మూII శ్రీకృష్ణ ఉవాచ:
అను ॥ శ్రీకృష్ణుడిట్లన్నాడు :
ఓ నందుడ! నీమనస్సు ఆనందపడేట్లుగా చెబుతాను, విను. పురాణములలో పరిష్కరింపబడిన రమ్యమైన మధురమైన కథను విను. (1) కృతయుగంలో ధర్మం పూర్ణంగా ఉంది అంతా ధార్మికులు. సత్యము పరిపూర్ణంగా ఉంది. దయపరిపూర్ణంగా ఉంది. (2) నాలుగు వేదముల రూపాలు మిక్కిలి వెలిగిపోతున్నాయి. వివిధమైన వేదాంగములు ఇతిహాసములు సంహితలు (3) రమ్యమైన పురాణములు, ఐదు పంచరాత్రములు, అందమైనవి, క్షేమకరమైనవి ఐనధర్మశాస్త్రములు అన్నివెలిగిపోతున్నాయి. (4) బ్రాహ్మణులంతా వేదాలనెరిగిన వారే పుణ్యవంతులు తపస్వులును. నారాయణుని వారు ధ్యానిస్తారు. వాని యందే మనస్సు నిలిపి జపిస్తారు. (5) బ్రాహ్మణులు క్షత్రియులు, వైశ్యులు, నాలుగవ వర్ణమువారు అంతా వైష్ణవులే. శూద్రులు బ్రాహ్మణులకు భృత్యులు. సత్యమందు ధర్మమందును ఆసక్తికలవారు. (6) రాజులు ధార్మికులు, ప్రజాపాలనయందు ఆసక్తికలవారు. ప్రజల నుండిరాజులు పదహారవ భాగం పన్నుగా తీసుకునేవారు. (7) విప్రులకు పన్నులేదు. వారు పూజ్యులు. స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. భూమి ఎల్లప్పుడు అన్ని పంటలతో కూడినది. రత్నములకు ఆధారమైనది. (8) శిష్యులు గురుభక్తి కలవారు. కొడుకులు తలిదండ్రుల పై భక్తిగలవారు. స్త్రీలు పతిభక్తిగలవారు, పతివ్రత ధర్మమందు ఆసక్తికలవారు. (9) అందరు ఋతుకాలమందే భార్యలను కలిసేవారు. స్త్రీలుబులు, లంపటులు లేరు. ధస్యుల భయము, దొంగల భయము లేదు. పరస్త్రీని తన భార్యగా గలవారు (వ్యభిచారులు) లేరు (10) చెట్లునిండుగా పండుతున్నాయి. ఆవులు నిండుగా పాలిస్తున్నాయి. జనులంతా బలవంతులు, పొడుగువారు, సౌందర్యవంతులు. (11) కొందరు లక్ష సంవత్సరాల ఆయుస్సు కలవారు పుణ్యవంతులు, రోగాలులేని వారు. విప్రులు విష్ణు భక్తులైనట్టుగానే మిగిలిన మూడు వర్ణములవారు విష్ణువును సేవించేవారు. (12) నదములు, నదులు నీటితో నిండి ఉంటాయి ఎప్పుడూ. అట్లాగే లోయలు కూడా, నాలుగు వర్ణముల వారు. తీర్థములతో పవిత్రమైన వారు. బ్రాహ్మణులు తపస్సుతో పవిత్రమైనవారు. (13) అందరు మనస్సుతో పవిత్రమైనవారు. ముల్లోకములలో ఖలలు లేరు. సత్కీర్తితో నిండినది. యశస్సునిచ్చేది మంగళముతో కూడినది (14) ప్రతి ఇంటిలో అన్ని కాలములలో పితరులు, తిథుల కాలములలో దేవతలు, అన్నికాలములలో అతిథులు పూజింపబడుతారు.
