శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
8 - పది రకముల సృష్టిని వర్ణించుట
విదురుడు ఇట్లు పలికెను --- శ్రీహరి భగవానుడు అంతర్ధానమైన పిదప ముల్లోకములకు అధీశ్వరుడు మరియు పితామహుడు అగు బ్రహ్మ గారు తన దేహమునుండి మరియు మనస్సునుండి ప్రాణులను ఎన్ని ప్రకా రములుగా సృష్టించినాడు?
మానవులు అల్పసుఖమును సంపాదించే ప్రయత్నములో పుట్టెడు దుఃఖమును పొందుచుందురు. వారి ఆ దుఃఖమును పోగొట్టుట కొరకై, నీచే ఈ విధముగా ప్రశ్నించబడిన నేను, భాగవత పురాణమునారంభించి చెప్పేదను. దీనిని సాక్షాత్తుగా భగవానుడే మహర్షులకు చెప్పినాడు.
ఐశ్వర్యము వీర్యము యశస్సు శ్రీ జ్ఞానము మరియు వైరాగ్యము అనే ఆరు గుణములు పూర్ణముగా గలవాడు, సర్వకారణుడు, అఖండజ్ఞాన స్వరూపుడు అగు సంకర్షణ దేవుడు. పాతాళ లోకములో ఉండెను. అప్పుడు సనత్కుమారుడు మొదలరు మునులు పరబ్రహ్మ తత్త్వమును తెలియగోరి, ఆయనను యథావిధిగా సమీపించి, ఇట్లు ప్రశ్నించిరి.
సంకర్షణ దేవుడు తనకు ఆశ్రయమగు శ్రీహరిని ధ్యానములో భావించి గొప్పగా పూజించుచుండెను. మహర్షులు ఆ శ్రీహరిని వాసుదే వుడు (సర్వజగన్నివాసుడు మరియు చైతన్యస్వరూపుడు) అని వర్ణించు చుందురు. ఆయన అంతర్ముఖుడై కన్నులను మూసుకొని యుండగా అవి పద్మపు మొగ్గలవలె విరాజిల్లెను. జ్ఞానులగు సనత్కుమారుడు మొదలగు వారు ప్రశ్నించగా, ఆయన వారిని అనుగ్రహించుట కొరకై కన్నులను కొద్దిగా తెరచి చూచెను.
సనత్కుమారుడు మొదలగు ఆ మహర్షులు గంగాజలములలో స్నానమాడి, తడిగా నున్న తమ జటల సమూహములతో ఆ సంకర్షణ. దేవుని పాదపీఠమైన పద్మమును స్పృశించుచున్నారు. నాగరాజకన్యలు తమకు నచ్చిన వరుని పొందగోరి, ఆ పద్మమును ప్రేమతో అనేకములగు ఉపహారములను సమర్పించి పూజించుచున్నారు.
కిరీటములయందలి శ్రేష్ఠమగు మణులచే గొప్పగా ప్రకాశింపజేయబడే పైకి ఎత్తి ఉంచబడిన వేయి పడగలు గల ఆయనను (ప్రశ్నించిరి).
సంకర్షణ దేవుని వేయి కిరీటములలోని శ్రేష్ఠమగు మణుల కాంతులు పైకి ఎత్తి ఉంచబడిన వేయి పడగలను గొప్పగా ప్రకాశింప జేయుచున్నవి. ఆయన లీలలు సనత్కుమారుడు మొదలగు మహర్షులకు తెలిసినవే. ఆయనయందలి భక్త్యావేశముచే వారి మాటలు తడబడుచుండిను. వారాయన లీలలను పలుమార్లు గాసము చేసి, ఆయనను ప్రశ్నించిరి.
ఓ విదురా! సంకర్షణ భగవానుడు నివృత్తిధర్మపరాయణుడగు సనత్కుమారునకు ఈ భాగవతమును ఉపదేశించెను. సాంఖ్యాయన ముని ఆయన వద్దకు వెళ్లి ప్రశ్నించగా, ఆయన దానిని దృఢవ్రతుడగు ఆ మునికి ఉపదేశించెను.
