3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

34 - కార్తవీర్యార్జునుని యుద్ధ సన్నాహము

నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లనెను-

భార్గవరాముడు ప్రాతఃకాలమున నిర్వర్తింపవలసిన కాలకృత్యములను నిర్వర్తించి కార్తవీర్యుని ఆశ్రమమువకు (సౌధమునకు) దూతను పంపెను. ఆ దూత శీఘ్రముగా రాజభవనమునకు వచ్చి సభలో మంత్రులతో కొలువు దీరిన రాజుతో నిట్లనము.

 రామదూత ఉవాచ- పరశురాముని దూత ఇట్లనెను-

ఓ కార్తవీర్య మహారాజ! నర్మదా నదీతారమున నున్న అక్షయ వట వృక్షము యొక్క క్రింద తన సోదరులతో నున్న భార్గవరాముని దగ్గరకు నీవు వెళ్ళుము. నీవు నీపరివారముతో, సోదరులతో కలసి యుద్ధము చేయుము, ఆతడు ఈ భూమిపై ఇరువదియొక్క మార్లు తిరిగి రాజులు లేకుండ చేయునని రాజుతో పలికి ఆదూత పరశురాముని సన్నిధికి తిరిగి పోయెను.

కార్తవీర్య మహారాజు కూడ యుద్ధ సన్నాహములు చేయుచు యుద్ధము చేయుటకు నిశ్చయించుకొనెను.

యుద్ధమునకై వెళ్ళుచున్న తన భర్తను చూచి మనోరమ అతనిని తన దగ్గర కూర్చుండబెట్టుకొని అతని యుద్ధ ప్రయత్నములను వారింపసాగెను. కార్తవీర్యుడు తనభార్య మనోరమను చూచి సంతోషములో తన మనస్సులో మన్న భావము నిట్లు వివరింపసాగెను.

కార్తవీర్యార్జున ఉవాచ- కార్తవీర్యార్జునుడిట్లు పలికెను-

ఓ ప్రియురాలా! జమదగ్ని మహర్షి పుత్రుడు. నర్మదానదీ తీరమున తన సోదరులతో నుండి యుద్ధమునకు రమ్మని నన్నే ఆహ్వానించుచున్నాడు. అతడు శంకరుని అనుగ్రహమువలన శస్త్రములను, శ్రీహరి మంత్రమును కవచమును పొంది ఈ భూమిపై నున్న రాజులనందరను ఇరువది యొక్క మార్లు చంపవలెనని అనుకొనుచున్నాడు.

ఇప్పుడు నాప్రాణములన్నియు ఆందోళనము చెందుచున్నట్లు మనస్సు కలవరపడుచున్నట్లు తోచుచున్నది. అట్లే ఎడమభాగము ఆదరుచున్నది. నిన్న రాత్రి ఒక దుస్వప్నము కలిగినది దానిని వినుము.

నేను నూనె శరీరమందంతట పులుముకొని పుష్పముల మాలను ధరించి రక్తవస్త్రమును ఇనుముతో చేసిన ఆలంకారములను ధరించి గాడిదనెక్కి పోవుచున్నట్లు, ఆరిపోవుచున్న నిప్పులతో నవ్వుచు ఆడుకొనుచున్నట్లు, ఈభూమి యందంతట దిరిసెన పువ్వులు, దుమ్ము నిండియున్నట్లు, చంద్రసూర్యులు లేని ఆకోశము ఎఱ్ఱగా నున్నట్లు, విధవ, ముక్కు కోయబడినది ఆగు స్త్రీ ఎర్రని వస్త్రములు ధరించి నృత్యము చేయుచున్నట్లు కల గాంచితిని. ఆదేవిధముగా ఒకచితి నిప్పులులేక బూడిదలో మండి బాణములతో కప్పబడియున్నట్లు, బూడిద వర్షమును, రక్తవర్షమును, ఆగ్నేవర్షమును కూడ కలలో చూచితిని. ఆశోకము, కరవీరము పుష్పములతో నున్నట్లు, తాటిచెట్టు ఫలములలో నుండగా ఆ ఫలములు పడిపోవుచున్నట్లు, నా చేతినుండి పూర్ణకలశము చేజారి క్రిందపడి పగిలిపోయినట్లు, ఆకాశమునుండి చంద్రసూర్యమండలములు భూమిపై పడిపోవుచున్నట్లు, పిడుగులు రాలుట, తోకచుక్క. సూర్యచంద్రుల గ్రహణమును కలలో చూచితిని. ఒక వికృతాకారముగల పరుషుడు భయంకరమైన ముఖముతో దీగంబరుడై నాముందు వచ్చుచున్నట్లు కలగంటిని.

