శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

14 - పృథూపాఖ్యానము - వేనరాజు మరణించుట

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- వేదవేత్తలగు భృగువు మీద లగు మహర్షులు జనుల క్షేమమును గురించి చింతిల్లెదరు. ప్రజలను రక్షించే రాజు లేకపోతే ప్రజలు పశువుల వలే ఒకరినొకరు దోచుకొనెదరని వారు భావించిరి. వారు వీరుడగు వేనుని తల్లియైన సునీథతో సంప్రదించిరి. మంత్రులు మొదలగు రాజ్యాధికారులకు మరియు ప్రజలకు స్వభావమును బట్టి వేనుడు సమ్మతము కాదు. అయిననూ, వారు ఆతనినే రాజ్యమునకు ప్రభువుగా పట్టాభిషిక్తుని చేసిరి.

మిక్కిలి కఠినమగు-శిక్షలను విధించే వేనుడు రాజసింహాసనమున ధిష్టించినాడని విని దొంగలు వెంటనే, పామునకు భయపడిన ఎలుకలు వలె, తమ కార్యకలాపములను కట్టిపెట్టి, అజ్ఞాతములోనికి వెళ్లిపోయిరి.

ఆ వేనుడు రాజసింహాసనముపై కూర్చుండగానే చాల గర్వ మును.పొందెను. ఎనిమిది దిక్కులలో ఆతని శాసనమునకు తిరుగు లేకుండెను. ఆతడు తన గొప్పలు తానే చెప్పుకుంటూ, అడ్డు ఆపు లేకుండా, మహాత్ములను అవమానించ దొడగెను.

ఈ విధముగా వేనుడు ఐశ్వర్యమదముచే కన్ను మిన్ను కానరా కుండా అడ్డు ఆపు లేని ప్రవృత్తి గలవాడయ్యెను. ఆతడు, మావటీని అంకు శపు భయము లేని ఏనుగు వలే, రథముపై పర్యటిస్తూ భూమిని అంతరిక్ష మును వణికించెను.

బ్రాహ్మణులు ఎక్కడైననూ యజ్ఞములను, దానములను, హోమ ములను చేయరాదు అనే భేరీశబ్దపూర్వకముగా చాటింపు వేయించి, ఆ వేనుడు ధర్మకార్యములను ఆపించెను.

చెడు స్వభావము గల వేనుని ఈ దుశ్చేష్టలను చూచి మహర్షులు జనులకు కలిగిన కష్టమును గురించి ఆలోచించి, దయ గలవారగుటచే ఒక చోట సమావేశమై ఇట్లు పలికిరి.

ఆశ్చర్యము! జనులకు ఒకవైపు చోరులనుండి, రెండవవైపు రాజు నుండి పెద్ద ఆపద రెండు వైపులా వచ్చి పడినది. కట్టెకు రెండు వైపులా మంట పెట్టినప్పుడు మధ్యలోనుండే పురుగుల వలె, జనులు ఒకవైపు చోరులు, మరియొక వైపు రాజు వీరి మధ్యలో నలిగిపోవుచున్నారు.

దేశములో అరాచకము వచ్చునేమో యను భయముతో రాజసిం హాసనమునకు అర్హత లేని ఈ వేనుని మనము రాజుగా చేసినాము. కాని, ఇప్పుడు వీని వలన కూడ ప్రజలకు భయము వచ్చి పడినది. ఈ స్థితిలో జనులకు మేలు కలిగే ఉపాయమేమి?

త్రాచుపామునకు పాలను పోసి పెంచినచో, అది పెంచినవానినే కాటు వేయును. అదే విధముగా ఈ వేనుడు మనకు చేసినాడు. సునీథా దేవి కడుపున పుట్టిన ఈ వేనుడు స్వభావము చేతనే దుష్టుడు.

మనము ప్రజలను పాలించే రాజుగా అభిషేకించిన ఈ వేనుడు తానే స్వయముగా ప్రజలను హింసించ గోరుచున్నాడు. అయినప్పటికీ, మనము వీనికి నచ్చజెప్పెదము. అట్లు చేయుట వలన, వీడు చేసే పాపము మనకు చుట్టుకొనకుండును.

వేనుడు దుష్టుడని తెలిసియే మనము దుష్టశీలుడగు ఆ వేనుని రాజుగా చేసినాము. అధర్మములను చేయుచున్న ఆ వేనునకు మనము నచ్చజెప్పెదము. ఇప్పటికే ఆతడు జనుల ధిక్కారముచే మృతప్రాయుడై ఉన్నాడు. మనము చెప్పిన సలహాను ఆతడు వినని పక్షములో, మనమాత నిని మన తేజస్సుచే దహించి వేసెదము.

మహర్షుల కోపము రహస్యముగా నుండును. వారీ విధముగా నిశ్చయించుకొని, ఈ వేనుని వద్దకు వెళ్లిరి. వారు ముందుగా ఆతనిని ప్రియోక్తులతో తమకు అనుకూలముగా చేసుకొని, తరువాత ఇట్లు పలికిరి.

మహర్షులు ఇట్లు పలికిరి --- ఓ మహారాజా! వత్సా! మేము నీకు ఒక విన్నపముమ చేసెదము. దీనిని పాటించినచో, నీ ఆయుర్దాయము, ఏ సంపద, బలము మరియు కీర్తి వర్ధిల్లును. నీవు దీనిని జాగ్రత్తగా విని తెలుసుకొనుము.

మానవుడు బుద్దితో ధర్మమును నిశ్చయించుకొని మనోవాక్కాయ ములతో దానిని ఆచరించవలెను. అట్లు చేయుట వలన వానికి ఇహపరలోక ములలో శోకము ఉండదు. మరియు, అట్టి వ్యక్తి ఇహాముత్రఫలభోగవిరక్తు డైనచో, ఆ ధర్మము వానికి మోక్షమునకు దారి (జ్ఞానము) ని సుగమము చేయును.

ఓయీ వీరా! ప్రజల క్షేమమే ధర్మమునకు చిహ్నము. అట్టి ధర్మము నీయందు నశించకుండును గాక! ఆ ధర్మమే నశించినచో, రాజు తన పదవిని సంపదను కోల్పోయి పతితుడగును.

ఓ రాజా! రాజు ప్రజలను చెడు మంత్రులనుండి, చోరులు మొద లగు వారినుండి రక్షిస్తూ, వారినుండి ధర్మబద్ధముగా పన్నును వసూలు. చేయవలెను. అట్లు చేయు రాజు ఈ లోకములో మాత్రమే గాక, పరలోక ములో సుఖముల ననుభవించును.

ఓ మహారాజా! రాజు తన రాజ్యములోనే గాక రాజధానీ నగర ములో కూడ జనులు స్వధర్మ పరాయణులై తమ తమ ధర్మములను నిర్వర్తిస్తూ, యజేశ్వరుడగు శ్రీహరి భగవానుని ఆరాధించునట్లు చూడవలెమ. అట్లు చేయు రాజు ఆ భగవానుని శాసనమును పాలించినవాడగును. సకల ప్రాణులను పాలించే శ్రీహరియే సకలప్రాణులలో ఆత్మరూపముగా నున్నా డు. అట్టి శ్రీహరి ఆజ్ఞను పాలించే రాజు విషయములో ఆయన సంతుష్టుడు గును.

జగత్తులో ఇంద్రాది. ప్రభువులకు కూడ శ్రీహరియే ప్రభువు. ఆయన. సంతోషించినచో; అట్టి భక్తునకు, పొంద: శక్యము కానిది యేమి. ఉండును? ఏలయనగా; లోకపాలకులతో సహా పకలప్రాణులు. ఆ శ్రీహరి (లేదా, శ్రీహరి భక్తని) కొరకు సాదరముగా పూజోపహారములను సమ ర్పించుచున్నారు.

ఓ రాజా! సకలలోకములను, లోకపాలకులను, వాటిని కర్మఫల రూపముగా పొందించే యజ్ఞములను, వేదరూపుడు వేదప్రతిపాద్యుడు అగు శ్రీహరియే నియంత్రించుచున్నాడు. ఆయనయే సకల (యజ్ఞ) ద్రవ్య ముల రూపములో నున్నాడు. తపస్సు కూడ ఆయన రూపమే. అట్టి శ్రీహ రిని రకరకముల యజ్ఞములచే జనులు ఆరాధించుట చేతనే నీవు జన్మించి, వర్దిల్లుచున్నావు. కావున, నీవు కూడ నీ దేశవాసులను అనుసరించుట, వారిని యజ్ఞములయందు ప్రవర్తిల్ల జేయుట యోగ్యముగా నుండును.

ఓ వీరా! నీ సామ్రాజ్యములో బ్రాహ్మణులు యజ్ఞములను చేసి శ్రీహరియొక్క అంశలైన దేవతలను చక్కగా ఆరాధించి సంతోష పెట్టుచున్నారు. వారు అట్లు చేయుటచే, నీ వాంఛితమును దేవతలు నెరవేర్చెదరు. కావున, ఆ దేవతలను, శ్రీహరిని తిరస్కరించుట నీకు తగదు.

ఆశ్చర్యముగా నున్నది! అధర్మమును ధర్మమని భావించే మీరు నిశ్చయముగా మూర్ఖులు. నేను మీకు జీవికను కలిగించుచున్నాను. అట్టి ప్రభువునగు నన్ను మీరు విడిచి పెట్టి, భర్తను విడిచి జారుని సేవించే స్త్రీవ లె, మీరు మరియొక ప్రభువు (విష్ణువు) ను సేవించుచున్నారు.

ఈ మూర్ఖులు రాజు రూపములోనుండే ఈశ్వరుడనైన నన్ను అవ మానించుచున్నారు. వీరికి ఈ లోకములో గాని, పరలోకములో గాని ఈపైన శుభము కలుగదు.

భర్త ప్రేమకు దూరమైన (దూరముగానుండే) దుష్టయువతీ జారు నియందు ప్రీతిని కలిగియుండును. అదే విధముగా, మీరు యజ్ఞపురుషునియందు గొప్ప భక్తిని కలిగియున్నారు. ఈ యజ్ఞపురుషుడెవరు?

విష్ణువు, బ్రహ్మ, కైలాసాధిపతియగు శివుడు, ఇంద్రుడు, వాయు వు, యముడు, సూర్యుడు, మేఘుడు, కుబేరుడు, చంద్రుడు, పృథివీ దేవ త, అగ్ని, జలాధిపతియగు వరుణుడు మొదలగు దేవతలందరు వరముల ను గాని, శాపమును గాని ఇచ్చుటకు సమర్థులు. వీరందరు రాజుయొక్క దేహములో నుండెదరు. రాజు సర్వదేవతాస్వరూపుడు.

ఓ బ్రాహ్మణులారా! కావున, మీరు మీ ఓర్వలేనిదనమును త్రోసిపు చ్చి, కర్మల ద్వారా నన్నే ఆరాధించుడు. పూజోపహారములను నాకే సమ ర్పించుడు. అగ్రపూజను స్వీకరించదగిన యజ్ఞపురుషుడు నేను తక్క మరియొకడు ఎవడు గలడు?

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! పాపస్వభావము గల వేనుని బుద్ధి భ్రాంతమై యుండెను. తప్పు దారిన నడిచే ఆ వేనుని పుణ్యము నశించెను. కావుననే, మహర్షులు నచ్చజెప్పిననూ, ఆతడు వారి కోరికను మన్నించలేదు.

ఓ విదురా! తాను పండితుడనని తలపోసే ఆ వేనుడు ఈ విధ ముగా ఆ బ్రాహ్మణులను అవమానించి, వారి భవ్యమగు (మంగళకరమగు) కోరికను భగ్నము చేసెను. అపుడు వారికి ఆతనిపై కోపము కలిగెను.

పాపి, స్వభావము చేతనే క్రూరుడు అగు ఈ వేనుని చంపుడు, చంపుడు. వీడు జీవించియున్నచో, సామ్రాజ్యమును తొందరలోనే నిశ్చయ ముగా బూడిదగా మార్చును.

దుష్టప్రవృత్తిగల ఈ వేనుడు శ్రేష్టమగు రాజసింహాసనమువకు తగినవాడు కాదు. యజ్ఞేశ్వరుడై జగత్తును పాలించే శ్రీహరిని, ఈతడు సిగ్గును విడచి, అధికముగా నిందించుచున్నాడు.

పాపియగు ఈ వేనుడు తాను ఎవని అనుగ్రహమునకు పాత్రుడై ఇట్టి మహైశ్వర్యమును పొందినాడో, అట్టి శ్రీహరిని నిందించుచున్నాడు. అట్టి పనిని ఈ వేనుడు ఒక్కడు తక్క మరియెవ్వరు చేయుదురు?

మహర్షులలో కోపము స్పష్టముగా కానవచ్చుచుండెను. వారాత నిని సంహరించుటకే నిశ్చయించిరి. శ్రీహరిని నిందించి ఆతడు అప్పటికే . మృతప్రాయుడై ఉండెను. వారు హుంకారములను చేయగానే ఆతడు మరణించేను.

అప్పుడా మహర్షులు తమ తమ ఆశ్రమములకు వెళ్లిరి. సునీథ దుఃఖిస్తూనే, మంత్రప్రభావముచే మరియు ఇతరములగు ఉపాయములతో, తన పుత్రుని దేహమును కాపాడెను.

ఒకనాడా మహర్షులు సరస్వతీనదిలో స్నానమాడి, అగ్నిహోత్రక ర్మను పూర్తి చేసుకొని, ఆ నది ఒడ్డున కూర్చుండి ఈశ్వరుని గాథలను చెప్పుకొనుచుండిరి.

జనులకు మహాభయమును గొల్పే చెడు శకునములు ఒక్క ఉదు టున ఆవిర్భవించినవి. అపుడా మహర్షులు వాటిని చూచి ఇట్లు తలచిరి : రాజు లేని ఈ దేశమునకు చోరుల వలన అమంగళములు కలుగవు గదా?

ఆ మహర్షులు ఈ విధముగా చర్చించుచుండిరి. ఇంతలోనే చోరులు దోపిడీలను చేయుచూ అన్ని దిక్కులయందు పరుగులు తీయు చుండగా, అధికమగు దుమ్ము బాగా పైకి లేచినది.

వేన మహారాజు మరణించగానే దోపిడీగాండ్రు దోపిడీలను చేయు చుండిరి. జనుల మధ్య వైరములు హింస పెచ్చరిల్లి జనులకు బెడద కలుగుచుండెను. రాజు లేని ఆ రాజ్యములో చోరుల బెడద పెరిగిపోయేను. జనులకు ధైర్యము క్షీణించెను. మహర్షులు ఈ పరిస్థితిని పరికించిరి. వారు దీనిని నివారించే సామర్థ్యము గలవారే అయినా, అట్టి రాజకీయము లలో తమకు దోషము సంక్రమించగలదనే భావనతో, వారు జనులను వారించలేదు.

సర్వత్రా పరబ్రహ్మను దర్శించే శాంతస్వభావము గల బ్రహ్మవేత్త యైననూ దీనులను పేక్షించినచో, ఆయన తపస్సు చిల్లు పడిన కుండలోని నీరు (పాలు) వలె, క్షీణించిపోవును.

రాజర్షియగు అంగుని ఈ వంశము వినాశమగుట తగదు. ఏలయ నగా, ఈ వంశములోని రాజులు శ్రీహరిని శరణు జొచ్చి మొక్కవోని పరాక్ర మమును చూపినవారే.

ఆ మహర్షులు ఈ విధముగా నిశ్చయించుకొని, మరణించిన వేన రాజుయొక్క తొడను వేగముగా మథించగా, అక్కడనుండి ఒక పొట్టివాడు పుట్టెను.

కాకివలె నల్లని ఆ పురుషుని శరీరము మీక్కిలి పొట్టీగానుండెను. వాని చేతులు, కాళ్లు పొట్టి. కాని, దవడలు పెద్దవి. చప్పిడి ముక్కు కొన గల ఆ పురుషుని కన్నులు ఎర్రగనుండెను. వానికి రాగి రంగు జుట్టు ఉండెను.

వత్సా విదురా! తల దించుకొని దీనుడైయున్న ఆ పురుషుడు, నేను ఏమి చేయాలి? అని వారిని ప్రశ్నించగా, వారాతనిని కూర్చుండుము అనిరి. వారు నిషీద (కూర్చుండుము) అని పలుకుట వలన, ఆతడు నిషా దుడు ఆయెను.

వాని వంశీయులగు నైషాదులు కొండకోనలలో సంచరించెదరు. ఆతడు పుట్టుచుండగనే వేనుని భయంకరమగు పాపమును తీసుకొనెను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో పృథూపాఖ్యానమునందు వేనుని మృతిని వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది.