బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

42 - గణేశ పరశురామ సంవాదము

పరశురామ ఉవాచ - పరశురాముడు గణపతితో ఇట్లు పలుకసాగెను –

యాస్యామ్యంతఃపురం భ్రాతః ప్రణామం కర్తుమీశ్వరం

ప్రణమ్య మాతరం భక్త్యా యాస్యామి త్వరితం గృహం

త్రిస్సప్తకృత్వో నిర్భూపాం కృత్వా పృథ్వీం చ లీలయా

కార్తవీర్యస్సుచంద్రశ్చ హతో యస్యప్రసాదతః

నానావిద్యా యతో లబ్ది నానాశాస్త్రం సుదుర్లభం

తం గురుం జగతాం నాథం ద్రష్టుమిచ్ఛామి సాంప్రతం

సగుణం నిర్గుణం చైవ భక్తానుగ్రహ విగ్రహం

సత్యం సత్యస్వరూపం చ బ్రహ్మజ్యోతిః సనాతనం

స్వేచ్చామయం దయాసింధుం దీనబంధుం మునీశ్వరం

ఆత్మారామం పూర్ణకామం వ్యక్తావ్యక్తం పరాత్పరం

పరాపరాణాంస్రష్టారం పురుహూతం పురస్కృతం

పురాణం పరమాత్మానమీశానం త్వాధిమవ్యయం

సర్వమంగళమాంగళ్యం సర్వమంగళకారణం

సర్వమంగళదం శాంతం సర్వైశ్వర్యప్రదం వరం

ఆశుతోషం ప్రసన్నాస్యం శరణాగతవత్సలం

భక్తాభయప్రదం భక్తవత్సలం సమిదర్శనం

ఓ సోదరా! ఈశ్వరునకు, తల్లియగు పార్వతీదేవికి నమస్కరించుటకై శంకరుని అంతఃపురమునకు వెళ్ళుచున్నాను.

ఆ పరమేశ్వరుని అనుగ్రహమువలన ఈ భూమి పై నున్న క్షత్రియులనందరను ఇరువదియొక్కమార్లు తిరిగి సంహరించితిని. అట్లే కార్తవీర్యార్జునుని, సుచంద్రుని సంహరించితిని.

ఆ దేవదేవుని అనుగ్రహమువలన అనేకవిధములైన విద్యలు, అనేక శాస్త్రములను నేర్చుకొంటిని. జగన్నాథుడగు నా గురువును చూడవలెనని పోవుచున్నాను.

అతడు సగుణస్వరూపుడు, నిర్గుణస్వరూపుడు, భక్తులను అనుగ్రహించుటకై మూర్తిని ధరించినవాడు. సత్యస్వరూపుడు, పరబ్రహ్మరూపుడు, జ్యోతిస్వరూపుడు, సనాతనుడు, స్వేచ్చామయుడు, కరుణాసముద్రుడు, దీనబంధుడు, ఆత్మారాముడు, పూర్ణకాముడు, వ్యక్తావ్యక్తుడు, పరాత్పరుడు, పురాణరూపుడు, పరమాత్ముడు, ఈశ్వరుడు, ఆద్యంతరహితుడు, అవ్యయుడు, సమస్తమంగళములకు కారణభూతుడు, సమస్తశుభములను కలిగించువాడు, సమస్తైశ్వర్యములని చ్చువాడు, అల్పసంతోషి శరణు కోరిన వారి పై దయగలవాడు, భక్తులకు అభయమునిచ్చువాడు, భక్తులపై దయకలవాడు. అట్టి నా గురువును చూచుటకు పోవుచున్నావని పరశురాముడు పలికెను.

