శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
15 - పృథూపాఖ్యానము - పృథువు పట్టాభిషిక్తుడగుట
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- తరువాత మరల ఆ మహ ర్టులు పుత్రసంతానము లేని ఆ వేనరాజుయొక్క భుజములను మథించగా, ఒక స్త్రీపురుషుల జంట పుట్టెను.
ఆ విధముగా పుట్టిన ఆ జంటను చూచి బ్రహ్మవేత్తలగు ఆ మహ ర్హులు వారిలో భగవానుని అంశను గుర్తించి చాల సంతోషించినవారై, ఇట్లు పలికిరి.
మహర్షులు ఇట్లు పలికిరి --- ఈతడు శ్రీహరి భగవానుని లోకము లను పాలించే అంశమే. పరమపురుషుడగు శ్రీహరిని లక్ష్మీదేవి ఏ కాల మునందైనా విడిచియుండదు. ఈమె అట్టి లక్ష్మీదేవియొక్క అవతారము.
వీరిద్దరిలో పురుషుడు రాజులలో ప్రథముడై కీర్తిని విస్తరింప జేయ గలడు, ఈతడు పృథువు అనే పేరుతో ప్రసిద్ధిని గాంచి, గొప్ప కీర్తి గల మహారాజు అగును.
చక్కని దంతములతో ప్రకాశించే ఈ సుందరి గుణములకు, భూష ణములకు కూడ అలంకారము. ఈమె కూడ అర్చి అనే పేరుతో ప్రసిద్ధిని గాంచి, పృథువును తన వశము చేసుకొనగలదు.
సాక్షాత్తుగా శ్రీహరియే లోకములను రక్షించగోరి ఈ పృథువు. రూపములో అవతరించినాడు. లక్ష్మీదేవి శ్రీహరియే పరాయణము గలది యై, ఆయనను ఏ కాలమునందైననూ విడిచియుండదు. కావుననే, ఆయన వెంటవెంటనే లక్ష్మీదేవి ఈ అర్చి యై అవతరించినది.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- బ్రాహ్మణులు ఆ పృథువును కొనియాడిరి. గంధర్వులలో ఉత్తములగు తుంబురుడు మొదలగువారు గానమును చేసిరి. సిద్ధులు పుష్పవృష్టిని కురిపించిరి. అప్సరసలు నాట్య మాడిరి.
అంతరిక్షములో శంఖములు తూర్యములు మద్దెళ్లు దుందుభులు మొదలగు వాద్యములు మ్రోగినవి. అచటకు దేవతలు, మహర్షులు, పితృ దేవతలు అందరు గణములుగా విచ్చేసిరి.
జగత్తునకు తండ్రియగు బ్రహ్మగారు దేవతలతో మరియు లోకపా లకులతో కూడి అచటకు వచ్చెను. ఆయన పృథువు కుడిచేతిలో గదాధారి యగు శ్రీహరియొక్క చిహ్నముగు, చక్రమును, పాదములయందు పద్మ మును చూచెను. ఎవని. చేతిలో ఇతరరేఖలతో తెగిపోకుండా చక్రము ఉండునో, ఆతడు పరమేశ్వరుని అంశయే యగును.
వేదవేత్తలగు బ్రాహ్మణులు ఆ పృథువుయొక్క పట్టాభిషేకమును ఆరంభించిరి. జనులు అన్ని దిక్కులనుండియు అభి షేక ద్రవ్యములను తీసుకు వచ్చిరి.
నదులు, సముద్రములు, పర్వతములు (వాటి అధిష్టాన దేవతలు), సర్పములు, గోవులు, పక్షులు, మృగములు, స్వర్గలోకము, భూదేవి, సకల ప్రాణులు బహుమతులను తీసుకు వచ్చిరి.
చక్కని వస్త్రములను దాల్చి, బాగుగా అలంకరించబడిన పృథువు మహారాజుగా పట్టాభిషిక్తుడైనాడు. ఆతడు చక్కగా అలంకరించుకున్న తన భార్యయగు అర్చిస్సుతోగూడి రెండవ అగ్నివలె విశేషముగా ప్రకాశించెను.
వీరుడవగు ఓ విదురా! కుబేరుడు ఉత్తమమగు బంగరు సింహాసన మును, వరుణుడు నీటిని స్రవిస్తూ చంద్రుని వలె ప్రకాశించే శ్వేతచ్ఛత్ర మును పృథువునకు బహుమతిగా ఇచ్చిరి.
పృథువునకు వాయువు వింజామరలను, ధర్ముడు కీర్తిని వర్ధిల్ల జేసే మాలను, ఇంద్రుడు చాల గొప్ప కిరీటమును, యముడు శత్రువులను వశము చేసుకొనే దండమును బహుమతులుగా ఇచ్చిరి.
బ్రహ్మగారు వేదరూపమగు కవచమును, సరస్వతీ దేవి ఉత్తమ మగు హారమును, శ్రీహరి సుదర్శన చక్రమును, ఆయన భార్యయగు లక్ష్మీదేవి నాశము లేని సంపదను పృథువునకు ఇచ్చిరి.
పృథువునకు రుద్రుడు కత్తినీయగా, పార్వతీదేవి డాలును ఇచ్చే ను. ఆ కత్తి ఒరకు చంద్రబింబమును పోలియున్న పది బుడిపెలు, డాలుకు వంద బుడి పేలు ఉండెను. చంద్రుడు అలసట, మరణము లేని గుర్రముల నిచ్చెను. త్వష్ట (విశ్వకర్మ) సౌందర్యనిధానమగు రథమునిచ్చెను.
అగ్ని పృథువునకు మేక మరియు గోవుయొక్క కొమ్ముతో చేసిన ధనస్సును, సూర్యుడు కిరణముల వలె వేగముగా పయనించే బాణముల ను, భూదేవి ఎక్కడి కైననూ క్షణకాలములో తీసుకుపోయే శక్తి గల పాదరక్ష లను, స్వర్గాధిష్టాన దేవత ప్రతిదినము పుష్పమాలను ఇచ్చిరి.
ఆకాశసంచారులగు గంధర్వాదులు పృథువునకు నాట్యములో, చక్కని సంగీతములో, వాద్యములను వాయించుటలో సామర్థ్యమును మాత్రమే గాక, అంతర్ధానమయ్యే శక్తిని కూడ ఇచ్చిరి. మహర్షులు అమోఘములగు ఆశీర్వచనములను పలికిరి. సముద్రుడు. తనలో పుట్టిన శంఖమును పృథువునకు ఇచ్చెను.
సముద్రములు, పర్వతములు, నదులు విశాలహృదయుడగు పృథువుయొక్క రథము తమగుండా నిరాటంకముగా పయనించునట్లు వర మునిచ్చినవి. అపుడు సూతుడు (పురాణకథలు తెలిసినవాడు), మాగధుడు (రాజుయొక్క వంశవృక్షము తెలిసినవాడు) మరియు వంది (తెలివిగా సందర్భోచితముగా మాటలాడువాడు) పృథువును స్తుతించుటకు ఉపక్ర మించిరి.
స్తోత్రపాఠకులు స్తుతించుటకు ఉపక్రమించుచుండగా, ఆ విషయ మును వేనుని పుత్రుడగు పృథువు గమనించెను. ప్రతాపశీలియగు ఆయన నవ్వుతూ మేఘధ్వనివలె గంభీరమగు వాక్కుతో ఆ స్తోత్రపాఠకులనుద్దే శించి ఇట్లు పలికెను.
ఓయీ సూతా! ఓయీ మాగధా! ప్రసన్నమగు శీలము గల ఓ వందీ! నా గుణములు ఇంకనూ లోకములో వెల్లడి కాలేదు. అట్టి స్థితిలో ఇప్పుడు మీకు నన్ను స్తుతించుటకు విషయమేమున్నది? కావున, మీరు నన్ను స్తుతించవలదు. నన్ను స్తుతించుట ద్వారా మీ వాక్కులు పొల్లు కారాదు.
మీ వాక్కులు మధురమైనవి. కావున, మీరు మరియొక సమయ ములో నేను లేనప్పుడు నా కీర్తిని గురించి అధికముగా స్తుతించవచ్చును. పవిత్రమగు కీర్తి గల శ్రీహరియొక్క గుణగానము ఉండగా, శిష్ట పురుషులు అల్పుడగు మానవుని స్తుతించరు.
ఒకడు మహాత్ముల గుణములను తనలో సంపాదించుటయందు సమర్థుడు కావచ్చును. కాని, అట్టివాడు తనలో లేని గుణములను ఉటం కిస్తూ చేసే స్తుతులను ఎట్లు ఇతరులచే చేయించును? వీడు శ్రమించి ఉంటే ఈ గుణములు. వీనిలో ఉండి ఉండెడివి అని జనులు అట్లు స్తుతులను చేయించుకొనే వ్యక్తిని నిందించెదరు. జనులు చేసే ఈ అవ హే ళనమును కూడ అట్టి మందబుద్ధి గ్రహించలేకపోవును.
వినయము, గొప్ప ఔదార్యము గల వారు తాము అధర్మమార్గ ములో చూపిన నిందితమైన పరాక్రమముయొక్క ప్రస్తావమును ఏవగించు కొనెదరు. అదే విధముగా, లోకప్రఖ్యాతి గాంచినవారు సమర్థులే అయి - ఉన్ననూ, ఆత్మస్తుతిని ఏవగించుకొనెదరు.
ఓ సూతా! మేము ఇంకనూ ఉత్తమమగు కర్మలను చేసి లోక ములో ప్రతిష్టను గడించినవారము కాము. అట్టిచో, అవివేకి వలే నా ప్రతివి నేనే ఎట్లు చేయించుకొన గల్గుదును?
శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో పృథూపాఖ్యానమునందు పృథువు పట్టాభిషేకమును వర్ణించే పదిహేనవ అధ్యాయము ముగిసినది.
