శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

32 - జీవుడు పొందే ఉత్తమగతి - భక్తియోగ మహిమ

శ్రీ కపిల, భగవానుడిట్లు పలికెను --- ఒకడు ఇంటియందు ఉంటూ గృహాశ్రమధర్మములను పాటిస్తూ వాటి ఫలరూపములగు అర్థకామ ములను అనుభవించును. మరల ఆ ధర్మములనే అనుష్ఠించుచుండును. ఈ విధముగా ఆతడు కామనలచే మోహమును పొందినవాడై భాగవత ధర్మమునుండి విముఖుడై క్రతువులచే దేవతలను, పితృదేవతలను శ్రద్ధ వంతుడై ఆరాధించును.

పితృదేవతలను, దేవతలను ఆరాధించుటయే ఆత్మ ) వ్రతము ఆతని బుద్ది వారియందలి శ్రద్దతో నిండియుండును. ఆతడు మరణించిన , తరువాత చంద్రలోకమును పొంది అమృతపానమును. చేసి, పుణ్యము క్షీణించిన తరువాత మరల భూలోకములో జన్మించగలడు.

కల్పాంతమునందు శేషశాయియగు శ్రీహరి శేషశయ్యపై నిద్రిఁ చును. అపుడు గృహస్థులు సంపాదించిన ఈ లోకములు వినష్టమగును.

కొందరు భక్తులు తాము చేసిన ధర్మములను అర్థకామములనే ఫలరూపములో అనుభవించుటకు ఇచ్చగించరు. వారు సంసారమునందు ఆసక్తి లేనివారై, ప్రసన్నము పవిత్రము అగు అంతఃకరణముతో సర్వకర్మస న్న్యాసపూర్వకజ్ఞాననిష్ఠయందు ఉందురు. అహంకార మమకారములు లేని అట్టివారికి సన్న్యాసధర్మమునందు ప్రీతి మెండు. వారు స్వధర్మాను స్థానము అనే సత్త్వగుణముచే పరిశుద్దము చేయబడిన అంతఃకరణము గల వారు. వారు సూర్యమార్గముగుండా 'సర్వవ్యాపకుడగు శ్రీహరిని పొందెద రు. కారణకార్యరూపమగు ఈ జగత్తునకు ప్రభువగు ఆ పూర్ణపురుషుడే ఈ జగత్తునకు ఉపాదానకారణము మాత్రమే గాక, దీని ఉత్పత్తిప్రళయములను సంకల్పించే నిమిత్తకారణము కూడ అగుచున్నాడు.

బ్రహ్మగారి ఆయుర్దాయము రెండు పరార్ధములు, అనగా బ్రహ్మ మానములో రెండు ఏభైలు అనగా వంద సంవత్సరములు. ఆ తరువాత బ్రహ్మ (హితణ్యగర్భుడు) భగవానునిలో విలీనమగును. అంతవరకు ఆ పుణ్యాత్ములు హిరణ్యగర్భుని లోకము (సత్యలోకము) లో ఆయననే ఉపా సిస్తూ నివసించెదరు.

దేవదేవుడు, స్వయంభువుడు అగు హిరణ్యగర్భుడు రెండు పరా ర్గముల కాలము తన అధికారముననుభవించును. తరువాత సత్త్వరజస్త మోగుణాత్మకమగు బ్రహ్మాండమునకు అభిమానియగు ఆ హిరణ్యగర్బు డు, భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు ఇంద్రియములు శబ్దాది విషయములు, సకలభూతములకు ఆదియగు అహంకారము అను వాటితో నిండియున్న బ్రహ్మాండమును ఉపసంహరించగోరువాడై, నిర్గుణని రాకార పరమేశ్వరునిలో విలీనమగును.

ఈ విధముగా, ప్రాణమును మనస్సును జయించి వైరాగ్యసంప న్ను లై యున్న యోగులు కూడ దేహమును విడిచి పెట్టి ఆ హిరణ్యగర్బుని తోటే పరమానందస్వరూపమగు పరబ్రహ్మయందు విలీనమగుదురు. అంతవరకు వారిలో 'అభిమానము శేషమై ఉండుటచే, వారు అనాది, పూర్ణ ము, సర్వాతిశాయియగు పరబ్రహ్మచైతన్యమునందు విలీనము కాలేదు.

అమ్మా! సకలప్రాణుల హృదయపద్మములలో నివసించే ఆ శ్రీహ రియొక్క మహిమను నీవు నానుండి వినియున్నావు. కావున, నీవు భక్తితో ఆయనను శరణు పొందుము.

స్థావరజంగమప్రాణులకు కారణుడు, వేదనిధియగు బ్రహ్మగారు మరీచి మొదలగు మహర్షులతో, యోగేశ్వరులతో, సనత్కుమారుడు మొద లగు జ్ఞానులతో, యోగమును లోకములో ప్రవర్తిల్లజేసిన సిద్ధపురుషులతో కూడి నిష్కామకర్మ ద్వారా ఆదిపురుషుడు, పురుషశ్రేష్ఠుడు అగు సగుణబ్ర హ్మ (నారాయణుడు) లో విలీనమైనాడు. కాని, ఆయనలో ఇంకనూ భేద దృష్టి, దేహాభిమానము, కర్తృత్వము మిగిలియుండెను. కావున, మరల సృష్టికాలము రాగానే కాలస్వరూపుడగు ఈశ్వరునిచే ప్రేరేపించబడి సత్త్వ రజస్తమోగుణాత్మకమగు ప్రకృతిలో వైషమ్యము రాగానే, ఆయన పూర్వక ల్పమునందు వలెనే, జగద్రూపముగా ప్రకటమగును.

ధర్మమును చేసి దాని ప్రభావముచే బ్రహ్మలోకమును పొందిన పుణ్యాత్ములు కూడ అచట పరమేష్టియొక్క ఐశ్వర్యముననుభవించి, ప్రకృ తిలో గుణవైషమ్యము కలిగి సృష్టి రాగానే మరల తిరిగి జన్మించెదరు.

ఈ సంసారమునందు తగుల్కొన్న మనస్సు గల కర్మఠులు వేద ముచే నిషిద్ధమైన కర్మలను విడిచి పెట్టి, నిత్యకర్మలను మాత్రమే గాక, కామ్యకర్మలను కూడ శ్రద్ధతో చేయుదురు.

రజోగుణముచే విక్షిప్తమైన మనస్సు గల జనులు కామన్పరిపూర్తీ యందు మాత్రమే లగ్నమై యుందురు. వారికి, ఇంద్రియజయము ఉండదు. వారికి గృహవ్యవహారములయందు మాత్రమే ప్రీతి కలుగును. అట్టివారు ప్రతిదినము పితృదేవతలను ఆరాధించెదరు.

మధుసూదనుడగు శ్రీహరిని బుద్దియందు స్మరించినచో సంసా రము తొలగిపోవును. ఆయన పరాక్రమములు గొప్పవి, కీర్తించదగినవి. కాని, ధర్మార్థకామములకు మాత్రమే కట్టుబడిన వ్యక్తులకు ఆయన గాథల యందు అభిరుచి ఉండదు.

శ్రీహరి గాథలనే అమృతమును విడిచి, సూకరములు మాలిన్య మును భక్షించునట్లు, చెడు కథలను వినువారు నిశ్చయముగా తమ ప్రారబ్ద ముచే తామే వినాశము చేయబడుచున్నారు.

గర్భాధానము మొదలుకొని వ్యక్తి మరణించిన తరువాత శ్మశాన ములో చేసే అంత్యేష్టివరకు గల కర్మలను వారు చేయుదురు. అట్టివారు దక్షిణమార్గముచే అర్యమునిచే పాలించబడే పితృలోకమును పొందెదరు పుణ్యము క్షయమైన తరువాత తమ సంతానమునకే మరల సంతానమై జన్మించెదరు.

ఓ పతివ్రతా! వారు 'ఆ పితృలోకములో భోగములననుభవించు చుండగా వారి పుణ్యము క్షీణించును. వెంటనే దేవతలు భోగములను తొల గించి, వారిని ఆ లోకమునుండి ఈ లోకమునకు త్రోసివేసెదరు. వార ప్పుడు అస్వతంత్రులై మరల ఈ లోకములో జన్మించెదరు.

కావున, నీవు పూర్ణప్రేమతో మనోవాక్కాయములతో, పరమేశ్వ రుని వాత్సల్యము మొదలగు గుణములనే ఆశ్రయించే భక్తితో ఆయనను ఆరాధించుము. ఆయన పాదపద్మములు తప్పక ఆరాధించదగినవి.

సర్వాంతర్యామియగు శ్రీకృష్ణభగవానునియందు భక్తిని చేసినచో, దాని వలన వైరాగ్యము మరియు బ్రహ్మసాక్షాత్కారమును కలిగించే - జ్ఞానము శీఘ్రముగా లభించును.

ఏ కాలమునందైతే భక్తుని చిత్తము తాను ఇంద్రియవ్యాపారముల ద్వారా గ్రహించే శబ్దాది విషయములను సర్వమును ఈశ్వరరూపముగను, కావున ప్రియము అప్రియము అనే వైషమ్యము లేనిదిగను దర్శించునో, అప్పుడా భక్తుడు ఆత్మయొక్క యథార్థస్వరూపమును దర్శించును. ఆత్మ నిస్సంగము. జ్ఞానరూపమగు ఆత్మ సర్వమునందు సమానరూపముగా నున్నది. ఆత్మయందు పరిత్యజించదగిన దోషములు గాని, స్వీకరించద గిన గుణములు గాని లేవు. ఈ దర్శనముచే ఆ భక్తుడు తన స్వరూపమగు ప్రత్యగభిన్నబ్రహ్మతో ఏకీభావమును పొందును.

జ్ఞానమాత్రమ్ - జ్ఞానఘనుడు, పరమ్ - ప్రకృతికి అతీతుడు, బ్రహ్మ - నిరతిశయ బృహత్తత్త్వము, పరమ-ఆత్మా - జీవుని అంతరతమ నుగు ఆత్మస్వరూపము, ఈశ్వరః - సర్వమును శాసించువాడు, పుమాన్ - పురుషుడు, ఏకః - అద్వితీయుడు అగు, భగవాన్ - భగవానుడు, దృశ్య ఆదిభిః - దృశ్యము మొదలగు, పృథక్-భావైః - వివిధరూపములుగా, ఈయతే - తెలియబడును.

జ్ఞానఘనము, తనయందు భాసించే సర్వమునకు అతీతము, నిర తిశయ బృహత్, భగవచ్చబ్దవాచ్యము అగు అద్వితీయ వస్తువు జీవుని యందు ప్రత్యక్ (అంతరతమమగు) ఆత్మరూపముగా, జగత్తును శాసించే ఈశ్వరునిగా, ప్రకృతిని ఆవేశించే పురుషునిగా శాస్త్రములలో ప్రతిపాదించ బడుచున్నది. ఆ వస్తువే దృశ్యజగత్తుగా, దర్శించే జీవునిగా, దర్శించుటకు సహకరించే ఇంద్రియములుగా భాసించుచున్నది.

సాధనానిష్ఠుడగు వ్యక్తి సమగ్రమగు. యోగసాధనచే పొందే పూర్ణ ఫలమేమనగా, ఈ సంసారమునందు సుతరాము ఆసక్తి లేకుండుటయే.

ఉన్న వస్తువు విజ్ఞానఘనమగు అద్వితీయ నిర్గుణ పరబ్రహ్మ మాత్రమే. కాని, నామరూపాత్మకమగు బాహ్యవిషయములయందు ఆసక్తి గల ఇంద్రియములు భ్రాంతిచే శబ్దము మొదలగు ధర్మములతో కూడిన వేర్వేరు రూపములను దర్శించుచున్నవి.

స్వయంప్రకాశస్వరూపమగు ఆ పరబ్రహ్మయే మహత్తత్త్వము, సాత్త్విక రాజస తామస అహంకారములు, పంచభూతములు, అయిదు కర్మేంద్రియములు అయిదు జ్ఞానేంద్రియములు మనస్సు వెరసి పద కొండుగా ప్రకటమైనది. వీటితో కూడి ఆ పరబ్రహ్మయే వ్యష్టి జీవుడు అగు చున్నది. ఈ జగత్తుతో గూడి ఆ పరబ్రహ్మయే సమష్టి హిరణ్యగర్భుడగు చున్నది. ఏలయనగా, వ్యష్టి జీవుడు, సమష్టి పురుషుడు, ఈ బ్రహ్మాం డము కూడ ఆ పరబ్రహ్మనుండియే ఆవిర్భవించినవి.

భక్తుడు వైరాగ్యముచే సంసారమునందలి ఆసక్తిని విడిచి పెట్టి, నిత్యము యోగమునభ్యసించుటచే ఏకాగ్రమగు అంతఃకరణము గలవాడై ఈ జగత్తును నిశ్చయముగా బ్రహ్మరూపముగా దర్శించును.

అమ్మా! ఈ విధముగా నేను నీకు బ్రహ్మసాక్షాత్కారసాధనమగు జ్ఞానమును బోధించితిని. దీని వలన భక్తునకు ప్రకృతిపురుషుల తత్త్వము తెలియును.

జ్ఞానయోగమునకు విషయము నిర్గుణ పరబ్రహ్మ. భక్తియోగము కూడ నాయందే నిష్ఠ గల యోగము. ఈ రెండింటికీ ఫలము ఒక్కటియే. ఆ ఫలమునే భగవానుడు అనే పదము బోధించును. అనగా, భగవత్ప్రా ప్తియే రెండింటికీ ఫలము.

పదార్థము ఒక్కటే అయినా, అది రూపము రసము మొదలగు అనేకగుణములకు ఆశ్రయమగుచున్నది. ఇంద్రియముల ప్రవృత్తి మార్గ ములు కూడ వేర్వేరుగా నున్నవి. కావుననే, ఒకే పదార్థమును కన్ను తెల్ల నిది అని, జిహ్వ తియ్యనిది అని ఈ విధముగా ఇంద్రియములు వేర్వేరుగా తెలియుచున్నవి. అదే విధముగా వివిధములగు శాస్త్రమార్గములు ఒకే భగ వానుని పలు విధములుగా దర్శించుచున్నవి.

పూజ మొదలగు కర్మలు, క్రతువులు, దానములు, తపస ), వేదా ధ్యయనము, వేదతాత్పర్యవిచారము, మనస్సును ఇంద్రిం" ములను జయించుట, సర్వకర్మసన్న్యాసము, ఎనిమిది అంగముల కూడిన యోగము, భక్తియోగము, ప్రవృత్తి (వేదోక్తకర్మానుష్ఠానను)) నివృత్తి (స న్న్యాసము) అనే రెండు రూపములలోనున్న సమ నిష్కామ ధర్మము, నిత్యానిత్యవస్తువివేకము, దృఢమగు వైరాగ్యము, అనే ఈ సాధనముల న్నియు భగవానుని పొందుటయందు సహకరించును. స్వయంప్రకాశస్వ రూపుడగు ఆ భగవానుడు సకలకల్యాణగుణసంపన్నుడే అయిననూ, స్వరూపముచే నిర్గుణుడు.

నీకు నాలుగు విధముల (మూడు సగుణ, ఒక నిర్గుణ) భక్తియోగ మును, కాలముయొక్క స్వరూపమును చెప్పినాను. కాలముయొక్క చేష్ట లను తెలియుట సంభవము కాదు. అది ప్రాణుల లోపలనుండి జన్మ మొద లగు వికారములను కలిగించుచున్నది.

అమ్మా! అజ్ఞానము, దాని వలన కలిగే కర్మలు జీవునకు అనేకగ తులను కల్పించుచుండును. జీవుడు వాటిని పొందుచూ తన స్వరూప మును తెలియలేకున్నాడు. ఆ వివరములను కూడ నేను నీకు చెప్పితిని.

ఈ జ్ఞానమును ఏ కాలములోనైననూ దుష్టునకు, వినయము లేని వానికి, తలబిరుసువానికి, దురాచారికి, , అశాస్త్రీయమగు వాదమును చేయువానికి ఉపదేశించరాదు. దాంభికునకు అసలే ఉపదేశించరాదు.

ఇంద్రియభోగములయందాసక్తి గలవానికి, ఇంటి సుఖముల యందు లగ్న మైన మనస్సు గలవానికి, నా భక్తుడు కాని వానికి ఈ జ్ఞాన మునుపదేశించరాదు. నా భక్తులను ద్వేషించువారికి దీనిని ఏ కాలమునం దైననూ ఉపదేశించరాదు.

శ్రద్ద, భక్తి, వినయము కలిగి ఇతరుల గుణమునందు దోషబుద్దిలేని వానికి ఈ జ్ఞానమును బోధించవలెను. ప్రాణులయందు ప్రేమభావము, గురు సేవయందు అభిరుచి, బాహ్యవిషయములయందు వైరాగ్యము, ప్రస న్నమగు చిత్తము గలవానికి దీనిని బోధించవలెను. మాత్సర్యము (ఇతరుల క్షేమమును చూచి సహించలేకపోవుట) లేనివానికి, ఆంతరబాహ్యశౌచము గలవానికి దీనిని బోధించవలెను. ఎవనికైతే నేను ప్రియమైన వస్తువులన్నిం టికంటే అధికముగా ప్రియమైనవాడనో, వానికి బోధించవలెను.

అమ్మా! ఎవడైతే నాయందు లగ్న మైన మనస్సు గలవాడై దీనిని శ్రద్ధతో ఒక్కసారైననూ వినునో, లేదా చెప్పునో, వాడు నిశ్చయముగా నా పరమపదము (మోక్షము) ను పొందును.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో

ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).