ఇత్థం పరశురామోఽస్థాదుక్త్వా గణపతేః పురః

వాచా మధురయా తత్ర సమువాచ గణేశ్వరః

క్షణం తిష్ఠ క్షణం తిష్ఠ శ్రుణు భ్రాతరిదం వచ

రహఃస్థలస్థితో నైవ ద్రష్టవ్య స్త్రీయుతః పుమాన్

స్త్రీసంయుక్తం చ పురుషం యః పశ్యతి నఽరాధమః

కరోతి రసభంగం చ కాలసూత్రం ప్రజేత్ ధ్రువం

తత్ర తిష్ఠతీ పాపీయాన్యావచ్చంద్రదివాకరం

విశేషతశ్చ పితరం గురుం భూతపతిం ద్విజి

రహస్సురత సంసక్తం నహి పశ్యేద్విచక్షణః

కామతః కోపతోవాఽపి యః పశ్యేత్పురతోన్ముఖం

స్త్రీ విచ్చేదో భవేత్తస్య ధ్రువం సప్తసు జన్మసు

శ్రోణీ వక్షస్థలం వక్రం యః పశ్యతి పరప్రియః

కామతోఽపి విమూఢశ్చ సోఽధోభపతి నిశ్చితం

పరశురాముడీవిధముగా గణపతితో పలికి ఊరకుండెను. అప్పుడు గణనాథుడు మధురముగా ఇట్లు మాట్లాడసాగెను.

ఓసోదరా! క్షణకాలము ఆగుము. నామాటలను శ్రద్దగా వినుము, రహస్య స్థలము నందు భార్యతోనున్న పురుషుని చూడకూడదు. రహస్య స్థలము నందున్న స్త్రీ పురుషులను చూచి వారి కామకేళికి భంగము కలిగించిన దుష్టుడు కాల సూత్రమను నరకమునకు పోవును. అతడు ఆ నరకము నందు సూర్య చంద్రులున్నంత కాలముండును.

ఓ బ్రాహ్మణుడా! విజ్ఞానవంతుడు తండ్రిని, గురువును, రహస్యస్థలమున సురతమునందుండగా చూడకూడదు. ఉద్దేశ్యములేకుండనో, కోపముతోనో సురతమునందున్న పురుషుని చూచినచో అతడు ఏడు జన్మలలోను భార్యావిహీనుడగును. పరస్త్రీయొక్క పిరుదులను, వక్షస్థలమును, ముఖమును చూచిన పురుషుడు తప్పక అధోగతినిపొందును.

గణేశస్య వచః శ్రుత్వా ప్రహస్య భృగునందనః

తమువాచ మహాకోపాన్నిఘ్ఠరం వచనం మునే

ఫైవిధముగా గణపతి పలికిన మాటలను విన్న పరశురాముడు అధికకోపముతో నిష్ఠురముగా వెక్కిరించుచు పలికెను.