నంద ఉవాచ-
శ్రీకృష్ణ ఉవాచ :
మూడు వర్ణముల వారు విప్రులకు భక్తులు విప్రులను భుజింపచేయటంలో ఆసక్తికలవారు. బ్రాహ్మాణుని ముఖమే ఒక పొలం. అది ఊషరక్షేత్రం కాదు (చవిటినేల కాదు). ముళ్ళులేనిది. (16) ఆ ఉత్సవంలో నారాయణుని గొంతెత్తి కీర్తిస్తూ అంతా ఆనందిస్తారు. అక్కడ దేవతలను బ్రాహ్మణులను పండితులను నిందించేవాళ్ళు ఉండరు. (17) తన్నుతాను పొగడుకొనేవాడు ఒక్కడు కూడా ఉండడు. అంతా ఇతరుల గుణాల పై శ్రద్ధచూపేవారే. జనులకు శత్రువులుండరు. అందరు అందరి హితాన్ని కోరేవారు. (18) పురుషులు, స్త్రీలు కూడా పండితులు, మూర్బులుండరు. జనులంతా దుఃఖంలేకుండా ఉంటారు. అందరికి రత్నముల మందిరాలే (19) వారి ఇళ్ళు మణులు, మాణిక్యాలు, రత్నరాసులు, రత్నములు, స్వర్ణము వీటితో కూడి ఉంటాయి. భిక్షుకులుండరు. రోగార్తులుండరు. దుఃఖం లేకుండా అంతా ఆనందంతో ఉంటారు. (20) ఆడవాళ్ళుకాని మగవాళ్ళుకాని సొమ్ములు లేకుండా ఎవరూ ఉండరు. పాపులు, ధూర్తులు, ఆకలితో బాధపడేవారు కుత్సితులు ఉండరు. (21) ప్రాణులంతా ముసలితనంలేనివారు. ఎప్పుడూ యవ్వనంలో ఉండేవారే! ఆధివ్యాధులు లేనివారు.ప్రాణులు నిర్వికారులు (22) సత్యయుగంలో (కృత) ధర్మము, సత్యము, దయాదికము ఏవి చెప్పానో, అది త్రేతాయుగంలో ఒకపాదం, తక్కువగా ఉంటుంది. ద్వాపరంలో కృతయుగం కన్న సగమే ఉంటుంది. (23) కలియుగంలో ధర్మం ఒక పాదంలో ఉంటుంది. కృశించి, బలహీనంగా ఉంటుంది. ఓ ప్రజ! దుష్టులైన దస్యులు దొంగలు మొలకెత్తుతారు. (24) కొందరు అధర్మం యందే ఆసక్తి చూపుతారు. వారు భయపడేవాళ్ళు, దాచేవాళ్లు ఉంటారు. కులటలు భయంతో రహస్యంగా ఉంటారు. వ్యభిచారులు కూడా భయంగా ఉంటారు. (25) ధర్మమాచరించే వారికి భయముంటుంది. అధర్మమాచరించేవారు వణికిపోతుంటారు. రాజులు కొద్ది ధర్మం ఆచరిస్తుంటారు. బ్రాహ్మణులు కొద్దిగా వేదాల పై ఆసక్తి చూపుతారు. (26) కొందరు వ్రతాలు ధర్మము వీని పై ఆసక్తి చూపుతారు. అంత స్వేచ్ఛగా నడిచేవాళ్ళే. తీర్థములున్నంత వరకు, సాధువులున్నంత వరకు (27) గ్రామదేవతలున్నంత వరకు, శాస్త్రములు, పూజ ఉన్నంత వరకు అంతదాకా కొద్దిగ, తపస్సు, సత్యము, స్వర్గము, ధరాంశ ఉంటాయి.. (28) కలి, దోషములకు నిధి ఐనా ఓ తండ్రి! కలికి ఒక గొప్ప గుణమున్నది. మనస్సు పుణ్యభావనకలదైతే చాలు పుణ్యమే. దుష్కృతములేదు. (29) ఓ తండ్రి! తీర్థాదికములకు వెళితే చెడు (దుష్కృతం) నష్టమై ధర్మాంశ ఉంటుంది. కుహు (అమావాస్య) యందు చంద్రునివలె ధర్మము కలారూపంలో ఉంటుంది. (30) అప్పుడునందుడిట్లా - ఈ తీర్దములన్ని ఎన్నాళ్ళుంటాయి. ఓ వత్స! సజ్జనులు, గ్రామదేవతలు, ఈశాస్త్రములు ఉంటాయా అనగా (31) కృష్ణుడిట్లా- ఈ భూమి పై హరి కలిలో పదివేల సంవత్సరాలుంటాడు. దేవతల ప్రతిమను పూజించాలి. శాస్త్రములు పురాణములు పూజించాలి. (32) అందులో సంగం కాలము తీర్థములుంటాయి. గంగాదులుంటాయి, ఇది నిశ్చయము. అందులో సగం కాలం గ్రామదేవతలుంటారు. వేదములు, విద్వాంసులకుంటాయి. (33) ఓ తండ్రి! కలిలో దాని అంతమందు అధర్మం పరిపూర్ణంగా ఉంటుంది. నాలుగు వర్ణముల వారు ఒకేవర్ణం వారై (కలిసి) పోతారు. (34) మంత్రంతో పవిత్రమైన వివాహాలుండవు. సత్యము, ఓర్పు ఉండవు. గ్రామీణ ధర్మాన్ని ప్రధానంగా చేసుకొని ఎప్పుడూ స్త్రీలను స్వీకరించడానికి ఆసక్తులౌతారు. (35) రోజు బ్రాహ్మణులకు యజ్ఞోపవీతము, తిలకము ఉండవు. సంధ్యలేదు. శాస్త్రములు లేవు. శ్రుతులులేవు. ఇట్లా బ్రాహ్మణ వంశములుంటాయి.