మంచి వస్త్రములను ఆభరణములను ధరించిన పన్నెండు సంవత్సరముల కన్య కోపముతో నా ఇంటి నుండి పోవుచు ఓ రాజా నీఇంటినుండి అడవికి పోదలచుకున్నాను. నీవందులకు ఆజ్ఞనిమ్మని కోరుతున్నట్లు రాత్రిపూట కలగంటిని. అట్లే కోపముతో బ్రాహ్మణుడు, సన్యాసి, గురువు వీరందరు నన్ను శపించుచున్నట్లు, గోడ పైనున్న బొమ్మలు చిత్రములు నృత్యము చేయుచున్నట్లు, కాకులు, గద్దలు తిరుగుచున్నట్లు, దున్నపోతులు నన్ను కిందపడవేసి హింసించుచున్నట్లు కలబడినది. దిగంబరులు, పాశహస్తులు అగుపురుషులను గానుగ వాడు తన గానుగలో వేసి త్రిప్పుచు నన్ను బాధించుచున్నట్లు, నా ఇంటిలో పెండ్లి జరుగుచుండగా కొందరు పాడుచున్నట్లు, మరికొందరు ఆడుచున్నట్లు కనిపించినది. ఇంకను కొందరు రమించుచున్నట్లు, మరికొందరు వెంట్రుకలు పట్టుకొని కొట్టుకొనుచున్నట్లు, కాకులు, కుక్కలు కొట్లాడుచున్నట్లు కలలో చూచితివి. అదేవిధముగా నాకలలో శవమున్న స్మశానము, ఎర్రని వస్త్రము, తెల్లని వస్త్రము కనిపించినది. నల్లని వస్త్రములను ధరించి వెంట్రుకలను విరియబోసికొన్న ఒక విధవ నగ్నముగా నన్ను కౌగిలించుకొన్నట్లు, మంగలి వాతలను, గడ్డము, రొమ్మును క్షీరముచేసి గోళ్ళు తీయుచున్నట్లు కలగంటిని. మరికొంత సమయమునకు పాదుకలు, చర్మముచే చేయబడిన త్రాళ్ళు కుప్పగా నున్నట్లు, కుమ్మరిచక్రమును తిప్పుచున్నట్లు, ఎండిపోయిన చెట్టు పెద్దగాలికి కొట్టుకొనిపోయినట్లు, ఆది తిరిగి నిలబడినట్లు, తలలేని మొండెము ఇటునటు తిరుగుచున్నట్లు చూచితిని, మరికొంతసేపటికి భయంకరమైన స్త్రీ తలల పుఱ్ఱెలను, మెడలో వేసికొనగా గాలికి అవి పగిలిపోవుచున్నట్లు, భూత ప్రేతములు తలనిరియబోసికొని, నిప్పులు గ్రక్కుచు, నన్ను బయ పెట్టుచున్నట్లు, కాలిపోవుచున్న ప్రాణినీ, కాలిపోవుచున్న చెట్టును, ఆంగహీనుడు. పురుషుని, కలలోచూచితిని. మరికొంత సమయమునకు ఇండ్లు, గుట్టలు, చెట్లు వెంటనే పడిపోవుచున్నట్లు, పిడుగులు మాటిమాటికి పడుచున్నట్లు కుక్కలు, నక్కలు ఏడ్చుచున్నట్లు కలలో చూచితిని. అట్లే తలక్రిందికి పాదముల పైకి పెట్టి తలవిరియబోసికొన్న దిగంబరుడొకడు తీరుగుచున్నట్లు కనిపించినది. గ్రామములముందు దేవతలు ఏడ్చుచున్నట్లు, మరియొక వికృతమైన శబ్దమును విని మేల్కోంటిని. కావున ఇప్పుడేమీ చేయవలెనో చెప్పుమని కార్తవీర్యుడు తన భార్యయగు మనోరమతోననెను.

రాజు చెప్పిన స్వప్నవృత్తాంతమును విన్నమనోరమ మనస్సు బాధపడుచుండగా ఏడ్చుచునిట్లు తన భర్తతో పలికెను.

మనోరమోవాచ- మనోరను ఇట్లు పలికినది-

సమస్త రాజులలో ఉత్తముడవైన ఓ ప్రాణేశుడా ! నా మాటను నీవు వినుము.