పరశురామ ఉవాచ- పరశురాముడిట్లు పలికెను –

అహోశ్రుతం కింవచనమపూర్వం నీతిసంయుతం

ఇదమేవమహో నైవం శ్రుతమీశ్వర వక్త్రతః

శ్రుతం శ్రుతౌ వాక్యమిదం కామినార చవికారీణాం

నిర్వికారస్య చ శిశోర్నదోషః కశ్చిదేవ హి

యాస్యామ్యంతః పురం భ్రాతస్తవ కిం తిష్ఠ బాలక

యథాదృష్టి కరిష్యామీ మత్కార్యం సమయోచితం

తవైవ తాతో మాతాచేత్యేవం నైవనిరూపితం

జగతాం పితరౌ తౌ చపార్వతీపరమేశ్వరౌ

పార్వతీస్త్రీ పుమాన్ శంభురితి కైర్న నిరూపితః

సర్వరూపః శంకరశ్చ సర్వరూపా చ పార్వతీ

గుణాతీతస్య కా క్రీడా తద్భంగో వా కుతో విభో

క్రీడాలజ్జా భీతిభంగో గ్రామస్యేవ న చేశితుః

స్తనంధయం చ మాం దృష్ట్యాపిత్తోర్లజ్జా కుతో భవేత్

లజ్జాయాశ్చ కుచోల లజ్జేశస్య చ సా కుతః

లజ్జా లజ్జం కిమాప్నోతి తాపం కిం వా హుతాశనః

శీతం శైత్యమహోభ్రాతర్నిదాఘో దాహమేవచ

భీతిర్భీతిమవాప్నోతి మృత్యోర్మృత్యుర్బిబేతి కిం

కుతోజ్వరో జ్వరం హంతి వ్యాధి వ్యాధి శ్చ జీర్యతి

సంహర్తా నాపీసంహర్తుః కాలః కాలాద్బిబేతి కిం

స్రష్టారం సృజతే స్రష్టా పాతా కిం పాతి తే మతే

క్షుత్క్షుధం సమవాప్నోతి కృష్ణా తృష్ణాం ప్రయాతి కిం

నీద్రానిద్రంచ శోభాంశ్రీ శాంతిః శాంతిం చ తే మతే

పుష్టిః పుష్టిం కిమాప్నోతి తుష్టిస్తుష్టిం క్షమాక్షమాం

ఓ గణపతీ! నీవు మీక్కిలి గొప్పవైన నీతివాక్యములను పలుకుచున్నావు. ఇట్టి మాటలను నేనెప్పుడు నా గురువగు పరమేశ్వరుని నోట వినలేదు.

నీవు చెప్పిన విషయము మోహ వికారము గల కాముకులకు సంబంధించినది. మోహవికారము లేని శిశువునకు నీవు చెప్పిన దోషమంటదు. నేను పరమేశ్వరుని యొక్క అంతఃపురములోనికి పోవుచున్నాను. బాలకుడవగు నీకు దీనిని గురించిన మీమాంస అనవసరము. నేను సమయోచితముగా నాకు తెలిసినట్లు చేయుదును

పార్వతీప రమేశ్వరులు నీకే తల్లిదండ్రులని ఎచ్చట చెప్పలేదు. వారు ప్రపంచమునకంతయు తల్లిదండ్రులు. ఇంకను సర్వరూపుడగు పరమేశ్వరుడు, సర్వ రూపిణియగు పార్వతీదేవి స్త్రీ పురుషులని ఎచ్చటను నిరూపింపబడలేదు. అందువలన గుణాతీతుడైన ఆ పరమేశ్వరుడు క్రీడించుట, ఆ క్రీడ భంగమగుట అనునవి లేనేలేవు. రతిక్రీడయందు సిగ్గుపడుట, ఆ క్రీడకు భంగమగుట అనునవి సాధారణ మానవునకే కాని పరమేశ్వరునకు సంబంధించినవికావు. చంటి పిల్లవాడనగు నన్ను చూచి జగత్పతరులగు పార్వతీ పరమేశ్వరులెందుకు సిగ్గుపడెదరు?

ఓగణపతీ! సిగ్గుకు సిగ్గుఉండునా? అగ్ని తాపమును పొందునా? శీతము శైత్యమును, వేసవికాలము దప్పికను, భయము భయమును పొందునా? అట్లే మృత్యువునుండి మృత్యువు భయపడునా? జ్వరము జ్వరమును, వ్యాధి ఆవ్యాధిని పోగొట్టునా? సంహారము చేయు వానిని చూచి సంహార కారకుడు, కాల పురుషుని జూచి కాలపురుషుడు భయపడునా? నీ అభిమతముననుసరించి సృష్టికారకుడు సృష్టికారకుని సృష్టించునా? లోకరక్షకుడు తన్ను రక్షించుకోనునా? ఆకలి ఆకలిని, దప్పి దప్పికను, నిద్ర నిద్రను, శోభ శోభను, శాంతి శాంతిని, పుష్టి వుష్టిని, తుష్టి తుష్టిని, క్షమ క్షమను పొందునా?