సర్వకర్మసన్న్యాసపూర్వక జ్ఞాననిష్ఠ అనే పరమహంసల ధర్మము నందు ఆ సాంఖ్యాయనుడు దిట్ట.తరువాతి కాలములో ఆయన భగవానుని మహిమలను వర్ణించగోరి, ఆ భాగవతమును అనుంగు శిష్యుడగు పరాశరు. నకు, బృహస్పతికి చెప్పెను. ఆ పరాశర మహర్షియే మా గురువు.
పులస్త్య మహర్షి కోరికననుసరించి, దయామయుడగు ఆ పరాశర మహర్షి ఆదిపురాణమగు భాగవతమును నాకు చెప్పెను. వత్సా! నీవు శ్రద్ధ గలవాడవు, నన్ను నిత్యము నిష్ఠతో సేవిస్తున్నావు. ఆ విధముగా పరా శరమహర్షినుండి నేను వినియున్న ఆ పురాణమును నీకు చెప్పుచున్నాను.
సృష్ట్యాదియందు అద్వితీయుడగు నారాయణుడు శేషశయ్యను అధిష్ఠించి పరున్నవాడై యోగనిద్రను ఆశ్రయించి కన్నులను మూసుకొనేను. ఆయన సృష్టివ్యాపారమునుండి విరమించి, తన స్వరూపమగు ఆనం దమునందు వేడుక గలవాడై యుండెను. ఆయన యోగనిద్రయందు ఉన్న నూ, లోపించని చైతన్యశక్తి గలవాడే. ఆ సమయములో ఈ బ్రహ్మాండమం తయు నీటిచే వ్యాపించబడి యుండెను.
ఆ నారాయణుడు, తన శక్తిని ప్రకటము చేయకుండగా కట్టెయందు దాగియున్న అగ్నివలె, సూక్ష్మభూతములను తన శరీరమునందు దాచి యుంచెను. ఆయన తన స్థానమగు ఆ జలములయందు నివసించియుండె ను. సృష్ట్యాదియందు ఆయన కాలము అనే తన శక్తిని ప్రేరేపించును.
ఈ విధముగా నారాయణుడు తన చిచ్చక్తితో కూడి ఆ జలముల యందు వేయి మహాయుగములు నిద్రించెను. తరువాత కాలము అనే ఆయన శక్తి సృష్టిక్రియద్వారా జీవుల కర్మఫలములు ప్రకటమయ్యే వ్యాపా రమును ఆయనకు కలిగించెను. అపుడాయన తన శరీరమునందు విలీనమై యున్న లోకములను (జీవులను) చూచేను.
నారాయణుడు తన సంకల్పరూపమగు దృష్టిని తనలో విలీన మైయున్న సూక్ష్మతత్త్వములపైకి సారించెను. అప్పుడు ఆ సూక్ష్మతత్త్వముల వర్గము ప్రకటము కాబోతూ, కాలశక్తిచే వికసించియున్న రజోగుణముచే క్షోభింపజేయబడి, ఆయన నాభిస్థానమునుండి ప్రకటమయ్యెను.
జీవుల కర్మాదృష్టమును జాగృతము చేసే కాలము సంప్రాప్తము కాగానే, సూక్ష్మతత్త్వ సముదాయము పరమాత్మనుండి పద్మకోశరూప ములో ఒక్కసారి ప్రకటమయ్యెను. సూర్యుని వలె ప్రకాశించే ఆ పద్మము తన కాంతులతో ఆ విశాలమగు జలరాశిని గొప్పగా ప్రకాశింప జేసెను.
