బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

21 - ఇంద్రునకు లక్ష్మీప్రాప్తి

నారద ఉవాచ –  నారదముని ఇట్లు పలికెను-

 తే దేనా బ్రహ్మశాన నిఃశ్రీకా కేవ వా ప్రభో

బభూవు స్తద్రహప్యం చ గోపవీయం సుదుర్లభం

కథం వా ప్రాపురే తాం కమలాం జగతాం ప్రసూం

కిం చకార మహేంద్రశ్చ తద్భవాన్ వక్తుమర్హసి

ఓ నారాయణమునీ! దేవతలు ఏ బ్రాహ్మణశాపమువలన తమ సంపదను కోల్పోయిరో అట్లే దేవేంద్రుడు దేవతలు లోకములకు తల్లియగు లక్ష్మీదేవినెట్లు పొందిరో, రహస్యమైన ఆ విషయమును నాకు వివరింపుడని అడిగేను.

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను.

గజేంద్రేణ పరాభూతో రంభయ చ సుమందధీః

భ్రష్టశ్రీర్దైన్యయుక్తశ్చ స జగామమరావతీం

ఆం దదర్శ నిరానందో నిరానందాం పురీం మువే

దైన్యగ్రస్తాం బంధుహినాం వైరివర్గైః సమాకులాం

 ఇతి శ్రుత్వా దూతముఖాజ్ఞగామ గురుమందిరం

తేన దేవగణైస్సార్థం జగామ బ్రహ్మణః సభాం

దేవేంద్రుడు తన వాహనమగు గజముచే, రంభచే తిరస్కరింపబడి, సంపదను కోల్పోయి. విచారవదనముతో అమరావతి పట్టణమునకు పోయెను. అప్పుడచ్చట అతని బంధువులు లేక శత్రువులుండిరి. అందువలన ఆ పట్టణము దైన్యముతో ఉన్నట్లు దూతలు చెప్పగా అతడు తోటి. దేవతలతో కలసి బృహస్పతి ఇంటికి వెళ్ళాము. అచ్చట నున్న తన గురువును తీసికొని ఇంద్రుడు బ్రహ్మలోకమునకు పోయెను.

గత్వా ననామ తం శక్రః సురైః సార్థం తథా గురుః

తుష్టావ వేదవాక్యైశ్చ సోత్రేణాఽపి చ సంయుతః

 ప్రవృత్తిo కథయామాస వాక్పతిస్తం ప్రజాపతీం

శ్రుత్వా బ్రహ్మా నమవక్త్రః ప్రవక్తుముపచక్రమే

దేవేంద్రుడు, అతని గురువగు బృహస్పతి దేవతలతో కలసి  బ్రహ్మదేవుని, వేదవాక్యములచే, స్తోత్రములచే స్తుతించిరి. అప్పుడు బృహస్పతి ఇంద్రుని విషయమునంతయు బ్రహ్మదేవున కెరింగించెను. బృహస్పతి మాటలు విన్న బ్రహ్మదేవుడు తలను వంచుకొని ఇట్లు మాటాలాడసాగెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను-

 మత్ప్రపౌత్రోఽసి దేవేంద్ర శశ్వద్రాజశ్రీయా జ్వలన్

లక్ష్మీసమశచీభర్తా పరస్త్రీలోలుపః సదా

గౌతమస్యాభిశాపేన భగాంగః సురసంపది

పునర్లజ్జావిహీనస్త్యం పరస్త్రీరతిలోలుపః

యః పరస్త్రీషు నిరతః తస్యశ్రీర్వాకులోయశః

స చ నింద్యః పాపయుక్తః శశ్వత్సర్వషభాసు చ

నైవేద్యం శ్రీహరేరేవ దత్తం దుర్వాససా చ తే

గజమూర్ద్నీ త్వయా న్యస్తం రంభయాఽహృతచేతసా

 క్వ సా రంభా సర్వభోగ్యా క్వాఽధునా త్వం శ్రీయాహతః

 సర్వసౌఖ్యప్రదాత్రీ త్వాం గతా త్యక్త్యా క్షణేన సా

 వేశ్యా సశ్రీకమిచ్ఛంతి నిః శ్రీకం న చ చంచలా

నవం నవం ప్రార్థయంతీ పరినింద్య. పురాతనం

యద్గతం తద్గతం వత్స నిష్పన్నం న నివర్తతే

భజ నారాయణం భక్త్యా పద్మాయా: ప్రాప్తి హేతవే

ఓ దేవేంద్రుడా! నీవు నా ముని మనుమడవు. ఎల్లప్పుడు రాజుగానున్నావు. నీ భార్యయగు శచీదేవి లక్ష్మీదేవితో సమానురాలు. ఐవన పరస్త్రీలోలుడవు. పరస్త్రీ లోలుడవైనందువలననే గౌతమమహర్షి శాపమువలన నీకు ఆకారమున వికారము కలిగినది. ఐనను సిగ్గును వదలి తిరిగి పరస్త్రీ లోలునివైతివి,

