శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
5 - మైత్రేయుడు సృష్టి క్రమమును వర్ణించుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మహాజ్ఞానియగు మైత్రేయుడు గంగా (హరి) ద్వారమునందు సర్వకర్మసన్న్యాసియై కూర్చుని యుండె ను. కురువంశ శ్రేష్ఠుడు, శ్రీకృష్ణునియందలి భక్తిచే పవిత్రమైన అంతఃకర ణము గలవాడు అగు విదురుడు ఆయన వద్దకు వచ్చెను. ఆయన యొక్క సాధుభావముచే మిక్కిలి ఆనందమును పొందిన విదురుడు ఈ విధముగా ప్రశ్నించెను.
విదురుడు ఇట్లు పలికెను --- మానవుడు సుఖములను గోరి కర్మ లను చేయును. కాని, వాటి వలన మానవునకు సుఖము లభించుట లేదు; దుఃఖము దూరమగుట లేదు. పైగా, వాటి వలన మరల మరల దుఃఖమే కలుగుచున్నది. ఈ స్థితిలో మానవునకు కర్తవ్యమేమియో పూజ్యుడవగు నీవు చెప్పుము.
మానవుడు శ్రీకృష్ణ భక్తిలేని కారణముగా దైవయోగముచే అధర్మ మునాచరించే స్వభావము గలవాడై, ఆ కారణముగా దుఃఖభాజనుడగుచున్నాడు. అట్టి మానవులననుగ్రహించుట కొరకై మంగళకరులగు శ్రీకృష్ణభక్తులు ఈ లోకములో సంచరించుచుందురు. ఇది నిశ్చయము.
సాధుపురుషులలో శ్రేష్ఠుడవగు ఓ మైత్రేయా! నీవు మాకు మంగ ళకరమగు మార్గమునుపదేశించుము. మానవులు ఆ మార్గములో భగవా నుని చక్కగా ఆరాధించి తమ హృదయములను భక్తితో పావనము చేసుకో నెదరు. అట్టి పవిత్రమగు హృదయములో నిలిచియుండే భగవానుడు వారికే ఆత్మస్వరూపముయొక్క అపరోక్షానుభూతిని కలిగించే సనాతన జ్ఞానమును అనుగ్రహించును.
స్వతంత్రుడు, ముల్లోకములకు ప్రభువు అగు భగవానుడు అవతా రములనెత్తి ఏ కర్మలను చేయును? భగవానుడు కర్తృత్వము మరియు కామనలు లేనివాడే అయిననూ కల్పమునకు ఆరంభములో ఈ జగత్తును సృష్టించిన విధమెట్టిది? ఆయన ఈ జగత్తునకు స్థితిని (రక్షణను) కల్పించి, ప్రాణులకు జీవికను ఏర్పాటు చేసే విధానమెట్టిది?
మరల ఆ పరమేశ్వరుడు సంకల్పరూపమైన సృష్టివ్యాపారము నుండి విరమించి, తన స్వరూపమగు చిదాకాశమునందు ఈ జగత్తును ఉప సంహరించి, యోగమాయయందు నిద్రించు విధమెట్టిది? యోగేశ్వరులకు అధీశ్వరుడగు ఆ పరమాత్మ అద్వితీయుడే అయిననూ, ఈ జగత్తును సృష్టించి, దానియందు అంతర్యామి (సత్తా-స్పూర్తులు) రూపముగా ప్రవే శించి, తానే అనేకరూపములుగా ప్రకటమైన విధమెట్టిది?
భగవానుడు వివిధములగు అవతారములనెత్తి విహరిస్తూ, గోబ్రా హ్మణులు మరియు దేవతల క్షేమము కొరకై అనేకలీలలను చేయుచుండు ను. పవిత్రమగు కీర్తి గలవారిలో ఆయన శిఖామణి. ఆయనయొక్క లీల లను వినుట అమృతపానము వంటిది. ఎంత విన్ననూ, మా మనస్సులకు తృప్తి కలుగుట లేదు.
లోకములు, లోకపాలకులు, లోకాలోకపర్వతములకు బాహ్యము నందుండే భాగములతో కూడిన ఈ బ్రహ్మాండమునందు అధికారభేద మును బట్టి సకలప్రాణుల సమూహములు వేర్వేరుగా ప్రతీయమానమగుచున్నవి. లోకపాలకులందరికీ ప్రభువగు ఆ భగవానుడు ఏ తత్త్వములతో ఈ బ్రహ్మాండమును రచించెను?
జీవులలో స్వభావము, దానిని బట్టి కర్మ, దానిని బట్టి రూపము, దానిని బట్టి నామము అను అంశములలో భేదము గలదు. స్వయముగా సద్రూపుడు, జగత్తును సృష్టించినవాడు అగు నారాయణుడు ఈ భేదము లను ఎట్లు సృష్టించేను? ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! దీనిని కూడ మాకు వర్ణించి చెప్పుము.
ఓ పూజ్యా! సమాజములో వివిధస్థాయిలలోని వ్యక్తులు అనుసరించదగిన ధర్మములను గురించి వ్యాసుని నోటినుండి పలుమార్లు వినియుంటిని. అల్పమగు సుఖమును మాత్రమే ఇచ్చే అట్టి ధర్మములయందు నాకు తృప్తి కలిగినది. కాని, శ్రీకృష్ణుని కథామృతప్రవాహమునందు మాత్రము నాకు తృప్తి కలుగుట లేదు.
మీ సాధుసమాజములో విద్వాంసులు భగవానుని చరితములను కీర్తించుచుందురు. వాటిని విన్నవానికి, ఇక చాలును అనే తృప్తి ఎవనికి కల్గును? ఎవ్వనికైననూ కలుగదు. ఆ శ్రీకృష్ణుడు మానవుని చెవిలోని శబ్ద నాడిని పొందినప్పుడు, అనగా మానవుడు శ్రీకృష్ణుని చరితమును విన్నచో, సంసారదాయకమగు గృహాదులయందలి ఆసక్తి పటాపంచలగును.
నీ మిత్రుడగు వ్యాసమహర్షి కూడ భగవంతుని గుణములను వర్ణిం చగోరి భారతమును రచించినాడు. దానిలో ఆయన విషయసుఖములను వర్ణిస్తూ, వాటి ద్వారా వెనువెంటనే మానవుల బుద్దిని శ్రీహరియొక్క గాథల వైపునకు తీసుకుపోయే ప్రయత్నమును చేసినాడు.
శ్రద్ధాళువు అగు మానవునకు శ్రీహరి గాథలయందు అభిరుచి వర్దిల్లి, ఇతరములగు భోగములయందు వైరాగ్యమును కలిగించును. ఆ విధ ముగా శ్రీహరియొక్క పాదములను నిరంతరముగా స్మరించి ఆనందించే భక్తునకు ఆ గాథ వెంటనే సకలదుఃఖములను నశింపజేయును.
ఈ లోకములో శోకింపదగినవారు పలువురు గలరు. కాని ఎవరైతే పూర్వపాపముయొక్క ప్రభావముచే శ్రీహరియొక్క గాథలయం ఏ నిము ఖులై యుందురో, అట్టి అజ్ఞానులు అందరికంటే అధికముగా శోకింప దగిన వారు. నేను వారిని గురించి ఖేదమును పొందుచున్నాను. ఏలయనగా, వారి కాయిక, వాచిక, మానసిక వ్యాపారములన్నియు వ్యర్థములే సూర్యుని రూపములోనున్న కాలపురుషుడు వారి ఆయుర్దాయమును వ్యర్థ ముగా క్షీణింపజేయుచున్నాడు.
ఓ మైత్రేయా! నీవు కష్టములలో నున్నవారికి బంధువువంటి వాడ వు. పవిత్రమగు కీర్తిగల ఆ శ్రీహరి భక్తులకు సుఖములనిచ్చును. కావున నీవు, పుష్పముల సారమగు తేనెను తుమ్మెద పైకి తీసిన విధముగా, లౌకికగాథలలోనుండి సారభూతమగు శ్రీహరినాథను వెలికి తీసి కీర్తించి, మాకు కల్యాణమును కలిగించుము.
ఆ పరమేశ్వరుడు మాయాశక్తిని ఆసరాగా చేసుకొని జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయుచున్నాడు. ఆయన ఈ లోకమునందవత రించి చేసిన దివ్యకర్మలను నాకు వినిపించుము.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా విదురుడు మాన వులకు మోక్షోపాయమును అందించవలెననే భావనతో ప్రశ్నించగా, మైత్రేయ మహర్షి ఆయనను చాల సమ్మానించి, ఇట్లు పలికెను.