ఓయీ విదురా! ముల్లోకముల రూపములోనున్న ఆ పద్మము జీవులకు భోగ్యములైన పదార్థజాతమునంతనూ ప్రకాశింపజేయుచున్నది. ఆ పద్మమును స్వయముగా విష్ణువు అంతర్యామి రూపముగా ప్రవేశించే ను. దానియందు సాక్షాత్తుగా వేదమూర్తియగు బ్రహ్మగారు ప్రకటమయ్యే ను. ఆ బ్రహ్మగారు స్వయంభువుడని కీర్తించబడుచున్నాడు.
ఆ పద్మముయొక్క కర్ణికయందున్న బ్రహ్మగారికి ప్రపంచము కానరాలేదు. ఆయన ఆ పద్మము లోపల చుట్టూ తిరుగుతూ ఆకాశమునందు కళ్లను సారించి త్రిప్పుచూ నాల్గు దిక్కులను చూడగా, దిక్కునకు ఒకటి చొప్పున ఆయనకు నాలుగు ముఖములు లభించెను.
ప్రళయకాలపోయువుల తాకిడికి ఆ జలరాశియందు గొప్ప కెరట - ములు పుట్టుచుండెను. ఆ కెరటముల మధ్యనుండి ప్రకటమైన ఆ పద్మ మును బ్రహ్మగారు అధిష్టించి యుండెను. కాని, ఆశ్చర్యమేమనగా, పద్మము రూపములో ప్రకటమైన ఆ లోకతత్త్వము గురించి గాని, తన గురించి గాని ఆయనకు ఏమీ తెలియకుండెను.
ఇది నేను అనే ప్రత్యయము గలవాడనై ఈ పద్మముయొక్క కర్ణి కయందు ఉన్న నేను ఎవరినై యుందును? ఈ జలములలో ఈ ఒక్క పద్మము తక్క మరియేదీ లేదు. ఇది ఎక్కడనుండి పుట్టియుండును? దీని క్రింద ఏదో ఒక వస్తువు ఉన్నది. ఎందుకంటే, ఈ పద్మమునకు ఆశ్రయ ముగా ఉండే వస్తువు ఏదో ఒకటి ఉండి తీరవలెను గదా!
ఆ బ్రహ్మ ఈ విధముగా ఊహించి, ఆ పద్మముయొక్క కఠిన మగు నాళములలోని రంధ్రముల గుండా నీటిలోనికి ప్రవేశించెను. ఆయన అచట వెదుకుతూ ఆ నాళమునకు ఆధారమగు నాభికి దగ్గరకు చేరిననూ, దానిని తెలుసుకొనలేక పోయెను.
ఆ అంతు లేని చీకటిలో బ్రహ్మగారు తన ఉత్పత్తి స్థానమును వెదుకుచుండగా, చాల కాలము గడిచిపోయేను. భూతభవిష్యద్వర్తమాన ములనే మూడు రూపములు గల ఈ కాలము ఆ భగవానుని చేతిలోని ఆయుధము. అది దేహాత్మభావము గల జీవులకు భయమును గొల్పుచూ, వారి ఆయుర్దాయమును హరించి వేయుచుండును.
ఆ బ్రహ్మగారి కోరిక తీరలేదు. ఆయన ఆ ప్రయత్నమునుండి వీర మించుకొని మరల తన స్థానమగు పద్మకర్ణికను చేరుకొని, దానియందు కూర్చుండి మెల్లమెల్లగా శ్వాసను జయించి, మనోవృత్తులను నిరోధించి, సమాధిస్థితిని చేరుకొని యుండెను.
ఆ బ్రహ్మగారు ఈ విధముగా పురుషాయుర్దాయమగు వంద సంవ త్సరముల కాలము సమాధియోగమును చక్కగా కొనసాగించగా, ఆయ నకు విశేషమగు జ్ఞానము ఉదయించెను. అపుడాయనకు ఇదివరలో ఎంత వెదికిననూ. కానరాని తన కారణము తన హృదయము లోపల ప్రకాశిస్తూ తనంత తానుగా సాక్షాత్కరించెను. -
ఆది శేషుని పదివేల పడగలు గొడుగుల వలె నున్నవి. వాటి తలలపై నున్న రత్నములు తమ కాంతులచే ఆ ప్రళయజలమునందలి చీకట్లను పారద్రోలుచున్నవి. తామరతూడువలె తెల్లనైన ఆ ఆదిశేషుని విశాల మగు దేహమే శయ్య కాగా, ఒక పురుషుడు దానిపై నడుము వాల్చియుం డెను. బ్రహ్మగారు ఒంటరిగానున్న ఆ పురుషోత్తమ భగవానుని కనుగొనెను.
