3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

6 - పార్వతీదేవి పుణ్యక వ్రతము చేయుట

శౌనక ఉవాచ - శానకమహర్షి ఇట్లు పలికెను-

ఓ సౌతి మహర్షి నారాయణుని మాటలు విన్న నారదముని సంతోషముతో ఏమడిగినో వివరింపుమని అడిగేను.

సూత ఉవాచ - సూతమహర్షి ఇట్లు పలికెను-

నారాయణముని చెప్పిన మాటలు విని నారదుడు సంతోషపడి పుణ్యకవ్రతమును ఎట్లు ఆరంభము చేయవలెనో తెలుపుమనీ నారాయణుని ఆడిగెను.

నారద ఉవాచ - నారదు డిట్లు పలికెను-

ఓమహర్షీ! పార్వతీదేవి తనభర్తయొక్క ఆజ్ఞననుసరించి శుభములనిచ్చు నీ పుణ్యకవ్రతము నెట్లు చేసినో నాకు వివరింపుము. పార్వతీదేవి ఆవ్రతము నొనరించినందువలన పరమేశ్వరుడేవిధముగా ఆమెకు తన అంశచే పుత్రుడుగా జన్మనెత్తానో దానినికూడ వివరింపుడని ఆడిగెను.

నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు నారదునితోననెను-

శంకరుడు పార్వతీదేవికి పుణ్యకవ్రతవిధానము నంతయు ఎరిగించి, తాను స్వయముగా తపఃఫలితము నిచ్చువాడైనను తపస్సు చేయుటకై పోయెను. శ్రీహరి యొక్క రూపభేదమే ఐన శివుడు శ్రీహరిని మనసున ధ్యానించుచు హరిని ఆరాధించుటకు పూనుకొనెను. జ్ఞానానందుడు, సనాతనుడు, పరమానందపూర్ణుడగు శంకరుడు శ్రీహరిమంత్రమును జపించుచు రాత్రి పగలు అనువాటినన్నిటిని మరచిపోయెను.

పార్వతీదేవి తన భర్తయొక్క ఆజ్ఞననుసరించి వ్రతముకొరకు దాసజనమును, బ్రాహ్మణులను నియోగించెను, ఆ దేవి ఆ వ్రతమునకు కావలసిన సమస్త పదార్థములను తెప్పించి పుణ్యకవ్రతము చేయుటకు మొదలిడెను.

అచ్చటికి బ్రహ్మతేజో విరాజితుడు, తేజఃపుంజము మూర్తీభవించినట్లున్న బ్రహ్మపుత్రుడగు సనత్కుమారుడు వచ్చెను. బ్రహ్మదేవు డచ్చటికి తన భార్యయగు సావిత్రీదేవితో వచ్చెను. మహేశ్వరుడుకూడ అచ్చటకు తొందరపడుచు వచ్చెను. ఆట్లే చతుర్భుజములు కలవాడు, ముల్లోకములను శాసించువాడు, రక్షించువాడు, వనమాలను ధరించినవాడు, రత్నాలంకార శోభితుడగు శ్రీమహావిష్ణువు తన భార్యయగు లక్ష్మీదేవితో, తన అనుచరవర్గముతో కలిసి రత్నములు పొదిగిన రథముపై ఆచ్చటకు వచ్చెను.

ఆవ్రతమునకు సనక, సనంద, సనాతనులు, కపిలమహర్షి అసురి, క్రతువు, హంసుడు, వోడుడు, పంచశిఖముని, అరుణిమహర్షి అగస్త్యుడు, ప్రచేతసుడు, దుర్వాసమునీ, చ్యవనమహర్షి మరీచి, కశ్యపుడు, కణ్వుడు, జరత్కారు, గౌతముడు, యతీ, సుమతీ, వసిష్ఠముని, పులహుడు, పులస్త్యుడు, అత్రి, భృగువు, ఆంగిరసుడు, బృహస్పతి, ఉతథ్యుడు, సంవర్తుడు. సౌభరి, దొబాలి, జమదగ్ని, జైగీషవ్యుడు, దేవలుడు, గోకాముఖుడు, వక్రరథుడు, పారిభద్రుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, ఋష్యశృంగుడు, విభాండకుడు, మార్కండేయుడు, మృకండుముని, పుష్కరుడు, లోమశుడు, కౌత్సుడు, వళ్పుడు, దక్షుడు, బాల్నా, అఘమర్షణుడు, కాత్యాయనుడు, కణాదుడు, పాణిని, శాకటాయనుడు, శంకుముని, ఆపిశీలి. శాకల్యుడు, శంఖుడు, ధర్మునిపుత్రులమగు మేము (నరనారాయణులు) ఇంకను అనేకమునులు తమ శిష్యులతో అచ్చటికేలెంచిరి.

అట్లే అష్టదిక్పాలురు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, మొదలగువారందరు తమ తమ గణములతో అచటికి వచ్చిరి. అదేవిధముగా అన్నీ పర్వతములు శైలరాజగు హిమాలయపర్వతము తన భార్యాపుత్రులలో, తన అనుచరగణముతో అచ్చటికి వచ్చెను.

 ఇంకను బ్రాహ్మణులు, మనువులు, సిద్ధులు, వాగులు, విద్యాధరులు; సన్యాసులు, భిక్షుకులు, స్తోత్రపాఠకులు, విద్యాధరులు, వర్తకులు, అప్సరసలు, అనేకవిధమైన వాద్యములతో కైలాసపర్వతమునకు వచ్చిరి.

పార్వతీదేవి పుణ్యకవ్రతమును చేయుచున్నప్పుడు కైలాసమునందలి రాజమార్గమును చందనముచే కలయంపిజల్లినారు. ఆ మార్గమునందంతట అరటిచెట్ల స్తంభములను నిలిపి, మామిడి తోరణములను కట్టిరి. ఆ మార్గమునందంతట దర్భలు, ధాన్యములు, ఫలములు కుప్పలు కుప్పలుగానున్నది. ఆ రాజమార్గమంతయు పద్మరాగమణులచే నిర్మించబడిన ఆరుగులున్నవి. ఆట్టి రాజమార్గమును మునిగణము, దేవతాగణము, యక్ష కిన్నరాది గణము సంతోషముతో చూచెను.

శంకరుడు తనభార్యచేయుచున్న వ్రతమునకు వచ్చినవారినందరిని ఎత్తిన సింహాసనములందు కూర్చుండబెట్టి గౌరవించెను. దానిని చూచి కైలాసమునమన్న వారందరు సంతోషించిరి.

ఆ పుణ్యకవ్రత కార్యక్రమమున దేవేంద్రుడు దానాధ్యక్షుడుగా, కుబేరుడు ధనాగారమునకు రక్షకుడుగా, సూర్యుడు ఆందరకు పనులనాదేశించువాడుగా, వరుణుడు భోజనములు పెట్టుచోట ఉండెను.. అచ్చట పెరుగు, పాలు, నేయి, గుఢము (బెల్లము), తేనె, నూనె, మజ్జిగ నదులై పారెను. పీయూషమను వంటకములు, మిష్టాన్నములు, చక్కరలు రాశులుగానుండినవి. నేతితో కలిపిన యవలు, గోధుమల పిండి, స్వస్తికములనే పిండివంటలు, పూర్ణములమ పిండివంటలు బెల్లము కలిపిన పేలాలు, అటుకులు, మంచి బియ్యము రాశులు రాశులుగా అచ్చట ఉండినవి. అట్లే అచ్చట బంగారము, వెండి, పగడములు, మణులరాశులు పర్వతములవలె ఉండినవి. పాయసము, పిండి, అప్పము, నేతితో చేసిన కూరగాయలను లక్ష్మీదేవి వండి పెట్టినది. లక్ష్మీదేవి చేసిన పంటను శివుడు, నారాయణుడు, దేవతలు, మునులు, బ్రాహ్మణులందరు చక్కగా భుజించిరి. ఆ సమయమున వడ్డించుటకే లక్షమంది బ్రాహ్మణులుండిరన్నచో భోజనముచేసినవారి సంఖ్య ఎంతయో చెప్పలేము. పార్వతీదేవి వారినందరిని రత్నసింహాసనములపై కూర్చుండబెట్టి కర్పూరాది సువాసన ద్రవ్యములు కల తాంబూలమునిచ్చినది.

