శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
10 - బ్రహ్మగారు ఆవిర్భవించుట
మైత్రేయుడు ఇట్లు పలికెను --- ఆశ్చర్యము! భగవద్భక్తాగ్రగణ్యు డవు, లోకపాలుడగు యముని అంశచే జన్మించినవాడవు అగు నీవు జన్మించుటచే పూరువంశము సత్పురుషులకు సేవించదగినదిగా అయిన ది. నీవు ప్రతి పదమునందు ఆ శ్రీహరియొక్క కీర్తిమాలను నిత్యనూత నముగా చేయుచున్నావు.
ఓ పూజ్యా! నీవు జ్ఞానాధికులలో శ్రేష్టుడవు. నేను ఇంతేగాక నిన్ను మరికొన్ని విషయములను కూడ ప్రశ్నించియుంటిని. వాటిని నీవు ఒక క్రమ ములో నాకు చెప్పి, మా సంశయములనన్నింటినీ తొలగించుము.
సూతుడు ఇట్లు పలికెను --- ఓ శౌనక మహర్షీ! అపుడు విదురు నిచే ఈ విధముగా ప్రేరేపించబడిన మైత్రేయ మహర్షి సంతోషించి, తన హృదయములోనున్న ఆ ప్రశ్నలకు సమాధానమును చెప్పెను.
ఆ ప్రళయకాలము వాయువునకు గొప్ప శక్తిని కలిగించెను. అట్టి వాయువు ఆ ప్రళయజలములను మరియు బ్రహ్మగారిచే అధిష్టించబడియున్న పద్మమును కంపింప జేయుచుండెను. పద్మమునుండి పుట్టిన బ్రహ్మగారు ఈ సంగతిని గమనించెను.
ఉత్తరోత్తరాభివృద్ధి గల తపస్సుచే మరియు హృదయమునందు నెలకొన్న ఆత్మజ్ఞానముచే బ్రహ్మగారి విజ్ఞానశక్తి విశేషముగా వర్ధిల్లియుం డెను. ఆయన ఆ వాయువును నీటిని కూడ త్రాగివేసెను.
ఆకాశమును వ్యాపించియున్న పద్మమునందు ఆసీనుడై యున్న బ్రహ్మ ఆ పద్మమును చూచి, దీనితోనే నేను గడచిన కల్పముయొక్క అంతమునందు విలీనమై పోయిన లోకములను మరల సృష్టించెదను అని తలపోసేను.
శ్రీహరి భగవానుడు బ్రహ్మను కర్తవ్యకర్మయగు సృష్టియందు నియోగించెను. అపుడా బ్రహ్మ పదునాలుగు భువనములుగా గాని, అంత కంటే అధికముగా గాని అగుటకు శక్తి గల ఆ పద్మకోశమును అధిష్ఠించి, దానిని మూడుగా విభాగము చేసెను.
జీవులు తమ కర్మఫలమును అనుభవించే స్థానములు ఈ ముల్లోక ములేనని శాస్త్రములలో చెప్పబడినది. మానవుడు నిష్కామకర్మను ఆచ రించినచో, దాని ఫలరూపముగా బ్రహ్మలోకమును పొందును.
విదురుడు ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! మైత్రేయ మహర్షీ! ఆశ్చ ర్యకరమగు లీలలను చేయుచూ అనేకరూపములలో ప్రకటమయ్యే శ్రీహరి యొక్క కాలము అనే శక్తిని గురించి నీవు చెప్పియుంటివి. దానిని మాకు యథాతథముగా వివరించి చెప్పము.
సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతిలో వచ్చే మార్పే కాలము యొక్క రూపము. ఆద్యంతములు లేని ఆ కాలమునందు విశేషములు (అ వయవములు) వాస్తవముగా లేవు. భగవానుడు స్వరూపముచే రూపము లేనివాడే అయిననూ, ప్రకృతియొక్క పరిణామమును ఉపాధిగా స్వీకరించి సగుణ సాకారుడగుచున్నాడు. తన మహిమయందు ప్రతిష్ఠితుడైన ఆ భగ వానునకు మరీయొక ప్రతిష్ట (ఆశ్రయము) లేదు. ఆయన ఆ కాలమును ఉపాదానము (ముడిసరుకు) గా చేసుకొని లీలచే తనను తానే జగద్రూప ముగా ప్రకటించుచున్నాడు.