ఆ పురుషోత్తమ భగవానుని దేహకాంతి, వెదుళ్లే భుజములుగా మరియు వృక్షములే పాదములుగా గల మరకతమాణిక్యపర్వతుని శోభను తిరస్కరించుచున్నది. ఆ పర్వతమునకు సంధ్యాకాలమునందలి మేఘ ములే కట్టువస్త్రములన్నచో, వాటిని ఆ పురుషుని పీతవస్త్రము తలదన్ను చున్నది. అనేకములగు బంగరు శిఖరములే ఆ పర్వతమునకు కిరీటముల న్నచో, ఆ పురుషుని కిరీటము వాటి శోభను అతిశయించుచున్నది. ఆ పర్వ తమునకు రత్నములు, నీటిధారలు, ఓషధి మొక్కలు మరియు పుష్పములు కలిసి వనమాలను సమగూర్చుచున్నవన్నచో, ఆయన దాల్చిన వన మాల ఆ మాలను తన శోభచే పరాస్తము చేయుచున్నది.
పురుషుని దేహము పొడవులో మరియు వైశాల్యములో తనకు తానే సాటియై
తనకు అనురూపమైన ప్రమాణమును కలిగి ముల్లోకములను తనలో ఇముడ్చుకొని యుండెను. ఆ దేహము రంగు రంగుల దివ్య ములగు వస్త్రములకు మరియు ఆభరణములకు శోభను కలిగించుచుండే ను. ఇట్లు అలంకరించబడిన దేహము గల ఆ పురుషుని బ్రహ్మ చూచెను.
భగవానుని పద్మమువంటి పాదమునకు చంద్రవంకలవంటి నఖ ముల కాంతులతో ప్రకాశించే వేళ్లు పద్మపత్రములవలె నున్నవి. మాన వులు తమ కోరికలు ఈడేరుట కొరకై ఆ పాదమును వేదములో నిర్దేశించబ డిన శుద్దమగు వేర్వేరు ఉపాయములతో చక్కగా ఆరాధించగా, వారికి ఆ పాదము కోరికలను సుసంపన్నము చేయును. అట్టి పాదపద్మమును దయతో దర్శనమిచ్చుచున్న పురుషోత్తముని బ్రహ్మగారు చూచేను.
ఆయన చిరునవ్వు ముఖము జనుల దుఃఖమును పోగొట్టును. అందమైన ముక్కు, చక్కని కనుబొమలు గల ఆ ముఖము ఇటునటు కదు లుతూ ప్రకాశించే కుండలములతో నలరారుచుండెను. ఎర్రని క్రింది పెదవి దొండపండువలే శోభిల్లెను. అట్టి ముఖముతో ఆయన తనను పూజించు భక్తులను సమ్మానించుచుండెను.
ఓ ప్రియవిదురా! ఆ పురుషోత్తముని నడుము కడిమి పువ్వుల పుప్పొడి వలే పసుపు వన్నెగల వస్త్రముతో మరియు మొలనూలుతో ప్రకా శించుచుండెను. ఆయన శ్రీవత్సము అనే మచ్చగల తన వక్షఃస్థలమునకు తగియున్న అమూల్యమగు హారముతో శోభిల్లుచుండెను.