కామక్రోధౌ లోభమోహౌ స్వాత్మనైతే న బాధితాః

దయా న బద్దా దయయా నేచ్చా బద్దేచ్చయా ప్రభో

జ్ఞానబుద్ధ్యోః కోవికారో జరాం నోబాధతేజం

చింతా న చింతయాగ్రస్తా చక్షుశ్చక్షుర్న పశ్యతి

హర్షో ముదం కిమాప్నోత శోకం శోకో న బాధతే

కా విపత్తీర్వపత్తేశ్చ సంపత్తి సంపదః కుతః

మేధాయా ధారణాశక్తిః స్మృతేర్వాస్మరణం కుతః

న దగ్గః స్వప్రతాపేన వివస్వానీతి సమ్మతః

విపరీతమతోభ్రాతస్త్వయైనాచరితో దునా

న శ్రుతోఽయం గురుముఖా న్నదృష్టో న శ్రుతౌశ్రుతః

కామము, క్రోధము, లోభము, మోహము అనునవి ఆత్మచే బాధింపబడవు. దయ దయాబద్ధము కాజాలదు. అట్లే ఇచ్చకూడ. చింత చింత్రాగ్రస్తము కాదు. కన్ను తన యొక్క ఇంకొక కన్నును చూడలేదు. హర్షమువలన సంతోషము కలుగునా? శోకము వలన శోకము, ఆపదవలన ఆపద, సంపద వలన సంపద, అనునవి ప్రత్యేకముగా ఏర్పడవు. అట్లే బుద్దికి ధారణాశక్తి, స్మతీకి స్మరించుగుణము, సూర్యునకు ఇతరులను దహించు గుణము స్వభావసిద్ధములు. కాని నీ ప్రవర్తన స్వభావ సిద్ధముగా లేదు. నీవు చెప్పిన విషయమును నాకు గురువు ఎన్నడును చెప్పలేదు. ఆట్లే ఏ గ్రంథమునను చూడలేదు అని పల్కెను.

ఇత్యుక్త్యా చాపి పరశురామశ్శశ్వత్ప్రహస్య సః

శీఘ్రం గంతుం మనశ్చక్రే తద్గృహాభ్యంతరం ముదా

పరశురాముడీ విధముగా నవ్వుచూ పలికి శంకరుని అంతఃపురములోనికి తొందరగా వెళ్ళబోయెను.

తచ్చ రామవచః శ్రుత్వా జితక్రోధో గణేశ్వరః

శుద్ధసత్వస్వరూపశ్చ ప్రహస్య తము వాచహా

భార్గవరాముని పలుకులను విన్న గణపతి క్రోధము లేని వాడు, శుద్ధ సత్వ స్వరూపుడు కావున పరశురామునితో ఇట్లు పలికెను.

