నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి నారదునితో ఇట్లనేమ-
త్యక్త్యా రతిం మహోదేవో దదర్శ పురతః సురాన్ ।
పలాయధ్వమితి ప్రాహ కృపయా పార్వతీభయాత్ ॥
దేవాఃపలాయితా భీతాః పార్వతిశాపహేతునా।
సర్వబ్రహ్మాండసంహర్తా చకంపే పార్వతీభయాత్॥
తల్పాదుత్థాయ సా దుర్గా న చ దృష్ట్యా పురః సురాన్।
సముత్థితం కోపవహ్నిం స్తంభయామాస దేహతః ॥
అద్యప్రభృతి తే దేవా వ్యర్థఏర్యా భవంత్వీతి ।
శశాప దేవీ తాన్ దేవాన్ ఆతీరుష్టా బభూవహ॥
శంకరుడు రతికార్యమును వదలి ఎదురుగానున్న దేవతలనుచూచి పార్వతీదేవి భయమువలన దేవతల పైగల దయతో వారిని పరుగెత్తిపొండని పలికెను. దేవతలుకూడ పార్వతీదేవి శాపము పెట్టునన భయమువలన పరుగెత్తుకొనిపోయిరి. సమస్తలోకములనన్నిటిని సంహరించు రుద్రుడు సహితము పార్వతీదేవి శాపము పెట్టునను భయమువలన కంపించిపోయెను.
పార్వతీదేవి శయ్య పైనుండి కోపముతో లేచినది. కాని దేవతలామెకు ఎదురుగా కన్పించినందువలన తనకోపమును తనలోనే కొంత సేపు అణచుకొనెను, ఐనను కోపమును పట్టలేక దేవతలకందరకు సంతానము కలుగవద్దనీ శపించినది.
తతః శివః శివాం దృష్ట్యా క్రోధసంరక్తలోచనాం ।
రుదంతీం నమవదనాం లిఖంతీం ధరణీతలం ॥
శివస్తాం దుఃఖిలాం దృష్ట్యా క్రోధసంరక్తలోచనాం ।
హస్తే గృహీత్వా దేవేవో వాసయామాస వక్షసి॥
ఆతీవభీతః సంత్రస్త ఉవాచ మధురం వచః ।
పార్వతీదేవి తాను సంతానమునకు దూరమైతినను దుఃఖముతో తలవంచుకొని భూమిని తన పాదనఖాంగుష్ఠముతో వ్రాయుచుండెను. ఆమెకన్నులు కోపముతో ఎరుపెక్కినవి. బాధపడుచున్న తనభార్యను చూచి శంకరుడు ఆమెను ఓదార్చుచు ఇట్లు మధురముగా అనెను.
శంకర ఉవాచ - శంకరుడిట్లు పార్వతితోననెను-
కథం రుష్టా గిరిశ్రేష్ఠకన్యే ధన్యే మనోహరే ॥
మమ సౌభాగ్యరూపేచ ప్రాణాధిష్ఠాతృదేవతే ।
కింతేభీష్టం కరిష్యామి వద మాం జగదంబికే ॥
బ్రహ్మాండసంఘే నిఖిలే కిమసాధ్యమిహాయోః ।
ఆహో నిరపరాధం మాం ప్రసన్నా భవ సుందరి ॥
దైవాదజ్ఞాతదోషస్య శాంతిం మే కర్తుమర్హసి ।
త్వయాయుక్తః శివోహం చ సర్వేషాం శివదాయకః ॥
త్వయా వినా హీశ్వరశ్చ శవతుల్యో శివః సదా ।
ప్రకృతిస్త్యం చ బుద్ధిస్త్యం శక్తిస్త్యం చ క్షమాదయా ॥
తుష్టిస్త్యం చ తథా పుష్ఠిః శాంతిస్త్యం క్షాంతిరేవ చ ।
క్షుత్యం ఛాయా తథా నిద్రా తంద్రా శ్రద్ధా సురేశ్వరి ॥
సర్వాధారస్వరూపా త్వం సర్వబీజస్వరూపిణీ ।
స్మితపూర్వం వద వచః సాంప్రతం సరసం శివే॥
త్వత్కోప విషసందగ్ధం ద్రుతం జీవయ మాం మృతం॥
పర్వత శ్రేష్ఠుడగు హిమాలయునిపుత్రీకా! నీవు చాలా అందమైనదానవు. నీవు నాప్రాణములకు ఆధిష్టానదేవతవు. నా యోక్క సౌభాగ్యరూపిణివి. జగన్మాతవగు నీకోరిక ఎట్టిదైనను దానిని నాకు చెప్పినచో తీర్తును.