జగత్కారణుడగు ఆ పురుషోత్తముడు గొప్ప చందనవృక్షము వలె నున్నాడు. జగద్రూపముగా ప్రకటమైన ఆయనయే జగత్తు అనే వృక్షము రూపములో నున్నాడు. ఆయన భుజదండములే ఆ వృక్షముయొక్క అనం తములగు శాఖలు. ఆ భుజములయందు ప్రకాశించే విలువైన అంగద ములు మరియు ఉత్తమమగు మణులు చందనవృక్షముయొక్క ఫలపుష్ప మలులతో నిండిన కొమ్మలను స్మరింపజేయుచున్నవి. జగత్తు అనే వృక్షము నకు అవ్యక్తము అనబడే మాయాశక్తి గాని, లేక అవ్యక్తశబ్దవాచ్యమగు పర బ్రహ్మ గాని మూలమై యుండుట ప్రసిద్ధమే. చెట్టుయొక్క తల్లివేరు కనబడకుండుట అందరికీ తెలిసినదే. ఆ పురుషోత్తముని భుజస్కంధములను ఆది శేషుని పడగలు చుట్టువారియున్నవి. ఆ విధముగా ఆయన పాములకు నివాసమగు చందనవృక్షమును పోలియున్నాడు.
ప్రళయజలములచే చుట్టువారబడియున్న ఆ భగవానుడు నీటిలో మునిగియున్న పర్వతమువలె నున్నాడు. పర్వతము చెట్టుచేమలకు ఇతర ప్రాణులకు ఆశ్రయమై యుండగా, ఆయన స్థావరజంగమాత్మకమగు జగత్తునకంతకూ నివాసస్థానము. పర్వతము గొప్ప పాములకు నిలయము కాగా, ఆయన ఆదిశేషునకు బంధువు. ఆది శేషుని పడగల పైనుండే అసంఖ్యాకములగు బంగరు కిరీటములు పర్వతశిఖరములవలె నొప్పారుచున్నవి. పర్వతములో రత్నములుండుననే ప్రసిద్ధి గలదు. ఆ పురుషోత్తముని వక్షఃస్థలమునందు కౌస్తుభమాణిక్యము చక్కగా ప్రకాశించుచుండెను.
శ్రీహరి మెడలో విరాజిల్లే వనమాల చుట్టూ వేదములే భ్రమర ములై తిరుగుతూ ఆయన కీర్తిని గానము చేయుచున్నవి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలగు జ్యోతిర్మండలములు ఆ శ్రీహరియొక్క ప్రకా శము ముందు వెలవెలపోవును. వాయువు ఆయనను సమీపించలేడు. ముల్లోకములలో మూడు కాలములలో తమ తేజస్సుచే దుర్నిరీక్ష్యములై ఆయన చుట్టూ తిరుగుతూ ఉండే సుదర్శనము మొదలగు ఆయుధములు కూడ ఆయనను సమీపించలేకున్నవి. వాటి కారణముగా ఇతరమేదియు ఆయనను సమీపించలేదు.
లోకములను సృష్టించుటకు కావలసిన జ్ఞానము, సృష్టించాలనే ఇచ్చ గల ఆ జగద్విధాతయగు బ్రహ్మదేవునకు శ్రీహరిని చూచిన ఆ సమ యములో, ఆయన నాభిసరస్సునుండి పుట్టిన పద్మము, తన శరీరము,ప్రళయ జలములు, ప్రళయ వాయువు మరియు ఆకాశము అనే ఈ అయిదు తక్క మరేదీ కానరాలేదు.
ఆ బ్రహ్మగారి మనస్సు రజోగుణముచే రంజితమై (వ్యాప్త మై) యుండెను. కావుననే, ఆయనకు మనస్సులో మాయాశక్తియొక్క విలాస మునందు అభినివేశము (పట్టుదల) పెరిగెను. ఆయన వివిధరకముల సర్గ ముల ద్వారా ప్రజలను సృష్టించగోరి, . ఆ సృష్టికి కారణము కాగల తత్త్వముల కొరకు పరికించగా, కేవలము ఆ అయిదు మాత్రమే ఆయనకు కానవచ్చెను. అపుడాయన కొనియాడదగిన శ్రీహరిని స్తుతించేను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