అప్పుడు పాలకడలిలో పడుకొనియుండు విష్ణుమూర్తి రత్నసింహాసనముపై కూర్చొని దాసజనము జతచామరములు వీచుచుండగా మునులు. ఆ దేవదేవుని స్తుతించుచుండగా, సిద్దులు, దేవగణములు సేవించుచుండగా గంధర్వులు పాడుచున్న సంగీతమును వినుచూ విద్యాధర స్త్రీలు చేయు నాట్యములను తిలకించుచుండెను. అట్టి పరబ్రహ్మస్వరూపుడైన విష్ణువును దేవతలు, ఋషులు నిండిపోయి యున్న సభలో బ్రహ్మదేవుడు ప్రేరేపింపగా ఆవ్రతమున చేయతగు కార్యమును. శంకరుడు చేతులు కట్టుకొని ఇట్లడిగాను.

శ్రీ మహాదేవ ఉవాచ -శ్రీమహాదేవు డిట్లనెను-

ఓ శ్రీనివాస! నీవు తపఃస్వరూపుడు. నీవు తపస్సుయొక్క, కర్మయొక్క ఫలితములనిచ్చువాడవు. అట్లే వ్రతములయొక్క జపములయొక్క యజ్ఞములయొక్క ఫలితములను నీవిత్తువు. నిన్ను అందరు పూజింతురు. నీవు అందరి కోరికలను కల్పవృక్షమువలె తీర్చెదవు. అట్టినీవు నామాటను వినుము.

నాభార్యయగు పార్వతీదేవి శోకముతో బాధపడుచు పుత్రులను కోరి సుపుణ్యకవ్రతమును చేయవలెననుకొన్నది. దేవతలు రతి భంగమును చేసినప్పుడు వీర్యము వ్యర్థముకాగా బాధపడుచున్నప్పుడా సాధ్విని నేను మంచిమాటలతో ఓదార్చితివి. ఇప్పుడా దేవి సత్పుత్రుని, స్వామి సౌభాగ్యము కావలెనని వ్రతము చేయుచున్నది. సత్పుత్రుడు, స్వామి సౌభాగ్యము లభింపనిచో ఆమె నిరాశకు గురియై ప్రాణములను తీసికోనుటకైనా వెనుకాడకున్నది.

ఓ పరబ్రహ్మస్వరూపుడా! నాభార్యయైన పార్వతీ పూర్వజన్మలో తండ్రియైన దక్షప్రజాపతిచేయుచున్న యజ్ఞమునందు అతడు నన్ను నిందించుటను సహింపలేక ఆ యజ్ఞాగ్నిలో తన శరీరమును పరిత్యజించి తిరిగి హిమవత్పర్వత కన్యగా పునర్జన్మనుపొందినది.

ఓ విష్ణుమూర్తీ! నీవు సర్వజ్ఞుడవు, నేను చెప్పిన వృత్రాంతమంతయు నీకు తెలియును. ఐననూ నేను నీకు ఈవృత్తాంతమున చెప్పితిని. సమస్త తత్త్వములు తెలిసిన నీవు పార్వతీదేవికి చక్కని హితమును చెప్పుము. ఓసర్వేశ్వరుడా! స్త్రీలయొక్క స్వభావము చంచలమైనది. దానిని నివారింపవీలులేనిది.

యోగులైనను, పిద్దులైనన, మావంటి తపోధమలైనను, జితేంద్రియులు, జితక్రోధులైనను స్త్రీని వదలి మనజాలరు. క్రీయొక్క రూపము అందరకు మోహమును కల్గించునది. ఆది సమస్తమాయలకు విలయమైనది. కామమును పుట్టించునేర్పుకలది. అది మన్మథుని బ్రహ్మాస్త్రము. దానివ్వెరు ఎదుర్కొనలేరు. అన్ని సమయములందు, అంతటను జయమును కల్గించును, ఈవిధముగా బ్రహ్మదేవుడు ప్రీరూపమును సృష్టించేను.