జమదగ్ని పుత్రుడగు భార్గవరాముడు శ్రీమన్నారాయణాంశ సంభూతుడు. గొప్పబలవంతుడు కూడా. ఆతడు సృష్టిసంహారము చేయు పరమశివుని యొక్క శిష్యుడు. అతడు ఈ భూమిపై నున్న రాజులనందరను ఇరువదియొక్క మార్లు హతము చేయుదుననీ ప్రతిజ్ఞ చేసెను. అట్టి భార్గవనందనునితో యుద్ధమును వదలి పెట్టుము. నీవు పాపాత్ముడగు రావణాసురునీ జయించి శూరుడవని ఆనుకొనుచున్నావు. కాని ఆ రావణుడు నీ బలము వలన ఓడిపోలేదు. ఆతని పాప కార్యములే ఆతనిని ఓడించినవి. ధర్మమును రక్షింపనివారిని ఎవరు కూడ రక్షింపలేరు. ఆమూఢాత్ముడు స్వయముగానే నశించుచున్నాడు. ఆతడు బ్రతికియున్నను చనిపోయిన వానితో సమానుడగుచున్నాడు. శుభాశుభ కర్మలకన్నిటికి. ఎల్లప్పుడు సాక్షీభూతుడు ధర్మదేవత, ఆతడు ఆత్మయందుండును. ఆ ధర్మదేవతను నీవు గమనింపక ఉన్నావు. చక్కగా ధర్మమును పరిపాలించువారలకు పుత్రులు. భార్య మొదలగు సమస్తైశ్వర్యములు నీటి బుడగల వంటివి. అవి నశించుపోవునని, ఈసంసారమంతయు కలతో సమానమైనదని తలచి ధర్మము నెల్లప్పుడు ధ్యానము చేయుచుందురు. దానికై భక్తితో తపమును ఆచరించెదరు.

దత్తాత్రేయుడు ప్రసాదించిన జ్ఞానమునంతయు నీవు మరచితివి. లేనిచో బ్రాహ్మణుని హింసించుటకు నీమనస్సు అనుమతించునా? నీవు నీ సుఖమునకై వేటాడబోయి అచ్చట తీండి లభింపనందువలన ఉపవాసముండి బ్రాహ్మణుని యొక్క ఆశ్రమమున అపూర్వమైన మృష్టాహారమును భుజించి, వ్యర్థముగా. ఆ బ్రాహ్మణుని చంపితివి. గురువును, బ్రాహ్మణులను, దేవతలను అవమానించిన వానిపై ఇష్టదేవత కూడ కోపించును. అందువలన ఆపద తప్పక కలుగును. కావున నీవు నీగురువు దత్తాత్రేయుని ధ్యానింపుము. గురుభక్తి యనునది సమస్త విఘ్నములను తొలగించును. నీవు నీ గురుదేవుని ఆర్చించి ఆ భార్గవ రాముని శరణు వేడుకొమ్ము, బ్రాహ్మణుడు, ఆభీష్టదైవము ప్రసన్నమైనచో క్షత్రియుల  కాపదలు కలుగవు, రాజు బ్రాహ్మణునకు దాసుడు. వైశ్యుడు రాజదాసుడు. శూద్రుడు సర్వదాసుడు. క్షత్రియుడు క్షత్రియుని శరణు వేడినచో అపకీర్తి కలుగును కాని గురువులను, దేవతలను, బ్రాహ్మణులను శరణువేడినచో ఆపకీర్తి కలుగదు. పైగా మంచి కీర్తి లభించును.

ఆందువలన నీవు భార్గవ రాముని శరణు వేడుము. బ్రాహ్మణుడు దేవతల కంటె గొప్పవాడు. బ్రాహ్మణుడు సంతోషపడినచో దేవతలందరు సంతోషపడుదురని మనోరమ పలికెను.

మనోరమాదేవి ఈవిధముగా కార్తవీర్యునితో పలికి అతనిని తన ఒడిలోనికి దీసికొని ఆతని ముఖము చూచుచు మిక్కిలి శోకించెను. ఓ మహారాజ నీవు క్షణకాలముండుము. స్నానము చేసిరమ్ము. తరువాత నీకోర్కెను తీర్చెదను. చందనము అగరు, కస్తూరి, కర్పూరము, కుంకుమలతో అమలేపనము చేసి నీ శరీరమునంతటను అలుముదుమ. నీవు క్షణకాలము నాఎద పైనుండుము. పుష్పములచే చేసిన శయ్యపై పరుండుము. సతులు తన భర్తను నూరుగురు పుత్రుల కంటే ఎక్కువగా ప్రేమింతురని వేదములలో శ్రీమన్నారాయణుడు తెల్పెను అను మనోరమ పలుకులు విని గొప్పజ్ఞానియగు కార్తవీర్యుడిట్లు సమాధానమిచ్చెను.

కార్తవీర్యార్జున ఉవాచ- కార్తవీర్యార్జునుడిట్లు పలికెను-

ఓకాంతా! నీమాటలనన్నిటిని వింటిని.  ఇక నాసమాధానము వినుము. సభలయందు శోకార్దుల మాటలు మన్నింపతగినవి కావు.