నియమములనుండి దిగజారి అందరు అందరితో కలసి తింటారు.లోకులు తినకూడని వాటిని తింటారు. నాల్గు వర్ణముల వారు లంపటులౌతారు. (అత్యాసక్తి) (37) స్త్రీలలో సతి అనేది ఉండదు. ప్రతి ఇంట్లో కులటలుంటారు. భార్య భర్తను భయ పెడుతుంది. సేవకునిలా చూస్తుంది. వణికిస్తుంది. (38) జారునకు మధురమైన ఆహారాన్ని పెడ్తుంది. తాంబూలము, వస్త్రములు చందనము ఇస్తుంది. ఓ తండ్రి! దుఃఖించే భర్తకు తిండి పెట్టరు. (39) కొడుకు తండ్రిని భయ పెడుతాడు. శిష్యుడు గురువును భయ పెడుతాడు. ప్రజలు రాజును కొడతారు. రాజు ప్రజలను కొడతాడు. (40) దస్యులతో (శత్రువు) దొంగలతో దుష్టులతో శిష్టులు పీడింపబడతారు. భూమి పంటలు లేనిదౌతుంది. ఆవులు పాలులేని దౌతాయి. (41) కొద్దిపాలలో నేయుండదు. రోజు వెన్ననే ఉంటుంది. జనులంతా సత్యము నుండి హీనులౌతారు. ఎప్పుడు అబద్దాలాడుతారు. (42) శుచిత్వము, సంధ్య, శాస్త్రములు ఇవి లేకుండా బ్రాహ్మణులు ఎద్దుల పై సంచరిస్తారు. బ్రాహ్మణులు శూద్రులకు వంటచేస్తారు. శూద్రుల శవాలను దహనం చేస్తారు. (43) శూద్రస్త్రీలందు ఆసక్తి చూపుతారు. ఎప్పుడూ శూద్రులు విప్రస్త్రీలందు ఆసక్తిచూపుతారు. పరిపాచకులు (పండించేవారు) ఏ బ్రాహ్మణుని తిండి తింటారో (44) ఆ బ్రాహ్మణుని భార్యను తల్లికన్నా మిన్నయైనదానిని శూద్రులు లంపటులై గ్రహిస్తారు. భృత్యుడు రాజును చంపితాను రాజౌతాడు. (45) కామంతో స్త్రీ భర్తను చంపి, కౌతుకంతో జారుని చేరుతుంది. కొడుకు తండ్రిని చంపి తాను రాజౌతాడు. (46) అంతా స్వేచ్ఛాసక్తులౌతారు. మైధునకర్మ, తిండి వీటి మీదే ఆసక్తి చూపుతారు. కఠినులు, తీసివేయతగినవారు, రోగగ్రస్తులు, కుత్సితులు, కుత్సితమైన వేషధారణ కలవారౌతారు. (47) అవ్వుత్పన్న మంత్రాలు కలిగి ఉంటారు, అబద్దపు బీజాక్షర చక్రాలను ప్రచారం చేస్తారు. జాతిహీనులైన గురువులు ఉండగా వారిని నిందించేవారు, వయోహీనులు (తక్కువ వయస్సువారు) (48) మేచ్ఛరాజులు, యవనులు ధర్మనిందకులౌతారు. సాధు జనుల సత్కర్తిని కూడా ఆనందంతో నాశనం చేస్తారు. (49) పితృదేవద్విజాతులు, అతిథులు వీరికి రోజు పూజ ఉండదు. గురుపూజ, పితృపూజ ఉండవు. స్త్రీలకు కూడా (50) ఓ తండ్రి! ఎప్పుడు స్త్రీలు తమతరపు బంధువులను (తల్లిగారిని) గౌరవిస్తారు. సత్కులంలో పుట్టినవారు దొంగలౌతారు. బ్రాహ్మణుడు దేవుని సొత్తు హరించేవాడౌతాడు. (51) లోభంతో, యుగధర్మాన్ననుసరించి, కౌతుకంతో అభిమానాన్ని కలిగి ఉంటారు. గుళ్ళు లేకుండా ఔతుంది, జగత్తంతా