ఈలోకములన్నిటియందు మన ఇద్దరకు ఆసాధ్యమైనదేదియులేదు. నేను ఏతప్పుచేయలేదు. నన్ను కోపించుట నీకు తగదు. ఆందువలన నీవు నావిషయమున ప్రసన్నురాలవు కమ్ము. నేను చేసిన తప్పు ఏమో నాకు తెలియదు. నీ వలననే నేను మంగళస్వరూపుడనైతిని. ఇతరులకు శుభములు కలిగించువాడనైతిని. నీవులేనిచో నేను శవమువలె ఆమంగళస్వరూపుడనైయుండువాడను.
నీవు ప్రకృతిస్వరూపిణివి, బుద్దీరూపిణినీ, శక్తి, క్షమ, దయ, తుష్టి పుష్టి శాంతి, క్షాంతీ, ఆకలి, ఛాయ, నీడ, నిద్ర, అలసత, శ్రద్ద మొదలగునవన్నీయు నీరూపములే. సమస్తసృష్టికి ఆధారరూపవు. సమస్తమునకు కారణరూపవు నీవే. ఇట్టినీవు నవ్వుచు సరసముగా నాతో సంభాషింపుము అని పరమేశ్వరుడు పార్వతీదేవితో పలికెను.
శంకరస్య వచః శ్రుత్వా క్షమాయుక్తా చ పార్వతీ ।
ఉవాచ మధురం దేవీ హృదయేన విదూయతా॥
మృదుమధురమైన శంకరుని మాటలను క్షమాగుణముకల పార్వతీదేవి విని హృదయము బాధతోనున్ననూ మధురముగా పరమేశ్వరునితో ఇట్లు పలికినది.
పార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లు పలికెను-
కిం త్వాం కథయిష్యామి సర్వజ్ఞం సర్వరూపిణం ।
ఆత్మారామం పూర్ణకామం సర్వదేహేప్వవస్థితం ॥
కామినీ మానసం కామమప్రజ్ఞం స్వామివం పదేత్ ।
సర్వేషాం హృదయజ్ఞం చ హృదీష్టం కథయామి కిం ॥
సుగోప్యం సర్వనారీణాం లజ్జాజననకారణం ।
ఆకథ్యమపి పర్వాసాం మహేశ కథయామి తే ॥
ఓమహేశ! నీవు సర్వము తెలిసినవాడవు, సమస్తరూపములు నీవే. నీవు ఆత్మారాముడవై యోగిగానున్నావు. నీవు సంపూర్ణకాముకుడవు.
కాముకురాలగు స్త్రీ తన మనస్సులోనున్న కోరికను తెలివితక్కువ భర్తతో నైనను చెప్పుకొనును. కానీ నీవు అందరి కోరికలు గుర్తించువాడవు. ఆట్టి నీకు నామనస్సులోని కోరికను ఏమని చెప్పుకొందును. నాకోరిక చాలా రహస్యమైనది. ఇది స్త్రీలందరకు సిగ్గును కలిగించునది. ఇతరులకు చెప్పరానిది. ఐనను నీకు చెప్పెదను.
సుఖేషు మధ్యే స్త్రీణాం చ విభవేషు సురేశ్వర ।
సత్పుంసా సహ సంభోగో నిర్జనేషు పరం సుఖం ॥
తద్భంగేన చ యద్దుఃఖం తత్సమం నాస్తి చ స్త్రీయాః ।
కాంతానాం కాంతవిచ్చేదశోకః పరమదారుణః ॥
కృష్ణపక్షే యథా చంద్రః క్షీయమాణో దినే దినే ।
తథా కాంతం వినా కాంతా క్షీణా కాంత క్షణేక్షణే ॥
చింతాజ్వరశ్చ సర్వేషాముపతాపశ్చ వాససాం ।
సాధ్వీనాం కాంతవిచ్చేదస్తురగానాం చ మైథునం ॥
రతీభంగో దుఃఖమేకం ద్వితీయం వీర్యపాతనం ।
దుఃఖాతిరేకి దుఃఖం చ తృతీయమనపత్యతా ॥
త్రైలోక్యకాంతం కాంతం త్వాం లబ్ద్వాపి వచ మేసుతః ।
యాస్త్రీపుత్రవిహీనా చ జీవనం తనిరర్థకం॥
జన్మాంతరసుఖం పుణ్యం తపోదానసముద్భవం ।
సద్వంశజాతః పుత్రశ్చ పరత్రేహ సుఖప్రదః ॥
ఓపరమేశ్వర! స్త్రీలకు సమస్తసుఖములలో గొప్పదైన సుఖము ప్రియుడగు తనభర్తతో రమించుట. ఆది నిర్జనప్రదేశమున మరింత సుఖమును కలిగించును. అట్టి సంభోగభంగముకంటే గొప్పనైన దుఃఖము స్త్రీలకు లేనే లేదు. అట్లే భర్త వియోగము స్త్రీలకు పరమదారుణమైనది.
చంద్రుడు కృష్ణపక్షమున ప్రతిదినము ఎట్లు క్షీణించునో భర్తలేని స్త్రీ ప్రతీక్షణము క్షీణించును. ఆందరకు చింత బాధాకరమైనది. బట్టలకు వేడిమి బాధాకరమైనది. అట్లే భర్త వియోగము స్త్రీలకు పరమ దారుణమైనది.
సుపుత్రః స్వామినోంశశ్చ స్వామితుల్యసుఖప్రదః ।
కుపుత్రశ్చ కులాంగిరో మనస్తాపాయ కేవలం॥
స్వామీ స్వాంశేన సుస్త్రీణాం గర్భే జన్మ లభేత్ ధ్రువం।
సాధ్వీ స్త్రీమాతృ తుల్యాచ సతతం హితకారిణీ ॥
అసాధ్వీ వైరితుల్యా చ శశ్వత్సంతాపదాయినీ।
ముఖదుష్టా యోనిదుష్టా చాసాధ్వీతి త్రిధాస్మృతా ॥
కిముపాయం కరిష్యామి వద యోగీశ్వరేశ్వర।
ఉపాయసింధో తపసాం సర్వేషాం చ ఫలప్రద ॥
మంచిపుత్రుడు తనభర్తయొక్క అంశరూపుడు. అతడు భర్తవలే సుఖమును కలిగించును. చెడ్డకొడుకు తన కులమునకు తనభార్యయొక్క గర్భమున తన ఆంశరూపమున పుత్రుడై పుట్టును. అట్లే పతివ్రతయగు స్త్రీ తల్లివలె ఎల్లప్పుడు తనభర్తయొక్క మేలునే కోరుచుండును. పతివ్రతకాని స్త్రీ శత్రువువలె ఎల్లప్పుడు తనభర్తకు దుఃఖమునే కలిగించుచుండును. ముఖదుష్ట (ఎల్లప్పుడు తనభర్తతో కలహము పెట్టుకొనునది) యోనిదుష్ట (జారస్త్రీ) అసాధ్వి అని దుష్టస్త్రీలు మూడువిధములుగానున్నారు.
అందువలన ఉపాయసముద్రుడవు. సమస్తతపః ఫలితములనిచ్చు ఓయోగీశ్వరేశ్వర నా బాధకు నివృత్తిమార్గమును నీవే ఉపదేశింపుమని పార్వతీ పరమేశ్వరుని కోరిను.
ఇత్యుక్త్యా పార్వతీదేవి నమ్రవక్త్రా బభూవ హా ।
ప్రహస్య శంకరోదేవో బోధయామాస పార్వతీం॥
సత్పుత్రబీజం సుఖదం తాపనాశనకారణం ।
మితం స్నిగ్ధం సురుచిరం ప్రవక్తుముపచక్రమే ॥
పార్వతీదేవి ఇట్లు తనభర్తతో పలికి తలవంచుకుని కూర్చుండెను. అప్పుడు శంకరుడు నవ్వి పార్వతిని ఇట్లు మధురమైన భాషణములతో లాలించెను.
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే ద్వితీయోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతిఖండమున నారద నారాయణసంపాదములో రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 2 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
High upon the snow-capped peaks of Mount Kailāsa, Goddess Pārvatī sat in profound sorrow, filled with an intense maternal longing to cradle a divine son in her arms. Beholding her distress, Her divine consort Lord Śiva lovingly solaced her heart, explaining that a transcendent son endowed with divine attributes cannot be obtained without rigorous penance and unwavering devotion to the Supreme Being. Lord Śiva revealed to her the sacred discipline of the Puṇyaka Vrata, an exalted vow dedicated to Lord Śrī Vishṇu that spans a full year and requires total physical purity, strict fasting, charity, and continuous meditation upon the Supreme Lord. Encouraged by Her husband's divine guidance, Goddess Pārvatī resolved to undertake this arduous vow with unyielding determination to attract the supreme grace of Lord Śrī Kṛshṇa.