సుఖము దుఃఖము, భయము, శోకము, కలహము, ప్రేమ కర్మ ఇవన్నియు ఆనుభవింపదగిన కాలమున జరుగును. కాలము రాజత్వము నిచ్చును. మృత్యువును, పునర్జన్మను కలిగించును. కాలమువలననే సంసారమేర్పడుచున్నది. ఆ సంసార నివృత్తి కూడ జరుగుచున్నది. సంసారపాలనము కూడ కాలము వలననే జరుగుచున్నది. ఇట్టి కాలరూపి జనార్దనుడు. శ్రీకృష్ణుడు కాలమునకు కాల స్వరూపుడు. ఆతడు సృష్టికర్తకు సృష్టికర్త, సంహర్తకు సంహారకారకుడు. సృష్టిపాలకునకు పాలకుడు కూడ, కర్మలకు కర్మరూపియగు ఆతడు తపః ఫలములనిచ్చును. కర్మ ప్రభావము లేక ఎవరు ఎవరినీ సంహరింపజాలరు.

ఆ కృష్ణుని వలననే బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతయు చేయుచుండగా సంహారకారకుడగు పరమశివుడు సృష్టిసంహారమును చేయుచున్నాడు. సృష్టిపాలకుడగు శ్రీమహావిష్ణువు ఈ సృష్టినంతయు పరిపాలించుచున్నాడు. ఆతని ఆజ్ఞననుసరించియే గాలివీచుచున్నది. మృత్యువు ఆతని భయముచే ఎల్లప్పుడు తిరుచున్నది. ఆదేవిధముగ సూర్యుడు ఎండనిచ్చుచున్నాడు అని పలికెను.

ఆ పరమాత్మయొక్క ఆజ్ఞననుసరించి ఇంద్రుడు వర్షించుచున్నాడు, అగ్ని దహించుచున్నాడు. కాలుడు భీతిచెందినట్లు తిరుగుచున్నాడు. వృక్షములు పుష్పించుచున్నవి. ఆయా కొలముననుసరించి ఫలించుచున్నవి, ఎండిపోవుచున్నవి. మరల మొలుచుచున్నవి. ఆతని ఆజ్ఞవలననే ఈ సృష్టి జరుగుచున్నది. నశించుచున్నది, సర్వకార్యములు అతని ఆజ్ఞవలననే జరుగుచున్నవి. ఏదీ కూడ స్వేచ్ఛగా జరుగుచులేదు,

ఈ జమదగ్ని సుతుడగు భృగురాముడు మహాబలపరాక్రమవంతుడు. శ్రీమన్నారాయణుని ఆంశవలన ఉద్భవించినవాడు. అతడు ఈ భూమిపై ఇరువదియొక్క మార్లు రాజాలు లేకుండ చేయును. అతని ప్రతిజ్ఞ ఎప్పుడును విఫలము కాదు. నేను ఆతని వలన చంపబడుదునన్న విషయము నాకు తెలియును. ముందు జరుగవలసిన విషయమంతయు తెలిసి అతనినేట్లు శరణు వేడెదను? కీర్తిగల వారికి చెడ్డపేరు చావుకంటే గొప్పది అని పలికెను.

కార్తవీర్యార్జునుడీ విధముగా తన భార్యతో వలికి యుద్ధమునకు పోవుటకు విశ్చయించి, యుద్ధవాద్యములను మ్రోగించుచు మంగళవచనమును చేయించెను. అతనితో నూరుకోట్ల రాజులు, మూడులక్షల రాజేంద్రులు మహాబలపరాక్రమ. పంపన్నమగు నూరు అక్షౌహిణుల సైన్యము, అసంఖ్యాకమైన ఆశ్వములు, గజములు, రథములు, పదాతివర్గముమ వెంట పెట్టుకొని యుద్ధమునకు బయలు దేరుచుండెను.

కార్తవీర్యార్జునుని భార్య అతని మాటలు విన్న తరువాత స్తిమితపడినదై యుద్ధసన్నోహములు చేయుచు ధనుర్బాణములను ధరించి యుద్దమునకు పోవుచున్న తన భర్తను క్రీడాగారమునకు తీసికొని పోయి ఆతని తన వక్షస్థలముపై నుంచుకొని ఆతని ముఖమును చూచుచు మాటిమాటికి ముద్దు పెట్టుకొనేను అని నారాయణుడు నారదునితో పలికెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణమునుల సంవాద సమయమున పేర్కొనబడిన కార్తవీర్యార్జునుని యుద్ధ సన్నాహమను ముప్పది వాల్గవ అధ్యాయము సమాప్తము.