భయంతో నిండిపోతుంది. (52) అరాజకము, చెడునడవడిక ఎప్పుడూ ఉంటాయి, కలిదోషం వలన, నరులు ఆకలిబాధ, కుత్సితవేషధారణ, దరిద్రము, రోగములు కలవారౌతారు. (53) గవ్వ ఘటములలో అధ్యక్షుడు. ఘటేశ్వరుడు రాజేంద్రుడు. లోకములు, ముసలివాని బొటనవేలంత వృక్షములు కొమ్మలంత సమానము. (54) తాటిచెట్ల, కొబ్బరిచెట్ల, పనసచెట్ల పండ్లు ఆవగింజలంత, ఆ పిదప అంతకన్న చిన్నగ (55) నీటి పాత్రలు వంట పాత్రలు, పంటలు, వస్త్రములు ఇవేవీలేక ఇళ్ళుంటాయి. గృహములు అలంకరణ లేకుండా ఉంటాయి. (56) గంధకం నిండి ఉంటుంది. దీపాలుండవు. చీకటుంటుంది. జనులు హింసించే జంతువుల భయం వల్ల భయపడుతుంటారు. అంతా పాపులే (57) అంతా ఫలమందు లోభం కలవారే. స్త్రీలు వ్యభిచారిణులు, కలహ ప్రియలు, స్త్రీలు సౌందర్యవతులు కారు. మగవాళ్ళూ రూపవంతులు కారు.
నంద ఉవాచ:
నదులు,నదములు, కందరములు, తటాకములు, సరోవరములు, నీళ్ళు పద్మములు లేకుండా ఔతాయి. మేఘములు నీరు లేకుండా ఔతాయి. (59) స్త్రీలు సంతానహీనులౌతారు, కాముకులు, జారులతో కూడిన వారౌతారు. అందరు రాగి చెట్లను కొట్టేస్తారు. భూమి వృక్షములు లేకుండా ఔతుంది. (60) చెట్లు పండ్లు లేనివి ఔతాయి. శాఖలు, స్కందములు లేనివౌతాయి. పండ్లున్నా వానిలో రుచి ఉండదు. అన్నము, జలము రుచి ఉండవు. (61) నరులు కపటం మాట్లాడేవారౌతారు. దయాహీనులు, ధర్మంలేని వారౌతారు. ఆ చివర పన్నెండు మంది సూర్యులు మనుష్యులను సంహరిస్తారు. (62) ఓ ప్రజేశ్వర! జంతువులనన్నిటిని వేడితోనో, అతి వృష్టితోనో చంపుతారు. భూమి మిగులుతుంది. అది కథామాత్రంగా మిగులుతుంది. (63) కలివెళ్ళిపోయాక ఈ భూమి, వర్షం వస్తే భూమి చిగురించినట్లు, తిరిగి సత్యకాలం వస్తుంది క్రమంగా. (64) ఓ తండ్రి! ప్రజానికి సుఖంగా వెళ్ళు. అని ఈ విధంగా అంతాచెప్పాగదా. నేను పాలుతాగే పిల్లవాణ్ణి నీ కొడుకును, ఇంకేం చెప్పాలి . (65) వెన్న, నేయి, పాలు, పెరుగు, చల్ల చక్క చేయబడినవి. స్వస్తికము శుభకర్మకు అర్హమైనది. మిష్టాన్నము అమృతము వంటిది. (66) పితృదేవతల నిమిత్తకమైన మిష్టద్రవ్యమేదైనా బలవంతంగా తిన్నదంతా బాలురకు రోదనము బలము. (67) నేను అడుగడుగున చిన్నవానిగా చేసిన దోషము, నా అపరాధాన్ని దానిని క్షమించు. నీవు తండ్రివి. నీ కొడుకును నేను యశోద నా తల్లి. (68) నాపరిహాసాన్ని, యశోదకు రోహిణికి చెప్పు. కుమారుని ముఖం నుండి విన్నదంతా చెప్పు. వాడే నేను అని ఈరకంగా నా కోరిక. (69) అదంతా అంతా గోకులంలో ఉండేవారికి చెప్తావు. కాలము