శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

30 - ప్రచేతసులు శ్రీహరిని దర్శించి స్తుతించుట

విదురుడిట్లు పలికెను --- ఓ మహర్షీ! ప్రాచీనబర్హిషుని పుత్రులు నీ సలహా ప్రకారముగా రుద్రుని ఉపదేశమును అనుష్ఠించి, శ్రీహరిని ప్రస న్నునిగా చేసుకొని సిద్ధిని బడసినారు గదా! ఆ సిద్ధి యెట్టిది ?

బృహస్పతి శిష్యుడవగు ఓ మైత్రేయా! ప్రచేతసులు అనుకో కుండా (ఈశ్వరేచ్చచే) కైలాసాధిపతియగు శివదేవుని దర్శనమును పొంది రి. మోక్షమునిచ్చే ప్రభుడగు శ్రీహరికి శివుడు ప్రియుడు. అట్టి శివుని అను గ్రహముచే వారు తప్పక పరమపురుషార్థమగు మోక్షమును నిశ్చయముగా పొందియే యుందురు. కాని, దానికి ముందు ఇహపరలోకములలో వారికి లభించిన సిద్ధి యెట్టిది?

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- తండ్రి ఆదేశమును పాలించే ప్రచేతసులు సముద్రము లోపల జపయజ్ఞరూపమగు తపస్సును చేసి, సృష్టికి మూలపురుషుడగు శ్రీహరిని ప్రసన్నునిగా చేసుకొనిరి.

వారు పదివేల సంవత్సరములు తపస్సును చేసిన పిదప శ్రీహరి వారికి శాంతమగు రూపముతో సాక్షాత్కరించెను. కాలమునకు అతీతుడు, పూర్ణుడు అగు ఆయనయొక్క కాంతి వారి తపఃక్లేశమును చల్లార్చెను.

పచ్చని వస్త్రమును దాల్చి గరుత్మంతుని స్కంధములపై అధిష్ఠిం చిన శ్రీహరి మేరుపర్వత శిఖరము పైనుండే మేఘమువలె నున్నాడు. మేడలో కౌస్తుభమాణిక్యమును దాల్చిన ఆయన తన కాంతిచే దిక్కులలోని చీకట్లను పారద్రోలుచుండెను.

రంగురంగుల మణులు పొదిగిన బంగరు ఆభరణముచే ఆయన చెక్కిళ్లు మరియు ముఖము ప్రకాశించుచుండెను. ఆయన తలపై కిరీటము, చేతులయందు ఎనిమిది ఆయుధములు విరాజిల్లుచుండెను. ఆయన చుట్టూ అనుచరులు, మహర్షులు మరియు లోకపాలకులు సేవించుచుండిరి. గరుడుడే కిన్నరుడై ఆయన కీర్తిని గానము చేయుచుండెను.

శ్రీహరియొక్క ఎనిమిది బలిసిన పొడవాటి భుజముల మధ్యలో లక్ష్మీదేవి, వనమాల కాంతిలో ఒకదానితోనొకటి పోటీ పడుచుండెను. సర్వ జగత్కారణుడు, పూర్ణుడు అగు శ్రీహరి తనను శరణు జొచ్చిన బర్హిష్మం తుని పుత్రులగు ప్రచేతసులను కృపాదృష్టితో చూచి, మేఘగర్జనవంటి వాక్కుతో వారితోనిట్లనెను.

శ్రీభగవానుడిట్లు పలికెను --- ఓ రాజకుమారులారా! మీరు అన్యోన్యము ప్రేమ గలవారై అందరు కలిసి ఒకే ధర్మమును పాటించుచు న్నారు. మీ ఈ పరస్పర స్నేహభావముచే నేను సంతసించితిని. మీరు నానుండి వరమును కోరుకొనుడు. మీకు మంగళమగు గాక!

ఏ మానవుడైతే ప్రతిదినము సంధ్యాకాలమునందు మిమ్ములను స్మరించునో, పోనికి తన సోదరులయందు ఆత్మసమమగు ప్రీతి కలుగును. మరియు, వానికీ సకలప్రాణులయందు ప్రేమ ఉదయించును.

ఎవరైతే ఉదయము సాయంకాలము నన్ను ఏకాగ్రచిత్తులై రుద్రరీ తముతో స్తుతించెదరో, వారికి నేను కోరిన వరములను మాత్రమే గాక చక్కటి బుద్ధిశక్తిని కూడ అనుగ్రహించెదను.

మీరు తండ్రియొక్క ఆదేశమును ఆనందముగా స్వీకరించిరి. కావు న, మీయొక్క గొప్ప కీర్తి లోకములలో వ్యాపించగలదు.

మీకు ఒక పుత్రుడు కలుగును. ఆతడు గుణములలో బ్రహ్మకు తక్కువ కాబోడు. గొప్ప ప్రఖ్యాతిని బడసే ఆతడు తన సంతానముతో ఈ ముల్లోకములను నింపును.

ఓ రాజకుమారులారా! ప్రహ్లిచ అనే అప్సరసకు కండు మహర్షి వలన కలువ కన్నుల చిన్నది జన్మించెను. కాని ఆమె ఆ పిల్లను అడవిలో విడిచి పెట్టగా, చెట్లు ఆ శిశువును స్వీకరించినవి.

ఆ శిశువు ఆకలితో బాధపడి ఏడ్చుచుండెను. అపుడు ఓషధులకు ప్రభువగు చంద్రుడు దయ గలవాడై అమృతమును స్రవించే తన చూపుడు వ్రేలును ఆ శిశువు నోటిలోనుంచెను.

మీ తండ్రియగు ప్రాచీనబర్హిషుడు నా ఆజ్ఞను పాలించే భక్తుడు. సంతానమును కనుడని మిమ్ములను ఆయన ఆదేశించినాడు. కావున, మీరు సుందరియగు ఆ కన్యను వివాహమాడుడు. విలంబము చేయకుడు.

మీరు అందరు కలిసి ఒకే ధర్మమును పాటిస్తూ ఒకే స్వభా వమును కలిగియున్నారు. మీతో సమానమగు ధర్మము మరియు శీలము గల ఈ సుందరి కూడ మీకే తన హృదయమునర్పించగలదు. ఆమె మీకు భార్య యగుగాక!

మీరు నా అనుగ్రహము వలన పది లక్షల దేవసంవత్సరముల కాలము తగ్గని బలము గలవారై, భూలోకమునందలి భోగములను మాత్రమే గాక దేవభోగములను కూడ అనుభవించుడు.

మీరు నాయందు నిరంతరమగు భక్తిని చేసెదరు. దాని ప్రభావ ముచే త్రిగుణాత్మకమగు మీ అంతఃకరణము పరిపక్వమై దానిలోని కామనలు మొదలగు మాలిన్యములు నశించును. అపుడు మీకు నరకతుల్య మగు ఈ భోగములయందు వైరాగ్యము కలుగును. అప్పుడు మీరు నా స్వరూపమునందు ఐక్యము కాగలరు.

మానవుడు ధర్మాధర్మవివేకపూర్వకముగా కర్మలను చేస్తూ, భగవ చ్చింతనలో కాలమును గడుపవలేను. అట్లు చేయువారలకు గృహస్థాశ్ర మమైననూ బంధ హేతువు కాబోదు.

నిరంతరమగు భగవచ్చింతన వలన జ్ఞప్తిస్వరూపుడనగు నేను సాధకుని హృదయములో నిత్యనూతనముగా ప్రకాశించేదను. దీనినే బ్రహ్మవేత్తలు బ్రహ్మయని నిర్దేశించుచున్నారు. ఇట్టి భగవచ్చింతనము వలన సాధకుడు వ్యామోహమును గాని, శోకమును గాని, హర్షద్రేకమును గాని పొందడు.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- దుష్టజనశిక్షకుడు, పరమహి తకారి అగు శ్రీహరి భక్తులకు పురుషార్థములననుగ్రహించును. ఆయన ఈ విధముగా పలుకగా, ప్రచేతసులు చేతులను జోడించి బొంగురు వోయిన కంఠముతో వారాయనను ఇట్లు స్తుతించిరి. ఆయన దర్శనముచే వారి హృదయములలోని రజస్తమోగుణముల మాలిన్యము నశించియుండెను.