విష్ణుభగవానుని మాయచే ఈ విశ్వము విలీనమై బ్రహ్మగారి రూ పములో మాత్రమే నుండెను. ఆయన స్వయముగా నిర్విశేషమగు స్వరూ పము గల కాలము ద్వారా దానిని భిన్నముగా ప్రకటింప జేసెను.
ఈ జగత్తు ఇప్పుడు ఏ విధముగా నున్నదో, పూర్వమునందు కూడ అటులనే ఉండెడిది; భవిష్యత్తులో కూడ అటులనే ఉండగలదు. దీని సృష్టి ప్రాకృతము మరియు వైకృతము అను భేదముచే తొమ్మిది విధము లుగా నున్నది' (ఉభయాత్మకమగు పదవ భేదము కూడ గలదు).
ఈ సృష్టికి కాలము ద్రవ్యము మరియు గుణములు అనువాటి ద్వారా క్రమముగా నిత్య నైమిత్తిక ప్రాకృత ప్రళయములు అనే మూడు విధముల ప్రళయములు కలుగును. బ్రహ్మాత్మనుండి మాయాశక్తి యొక్క సత్త్వ రజస్తమోగుణముల సామ్యావస్థలో వచ్చిన వైషమ్యము కారణముగా మొట్టమొదట మహత్తత్త్వము (సమష్టి జ్ఞానశక్తి క్రియాశక్తుల సమాహారము) పుట్టినది.
అహంకార సృష్టి రెండవది. పంచభూతములు జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రియములు ఆ అహంకారమునుండి పుట్టినవి. మూడవది అయిదు సూక్ష్మమహాభూతముల సృష్టి. ఈ సూక్ష్మభూతములలో ఈ స్థాయిలో ఇంకనూ పరస్పర సమ్మేళనము లేదు. పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము అనే అయిదు స్థూలమహాభూతములను ప్రకటిఠాప జేసే శక్తి ఈ సూక్ష్మభూతములయందు గలదు.
జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల సృష్టి నాల్గవది. ప్రకృతివికారమగు అహంకారముయొక్క సాత్త్వికాంశమునుండి ఇంద్రియాధిష్టాన దేవతలు మరియు మనస్సు ప్రకటమగును. ఇది అయిదవ సృష్టి.
ఓ విదురా! జీవులకు ఆవరణము (ఉన్నది కానరాకుండుట) మరియ విక్షేపము (లేనిది కానవచ్చుట) లను కలిగించే అవిద్యనుండి ఆరవ సృష్టి (తామిస్రము మొదలైనవి) వచ్చినది. ఈ ఆరు ప్రాకృత (త్రిగు భౌత్మికయగు ప్రకృతికి చెందిన) సర్గములు. నేనిప్పుడు వైకృత (సమష్టి స్వరూపుడగు బ్రహ్మగారి) సర్గములను చెప్పెదను. వినుము.
శ్రీహరిని బుద్ధిలో చింతించువారలకు సంసారము హరించిపోవు ను. ఆయన రజోగుణమును ఉపాధిగా స్వీకరించి బ్రహ్మరూపములో ఈ సృష్టి అనే లీలను చేసినాడు. ఇక ఏడవది చెట్టుచేమల సృష్టి. మానవునకు ముఖము వలె ఇది వైకృతసర్గములలో మొట్టమొదటిది గనుక, ముఖ్యసర్గ మనబడుచున్నది. ఇది ఆరు విధములుగా నున్నది.
ముఖ్యసర్గములో వనస్పతులు (పువ్వు లేకుండగనే ఫలముల నిచ్చే రావి మొదలగు చెట్లు), ఓషధులు (ఫలములు పక్వమగుట తోడనే నశించే వరి మొదలగు మొక్కలు), లతలు (ఏదో ఒక చెట్టు మొదలగు ఆసరాను ఆశ్రయించుకొని పెరిగే మల్లె మొదలగు తీగలు), త్వకార ములు (బలమైన బెరడు గల వెదురు మొదలగు ఆశ్రయమున పేక్షించని తీగలు), వీరుధములు (పొదలు) మరియు ద్రుమములు (పువ్వు కాయ అనే వరుసలో ఫలించే మామిడి మొదలగు చెట్లు) అనే ఆరు రకములు గలవు. వీటి అన్నిటియందు పోషకరసము క్రింద నేలనుండి పైకి ప్రవహిం చును. వీటియందు తమోగుణము ప్రధానమగుటచే, అంతఃకరణవికాసము చాల తక్కువగా నుండును. ఇవి తమ లోపల స్పర్శగుణమునను భవించు ను. వీటిలో అనేకభేదములు ఉండుటయే గాక, ప్రతి దానియందు ఎదో ఒక విశేషగుణము ఉండును.
పశుపక్ష్యాదుల సృష్టి ఎనిమిదవది. దీనియందు ఇరవై ఎనిమిది రకములు గలవు. ఈ ప్రాణులలో తమోగుణము అధికముగా నుండుటచే, వీటికి కాలముయొక్క అనుభవము ఉండదు. ఇవి ఘ్రాణేంద్రియముతో మాత్రమే పదార్థములను తెలుసుకొనును. వీటికి బుద్ధియందు సుఖము మొదలగునవి తెలిసిననూ, విచారశక్తి ఉండదు.
ఓ సాధుపురుషా! విదురా! ఆవు (ఎద్దు), మేక, గేదె (దున్న), కృష్ణ మృగము (నల్ల జర్రీ), పంది, గురుపోతు, దుప్పి, గొర్రె మరియు ఒంటె అనే ఈ తొమ్మిది పశువుల కాళ్లకు రెండు డెక్కలు ఉండును.
ఓ విదురా! గాడిద, గుర్రము, కంచరగాడిద, గౌరము (గేదెవంటి ఒక మృగము), శరభము (ఎనిమిది కాళ్లు గల మృగము), చమరీ అనే ఆరు మృగములు ఒక గిట్ట గలవి. ఇపుడు ఒక కాలికి అయిదు గోళ్లు గల మృగములను (పంచనఖములు) చెప్పెదను. వినుము.
కుక్క, నక్క, తోడేలు, పెద్దపులి, పిల్లి, చెవుల పిల్లి, ఏదుపంది, సింహము, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము అనే పన్నెండు భూచరము లగు పంచనఖములు. మొసలి మొదలగు జలచరములు, రాబులుగు, గద్ద, గవ్వపక్షి, డేగ, రాబందు, భల్లూకము, నెమలి, హంస, బెగ్గురు, జక్కవపిట్ట, కాకి, గుడ్లగూబ మొదలగు పక్షులు కలిసి భూచరములు కాని ఇరవై ఎనిమిదవ వర్గము.
ఓ విదురా! మానవులలో ఆహారప్రవాహము నోటినుండి క్రిందకు ఉండుటచే ఈ తొమ్మిదవ సర్గము అర్వాక్-ప్రోతస్సు అనబడును. మానవులందరు ఒకే విధముగా నున్నారు. మానవులు రజోగుణము అధికముగా గలవారగుటచే కర్మలలో మునిగి తేలుచుందురు. మానవులు దుఃఖాత్మకములగు విషయభోగములయందు సుఖమున్నదని తలపోయుచుందురు.
ఓ సాధుపురుషా! విదురా! పైన చెప్పిన మూడు సర్గములు వైకా రిక సర్గములు. దేవసర్గము కూడ వైకారిక సర్గమే. సాత్త్వికాహంకారము నుండి వచ్చిన ఇంద్రియాధిష్టాన దేవతల సర్గము (ప్రాకృతము) పూర్వమే చెప్పబడినది. కౌమారసర్గము వైకృత మరియు ప్రాకృత అనే రెండు కోవ లకు చెందినది.
దేవతలు, పితృదేవతలు, అసురులు, గంధర్వాప్సరసలు, యక్షరాక్షసులు, సిద్దచారణవిద్యాధరులు, భూతప్రేతపీశాచములు, కిన్నరకింపురుషాదులు అని దేవసర్గము ఎనిమిది విధములుగా నున్నది. విదురా! ఈ విధముగా బ్రహ్మగారిచే చేయబడిన పది విధముల సృష్టిని నీకు చెప్పితిని.
ఇటుపైన నేను వంశములను మరియు మన్వంతరములను వర్ణించెదను. కల్పముల ఆదియందు సత్యసంకల్పుడగు శ్రీహరి రజోగుణమును ఉపాధిగా స్వీకరించి, సృష్టికర్త మరియు స్వయంభువుడు అగు బ్రహ్మ రూపములో ఈ సృష్టిని తన ఇచ్ఛచే తనయందు ప్రకటించును.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు పదవ అధ్యాయము ముగిసినది (10).