కలుపుతుంది. బంధువులను బంధువులతో, (70) కాలం విడదీస్తుంది విరోధము, ప్రీతిదేన్నైనా కాలం కల్గిస్తుంది. కాలం సృష్టిస్తుంది, కాలం పాలిస్తుంది. (71) కాలం ఆనందపరుస్తుంది. కాలం ప్రజలను సంహరిస్తుంది. సుఖము, దుఃఖము, భయము, శోకము, ముసలితనము, మృత్యువు, జన్మ (72) అన్నిటిని కర్మానుగుణంగా కాలమే చేస్తుంది. ఓ తండ్రి! అంతా కాలం చేసేదే ఆశ్చర్యపడేది లేదు. ప్రజానికి వెళ్ళు. (73) గోకులంలో వైశ్యుడవు. నందుడవు వైశ్యాధిపుడవు నృపుడవు నీవెక్కడ. వసుదేవుని కొడుకును నేను, మధురలోనేను. నేనెక్కడ (74) నా తండ్రి కంసునికి భయపడి నీ ఇంట్లో ఉంచాడు. నీవు తండ్రిని మించిన తండ్రిని, తల్లి నాతల్లిని మించినది. (75) ఓవ్రజేశ్వర! నేనిచ్చిన జ్ఞానంతో, గోపికతో కూడి, ఓ మహాభాగ! మోహాన్నివిడువు. ఓ తండ్రి! సుఖంగా ఇంటికివెళ్ళు. (76) అనగా నందుడిట్లా ఓ తండ్రి (కొడుక) ! వృందావనాన్ని పుణ్యమైన , అందమైన , గొప్ప ఉత్సవముగలదాన్ని స్మరించు. గోకులంగల గోకులాన్ని అందమైన, సుందరమైన యమునా తటాన్ని స్మరించు . (77) అందమైన నీకిష్టమైన స్త్రీల రాసమండలాన్ని స్మరించు. గోపబాలికలను, గోపాలురను యశోదను, ప్రియమైన రోహిణిని స్మరించు. (78) ఓ కొడుక! ప్రాణాధికురాలైన రాధిక నెట్లా మరుస్తావు. ఓ కొడుక! ఒకరోజు కొద్ది సమయముకై గోకులమునకు వెళ్ళు.
అనిపలికి ఆనందుడు కృష్ణుని తన ఉరము పై ఉంచుకున్నాడు. దుఃఖిస్తూ కన్నీళ్ళతో పూర్తిగా, ఆకృష్ణుని తడిపాడు. (80) మోహంతో వక్షమందుంచుకొని , ఆతని గండ స్థలాలను ముద్దాడాడు నందుడు. ఆనందంతో పరమానందంతో ఆభగవంతుడు నందునితో ఇట్లన్నాడు. (81) అని బ్రహ్మవైవర్త మహాపురాణంలో శ్రీకృష్ణజన్మఖండమందు ఉత్తరభాగంలో నారాయణ నారద సంవాదమందు తొంబదవ అధ్యాయము.
Summary of chapter 90 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Illustrating how the Supreme Lord personally protects His unalloyed devotees, the text narrates the history of King Ambarīsha, a saintly monarch who observed strict vows of devotion to Lord Śrī Vishṇu. When the short-tempered Maharshi Durvāsas attempted to curse the king over a minor breach of hospitality during an Ekādashī fast, Lord Vishṇu's Sudarshana Chakra manifested instantly to protect Ambarīsha, pursuing Durvāsas across the universe until the sage humbly sought the king's forgiveness.