ప్రచేతసులు ఇట్లు పలికిరి --- భక్తుల కష్టములను బాపే శ్రీహరికి ఏ గుణములను శాస్త్రములు నిరూపించుచున్నవో, అవియే ఆయన నామ ములగుచున్నవి (ఆయన గుణములు, నామములు శాస్త్రముచే నిరూపించబడుచున్నవి). ఆయన స్వరూపము మిక్కిలి వేగము గల మనస్సునకు గాని, వాక్కునకు గాని అందదు. ఆయన స్వరూపము ఇంద్రియముల వ్యాపారములకు అందదు. ఆయనకు అనేక నమస్కారములు.

శ్రీహరియే మాయాశక్తియొక్క సత్వరజస్తమోగుణములను ఉపా ధిగా స్వీకరించి, జగత్తునకు స్థితిని ప్రళయమును మరియు సృష్టిని చేయు ను. అయిననూ, అయన స్వస్వరూపనిష్ఠుడగుటచే ఆయనయందు కర్తృ త్వదికము గాని, గుణముల సంక్షోభము గానీ లేవు. వాస్తవముగా లేకు న్ననూ మనస్సునందు స్పురించే ఈ నానాత్వరూపమగు జగత్తునకు అధి స్థానము శ్రీహరియే. అట్టి శ్రీహరికి నమస్కారము.

శ్రీహరి శుద్ధసత్త్వప్రధానమగు మూర్తి, ఆయనను తెలుసుకున్నవా నికి సంసారము తొలగిపోవును. ఆయనయే వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణుడై అవతరించి సాత్వతవంశీయులకు ప్రభుడైనాడు. సకలజగత్తులు చైతన్యస్వ రూపుడగు ఆయనయందే భాసించుచున్నవి. ఆనందరూపుడగు ఆ శ్రీహరియే సత్త్వగుణప్రధానులగు భక్తులకు ప్రభుడు. ఆయనకు నమస్కారము.

ఓ కలువ కన్నుల శ్రీహరీ! బ్రహ్మాండము కమలముల మాలను ధరించే నీ నాభియందలి కమలమైనది. కమలములవంటి పాదములు గల నీకు అనేక నమస్కారములు.

కమలముల పుప్పొడివలె పచ్చనైన స్వచ్ఛమగు వస్త్రములను ధరించియున్న శ్రీహరి కొరకు పలుమార్లు నమస్కరించుచున్నాము. ఆయన సకలప్రాణులలో సాక్షి చైతన్యరూపముగా నివసించి యున్నాడు.

కష్టములనన్నింటినీ బా పే ఈ రూపము అవిద్యాది క్లేశములతో నిండియున్న మాకు శ్రీహరి భగవానునిచే ఆవిష్కరించబడినది. ఇంతకంటే గొప్ప అనుగ్రహము ఏమి గలదు?

అమంగళములను నాశనము చేయువాడా! దీనవత్సలురగు ప్రభు వులు ఆయా కాలములయందు సేవకులను తమ బుద్ధియందు స్మరించవలెను. అంతమాత్రముచే సేవకులు కృతార్థులగుదురు.

శ్రీహరిచే స్మరించబడువారల కష్టములు నివారణ అగును. ఆయన అత్యల్పములగు ప్రాణుల హృదయముల లోపల కూడ అంతర్యా మియై ఉన్నాడు. అట్టి శ్రీహరికి కోరికలతో నిండిన మా హృదయముల లోని ఆకాంక్షలు ఏల తెలియకుండును?

ఓ జగన్నాథా! మోక్షప్రదాతవు, మోక్షమార్గమును చూపువాడవు అగు నిన్ను మేము శరణు పొందినాము. మాయందు భగవానుడవగు నీవు ప్రసన్నుడవైనావు. మేము కోరే వరము ఇదియే.

ఓ ప్రభూ! అయినప్పటికీ, ప్రకృతికి అతీతుడవగు నీనుండి మేము వరమును కోరుచున్నాము. నీ మహిమలకు అంతము లేదు గనుకనే, నిన్ను అనంతుడని కీర్తించుచున్నారు.

తేలికగా కల్పవృక్షము లభించినప్పుడు తుమ్మెద మరియొక చెట్టును సేవించదు. మాకు సాక్షాత్తుగా నీ పాదమూలము లభించినది. మేము ఇతరములను వేటిని కోరవలయును?

నీ మాయచే కప్పివేయబడిన మేము కర్మఫలములననుభవిస్తూ ఈ సంసారములో పరిభ్రమిస్తూ ఉన్నంతవరకు, మాకు జన్మజన్మలయందు నీ గొప్ప భక్తుల సంగము కలుగు గాక!

భగవంతునియందు ప్రేమ గల భక్తులతోడి సంగముయొక్క లేశ ముతోనైననూ స్వర్గము గాని, మోక్షము గాని తులదూగవు. ఇక మానవుల భోగభాగ్యములు తులదూగవని వేరుగా చెప్పవలయునా?

సత్సంగములో శుద్దములగు భగవద్గాథలు గానము చేయబడును. దానిలో పాల్గొన్నవారికి సంసారాసక్తి బాగుగా పలచబడును. అచట ప్రాణుల మధ్యనుండే వైరము తొలగిపోవును. సత్సంగము వలన మనస్సులోని భయాందోళనలు పూర్తిగా దూరమగును.

సత్సంగములో సంసారాసక్తిని విడిచి పెట్టిన మహాత్ములు భగవద్గా థలను కీర్తించెదరు. ఆ గాథలలో సాక్షాత్తు నారాయణ భగవానుడు చక్కగా పదే పదే స్తుతించబడును. సర్వసంగపరిత్యాగులకు గత ఆయనయే.

నీ భక్తులు తీర్థములను పవిత్రము చేసే ఆకాంక్షతో కాలి నడకన సంచరించెదరు. సంసారము వలన భయపడియున్నవానికి వారితోడి సమా గమము ఏల రుచించదు?

ఓ భగవానుడా! నీకు ప్రియసఖుడగు శివునితో సాక్షాత్తుగా మాకు - క్షణకాలము సమాగమము కలిగినది. జననమరణములనే రోగమునకు చికిత్స చాల కష్టము. కాని, శివసమాగమముయొక్క ప్రభావముచే మేము సంసారరోగమునకు సర్వోత్తమవైద్యుడవగు నిన్ను శరణు పొందగల్గినాము.

ఓ ఈశ్వరా! మేము చక్కగా వేదమును అధ్యయనము చేసితిమి. గురువులను, వేదవేత్తలను మరియు పెద్దలను అన్ని కాలములలో అనుస రించి ప్రసన్నులను చేసుకొంటిమి. గొప్పవారు, మిత్రులు, సోదరులకు మాత్రమే గాక సకలప్రాణులకు మేము దోషారోపణను చేయకుండగా నము స్కరించితిమి. మేమీ విధముగా నీటిలో నిలబడి నిరాహారులమై చాలకా లము చక్కని తపస్సును చేసితిమి. ఈ సర్వము వలన సర్వాంతర్యామివి, పరబ్రహ్మస్వరూపుడవు అగు నీవు ప్రసన్నుడవగుదువు గాక! మా కోరిక ఇదియే.

స్వాయంభువ మనువు, స్వయంభువుడగు బ్రహ్మగారు, శివ భగ వానుడు మాత్రమే గాక, తపస్సు మరియు ఉపాసనలచే పవిత్రమైన అంతఃకరణము గల ఇతరులు నీ మహిమయొక్క అంతమును చూచినవారు కాకున్ననూ, తమ తమ శక్తికి తగ్గట్లుగా మాత్రమే నిన్ను స్తుతించుచున్నారు. కావుననే, మేము కూడ నిన్ను స్తుతించుచున్నాము.