ఓ సాధుపురుషుడవగు విదురా! నీ మనస్సు సర్వదా శ్రీహరి పైనే లగ్నమై యున్నది. నీవు మానవులను అనుగ్రహించ గోరి చక్కని ప్రశ్నను వేసితివి. ఈ ప్రసంగము ద్వారా నీ కీర్తి కూడ లోకములో విస్తరించగలదు.
ఓ విదురా! వ్యాసుని ఔరసపుత్రుడవగు నీవు ఈ విధముగా ప్రశ్నిం చుటలో ఆశ్చర్యము లేదు. ఏలయనగా, నీవు సర్వేశ్వరుడగు శ్రీహరిని ఏకాంతభక్తితో ఆశ్రయించినవాడవై, ఆయనను ఆత్మరూపునిగా తెలుసుకున్నావు.
యముడు మాండవ్యమహర్షియొక్క శాపముచే సత్యవతీపుత్రు డగు వ్యాసుని వలన ఆయన తమ్ముడగు. విచిత్రవీర్యునిచే భార్యగా స్వీకరించబడిన దాసియందు జన్మించినాడు. ఆ యమభగవానుడవు నీవే.
నీవు భగవానునకు, ఆయన భక్తులకు మిక్కిలి ప్రియుడవు. అందు వలననే, శ్రీకృష్ణ భగవానుడు అవతారమునుపసంహరిస్తూ, నీకు జ్ఞానము నుపదేశించుమని నన్ను ఆదేశించినాడు.
భగవానుడు జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయుటకై యోగమాయచే విస్తారముగా లీలలను ప్రకటించినాడు. నేను ఇప్పుడు ఆ లీలలను నీకు క్రమముగా వర్ణించి చెప్పెదను.
ఈ జగత్తు సృష్టికి పూర్వమునందు అద్వితీయుడగు భగవానుని రూపములో నుండెడిది. ఆయననుండి వ్యక్తమైన ఈ జీవుల స్వరూపము (ఆత్మ) ఆయనయే. స్థితికాలమునందు ఆయనయే సర్వవ్యాపియై నామ రూపముల భేదముచే అనేకముగా భాసించుచున్నాడు. ఈ సృష్టికి మూల మునందున్న ఆయన మాయాశక్తి ఆయనలో విలీనము కాగానే, కేవల శుద్ధచేతనుడగు పరమాత్మ మాత్రమే మిగిలియుండును.
అద్వితీయుడై ప్రకాశించే అట్టి ఆ భగవానుడు అపుడు తాను ద్రష్టయై చూడగా, దృశ్యమేమియూ కానరాలేదు. అందువలన, ఆయనకు అప్పుడు తనకు తాను అసత్ (ఉనికి లేనివాడు) గా భాసించెను. వాస్తవ ములో జ్ఞానస్వరూపుడగు ఆ పరమేశ్వరుని జ్ఞానము ఎప్పుడైననూ నిద్రిం చేది (ఉపరతమయ్యేది) కాదు. కేవలము ఆయన మాయాశక్తి మాత్రమే నిద్రించుచుండెను; అనగా, ఆయనయందు విలీనమై యుండెను.
ఓ మహాత్మా! విదురా! మాయ అనగా నిత్యదృక్-స్వరూపుడగు ఈ పరమేశ్వరుని శక్తియే. అదియే కారణము, అదియే కార్యము. అది భావ (ఉన్నది)-అభావ (స్వతంత్రమగు ఉనికి లేనిది)-రూపమగుటచే అనిర్వచనీ యము. ఆ పరమేశ్వరుడు ఆ శక్తిని ఉపాదానముగా చేసుకొని, ఈ విశ్వ మును నిర్మించి, సర్వవ్యాపకుడై యున్నాడు.
చైతన్యాధిష్ఠితమైన సత్త్వరజస్తమోగుణాత్మకమగు మాయాశక్తి యందు కాలప్రభావముచే కదలిక యేర్పడెను. ప్రత్యక్షాది ప్రమాణములకు అతీతుడైన చిచ్చక్తిసమేతుడగు పరమేశ్వరుడు ఆ మాయాశక్తియందు తన అంశ (స్వరూపమే) యే అయి ఉన్న పురుషుని (ప్రకృతికి అధిష్ఠాత) రూప ములో చిదాభాస (జీవ) రూపమగు బీజమును స్థాపించెను.
నామరూపాత్మకమగు వ్యాకరణము లేని ఆ మాయాశక్తినుండి కాలప్రేరణచే మహత్తత్వము ఉదయించి, చీకటి అనదగిన అవ్యక్తస్థితికి స్వస్తి పలికి, తనయందు బీజరూపముగా దాగియున్న జగత్తును ప్రకటింప జేయుటకు సిద్దముగా నుండెను. ఈ జగత్తులోని సకల క్రియాశక్తుల మరియు జ్ఞానశక్తుల సమష్టియే ఈ మహత్తత్త్వము. అది జీవులకు పదార్థ జ్ఞానమును కలిగించి అజ్ఞానమును పోగొట్టును.
ఆ మహత్తు చిదాభాసకు, ఉపాదానమగు సత్త్వరజస్తమోగుణములకు మరియు వాటి సామ్యావస్థయందు క్షోభను కలిగించే కాలమునకు వశమై యుండును. అది ఉపాధిచే మహత్తు అయినది కాని, స్వరూపముచే పరబ్రహ్మయే. భగవానుడు అధ్యక్షుడు కాగా, అనగా సచ్చిదహ్మయొక్క సన్నిధియందు మాత్రమే, అది తననుండి నామరూపాత్మకమగు జగత్తును ప్రకటింప జేయును. అట్లు ప్రకటమగుటకు సగుణబ్రహ్మ (మహత్తత్త్వముచే అవచ్ఛిన్నమైన చైతన్యము) యొక్క సంకల్పమే కారణము.
ఆ మహత్తత్త్వము వికారమును చెంది అహంకారము పుట్టేను. అది కార్యరూపమగు పంచమహాభూతములు, వాటికి కారణమగు తన్మాత్ర లు, మరియు కర్తృత్వము అను వికారములకు ఆశ్రయమగుచున్నది.
అహంకారము సాత్త్వీకము, రాజసము, తామసము అని మూడు విధములుగా నున్నది. వాటిలో సాత్త్వికాహంకారము వికారములను పొంది, మనస్సు మరియు ఇంద్రియములకు అధిష్టానమగు దేవతలు ప్రక టమైరి. వాటి వలన మాత్రమే శబ్దము మొదలగు విషయములు ప్రకాశించుచున్నవి.
కర్మేంద్రియములతో బాటు జ్ఞానేంద్రియములు కూడ రాజసాహం కారమునుండి మాత్రమే పుట్టినవి. ఇంతేగాక, తామసాహంకారమునుండి శబ్దతన్మాత్ర పుట్టినది. ఈ శబ్దము ఆకాశమునకు గుణము. శబ్దము గుణ ముగా గల ఆకాశము పరమాత్మకు శరీరము.
కాలము, తామసాహంకారము రూపములోనున్న మాయాశక్తి మరియు చిదాభాసల సంయోగముచే భగవానుని ఆధ్యక్ష్యమునందు ఆకా శము పుట్టెను, ఆకాశమునుండి స్పర్శ తన్మాత్ర పుట్టెను. అది వికారమును చెంది, వాయువు పుట్టెను.
గొప్ప బలముతో గూడిన వాయువు ఆకాశముతో కలిసి వికార మును చెందుట వలన రూపతన్మాత్ర, దానినుండి లోకమునకు ప్రకాశ మును ఇచ్చే తేజస్సు (అగ్ని) పుట్టినవి.
పరబ్రహ్మయొక్క ఆధ్యక్ష్యములో కాలము, మాయాశక్తి మరియు చిదాభాసల సంయోగము వలన వాయువుతో కూడిన అగ్నినుండి రసతన్మాత్ర, దానినుండి నీరు పుట్టినవి.
కాలము, మాయాశక్తి మరియు చిదాభాసల సంయోగము వలన పరమేశ్వరుని ఆధ్యక్ష్యములో అగ్నితో అనుగతమై యున్న జలము వికార మును పొంది, గంధము గుణముగా గల పృథివిని ఉత్పన్నము చేసెను.
ఓ మహాత్ముడవగు విదురా! ఆకాశము మొదలగు ఈ పంచభూత ములలో వెనుకదానియందు ముందు ఉన్న భూతములు అనుగతమగు చుండుటచే, వాటి గుణముల సంఖ్య అదే క్రమములో నుండునని తెలియ వలెను.
మహత్తత్త్వము మొదలగువాటి ఈ అభిమాని దేవతలు శ్రీమహావిష్ణువుయొక్క అంశలే. కాలమునకు లింగమగు వికారము, మాయయొక్క లింగమగు విక్షేపము (అనేకము అగుట) మరియు చిదా భాసయొక్క లింగమగు చేతన అనువాటీ సమాహారమే ఈ దేవతలు. కాని, వారు అనేకముగా నుండుటచే, పరస్పర సంబంధము కలుగ లేదు. ఆ కార ణముగా, ఆ దేవతలు బ్రహ్మాండరచనను చేయలేకపోయినవి. అపుడా దేవ తలు చేతులను జోడించి, పరమేశ్వరునితో ఇట్లు పలికినవి.
అభిమాని దేవతలు ఇట్లు పలికినవి --- ఓ పరమేశ్వరా! నీ పాదప ద్మములు శరణు పొందినవారి తాపమును పోగొట్టే గొడుగు వంటివి. యత నశీలురగు మహాత్ములు నీ పాదమూలమునాశ్రయించిన వారై, సంసారము లోని మహాదు:ఖమును తేలికగా దూరముగా పారద్రోలుచున్నారు.
జగత్తును సృష్టించి పాలించే ఓ పరమేశ్వరా! జీవులు ఈ సంసారమునందు మూడు విధముల దుఃఖముచే పరాభూతులై అంతఃకరణము నందు శాంతిని పొందలేకున్నారు. కావున, మేము సర్వదా జ్ఞానప్రకాశము గల నీ పాదముల నీడను ఆశ్రయించుచున్నాము.
మహర్షులు నీ పద్మమువంటి ముఖమే గూడుగా గల (నీ ముఖప ద్మముయొక్క సొగసును వర్ణించే) వేదములు అనే పక్షుల ద్వారా (వేద మంత్రముల ద్వారా) ఏకాంతమునందు నీ పొదమును అన్వేషించుచుం దురు (ధ్యానించుచుందురు). తమ ఉదకములచే పాపములను పోగొట్టే నదులలో ముందు యెన్నదగిన గంగ నీ పాదమునుండి పుట్టినది. అట్టి పర మపావనమగు నీ పాదమును మేము శరణు జొచ్చుచున్నాము.
సాధకులు శ్రద్దతో నీ లీలలను శ్రవణము చేసి నీయందు భక్తిని పరి పుష్టము చేసుకొనెదరు. దానిచే, వారి అంతఃకరణము శుద్దమగును. అట్టి శుద్ధమగు హృదయమునందు వారు నీ పాదమును ధ్యానించి, తద్ద్వారా జ్ఞానమును, వైరాగ్యబలమును సంపాదించి జీవన్ముక్తులగుదురు. అట్టి నీ పద్మములవంటి పాదముల పీఠమును మేము ఆశ్రయించుచున్నాము.
ఓ ఈశ్వరా! నీవు జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను నిర్వహిం చుట కొరకై అవతరించుచుందువు. అట్టి నీ పాదపద్మమును మే ఎందరము శరణు వేడుచున్నాము. నీ పాదము స్మరించిన భక్తులకు లాభ నుమునొసం గును గదా!
ఓ ఈశ్వరా! జీవులు దేహము అనే ఇంట్లో నివసిస్తూ, ఆ దేహ మునందు, దానితో ముడివడియున్న బంధువర్గమునందు, ఇల్లు మొదలగు పరికరములయందు, నేను నాది అనే తప్పుడు భావనను దృఢముగా నిలు పుకొని యుందురు. ఈ సర్వము మిథ్య అని వారు యెరుగరు. నీవు కూడ అదే దేహములో ఆత్మచైతన్యరూపముగా నిలిచియున్ననూ, అజ్ఞానులగుటచే వారికి నీ పాదము బహుదూరమే. అట్టి నీ పాదపద్మమును మేము సేవించెదము.
ప్రకృతిని నియంత్రించే ఓ దేవా! మానవులు ఇంద్రియముల ద్వారా మిథ్యాభూతమగు జగత్తునందు సంచరిస్తూ బహిర్ముఖులై యుందురు. ఆ ఇంద్రియములు వారి అంతఃకరణములను నీనుండి దూర ముగా లాగివేయును. భక్తులచే అధికముగా గానము చేయబడే కీర్తి గల ఓ దేవా! కావుననే, వారు నీ నడకయొక్క విలాసమును ఉపాసించి ప్రకాశించే (నీ పాదములను శరణు జొచ్చి నిశ్చింతతో శోభిల్లే) భక్తులను నిశ్చయ ముగా కనజాలరు.
ఓ దేవా! నీ గాథలు అనే అమృతమును పానము చేయుట వలన సాధకులలో భక్తి విశేషముగా వర్ధిల్లి అంతఃకరణము స్వచ్చమగు' . అట్టి అంతఃకరణములో వైరాగ్యమే సారముగా గల ఆత్మజ్ఞానము ఉదయించును. వెనువెంటనే వారు అనాయాసముగా వైకుంఠలోకమును పొందెదరు; అనగా, అప్రతిహతమగు స్వరూపమునందు నిష్ఠను కలిగి, జీవన్ముక్తులైయుందురు.
అదే విధముగా వివేకవంతులగు మరికొందరు సాధకులు చిత్తవృ త్తులను నిరోధించుట అనే ఉపాయముచే బలీయమగు మాయను జయించి పూర్ణుడవగు నిన్ను పొందుతున్నారు. కాని, వారికి శ్రమ అధికము. నీ సేవ చేయు భక్తులకైతే మోక్షము సులభము.
ఓ ఆదిదేవా! నీవు లోకములను సృజించగోరి మమ్ములను సృష్టించినావు. కాని, సత్త్వరజస్తమోగుణములు అనే మూడు విభిన్నస్వభావ ములు గలవారమై విడిపోయి ఉన్నాము. ఆ, కారణముగా నీవు విహరించు టకు యోగ్యమగు బ్రహ్మాండమును నిర్మించి నీకు సమర్పించే సామ ర్థ్యము మాలో కొరవడినది.
పుట్టుక లేని ఓ దేవా! మేము సరియగు కాలములో నీకు పూర్ణభో గమును సమర్పించవలెను. మరియు, మేము కూడ మా స్థానమునందున్న వారమై ఆహారమును భక్షించవలెను. ఇంతేగాక, ఈ జీవులు కూడ విఘ్న ములకు, సంశయములకు దూరముగా నున్నవారై, నీకు మాకు ఇద్దరికీ భాగములనర్పిస్తూ, తమ తమ అన్నమును భక్షించవలెను. ఇవి అన్నీ జరిగే ఉపాయమును నీవు చేయుము.
నిర్వికారుడవు, పూర్ణుడవు, సకలప్రాణులకు అంతర్యామివి, సనా తనుడవు అగు నీవే సకలకార్యవర్గముతో కూడియున్న మా దేవతలకు ఆదికారణుడవు. ఓ దేవా! నీకు పుట్టుక లేదు. సత్త్వరజస్తమోగుణములకు మరియు జన్మ మొదలగు క్రియలకు కారణమగు మాయాశక్తికి కూడ పుట్టుక లేదు.. నీవు అట్టి మాయాశక్తియందు మహత్తత్వము (సమష్టి చిదా భాస రూపము) అనే జగద్బీజమును కల్పించినావు. నీవు మాయాశక్తియందు చిదాభాస అనే జగద్బీజమును ఉంచినావు.
ఆత్మస్వరూపుడవగు ఓ దేవా! మహత్తత్త్వము మొదలగు మేము ఏ కార్యము కొరకు పుట్టితిమో, దాని విషయములో నీకు మేము ఏమి చేయదగును? మమ్ములను అనుగ్రహించువాడవు నీవే. బ్రహ్మాండ రచన కొరకై నీవు మాకు నీ క్రియాశక్తితో కూడియున్న నీ జ్ఞానశక్తిని కూడ ఇమ్ము.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో అయిదవ అధ్యాయము ముగిసినది (5).
