కదా! మరి ఆ కులట శాపము వలన ఎట్లు అపూజ్యుడాయెను? శ్రీహరి అతనికి గర్వభంగమెట్లు చే సెను? నర్వేశ్వరుడవు ఆ కారణము చెప్పుము.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
రసికుడైన ఆ శ్రీకృష్ణుడు రాసమండలేశ్వరి (రాధాదేవి) మాట విని నవ్వి మిక్కిలి రహస్యమైన ఇతిహాసమును ఆమెకు ఇట్లు చెప్పనారంభించెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
బ్రహ్మ చాలకాలము తపస్సు చేసి నా వలన మంచి వరము పొంది నానావిధమైన సృష్టిని చేసి విధాత అయ్యెను. సర్వజీవులకు తపస్సుకు ఫలదాతయైనవాడు శిక్షించువాడు ప్రభువును నేనే ఈశ్వరుడనని భావించి బ్రహ్మ మహా గర్విష్టి యయ్యెను. సర్వ బ్రహ్మాండ ములలో అభివృద్ధి గర్వమేర్పడునంత వరకే జరుగును. గర్వమేర్పడిన తర్వాత ఇక ఉన్నతీ యుండదు అని తలచి నేను బ్రహ్మకు దర్పభంగము చేసితినీ. ఈ బ్రహ్మాండములలో ఎవరెవరికి గర్వము కలుగునో పరాత్పరుడను సర్వులకు ఆత్మనైన నేను అది తెలిసికొని వారిని శిక్షింతును, మొదట బ్రహ్మ గర్వమును చూర్ణము చేసితిని. అట్లే శంకరుని యొక్క, పార్వతి యొక్క, చంద్రసూర్యుల యొక్కయు, అగ్ని, దుర్వాసమునీ, ధన్వంతరుల యొక్క దర్పమును క్రమముగా భంగము చేసితినీ. ప్రియురాలా! ఆ విషయమును చెప్పెదను వినుము. క్షుద్రులకును మహాత్ములకును ఎవరెవరికి గర్వము పుట్టునో వారందరి గర్వమీవిధముగా చూర్ణము చేయుదును.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి పలికెను :
శ్రీకృష్ణుని వాక్కులు వినగానే కంఠము పెదవులు దవడలు ఎండిపోగా భయముతో మనను చెదరి మిక్కిలి వణకుచున్న రాధాదేవి ప్రయత్నించి ఇట్లు పలికెను.
శ్రీరాధికోవాచ - రాధాదేవి పలికెను :
ప్రాణనాథా! అందరి దర్పములను భగ్నము చేయువాడా! దర్పము కల్గించువాడవు భయము కళించువాడవును నీవే. ప్రాణదానమొనర్చుటకు మూలకారణము నీవే! ప్రభూ! ఎవనికే ప్రభావము (శక్తి) వలన మహాదర్పము కల్గినో - పూర్వమే ప్రభావము చేత నీవు వానికి దర్ప భంగము చేసితివో చెప్పుము.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :
అరవై వేల యుగములు రేబవళ్లు తపస్సు చేసి నా కలలు నిండి శివుడు నాతో సమానుడయ్యెను. తపస్సు చేత తేజస్సు చేత కోటి సూర్యుల ప్రభావము గలవాడై లేజోరాశియై భక్తులకు కల్పవృక్షమయ్యెను. ఆ తేజోమూర్తిని యోగీంద్రులు బహుకాలము నుండి ధ్యానించి ధ్యానించి ఆ తేజస్సు నడుమ మిక్కిలి సుందరమైన స్వరూపమును దర్శించిరి.
శుద్ధమైన స్ఫటిక మణివంటి తెల్లదనము గలవాడును, ఐదుముఖములు గలవాడును, మూడు నేత్రములు గలవాడును, త్రిశూలము పట్టేశాయుధము చేత ధరించినవాడును పులితోలును వస్త్రముగా ధరించినవాడు తెల్లని పద్మాక్ష మాలతో తనలో తాను తనను (అంతరాత్మయైన రామ మంత్రమును) జపించువాడును చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖము గలవాడును చంద్రుని సిగ మీద ధరించిన వాడును పరాత్పరుడును బంగారము వలె ప్రకాశించు జడలను తలపై ధరించినవాడు శాంతుడును ముల్లోకములందలి జనులకు మనోహరుడును భక్తుల ననుగ్రహించుటలో త్వరగలవాడును అగు పరమ శివుని యోగులు దర్శించిరి. ఆతడు సర్వ సంపదల నిచ్చు ఈశ్వరునిగా తనను తలచుకోనీ కల్పవృక్షమై సర్వులకు సర్వవాంఛితములను (కోరికలను - వరములను) ఇచ్చును. ఎవడెవడు ఏయే కోరిక కోరునో వాని వానికా వరప్రదాత వరమిచ్చి ఆ స్వాత్మారాముడు (తనయందే ఆనందించువాడు) అగు ఆ శివుడు తన లీల కారణముగా గర్వము గలవాడయ్యెను.
ఒకసారి వృకుడను రాక్షసుడు కేదారమను క్షేత్రములో సంవత్సర కాలము రాత్రి పగలు విడువక కఠోర తపస్సు చేసెను. దయానిధియైన శివుడు నిత్యము కోరిన వరమిచ్చుటకు పోవుచుండెను. సంవత్సరము చివర శివుడు మరల పోయి వాని ముందు నీలిచెను. వరదాత కనుక భక్తి పాశము చేత బంధితుడై వాసిని విడిచి పోలేకపోయెను. దైత్యుడు మాత్రము సర్వవిధములైన ఐశ్వర్యములను గానీ సర్వవిధ సిద్దులను గాని భుక్తి ముక్తులను గానీ చివరకు వైకుంఠమును గానీ కోరక శివుని పాదపద్మములను ధ్యానించుచుండెను. ఏమి కోరుకొనక కదలక మెదలక ఉన్న ఆ భక్తుని చూచి భయపడిన శివుడు వానీమీద ప్రేమతో మనస్సు చెదిరి బోరున ఏడ్చెను. శివుడట్లు మిక్కిలి రోదించుట వలన వృకాసురునికి ధ్యానభంగమై కనులు తెరచి తనయెదుట సాక్షాత్కరించిన సర్వసంపదలిచ్చు శివుని చూచెను.
నా మాయ వలన ఆ రాక్షసుడు భక్తిని ప్రకటించి గూడ ఎవని శిరస్సు మీద నేను చేయి పెట్టుదునో వాడు భస్మము కావలెను” అని వరము కోరుకొనెను. “అట్లే అగును” అని వెళ్లిపోవుచున్న శివుని వెనుక వృకుడు పరిగెత్తాను. మృత్యుంజయుడైనను శివుడు మనస్సు చెదిరి మృత్యుభయముతో పరుగెత్తుచుండెను. చేతిలోని డమరు క్రింద పడిపోయెను. సుందరమైన వ్యాఘ్ర చర్మము శరీరము నుండి జారీ పడిపోయినను రాక్షసునికి భయపడి శివుడు నగ్నము గానే పది దిక్కులకు పరుగెత్తేను గాని భక్తవత్సలుడు గనుక దయతో వానిని సంహరించలేదు. సాధుపురుషుడు తననాశ్రయించిన వాడు దుష్టుడైనను వానిని శిక్షింపడు గదా! సత్పురుషులు భృత్యుని, పుత్రుని, భార్యను కాక ఇతరులను హంతకులైనప్పుడు దండింతురు, దయతో తనతో సమముగా చూచిన వ్యక్తికి హితబోధ చేయుటకును శివుడశక్తుడయ్యెను.
శివుడు తనకు మృత్యువా దానవుడని తలచి భయపడి ముందటి అహంకారము లేనివాడయ్యెను. నన్ను తలచి తలచి నన్నే రక్షకుడని భావించి శరణుపొందెను. తన స్థానమునకు వచ్చుచు కంఠము పెదవులు దవడలు ఎండిపోయి భయముతో మనస్సు కలతచెంది ఓ శ్రీహరీ రక్షింపుము రక్షింపుము అని జపించుచున్న అతనిని చూచి ప్రత్యక్షమై ఆపితిని. అతనికి దగ్గరగా వచ్చుచున్న వృకాసురుని విషయమేమని ప్రశ్నించితిని. వాడు వరుసగా జరిగిన వృత్తాంతమంతయు చెప్పెను. అప్పుడా దైత్యుడు నా మాయచేత వంచితుడై (మోసగింపబడినవాడై) నా ఆజ్ఞననుసరించి తన శిరస్సు మీద హస్తమును పెట్టుకొని వెంటనే భస్మమై పోయెను.
అప్పుడు సిద్ధులు దేవతాధిపతులు మునీంద్రులు మనువులు సంతోషముతో సద్భక్తితో నన్ను స్తుతించిరి. శివుడు తన స్థితికి మిక్కిలి సిగ్గుపొందెను. అతని గర్వము చూర్ణమై పోయెను. ఇక ముందును అతడు వరములిచ్చువాడు కనుక ఆ విషయములో నేను శివునకు తగిన జ్ఞానమును బోధించితిని.
పిదప మరియొక సారి రుద్రుడు త్రిపురాసురుని హద్దుమీరిన గర్వపు పొంగునుచూచీ సర్వ జగములను సంహరించువాడను నేను గదా అని తలచి గర్వించెను. పక్షివలె ఆకాశములో ఎగురు నీ రాక్షసుడెవడు అని నేను తనకిచ్చిన శూలమును శ్రేష్ఠమైన కవచమును వదిలి పెట్టియే యుద్ధమునకేగెను. ఆ యిద్దరికి ఒక సంవత్సర కాలము రాత్రింబగళ యుద్ధము నడిచాను. ఇద్దరుసు యుద్ధములో సములే కనుక ఏ యొక్కడు గెలువలేకపోయెను. ప్రియురాలా! త్రిపురాసుడు భూమి మీద ఒక కాలానించి ఏబదికోట్ల యోజనములంత ఎత్తునకు తన మాయాశక్తితో ఆకాశమున కెగిరెను. జగత్ర్పభువైన శంకరుడు కూడ దైత్యుని వధించుట కొరకు అంత యెత్తు కెగిరెను. ఏ ఆధారము లేనీ ఆయాకాశములో వారిద్దరికొక మాసము యుద్ధము నడిచెను. బలవంతుడైన రాక్షసుడు శంకరుని అస్త్రములను ధనుస్సును ఖండించి రథమును గూడ భగ్నము చేసెను. శంకరుని వలన వాడును ఆ స్థితిని పొందెను. మిక్కిలి కోపము పొందిన రుద్రుడు పిడికిలి బిగించి రాక్షసుని గొట్టెను. పిడుగు వంటి ముష్టి దెబ్బకు రాక్షసుడు వెంటనే మూర్ఛిల్లెను.
ఒక క్షణములోనే మూర్చ నుండి తేరుకొన్న దానవుడు విశ్రాంతిగా శయనించి యున్న శివుని రెండు చేతులతో లేవనెత్తి భూమి మీద పడవేసెను. అది చూచి దేవతలు దేవఋషులు భయముతో “కృష్ణా! రక్షింపుము. రక్షింపుము” అని నన్ను స్తుతించిరి. భయ రహితుడైన శంకరుడు భయకారణమును చూచి నన్ను స్మరించెను. ఆపదలయందు తలచుకొమ్మని నేనుపదేశించిన స్తోత్రమును భక్తితో పఠించి స్తుతించెను.
అప్పుడు నేను వెంటనే నా యంశతో వృషభ (ఎద్దు) రూపమును పొంది పడుకొని యున్న గొప్ప శక్తి గల శంకరుని కొమ్ములతో ధరించి అతనికీ శత్రువులను నశింపజేయు కవచ శూలములను ఇచ్చితిని. శంకరుడు వెంటనే ఆధారము లేని అత్యున్నతమైన ఆ రాక్షసుడున్న చోటికి చేరి నేనిచ్చిన శూలముతో త్రిపురాసురుని గొట్టెను. వెంటనే వాడు పొడిపొడియై భూతలము మీదపడి మరణించెను. దేవతలు మునులు అది చూచి సంతసముతో శంకరుని స్తుతించిరి. తన అశక్తతకు సిగ్గుపడిన శంకరుడు తన ధర్పమును నశింపజేసిన నన్నే మరల మరల స్తుతి చేసెను.
విఘ్నములకు మూలమైన దర్పమును (గర్వము) శంకరుడు త్యజించి తాను చేయునట్టి సర్వకర్మల యందును నిర్లీపుడై (అహంకార మమకారములు సోకనివాడై జ్ఞానానందమయుడయ్యెను. అందువలననే నాకు ప్రియమైన అతనిని వృషభ రూపమెత్తి మోయుచున్నాను. ముల్లోకములలో శివుని కన్న ఇతరుడు నాకు మిక్కిలి ప్రియమైనవాడు లేడు.
ఓ రాధా! బ్రహ్మ నా మనస్స్వరూపుడు. మహేశ్వరుడు నా జ్ఞాన స్వరూపుడు. ప్రకృతికి మూలభూతురాలు ఈశ్వరి ఐన భగవతి దుర్గాదేవి నా బుద్ధి. ప్రకృతి యొక్క అంశలైన నిద్రాదులు నా శక్తులు, శబ్దరాశికి అధిష్టాన దేవతయైన సరస్వతీ దేవి నా వాక్కు మంగళములకు అధిదేవుడైన గణేశ్వరుడు నా సంతోషరూపుడు. ధర్మదేవత నా పరమార్థరూపుడు. అగ్నిదేవుడు నా ఆహారస్వరూపుడు. సర్వైశ్వర్యములకు అధి దేవతవైన నీవు నా ప్రాణములకు అధిష్టాన దేవివి. గోలోక వాసులందరును నాకు ప్రాణాధికులు. గోలోకవాసినులైన గోపాంగనలందరు నీ యంశలు కావుననే నాకు ప్రియమైన వారు. గోలోకమందలి గోపాలకులందరు నా రోమ కూపముల నుండి పుట్టినవారు. సూర్యుడు నా తేజ స్వరూపుడు. వాయువులు నా ప్రాణములు. జలములకు అధిదైవతమైన వరుణుడును అట్లే. పృథివీ నా శరీరములము నుండి పుట్టినది. మహాకాశమే నా ఆకాశము. మన్మథుడు నా మనస్సు నుండి ఉద్భవించినవాడు. ఇంద్రాది దేవతలందరు నా కళల యొక్క అంశాంశముల నుండి సంభవించిరి.
మహత్తు మొదలుకొని పృథివి వరకు గల ఈ సృష్టికి మూలమైనవేవి గలవో వాటికన్నిటీకి బీజరూపుడను (కారణము) నేనే. నేనింకొక దాని పై ఆధారపడి లేని స్వతంత్రుడను. ఈ జీవుడు నాయొక్క ప్రతిబింబము. కర్మఫలము లనుభవించునధికారి. నేను కోరికలు లేనివాడను. సర్వ వ్యవహారములకు సాక్షిభూతుడను. కర్మలు కర్మ ఫలములు నాకు లేవు, స్వేచ్చామయుడ (ఇచ్చననుసరించి వ్యవమరించువాడను) నైన నాయొక్క ఈ దేహము భక్తుల ధ్యానము కొరకే ఏర్పరచుకొన్నది. అది నా ప్రకృతి. నిత్యముక్తులకన్న పరుడను (శ్రేష్ఠుడను) ఐన నేనొకడనే పురుషుడును. రాధా! ఇట్లు నీకు శివుని దర్ప విమోచనము (దర్పము నుండి విడిపించుట)ను చెప్పితిని. సృష్టి బీజమైన పార్వతి యొక్క దర్ప విమోచనమును వినుము.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణముని పలికెను :
శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పలుకగా రాధాదేవి మిక్కిలి దాచబడిన తన కోరికనిట్లు అడిగెను.