గణపతీ రువాచ- గణపతి ఇట్లు పలికెను –

అజ్ఞాన తిమిరాచ్ఛన్నో జ్ఞానం ప్రాప్నోతి తద్విదః

పితు ర్భ్రాతుర్ముఖాతజ్ఞానం దుర్లభం భాగ్యవాన్ లభేత్

శ్రుతం జ్ఞానం విశిష్టం చ జ్ఞానినామపి దుర్లభం

కించిన్మే త్వం మందబుద్ధేః. శ్రుణు: తర్నివేదనం

యోనిర్గుణః సనిర్లిప్తః శక్తిభిరహి సంయుతః

సిసృక్షురాశ్రితః శక్త్యా నీరుణః సగుణో భవేత్

యావంతీ చ శరీరాణి భోగార్హాణి మహామునే

ప్రాకృతాని చ సర్వాణి వినా శ్రీకృష్ణవిగ్రహం

ధ్యాయంతి యోగినస్తం చ శుద్ధజ్యోతి స్వరూపిణం

హస్తపాదాది రహితం నిర్గుణం ప్రకృతేః పరం

వైష్ణవాస్త్రం నమస్యంతి భక్తానుగ్రహకారకం

కుతో బభూవ. తజ్జ్యోతిరహో తేజస్వినో వినా

జ్యోతిరభ్యంతరే నిత్యం శరీరం శ్యామసుందరం

ద్విభుజం మురళీహస్తం సస్మితం పీతవాససం

ఆతీవామూల్యసద్రత్నభూషణేశ్చ విభూషితం

జ్యోతిరభ్యంతరే మూర్తిం పశ్యంతి కృపయా విభోః

ఓ పరశురామా! జ్ఞానము కల తండ్రి వలన లేక సోదరుని వలన అదృష్టము కల అజ్ఞాని జ్ఞానమును పొందును. నీవు జ్ఞానులకు సహితము లభించని విశిష్టజ్ఞానమును పొందినట్లు విన్నాను. ఐనను తెలివి తక్కువ గల నాయొక్క విన్నపమును సహితము కొంత వినుమని వేడుకొనెను.

నిర్గుణుడగు పరబ్రహ్మ నిర్లిప్తుడుగానుండును. అతనికి శక్తి యొక్క తోడ్పాటు అక్కరలేదు. కానీ ఆ నిర్గుణ పరబ్రహ్మమే జగత్తును సృష్టించుటకై శక్తితో కలసి సగుణుడుగా మారును. భోగములననుభవించు ప్రాణుల శరీరములన్నియు శ్రీకృష్ణుడు లేనిచో సామాన్యమైనవి అగును.

అందువలననే యోగులు ఆ శ్రీ కృష్ణ పరమాత్మను శుద్ధ జ్యోతి స్వరూపుడుగా, అవయవ రహితుడుగా, ప్రకృతికి అతీతమైన నిర్గుణ స్వరూపుడుగా భావింతురు, వైష్ణవులు మాత్రము భక్తులననుగ్రహించు ఆ శ్రీ కృష్ణ పరమాత్మను సగుణుడుగా భావింతురు. వారు జ్యోతి లోపలనున్న మూర్తి శ్యామ సుందర మూర్తియని, రెండుభుజములు, హస్తమున మురళి, పట్టు వస్త్రములు ధరించి అమూల్యమైన రత్నాభరణములచే అలంకృతుడైన మూర్తిగా భావింతురు.