అది మోక్షమనే వాకిలికి తలుపువంటిది. శ్రీహరిపై భక్తిని కలుగనీయదు. సంసారమనే స్తంభమున శాశ్వతముగా బంధించు త్రాడువంటిది. ఎల్లప్పుడదీ అనురాగమునే కళించుము కాని ఫైరాగ్యమును కలుగనీయదు. పొపాపములకు, దోషములకు విలయమైనది. నమ్ముటకు వీలులేవీది కపటమైనది. ఎల్లప్పుడు అహంకారము కలిగియుండు ఆ రూపము వేయము విషకుంభమువంటిది. స్త్రీలు ఎవ్వరికి వశులుకారు వారివి లాలించవలెననినచో మిక్కిలి కష్టము కలుగును. కలహములను, వారు కలిగింతురు.

ఓపరబ్రహ్మరూపుడా! నా పరిస్థితినంతయు నీకు నివేదించితివి. ఇప్పుడు నేనేమీ చేయవలెనో వాకు కర్తవ్యమును ఉపదేశింపుము. ఆ కర్తవ్యము విమర్శించి చేయతగినది కావలెను. అట్లే పరిణామసమయమున సుఖమును. కలిగించవలెను. అట్టి కర్తవ్యమును నీవు చక్కగా విమర్శించి ఉపదేశింపుమని శంకరుడు అడిగిమ.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణమహర్షి నారదునీతో ఇట్లనెను-

శ్రీమహాదేవుడు లక్ష్మీపతియగు నారాయణునితో ఈవిధముగా తనవృత్తాంతమునంతయు దేవతలున్న ఆ సభలో చెప్పి శ్రీమహావిష్ణువును కీర్తించుచు, బ్రహ్మదేవుని ముఖమును చూచి ఆగిపోయెను.

అనంతజగములకెల్ల ప్రభువగు శ్రీమహావిష్ణువు శంకరుని మాటలవన్నీటిని విని చిరునవ్వుతో హితమును, నీతియుక్తమువగు మాటలను ఇట్లు చెప్పసాగెను,

శ్రీవిష్ణురువాచ-శ్రీమహావిష్ణువిట్లు శంకరునితోననెను-

ఓశంకరా! విభార్యయగు పార్వతి భర్భసౌభాగ్యము, చక్కని సంతానము కలుగవలెవవి వ్రతములలో పర్వగమైన పుణ్యకవ్రతమును చేయవలెనని అనుకొనుచున్నది. ఆ వ్రతము ఉందరకు అసాధ్యమైపది. ఆది, సమస్తవాంఛితములను, సుఖమును, మోక్షమును కల్గించును.,

ఈవ్రతమునకు సాక్షీభూతుడై ఆధిదేవతాగానుండువాడు సనాతనుడు జ్యోతిస్వరూపుడు ఆగు పరమాత్మయే. అతడు వీరాశ్రయుడు, నిర్లిప్తుడు, నిరుపాధిరూపుడు, నిరామయుడు. ఆ పరమాత్మ భక్తులనెల్లప్పుడు అనుగ్రహించుచుండును. ఆతనీ ప్రాణములు పరమభాగవతోత్తములే, ఆతడు అన్యజనులకు ఆందనివాడైనను భక్తజనులకు మాత్రము. ఎల్లప్పుడు అనుకూలమై యుండును. ఆ భగవంతుని వదలివేసినచో సమస్తసిద్ధులు విప్పలమగును..

బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మహేశ్వరుడు ఆ పరమపురుషుని అంశస్వరూపులు మాత్రమే. అట్లే ప్రకృతికంటిపరుడైన మహావిరాట్వరూపుడు ఆ పరమపురుషుని అంశస్వరూపుడు మాత్రమే. భక్తులనుగ్రహించుటకై ఆకారమును ధరించిన ఆ పరమపురుషుని నీవంటివారు తప్ప ఇతరులు మూడుకోట్ల జన్మలెత్తినను పొందజాలరు.

ఈ భారతభూమిపై జన్మపొందినవాడు మాత్రమే శ్రీహరీ భక్తిని పొందును.

క్షుద్రదేవతలను ఏడు జన్మలవరకు నియమనిష్ఠలతో ఆరాధించిన వ్యక్తికి సూర్యమంత్రము లభించును. అట్లే ఈ భారత ఖండమున సూర్యమంత్రమును నియమనిష్ఠలతో మూడు జన్మలవరకు ఉపాపించినచో సమస్త కోరికలను తీర్చు. శివమంత్రము లభించును.