శ్రీరాధికోవాచ - రాధ పలికెను :
ఓ సనాతనుడా! సర్వమునకు మూలమైన వాడా! సర్వ తత్త్వములు తెలిసిన భగవంతుడా! సర్వ సందేహములను నశింపజేయు నా ప్రశ్నకు కోరిన సమాధానము చెప్పుము. సర్వజ్ఞానమునకు అధిదైవము సర్వ తత్త్వము లెరిగినవాడు ఐన శంకరుడు మృత్యుంజయుడు కదా! కాలునికి కౌలుడు కదా. ఆ భగవంతుడు నీతో సమానుడు కదా! ఆ పంచవక్రుడు (ఐదు ముఖములు గలవాడు) త్రిలోచనుడు విభూతి పులుముకున్న దేహము గలవాడు ఎందుకయ్యెను? ఉత్తమమైన వాహనము విడిచి ఎద్దునెక్కి ఎందుకు సంచరించును? శ్రేష్ఠమైన రత్నములతో నిర్మించబడిన భూషణముల నెందుకు ధరించడు? అగ్నివలె ప్రకాశించు వస్త్రము వదిలి పులితోలు ధరించునేమి? పారిజాత పుష్పమును త్యజించి ఉమ్మెంతపూలు ధరించుచున్నాడు. రత్నకిరీటమందు కోరిక లేదు. జటాభారమందే (జడల ముడి) అధిక ప్రీతి. ఆ విభునికి దివ్యలోకమును పరిత్యజించి శ్మశాన స్థలములందు కోరిక. చందనము అగురు కస్తూరి పదార్ధములను సువాసనగల పుష్పము లను త్యజించి బిల్వ పత్రములు బిల్వ కాష్ఠ చందనము (మారేడు కర్రయొక్క గంధము) కావలయునని కోరుకొనును. వీటిని గూర్చి తెలిసికొన గోరుచున్నాను. నాథా! దీనిని వినుటకు నా మనస్సులో కోరిక ఆసక్తి పెరుగుచున్నవి. వివరించి చెప్పుము ప్రభూ!”
రాధాదేవి మాటవిని మధువను రాక్షసుని సంహరించిన శ్రీహరి నవ్వీ రాధను తన వక్షస్థలమున చేర్చుకొని కౌగిలించుకొని) కథను చెప్పనారంభించెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీ కృష్ణుడనెను :
అరువది వేల యుగములు మహేశ్వరుడు తపస్సు చేసి సంతోషముతో నన్ను ధ్యానించి పూర్ణతముడై తపస్సు చాలించెను. అంతలోనే ఎదురుగా నిలిచియున్న నన్ను చూచేను. మిక్కిలి కోరదగిన ఆకారము గల, బాల్యదశలో నున్న, శ్యామసుందరమైన ఇది ఇట్లనిచెప్పరాని, నా ఉత్తమ రూపమును దర్శించి ఆ త్రిలోచనుడు కన్నుల దప్పిక తీరక - రెప్పపాటు లేని కన్నులతో అట్లే చూచుచు - అత్యంత ప్రేమతో అవయవములు ఆధీనము తప్పగా - ఆ మహాభక్తుడు భక్తి ఉద్రేకములతో బోరుమని ఏడ్చెను.
వేయినోళ్లు గల అనంతుడు (నాగరాజు)ను నాల్గు ముఖములు గల బ్రహ్మయు భాగ్యవంతులు. వారు అనేక ముఖములతో అనేక నేత్రములతో భగవంతుని స్తుతించి దర్శింపగలిగిరి అని శివుడు మనస్సులో “నా ఎదుట నాధుడైన పరమాత్మను ఉంచుకొని (పొంది) కూడ ఒక్క ముఖముతో రెండు కన్నులతో ఏమి చూతును? ఏమీ సుతింతును?” అన్న భావనను మరల మరల ఒకటీకి నాల్గుసార్లు అనుకొనగా తపస్సంపద గల శివునకు క్రొత్తగా నాల్గు ముఖములు ఏర్పడి ముందున్న ముఖముతో గలిసి ఐదు ముఖములయ్యెను.
ఒక్కొక్క ముఖము మూడేసి కన్నులతో శోభించినవి. అందుచేత అతనికి పంచవక్రుడు త్రిలోచనుడు అన్న నామము లేర్పడెను. నా దర్శన వేళయందు శివుని యొక్క స్తుతి వలన నాకు అధిక ప్రీతి కలిగినది. శివునికిట్లు ముఖములు నేత్రములు అధికముగా ఏర్పడినవి.
బ్రహ్మస్వరూపము గల శివుని కన్నులు ప్రకృతి గుణరూపములైన సత్త్వరజస్తమస్సులు. దాని కారణము వినుము. సత్తాంశ గల కంటితో సాత్విక జనమును చూచి కాపాడును. రాజననేత్రముతో రజోగుణము గలవారినీ తామస నేత్రముతో తామసులను చూచి పాలించును. ప్రళయ కాలమందు సృష్టి సంహారకుడైన అతనికి కోపమేర్పడుట వలన హరునీ తామస గుణము గల లలాట నేత్రము {నొసట గల కన్ను) నుండి అగ్నీ ఉద్భవించును. కోటి తాటిచెట్ల ఎత్తును కోటి సూర్యులతో సమానమైన ప్రకాశమును గల ఆ హరుడు నాల్కలు చాచుచున్న పొడవైన అగ్ని జ్వాలలతో ముల్లోకములను దగ్ధము చేయును.
పరమేశ్వరుడు తన మొదటి భార్యయైన (దక్ష ప్రజాపతి పుత్రిక) సతీదేవి యొక్క శవ సంస్కార భస్మముతో విభూతి గల శరీరము గలవాడయ్యెను. ఆమె యందలి ప్రేమ భావము చేతనే ఆమె భస్మమును ఎముకల పేరును ధరించుచున్నాడు. తన ఆత్మయందే రమించు ఆనందమయుడైనను శంకరుడు సతీదేవి మరణానంతరము ఆమె శవమును పట్టుకొని ఒక సంవత్సరము వరకు అంతట తిరుగుచు తిరుగుచు రోదించెను. ఆ సమయములో సతీదేవి యొక్క శరీరాంగములోక్కొక్కటి ఎక్కడెక్కడ రాలిపడెనో అక్కడక్కడ మంత్రసిద్ధి కల్గించు సిద్ధపీఠము లేర్పడెను. తరువాత శవము యొక్క శేష భాగములను రొమ్ముమీద పెట్టుకొని శంకరుడు ఆయా సిద్ధ క్షేత్రములలో మూర్ఛిల్లిపడిపోయెను. రాధా! అప్పుడు నేను మహేశుని వద్దకేగి నా ఒడిలో కూర్చుండ బెట్టుకొని దుఃఖము నుండి మేల్కొలిపి అతని శోకము హరించునట్టి శ్రేష్ఠమైన దివ్య తత్త్వముపదేశించితిని. అప్పుడు శివుడు సంతుష్టుడై తన లోకమున కేగెను. కొంతకాలము తరువాత వేరొక రూపము పొందిన ఆ ప్రియ సతిని (పార్వతిగా జన్మించిన సాధ్విని) శివుడు పొందెను.
శాశ్వతుడు ప్రకృతి కన్న పరుడైన పరమేశ్వరునికి దివ్యపుష్పమాలలు ధరించుట యందాసక్తి లేదు. వివేక మూలమున తపఃకాలమందలి జడలనే నేటికి ధరించుచున్నాడు. యోగియైన అతనికి కేశాలంకారమందుగానీ శరీరాలంకారమందు గాని ఇచ్చలేదు. చందనము, బురద, మట్టి పెల్ల, శ్రేష్ఠ రత్నము అన్నిటియందతనికి సమభావమే. గరుడుని శత్రువులైన నాగరాజులు శంకరుని శరణుపొందిరి, అట్టి శరణాగతులను కృపతో తన శరీరమందు భరించుచున్నాడు. త్రిపుర సంహార కాలములో నా యొక్క కళలలోని అంశతో జనించిన వృషభము శివునికి వాహనము. ఆ వృషభము నేనే. ఇతరుడెవ్వడును అతనిని మోయుటకు సమర్థుడు కాడు. పారిజాతము మొదలగు పుష్పములను మంచి పరిమళము గల చందనాది పదార్దములను నాయందుంచిన (నా కర్పించిన) అతనికి ఆ పదార్థములందెప్పుడు కూడ కోరిక లేదు. అతనికి ఉమ్మెంత పువ్వు బిల్వ పత్రములు మారేడు కర్ర గంధము లందే ఎల్లప్పుడు ప్రీతి. గంధమానములు సుగంధములు అతనికి సమానము. యోగుల కిష్టమైన వ్యాఘ్ర చర్మము (పులితోలు) నందు అతనికాసక్తి.
దివ్యలోకమందు గానీ దివ్యమైన శయ్యయందు గాని జన సమూహము నందు గాని అతని మనస్సు లగ్నము కాదు. మిక్కిలి ఏకాంత ప్రదేశమైన శ్మశానము నందుండి రాత్రింబగళ్ళు నన్ను ధ్యానించుచుండును. బ్రహ్మ మొదలుకొని గడ్డి వరకు అన్ని ప్రాణులనతడు సమానముగా మలచును. అనిర్వచనీయమైన నా రూపమందే అతని మనసు మగ్నమై యుండును. ఒక సృష్టికర్త (బ్రహ్మ) యొక్క జీవితకాలము శివునికొక క్షణకాలము. ఇకనతని ఆయుః ప్రమాణము నేనే ఎరుగను. ఆ స్థితిలో వేదమునకెట్లు తెలియును.
ఆ మృత్యుంజయుడు నా తేజస్సుతో సమమైన జ్ఞానమునకు మారు రూపమైన శూలమును ధరించును. నేను తప్ప మరి యొక్కడెవ్వడును శంకరుని జయించ గల ప్రభువు లేడు సమర్థుడు లేడు), శంకరుడు నాకు ప్రాణముల కంటే అధికుడు. అతడు నా అంతరాత్మ. త్ర్యంబకుని యందే నా మనస్సెప్పుడు నుండును. భవుని కంటే ఇతరుడు ఎవడును నాకు ప్రియుడు లేడు. ఈ బ్రహ్మాండములన్నియు నాచేత ఆక్రమింపబడీ (కప్పబడి} ఉన్నవి. ఎల్లప్పుడు నా మాయచేత అవి వణికి పోవుచున్నవి. కాని అతని నేదియు మోహింపజేయజాలదు. నేను వైకుంఠమున గాని గోలోకమున గాని నీ వక్షస్థలమందుగాని కుదురుగా నివసించుచులేను. ప్రేమ పాశము చేత బంధింపబడినవాడనై శివునీ హృదయమందెల్లప్పుడు నివసింతును. శంకరుడు ఐదు ముఖములతో మంచి రాగచ్ఛాయ గల సప్తస్వరములతో ఎల్లప్పుడు నా కథను పాడుచుండును. ఆ కారణము చేత అతని వద్దనే యుందును.
ఎవడు తన యోగశక్తి వలన కేవలము బొమముడి యొక్క విలాసముతో బ్రహ్మాండములను సృష్టించుటకు నశింపజేయుటకు శకుడో ఆ శంకరుని మించిన యోగి మరొకడు లేడు, దివ్యజ్ఞానముతో బొమముడి విలాసము ద్వారా మృత్యువును కాలాదులను సృష్టించుటకు నశింపజేయుటకు సమర్థుడైన శంకరుని కంటే జ్ఞాని మరియొకడు లేడు. నా భక్తిని నా దాస్యమును నా ముక్తిని సర్వసంపదలను సర్వసిద్ధులను ఇచ్చుటకు శంకరుడే ప్రభువు. అతనిని మించిన దాత వేరొకడు లేడు. ఐదు ముఖములతో నా నామమును రాత్రీబగలు పాడుచు నా రూపము నెల్లప్పుడు ధ్యానించు శంకరుని కన్న భక్తుడు వేరొకడు లేడు. నేను సుదర్శన చక్రము శంభుడు తేజస్సును బట్టి సమానులము. యోగశక్తితో లోకసృష్టి చేయగల బ్రహ్మ, తేజస్సులో మాతో సముడు గాడు. ఇట్లు శంకరుని విమల కీర్తిని నీకు చెప్పితిని. ఇంతవాడైనను శంకరునికి దర్పభంగము సంభవించినది. ఇంకేమి వినగోరుచున్నావు.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే శ్రీకృష్ణకృత శంకర ప్రశంసా నామ షట్ త్రింశోధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదనంవాదరూపమైన శ్రీ కృష్ణుని చేత చేయబడిన శంకర ప్రశంస అనెడి ముప్పది ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 36 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Kaṃsa dispatched another formidable demon named Arishta, who assumed the terrifying form of a gigantic, ferocious bull with horns that pierced the clouds, striking terror into the hearts of the residents of Vraja. Charging furiously through Gokula, Arishta threatened to destroy everything in his path until Lord Kṛshṇa calmly stepped forward, caught the raging bull by his massive horns with one hand, and slammed him to the ground. Kṛshṇa then twisted the demon's neck and broke his body like a dry twig, liberating Arishta's soul while the cowherds praised the Lord's infinite strength and protection.