పరస్త్రీలోలునకు సంపద, కీర్తి యుండునా? ఆ పాపుని అంతటా నిందించుచుందురు. నీకు దుర్వాసమహర్షి శ్రీహరి నైవేద్య రూపమైన పుష్పమునీయగా రంభా లోలునివై ఆ పుష్పమును ఏనుగు శిరస్సుపై పారవేసితివి. వేశ్యయగు ఆ రంభ ఇప్పుడెచ్చటనున్నది. నీవు మాత్రము రాజ్యలక్ష్మిని కోల్పోతివి. అందరకు శారీరక సౌఖ్యమునందజేయు ఆ రంభ నిన్ను క్షణములో వదలివేసినది. చంచల స్వభావయగు వేశ్య ఎల్లప్పుడు సంపదకలవానిని మాత్రమే కోరుకొనును. అట్లే పాతవారిని వదలిపెట్టుచు కొత్తవారిని కోరుకొనుచుండును.

సరే జరిగిందేదో జరిగిపోయినది. జరిగిన కార్యము తిరిగి వెనుకకురాదు. అందువలన జరిగినదానికై చింతింపక లక్ష్మీదేవియొక్క అనుగ్రహమునకై నారాయణుని భక్తితో సేవింపుమని అనెను.

ఇత్యుక్త్వా తం జగత్త్రష్టుః స్తోత్రం చ కవచం దదౌ

నారాయణస్య మంత్రం చ నారాయణ పరాయణః

సతైః సార్థం గురుణా హ్యాజమన్మంత్రమీప్సితం

 గృహీత్వా కవచం తేన పర్యష్ఠౌత్ పుష్కరే హరేః

 వర్షమేకం నిరాహారో భారతే పుణ్యదే శుభే

సిషేవే కమలాకాంతం కమలాప్రాప్తిపాతం

బ్రహ్మదేవుడీ విధముగా పలికి జగత్కారణుడగు శ్రీమన్నారాయణుని మంత్రమును, స్తోత్రమును, కవచమును అతనికి ఉపదేశించేను, అప్పుడు దేవేంద్రుడు తన గురువు, ఇతర దేవతలతో కలసి పుష్కర క్షేత్రమున శ్రీహరి మంత్రమును జపించుచు స్తోత్రమును కవచమును పఠించెను. ఇట్లు పుణ్యదేశమైన భారతభూభాగమున ఆహారరహితుడై ఒక సంవత్సరము వరకు శ్రీహరిని సంపద కొరకు సేవించెను.

ఆగత్య తం హరిస్తస్మై వాంచితం చ వరం దదా

 లక్ష్మీస్తోత్రం చ కవచం మంత్రమైశ్వర్యవర్ధనం

దత్వా జగామ వైకుంఠమింద్రః క్షీరోదమేవచ

గృహీత్వా కవచం శ్రుత్వా ప్రాప్తి పద్మాలయాం మునే

 సురేశ్వరోఽరిం జిత్పావై హ్యలభచ్చామరావతీం

ప్రత్యేకం చ సురాః సర్వే స్వాలయం ప్రాపురీప్సితం

ఇంద్రుడు చేసిన తపస్సునకు శ్రీహరి సంతోషించి ఇంద్రుని దగ్గరకు వచ్చి అతనికి ఆభిమత వరమునిచ్చెను. అట్లే ఐశ్వర్యమును పెంపొందించు లక్ష్మీస్తోత్రమును, లక్ష్మీకవచమును, మంత్రమును అతనికి ఉపదేశించి వైకుంఠమునకు పోయేను. ఇంద్రుడు శ్రీమహాలక్ష్మీ కవచమును స్వీకరించి లక్ష్మీస్తోత్రముచే ఆమెను స్తుతించి లక్ష్మీదేవి అనుగ్రహమును పొందెను. అందువలన ఇంద్రుడు తన శత్రువులను జయించి తన అనుచరులైన దేవతాగణముతో కలిసి అమరావతిన్ (స్వర్గమున) తిరిగి పొందగలిగాడు.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతియే గణపతిఖండే నారద నారాయణపంవాదే శకలక్ష్మీప్రాప్తిర్నామ ఏకవింశతిశయోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారద నారాయణ మునుల సంవాద సమయమున తెలుపబడిన ఇంద్రునకు లక్ష్మీప్రాప్తియను ఇరువది యొకటవ అధ్యాయము సమాప్తము.