అంతులేని భక్తితో పరమశివుడవగు నీన్ను ఆ ఏడుజన్మలవరకు ఆరాధించినచో వీ ఆనుగ్రహమువలన విష్ణుమాయ అను దుర్గాదేవి మంత్రము లభించును. నారాయణియగు ఆదేవిని నూరుబిన్మలవరకు ఆరాధించినచో నారాయణాంశ మంత్రమును పొందగలడు. ఆ నారాయణాంశముమ పుణ్యక్షేత్రమున ఒక సంవత్సరము అత్యంతభక్తితో ఉపాసించినచో శ్రీకృష్ణ భక్తులతో సమాగమనమును కల్పించు శ్రీకృష్ణభక్తి లభించుమ, పూర్తిగా పరిపక్వముకొని శ్రీకృష్ణభక్తితో ఈ భారతవర్షమున పుణ్యక్షేత్రసందర్శనము చేసినచో అచ్చటనున్న శ్రీకృష్ణభక్తులతో కలిసియున్న పుణ్యము వలన ఆయా దేవతల అనుగ్రహమువలన పూర్తిగా పక్వమైనది మోక్షఫలము నొసగునది ఐన శ్రీకృష్ణమంత్రము లభించును.

శ్రీకృష్ణమంత్రము, శ్రీకృష్ణ వ్రతము సమస్త కోరికలను తీర్చును. శ్రీకృష్ణమంత్రము నెల్లప్పుడు ఉపాసించు భక్తుడు శ్రీకృష్ణునితో సమానుడు కాగలడు.

మహాప్రళయకాలమున ఈలోకములందున్న పర్వజీవులు నశించును కాని పరమసాధువులైన శ్రీకృష్ణభక్తులు మాత్రము నశింపరు. శ్రీకృష్ణభక్తులాసమయమున సాశసమనునది లేని గోలోకమున సుఖముగానుందురు. మహాప్రళయకాలమున బ్రహ్మాదిదేవతలందరు నశించుచుండుటను కని వారు నిశ్చింతతోనుందురు.

ఓమహేశ్వర! నీవు చరాచర ప్రపంచమునంతయు లయమొనరింతువు కాని నాభక్తులను మాత్రము నీవు సంహరింపలేవు. సామాయ అందరినీ మోహింపజేయును గాని నాఅమగ్రహమువలన నా భక్తులను మాత్రము మోహపరవశులను చేయజాలదు. పైగా నారాయణియగు విష్ణుమాయ నాఅనుగ్రహము వలన భక్తులందరకు శ్రీకృష్ణభక్తిని కలిగించును. అందువలన విష్ణుమాయయగు దుర్గాదేవిని సేవింపక ఎవ్వరు శ్రీకృష్ణభక్తిని పొందజాలరు.

సారాయణియగు విష్ణుమాయ మూలప్రకృతిస్వరూపిణి. ఆ దేవి శ్రీకృష్ణునకు మిక్కిలి ప్రియమైనది. ఆమె శ్రీకృష్ణునకు భక్తురాలు. ఆతనితో సమానమైనది. తేజోరూపిణి. తాము కోరుకున్న ఆకారమును ధరించగలది, ఆమె సమస్తదేవతల తేజస్సువలన రాక్షసులను సంహరించుటకు అవతరించిన తల్లి, ఆదేవి శుంభాది రాక్షసులను సంహరించి దక్షప్రజాపతీ అనేక జన్మలలో చేసికొన్న తపస్సువలన అతనికి పుత్రికగా జన్మించినది.

నారాయణియగు ఆ సతీదేవి తన తండ్రియగు దక్షుడు యజ్ఞము చేయుచున్న సమయమున నిన్ను నిందింపగా విని సహింపలేక అచ్చటనే తన శరీరమును వదలి గోలోకమునకు చేరినది. అప్పుడు నీవాదేవియొక్క శరీరమును చేతబట్టుకొని భారతదేశమంతటను తిరుగుచుండగా నీ అవస్థను గమనించి నేను నిన్ను ఓదార్చితిని. అప్పుడే ఆమె హిమాలయ పర్వతమునకు కూతురై పుట్టెమ.