తదా దాస్యే నియుక్తాస్తే భవంతేవేశ్వరేచ్ఛయా

యోగస్తపో వా దాస్యస్య కళాం నార్హంతి షోడశీం

యదా సృష్ట్యున్ముఖః కృష్ణ ససృజే ప్రకృతిం ముదా

తద్యోనే హ్యార్పితం వీర్యం వీర్యాడ్డింభో బభూవ హి

దివ్యేన లక్షవరేణ గర్భాడ్డింభో వినీర్గతః

తదా బభూవ నిశ్వాసస్తతో వాయుర్బభూవహ

నిశ్వాసేన సమం భ్రాతః ముఖబిందుర్వినిర్గతః

తతో బభూవ సహసా జలరాశిర్హరేః పురః

తజ్ఞులే చ స్థితో డింభో దివ్యవర్షాణి లక్షకం

తతో బభూవ సహసా విశ్వాధారో మహావిరాట్

యావంతి గాత్రలో మాని తస్యసంతి మహాత్మనః

బ్రహ్మాండాని చ తావంతి విద్యమానాని నిశ్చితం

తత్రైవ ప్రతివిధ్యండే బ్రహ్మ విష్ణు మహేశ్వరాః

దేవాశ్చ మునయశ్చైవ విద్యమానాశ్చరాచరాః

మహావిరాటాశ్రయశ్చ సర్వస్యచ జనస్య చ

విశ్వాసవాయుర్భగవాన్ బభూవ శ్రీహరేర్మునే

మహావిష్ణుశ్చ కళయా తతః క్షుద్ర విరాడభూత్

తన్నాభికమలే బ్రహ్మా శంకరస్తలలాటబి

విష్ణుస్తదంశః పాతా యః శ్వేత ద్వీప నివాసకృత్

ఏవం తే ప్రతి విధ్యండే బ్రహ్మ విష్ణు మహేశ్వరాః

ఆ వైష్ణవులు పరమాత్ముని కోరికననుసరించి శ్రీకృష్ణ దాస్యముననుష్ఠింతురు. శ్రీ కృష్ణదా స్యము చాలాగొప్పది. యోగము, తపస్సు అనునవి దానికి పదునారవవంతైనను కాజాలవు.

ఆ శ్రీకృష్ణుడు సృష్టిచేయదలచి తొలుత ప్రకృతిని సృష్టించెను. ఆ పరమాత్మ వీర్యము వలన ప్రకృతి గర్భమును దాల్చెను. ఆమె ఆ గర్భమును దివ్య లక్ష వత్సరములు ధరించిన పిదప శిశువు ఉదయించెను. ఆ పరమాత్మ యొక్క నిశ్వాసమునుండి వాయువేర్పడినది. ఆ నిశ్వాసముతో పాటు ఆ పరమాత్మ ముఖమున ఏర్పడిన చెమట చుక్క ఆతని ముందే సముద్రముగా మారినది.

ఆ సముద్రమున ప్రకృతినుండి ఉద్భవించిన శిశువు లక్ష దివ్య సంవత్సరములుండినది. ఆ శిశువే ప్రపంచమునకు ఆధారభూతుడైన మహా విరాట్పురుషుడయ్యెను. ఆ మహా విరాట్పురుషుని రోమ రోమమున బ్రహ్మాండములేర్పడినవి, అట్లే ప్రతి బ్రహ్మాండమునను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవతలు, మునులు ఇంకను చరా చర పాణి సృష్టియు జరిగినది. పరమాత్మ వదలిన నిశ్వాస వాయువు మహా విరాట్పురుషుని ఆశ్రయించుకొని సమస్తజీవులకు నిశ్వాస వాయువయ్యెను.

మహా విరాట్పురుషుని అంశ వలన క్షుద్ర విరాట్పురుషుడు ఆవిర్భవించెను. మహా విష్ణువు యొక్క నాభి కమలమున చతుర్ముఖ బ్రహ్మ, ముఖమున శంకరుడు అతని ఆంశవలన విష్ణువు ఉద్భవించిరి. ఈ విధముగా ప్రతి బ్రహ్మాండమునను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులేర్పడిరి.

స్వయం చ స్వాంశకళయా నానామూర్తిధరో హరీః

తదాధవచ్చ సగుణః సర్వశక్తియుతస్తదా

కథం లజ్జాదిరహితః స చ స్వేచ్చామయో మహాన్

సర్వదా సర్వభోగార్హః సర్వశక్తిసమన్వితః

లజ్జా నాస్త్యేవ లజ్జాయామతోఽయం సర్వసమ్మతః

యా చ లజ్జావతీ దేవీ తస్యలజ్జా కుతోగతా

సర్వశక్తిమతీ దుర్గా ప్రకృత్యా సాచ శైలజా

తస్యా లఙాదయః సంతి సర్వదా సర్వసమ్మతాః

శ్రీహరి స్వయముగా తనయొక్క అంశలవలన, అంశాంశలవలన అనేక విధములైన శరీరముల ధరించెను. ఈవిధముగా ఆ పరమాత్మ సగుణుడు, సర్వ శక్తి యుక్తుడయ్యెను. స్వేచ్చా రూపుడు సమస్త భోగములకు అర్హుడు, సమస్త శక్తి సమేతుడైన ఆ పరమాత్మ లజ్జాది భోగరహితుడెట్లగును. నీవనినట్లు లజ్జాబుద్ది లజ్జారహితమే, దీనిని ఆందరు ఆమోదింతురు. కాని సగుణాత్మకమైన ఆ పార్వతీ దేవికి లజ్జ ఉండుట సహజమే కదా! స్వభావముతో సర్వశక్తులుగల యా దుర్గా దేవియే పార్వతీదేవి. ఆదేవికి లజ్జా భావములుండుటలో ఎవరికిని వ్యతిరేకతయుండదు.

పంచధా ప్రకృతిర్యాచ శ్రీ కృష్ణస్య బభూవహ

రాధా పద్మా చ సావిత్రీ దుర్గా దేవీ సరస్వతీ

ప్రాణాధిష్ఠాతృదేవీ యా కృష్ణస్య పరమాత్మనః

ప్రాణాధికా ప్రియా సాచ రాధాఽస్తే తస్యవక్షసి

విద్యాధిష్ఠాతృదేవీ యా సావిత్రీ బ్రహ్మణః ప్రియా

లక్ష్మీర్నారాయణస్యైవ సర్వ సంపత్స్వరూపిణీ

సరస్వతీ ద్విధాభూత్వా కృష్ణస్య ముఖనిర్గతా

సావిత్రీ బ్రహ్మణః కాంతా స్వయం నారాయణస్యచ

బుద్ధ్యధిష్ఠాతృదేవీ యా జ్ఞానసూః శక్తిసంయుతా

సాదుర్గా శూలినః కాంతా తస్యా లజ్జ కుతోగతా

శ్రీకృష్ణుని ఆంశరూపయైన ప్రకృతీ దేవి రాధ. లక్ష్మి, సావిత్రి, దుర్గాదేవి, సరస్వతి అను పేర్లతో ఐదు విధములుగా మారినది. వారిలో రాధా దేవి శ్రీ కృష్ణ పరమాత్మకు ప్రాణముల కంటె మిక్కిలి ప్రియమైనది. అతని ప్రాణములకు ఆమె అధిష్టాన దేవత. ఆ రాధాదేవి ఎల్లప్పుడును శ్రీ కృష్ణ పరమాత్మ వక్ష స్థలముననే ఉండును.

విద్యకు అధిష్టాన దేవత యగు సావిత్రి బ్రహ్మదేవుని భార్య. సమస్త సంపదలకు రూపమైన లక్ష్మీదేవి నారాయణుని భార్య.

శ్రీ కృష్ణుని ముఖము నుండి ఉద్భవించిన సరస్వతి రెండు విధములైన రూపులను ధరించినది. సరస్వతీ దేవి నారాయణునకు భార్య కాగా సావిత్రీదేవి బ్రహ్మదేవుని భార్యయైనది.

బుద్ధికి అధిష్టాన దేవతయగు దుర్గాదేవి జ్ఞానమును ప్రసాదించునది. సమస్త శక్తులు గలది. ఆదేవి శంకరునకు భార్యయైనది. అట్టి పార్వతీ దేవికి లజ్జ ఎందుకుండదని గణపతి పరశురామునితో పలికెను.

ప్రకృతిః పంచధా తః గోలోకే చ బభూవ హ

ఇమాః ప్రధానాః కళయా బభూవుర్నైకధా యతః

ఓ సోదరా! ఈ విధముగా గోలోకమున ప్రకృతి ఐదు విధములుగా మారినది. పైన పేర్కొన్న స్త్రీలు ప్రకృతియొక్క ప్రధానాంశలు. ఇంకను ఆ ప్రకృతి యొక్క అంశాంశలవలన అనేక స్త్రీ మూర్తులుద్భవించిరి.

విప్రేంద్ర నిత్యం వైకుంఠం బ్రహ్మాండాత్పరముచ్యతే

అవినాశి స్థలం శశ్వల్లయే ప్రాకృతికే ధ్రువం

తత్ర నారాయణోదేవః కృష్ణార్ధాంశశ్చతుర్భుజః

వనమాలీ పీతవాసా శక్త్యావై పద్మయా సహ

స్వయం కృష్ణశ్చ గోలోకే ద్విభుజః శ్యామసుందరః

సస్మిలో మురళీహప్తా రాధాపక్షస్థలస్థితః

శశ్వద్గో గోపగోపీభిః సంయుక్తో గోపరూపధృక్

పరిపూర్ణతమః శ్రీమాన్ నిర్గుణః ప్రకృతేః పరః

స్వేచ్ఛామయః స్వతంత్రస్తుపరమానందరూపధృక్

భార్గవ రామా! బ్రహ్మాండములకు ఊర్ద్వ భాగముననున్నది వైకుంఠ లోకము. ఆది ప్రాకృతిక లయమందును నశింపనిది. ఆచ్చట శ్రీ కృష్ణుని అర్ధాంశమగు నారాయణుడుండును. అతడు నాలుగు భుజములు కలవాడు, వనమాలను ధరించినవాడు లక్ష్మీ దేవితో కలిసి పీత వస్త్రములను ధరించియుండును.

గోలోకమున ద్విభుజూడగు శ్రీకృష్ణుడుండును, అతడు శ్యామ సుందర మూర్తి కలవాడు. ఆతడెల్లప్పుడు మురళీహస్తుడై రాధా దేవి యొక్క వక్షః స్థలమున నుండును. అతడు గొల్లవాని వేషమున గోవులు, గోపికలు, గోపాలురు వెంటనుండగా గోలోకముననుండును.

ప్రకృతికంటె విశిష్టుడైన ఆ శ్రీకృష్ణపరమాత్మయే సంపూర్ణముగా పరిపూర్ణుడు, స్వేచ్ఛారూపి, స్వతంత్రుడు, పరమానంద స్వరూపుడు నిర్గుణుడుకూడ.

సురాః కళోద్భవా యస్య షోడశాంశో మహావిరాట్

యతో భవంతి విశ్వాని స్థూలసూక్ష్మాదీకానిచ

పునస్తత్ర ప్రలీయంత ఏవమేవ ముహుర్ముహుః

గోలోక ఊర్ద్వవైకుంఠాత్పంచాశతోటియోజనః

నాస్తిలోకస్తదూర్ద్వం చ నాస్తి కృష్ణాత్పరః ప్రభుః

దేవతలందరు ఆ శ్రీకృష్ణప రమాత్మ యొక్క అంశాంశలవలన పుట్టినవారు. మహావిరాట్పురుషుడు ఆ పరమాత్మ యొక్క పదునారవ యంశ. ఈ స్థూల సూక్ష్మ విశ్వములన్నియు మహా విరాడ్రూపుని వలననే ఉద్భవించుచున్నవి. అతని యందే ప్రళయకాలమున విలీనమగుచున్నవి.

గోలోకము వైకుంఠ లోకమున కంటే ఏబది యోజనముల ఎత్తుననున్నది. గోలోకము కంటె పై భాగమున ఎట్టిలోకములు లేవు. అట్లే శ్రీకృష్ణుని కంటే గొప్ప దైవము లేదని చెప్పెను.

ఇదం శ్రుతం శంభువక్త్రాన్మయా తే కథతం ద్విజ

క్షణం తిష్ఠాఽధునాభ్రాతరీశ్వరః సురతోన్ముఖః

భార్గవరామా! దీనినంతయు నేను శంకరునివలననే నేర్చుకొంటిని. శంకరుడు సురలోన్ముఖుడై యున్నందువలన శంకరుని అంతఃపురములోనికి వెళ్ళక క్షణకాలముండుమని కోరెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే గణేశ పరశురామసంవాదోనామ ద్వీచత్వారింశత్తమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాదసమయమున చెప్పబడిన గణపతి పరశురాముల సంభాషణయను నలుభై రెండవ అధ్యాయము సమాప్తము.