శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
27 - ప్రకృతి పురుష వివేకముచే మోక్షప్రాప్తి
శ్రీ కపిల భగవానుడు ఇట్లు పలికెను --- అకర్తయగు పురుషుని (ఆత్మ) యందు వికారములు లేవు. పురుషుడు నిర్గుణుడు. కావున, పురు షుడు ప్రకృతి కార్యమగు దేహమునందు ఉన్నవాడైననూ, నీటియందు ప్రతిఫలించిన సూర్యుని వలె, ప్రకృతి గుణములగు సత్త్వరజస్తమస్సులచే సంప్రాప్తమయ్యే పుణ్యపాపములచే గాని, . సుఖదుఃఖములచే గాని లేపమును పొందడు.
అట్టి ఈ పురుషుడు ఏ కాలమునందు అహంకారముచే మోహిని పజేయబడిన బుద్ధి గలవాడై ప్రకృతియొక్క గుణములయందు ఆసక్తి గల వాడగునో, అప్పుడు నేను కర్తను అనే అభిమానమును కలిగియుండును.
నేను కర్తను అనే అభిమానముగల జీవుడు దేహాదులచే చేయబడే కర్మలయొక్క పుణ్యపాపరూపమగు ఫలముకు భోక్తయగును. అట్టి జీవుడు అస్వతంత్రుడై మంచి (దేవ), చెడు (పశు), మిశ్రమ (మనుష్య) జన్మలను పొంది సంసారచక్రములో పడి తిరుగుతూ సుఖమునకు దూరమగును.
జన్మమరణాది రూపసంసారము మిథ్య. అయిననూ, భోగము లను గురించి చింతిల్లే జీవునకు, స్వప్నమునందలి ఆపద దాని దుఃఖము వలే, సంసారమునందు తిరుగాడుట తప్పుట లేదు.
కావుననే, దుష్టములగు ఇంద్రియముల మార్గములో, అనగా వాటి విషయములలో గట్టిగా తగుల్కొనియున్న మనస్సును భక్తిర్గముచే మరియు తీవ్రమగు వైరాగ్యముచే మెల్లగా వశములోనికి తెచ్చుకొనవలెను.
సాధకుడు నాయందు ఫలాసక్తి లేని ప్రేమ గలిగి నా గాథలను వింటూ, యమనియమాది యోగాంగములను శ్రద్ధతో అభ్యసించవలెను.
సాధకుడు సకలప్రాణులయందు ప్రకాశించే చైతన్యరూపమగు బ్రహ్మను దర్శించవలెను. అట్టి దర్శనముచే వైరభావమును తొలగించుకో ని, సంసారవిషయములయందు ఆసక్తికి దూరముగా నుండవలెను. సాధ కుడు బ్రహ్మచర్యము (గృహస్థుని విషయములో ఏకపత్నీ వ్రతము) ను పాటిస్తూ మౌనియై (అధికప్రసంగమును చేయనివాడై, ప్రసన్నమగు మనస్సు గలవాడై) స్వధర్మము (కర్తవ్యము) ను గట్టిగా అనుష్ఠించవలెను.
సాధకుడు ప్రారబవశముచే తనంత తానుగా లభించిన దానితో సంతుష్టుడు కావలెను. మితముగా భుజిస్తూ మననశీలుడై ఏకాంతములో నివసించవలెను. రాగద్వేషములను విడనాడి అందరినీ ప్రేమిస్తూ అందరి యందు దయ గలిగి తాను కృతార్థుడననే ధైర్యముతో నుండవలెను.
ప్రకృతిపురుషుల స్వరూపమునెరింగిన జ్ఞాని ఈ దేహమునందు గాని, దాని సంబంధీకులయందు గాని, నేను నాది అనే మిథ్యారూపమగు అభిమానము లేనివాడై యుండును.
ప్రకృతిపురుష వివేకము గల జ్ఞాని, జాగ్రత్తు మొదలగు అవస్థలు బుద్ధికి సంబంధించినవే గాని, ఆత్మకు వాటితో లేపము లేదని తెలుసుకొను ను. ఈశ్వరుని కంటె భిన్నముగా ఏదీ లేదనే దర్శనమును ఆతడు కలిగి యుండును. సూర్యుడు అధిష్ఠానదేవతగా గల కంటితో సూర్యుని చూచే విధముగా, ఆతడు తన శుద్దమగు అంతఃకరణము ద్వారా ఆత్మరూపముగా నుండే పరమేశ్వరుని దర్శించి ఆయనయందు విలీనుడై జీవన్ముక్తుడగును.
అంతఃకరణములో ఆ అఖండసత్ యొక్క ప్రతిఫలనమే జీవుడనియు, ఉపాధిని పరిత్యజించిన జీవుడు ఆ సత్ కంటే భిన్నుడు కాడనియు, ఈ మిథ్యాభూతమగు జగత్తును అంతనూ వ్యాపించి దానిని ప్రకా శింపజేసే అద్వయబ్రహ్మ అదియేననియు ఆ ముని దర్శించును.
నీటి పడియలో పడిన సూర్యకాంతి ప్రతిఫలించి ఇంటిలోని గోడపై పడినప్పుడు ఆ గోడమీది సూర్యుడు నీటిలోని సూర్యుని ప్రతిబింబమని తెలియును. నీటిలోని సూర్యుడు కూడ ఆకాశమునందలి సూర్యుని ప్రతి బింబమే. అదే విధముగా, పంచభూతకార్యమగు ఈ దేహమునందు, ఇంద్రియములయందు, అంతఃకరణమునందు చైతన్యప్రకాశము అనుభవమునకు వచ్చుచున్నది. కాని, వాటి ఈ ప్రకాశము అహంకార ప్రకాశము యొక్క ప్రతిఫలము మాత్రమేనని గ్రహించదగును. అహంకారమునందలి చైతన్యప్రకాశము కూడ ఆ అఖండసత్ యొక్క ప్రకాశమేనని దర్శించు జీవన్ముక్తుడు ఆ బ్రహ్మ-అభిన్నమగు సచ్చిదాత్మను దర్శించును.
నిద్రావస్థలో సూక్ష్మభూతములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలగునవి అవ్యాకృతము (నామరూప పరిణామము లేని ప్రకృతి యొక్క సూక్ష్మావస్థ) లో విలీనమగును. కాని, ఆత్మ చైతన్యము నిద్రించ దు. అది నిత్యదృక్స్వరూపమై అహంకారము లేని ఆ అవస్థను ప్రకాశింప జేయును.
ఆత్మ జాగ్రదవస్థయందు సర్వమునకు ద్రష్టవలె భాసించును. కాని, నిద్రలో అహంకారముతో సహా ఆ సర్వము అంతర్ధానమగును. అప్పుడు ధనమును కోల్పోయి తనను తానే కోల్పోయినట్లుగా కంగారు పడే వ్యక్తి వలె, అజ్ఞాని తాను నిద్రలో లేకుండా పోయినానని భావించును.
దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము అను నవి కేవలము ఆత్మ చైతన్యము మాత్రమే అధిష్టానముగా కలిగి దాని యందు మాత్రమే భాసించుచున్నవి. వివేకి ఈ విధముగా విమర్శ చేసి ఆత్మతత్త్వమును తెలుసుకొనును.
దేవహూతి ఇట్లు పలికెను --- ఓ పరమేశ్వరా! ప్రభూ! ఒకదానిని మరియొకటి ఆశ్రయించి ఉండే ఈ ప్రకృతి పురుషులు నిత్యములు. కావు న, ప్రకృతి ఏ కాలమునందైననూ పురుషుని విడిచి యుండదు.
భూమి, గంధము వేర్వేరుగా మనజాలవు. నీరు, రసము అనువా టికి వేర్వేరు ఉనికి లేదు. అదే విధముగా బుద్ది (ప్రకృతి), పురుషుడు ఒక దానిని విడిచి మరియొకటి ఉండలేదు.
పురుషుడు స్వయముగా కర్త కాడు. కాని, ప్రకృతి గుణములతో తాదాత్మ్యముచే పురుషునకు కర్మబంధము కలుగుచున్నది. కాని, ఈ సత్త్వరజస్తమోగుణములు నిత్యములై యుండగా, ఆ పురుషునకు కర్మబం ధమునుండి విముక్తి, కేవలభావము ఎట్లు కలుగును?
ఒకానొక పురుషునియందు ఒకవేళ ఆత్మజ్ఞానముచే తీవ్రమగు సంసారభయము తొలగిననూ, దానికి కారణమగు గుణములు నిత్యముల గుటచే, ఆ సంసారము మరల సంప్రాప్తమగును.
సాధకుడు ఫలమునందు తృష్ణ లేకుండగా స్వచ్చమగు అంతఃకర ణముతో స్వధర్మముననుష్ఠించవలెను. చిరకాలము నా గాథలను విని నాయందలి భక్తిని తీవ్రముగా పరిపుష్టము చేసుకొనవలెను. ప్రకృతిపురు షుల యథార్థస్వరూపమును తెలుసుకొనవలెను. బలిష్టమగు వైరాగ్యము గలవాడై, ప్రతనియమములను పాటిస్తూ ధ్యానమును అభ్యాసము చేయవ లెను. దృఢమగు చిత్తేకాగ్రతను కలిగియుండవలెను. ఇట్లు చేయు సాధకు నకు ఈ జన్మలోనే, కట్టెయందలి నిప్పుచే కట్టె కాల్చివేయబడినట్లుగా, అవిద్య మెల్లమెల్లగా దహించివేయబడి అంతర్ధానమగును.
ప్రకృతి నిత్యము దుఃఖ హేతువు అని వివేకియగు పురుషుడు దర్శించి దానియందు తాదాత్మ్యమును చెందకుండగా విడిచి పెట్టును. అట్టి ప్రకృతి తన పరమానంద స్వరూపమునందు నిలిచియుండే స్వతంత్రుడగు పురుషునకు సంసారమనే అమంగళమును కలిగించలేదు. .
కలను కనుచున్నవానికి ఆ కలలోని దృశ్యములు అనేకములగు ఆపదలను కలిగించి దుఃఖితుని జేయును. కాని, ఆ వ్యక్తి నిద్ర లేచిన తరు వాత, ఆ కల వానికి మోహమును కలుగజేయలేదు గదా!
ఈ విధముగా ప్రకృతిపురుషుల స్వరూపమునెరింగి తనయందు తాను రమించువాడై నాయందు మనస్సును లగ్నము చేయు సాధకునకు ప్రకృతి ఏ కాలమునందైననూ మోహము కలిగించదు.
ఈ విధముగా మననశీలుడగు వ్యక్తి అనేకజన్మల కాలము ఆత్మని ష్ఠను కలిగియున్నప్పుడు, వానికి బ్రహ్మలోకము వరకు గల భోగముల న్నింటియందు వైరాగ్యము కలుగును.
నా భక్తుడగు వివేకికి స్వరూపజ్ఞానము కలిగి సంశయములు తొల గిపోవును. వానికి నా గొప్ప అనుగ్రహముచే తత్త్వజ్ఞానము లభించును. ఆతనికి ఈ జన్మలోనే సాక్షాత్తుగా ప్రత్యగభిన్నమగు బ్రహ్మయే (నేనే) స్వరూపముగా గల కేవల (అద్వయ) భావమని ప్రసిద్ధిని గాంచిన నిరతిశ యానందరూపమగు జీవన్ముక్తి లభించును. ఆ జ్ఞాని లింగదేహము నశిం చిన తరువాత మరల తిరిగి జన్మించడు.
అమ్మా! సిద్ధపురుషుని యెదుట యోగశక్తిచే పరిపుష్టము చేయబ డిన మాయామయములగు సిద్దులు ప్రకటమగును. వాటిని సాధించుటకు యోగము తప్ప మరియొక ఉపాయము లేదు. కాని, ఎప్పుడైతే ఆతడు వాటియందు ఆసక్తిని పొందడో, అప్పుడు ఆతడు పరమపురుషార్థమగు మోక్షమును పొంది సాలో విలీనమగును. అపుడాతనికి మృత్యుభయము శాశ్వతముగా నివారణ యగును.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది.