ఓశంకరా! పరమపతివ్రతయగు పార్వతీదేవి మంచివతమైన పుణ్యకవ్రతమును చేయుగాక. ఆవ్రతము వేలకొలది రాజసూయయాగములు చేసినదానికంటే గొప్ప పుణ్యమును కలిగించును. ఈ వ్రతమును పతివ్రతలందరు చేయజాలరు. ఈ పుణ్యకవ్రత మాహాత్మ్యమువలన పార్వతీదేవికి పుత్రుడు కలుగును. ఆతడు దేవతాగణముల కన్నిటికి అధిపతిగావున గణేశుడను పేరుతో ప్రసిద్దినందును. అట్లే ఆతనిని స్మరించినంతమాత్రమున విఘ్నములన్నియు నశించిపోవునుపువ విఘ్నాధిపుడుగను, విఘ్ననాశకుడుగను పేరు సంపాదించుకోమను. అదేవిధముగా ఈపుణ్యకవ్రతమున ఆతవి కొసగు నైవేద్యములవలన ఆతడు లంబోదరుడగును. శనిదేవునియొక్క వక్రదృష్టి ఇతనిపై పడుటవలన ఆతని శిరచ్ఛేదము జరుగును. అటు పిమ్మట అతనికి గజముయొక్క శిరస్సును తగిలించుటవలన గబావను డగును. అట్లే ఆతడు. పరశురామునియొక్క గండ్రగొడ్డలి దెబ్బచే ఒక దంతమును కోల్పోయి ఏకదంతుడగును. ఈతడు సమస్తదేవతలకు చివరకు నాకు కూడ పూజనీయు డగుమ. వారమువలన ఇతడు అందరు. దేవతలకంటే ముందుగానే పూజలనందుకొనును. దినులు సమస్తదేవతలను పూజించు సమయమున తొలుత ఈ గణపతిని పూజించినందువలన, ఆయా దేవతాపూజీ నిర్విఘ్నముగా కొనసాగును. అట్లే పూజచేయుమానవునకు పూజాఫలముకూడ తప్పక లభించును.

గణపతిని, సూర్యుని, విష్ణుమూర్తిని, శంకరుని, ఆగ్నివి, దుర్గాదేవిని పూజించిన తరువాతనే ఇతర దేవతలను పూజింపవలెను.

గణపతిని పూజించినచో విఘ్నములన్నియు తొలగిపోవును. సూర్యదేవుని పూజించిన చక్కని ఆరోగ్యము కలుగును. శ్రీమహావిష్ణువును పూజించినచో శుచిత్వము కలుగును. శంకరుని పూజివలన మోక్షము, పాపనాశనము, కీర్తి, ఉత్తమైశ్వర్యము. తత్త్వజ్ఞానము కలుగును. ఆగ్నిదేవుని పూజించినచో చక్కని బుద్ధి కలుగును. ప్రతిదినము వీధిప్రకారముగా అగ్ద్యాధానము చేయువాడు అగ్నిని పూజించుచున్నచో మరణసమయమునను అతనికి జ్ఞానముండుమ. అట్లే ప్రతిదినము అగ్నిని శంకరుని పూజించినచో ధనధాన్య గులు కలిగి, ఇతరులకు దానములు చేయుచు అను వాటిననుభవించుచు సుఖముగానుండును. దుర్గాదేవిని అర్చించిన శ్రీహరి భక్తి కలుగును.

గణపతి మొదలగు దేవతలను పూజింపక ఇతర దేవతలను పూజించినచో విపరీత గు జరుగును. పైన పేర్కొన్న క్రమపద్ధతిననుసరించియే ప్రతికల్పమున ఇతర దేవతలను పూజింతురు.

ఈదేవతలు సృష్టికర్తలై నిత్యులైయుందురు. వీరి జననమరణములు శ్రీకృష్ణపరమాత్మయొక్క ఇచ్ఛననుసరించియే జరుగును.

శ్రీహరి ఆదేవతలున్న సభలో శంకరునితో నిట్లు పలికి ఊరకుండగా దేవతలు పార్వతీపరమేశ్వరులు ఇంకము అచటమన్న బ్రాహ్మణులందరు సంతసించిది.

 బ్రహ్మ వైవర్తమహాపురాణములో మూడవదగు గణేశఖండమున నారద నారాయణ మహర్షులసంవాదమున చెప్పబడిన పార్వతీదేవి పుణ్యకవ్రతాజ్ఞను స్వీకరించుకథ గల యారవధ్యాయము సమాప్తము.