నీవు సర్వప్రాణులలో ఆత్మచైతన్యరూపముగా సమానముగా నున్నావు. నీయందు కర్తృత్వభోక్తృత్వాది దోషములు లేవు. సర్వజగన్నివా సుడవగు నీవు స్వయంప్రకాశస్వరూపుడవు. నీవు ప్రకృతికి అతీతుడవు. సత్త్వమూర్తివగు నీయందు ఈశ్వరభావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము మరియు వైరాగ్యము అనే ఆరు గుణములు పూర్ణముగా నున్నవి. నీకు నమస్కారము.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- అమోఘమగు శక్తి గల శ్రీహరికి శరణాగతులయందు వాత్సల్యము మెండు. ప్రచేతసులు ఈ విధ ముగా స్తుతించగా, ఆయన సరేయని వారి కోరికను అనుమోదించెను. ఆయన దర్శనముచే వారి కన్నులకు ఇంకనూ తృప్తి కలుగనే లేదు. కావున నే, ఆయన నిర్గమనమును వారు ఇష్టపడలేదు. అయిననూ, ఆయన తన ధామమునకు వెళ్లెను.

తరువాత ప్రచేతసులు సముద్రజలములనుండి పైకి వచ్చి చూడగా భూమి అంతయు చెట్లతో ఆవరించబడి యుండెను. ఆ చెట్లు స్వర్గమును అడ్డుకొనుటకా యన్నట్లు ఎత్తుగా పెరిగినవి. వాటిని చూచి వారు కోపించిరి.

ఓ రాజా! తరువాత వారు, ప్రళయకాలరుద్రుని వలె కోపించి, భూమిపై చెట్లు లేకుండా చేయుటకై నోటినుండి మంటలను గాలిని విడిచిపెట్టిరి.

చెట్లు కాలి బూడిద అగుచుండగా చూచిన బ్రహ్మగారు అచటకు వచ్చి, ప్రాచీనబర్హిషుని పుత్రులగు ఆ ప్రచేతసులకు మంచి మాటలను చెప్పి, వారి కోపమును తగ్గించెను.

కాలిపోగా మిగిలియున్న చెట్లు భయపడినవి. స్వయంభువుడగు బ్రహ్మగారి ఉపదేశానుసారముగా అవి అప్పుడు తమ కుమార్తెను ప్రచేత సులకు సమర్పించినవి.

ఆ ప్రచేతసులు కూడ బ్రహ్మగారి ఆదేశము వలన మారిష అనే ఆ కన్యను వివాహమాడిరి. పూర్వము నారాయణునినుండి ఉద్భవించిన బ్రహ్మగారికి పుత్రుడైన దక్షుడు మహాదేవుని నిందించుటచే, గర్భవాసదుఃఖ ముననుభవించుటకై మరల ఆమెయందు జన్మించెను.

చాక్షుష మన్వంతరము వచ్చు కాలమునకు అంతకు ముందటి సృష్టి కాలప్రభావముచే నశించెను. అప్పుడు దైవముచే ప్రేరితుడైన దక్షుడు తనకు అభీష్టమగు సంతానమును కనెను. ఆ దక్షుడు ఇప్పుడు మారిషయందు జన్మించెను.

ఆ దక్షుడు పుట్టుచుండగనే తన తేజస్సుచే తేజశ్శాలురందరి తేజ స్సును తిరస్కరించెను. కర్మలయందు చాతుర్యము గలవాడగుటచే ఆత నిని దక్షుడని వ్యవహరించిరి.

స్వయంభువుడగు బ్రహ్మగారు ఆ దక్షుని అభిషేకించి ప్రజాసృ షిని రక్షించుమని నియోగించెను. ప్రజాపతులకు నాయకుడగు ఆ దక్షుడే ఇతరప్రజాపతులను కూడ నియోగించేను.

శ్రీమద్భాగవతమునందలి నాల్గవ స్కంధములో ప్రచేతసులకు శ్రీహరి దర్శనమిచ్చుటను, ఆయనను వారు స్తుతించుటను వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసినది.