నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను
రాజగు సురథుడు ప్రకృతిరూపిణియగు ఆ దుర్గాదేవినీ ఎట్లు పూజించెనో ఆ విషయమును నీకు చెప్పెదను.
మహారాజు స్నానము చేసి ఆచమనము చేసి దుర్గాదేవిని పూజింపనారంభించెను. తొలుత నా మహారాజు ఆంగన్యాసము, కరన్యాసము, మంత్రాంగన్యాసమను మూడు స్యాసములు చేసి తరువాత భూతశుద్దీనీ చేసెను. తరువాత మూడుసార్లు ప్రాణాయామమును చేసి శంఖబిలముచే ఆ దేవిని అభిషేకించెను. ఆ తరువాత మట్టితో చేసిన దేవతా ప్రతిమయందు ఆ దేవిని ఆవాహన చేసెను. తరువాత ఆ దేవీని మరల ధ్యానించీ భక్తితో ఆమెను పూజించెను. దుర్గాదేవి పూజచేయునప్పుడు ఆ దేవి కుడివైపు మహాలక్ష్మీదేవి ప్రతిమనుంచెను, ఆ మహాలక్ష్మినీ భక్తితో పూజించి దుర్గాదేవి ముందున్న ఘటమున గణపతిని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, దుర్గాదేవిని, (దేవషట్కమును) ఆవాహన చేసి పూజించెను. దేవషట్కమును పూజించి నమస్కరించి తరువాత వేదమునందు చెప్పబడిన ఈ ధ్యానశ్లోకములతో దుర్గాదేవిని అతడు స్తుతించెను.
ఆ మహాదేవి మూలప్రకృతి, ఈశ్వరి, బ్రహ్మవిష్ణుశివాది దేవతలచే ఎల్లప్పుడు నమస్కరింపతగినది. పూజింపదగినది. ఆ దేవి సనాతని, నారాయణ, విష్ణుమాయ విష్ణుభక్తినొసగు దేవత. సర్వస్వరూప, ఆందరకు ఆధారభూత, పరాత్పర, సమస్త విద్యలు, సమస్తమంత్రములు, సమస్త శక్తులయొక్క స్వరూపిణి. ఆమె సగుణ, నిర్గుణ, సత్వస్వరూపిణి, స్వేచ్ఛామయి, సతి, మహావిష్ణువుయొక్క మాత, శ్రీకృష్ణుని ఆర్ధాంగమునుండి జన్మించినది. ఆ దేవత శ్రీకృష్ణునకు ప్రియ, శ్రీకృష్ణశక్తి స్వరూపిణి. శ్రీకృష్ణబుద్ధికి అధిదేవత, శ్రీకృష్ణునిచేత స్తుతింపబడినది. కృష్ణపూజ్య, కృష్ణవంద్య, కృపగలదీ, ఆ దేవి మేలిమి బంగారువంటి వన్నెగలది. కోటి సూర్యులతో సమానమైన కాంతీ గలది. చిరునవ్వులోనున్న ముఖములో భక్తజనులనెల్లప్పుడు అనుగ్రహించును. ఆ దుర్గకు నూరు భుజములు కలవు. భక్తుల కష్టములనన్నిటినీ తొలగించును, శివునకు ప్రియురాలు. సత్వరజస్తమో గుణములు, త్రిలోచనములు కలది. ముక్కంటికి ప్రాణములవంటిది. శిరస్సున ఆర్ధచంద్రునీ ధరించునది. మాలతీ మాలలు కొప్పునగలది. ఆదేవి ముఖము గుండ్రము అందముగా ఉండును. రత్నకుండలములు ఆ దేవి చెవులకు కలవు. ముక్కుయొక్క కుడివైపు పెద్దనైన ముత్యపు పోగును ధరించును. అదేవి చెవిపైన అమూల్యమైన రత్నములున్నవి, ముత్యములను మించిన పలువరుస కలదు. ఆమె పెదవులు పండిన దొండపండువలె ఉండును. చెంపలపై చిత్రవిచిత్రములైన పత్రములున్నవి. చేతులకు రత్నకేయూరములు కాళ్ళకు రత్నమంజీరములు ధరించినదీ, అనేక విధములైన రత్నాభరణములు ఆ దేవి శరీరమున కలవు. పాదములు, చేతులక్క గోళ్ళకు లత్తుకను అలంకరించుకోనీనది. ఆ దేవీ ధరించిన వస్త్రము మిక్కిలి పరిశుద్ధమైనది. ఆమె శరీరమునకంతా గంధమును నద్దుకొన్నది. స్తనములపై కస్తూరి చుక్కలున్నవి. ఆమె సర్వరూపగుణవతి. గజేంద్రమువలె మందగమనము కలది. మిక్కిలి ఆంధమైనది, శాంతురాలు, విధాతనే సృష్టించునది, శరత్కాలచంద్రునిపంట ముఖముగలది, ముఖమున కస్తూరి బిందువులు దానికింద చందనబిందువులు, దానికి కింది సిందూరబిందువులు కలది. ఆ దేవత నయనములు శరత్కాల మధ్యాహ్న సమయమున కనిపించు పద్మములవలె ఉన్నవి; కాటుకరేఖలు ఆమె కండ్లలో కనిపించును. ఆమె కోటిమన్మథుల లోపణ్యముకలది. రత్నసింహాసనముపై నున్న ఆ దేవి మంచి రత్నములున్న కిరీటమును ధరించినది. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు శిల్పముగా, జగద్రక్షకుడైన మహావిష్ణువు రక్షించునపుడు కృపామయిగా, సంహరకర్తయగు రుద్రుడు సంహారము చేయుచున్నపుడు సంహారరూపిణిగా కనిపించును. ఆమె శుంభనిశుంభులను, మహిషాసురుని సంహరించినది. త్రిపురాసురయుద్ధమున ట్రిపురారియైన శివుడు ఆ దేవిని స్తుతించి విజయము పొందగా, శ్రీమహావిష్ణువు మధుకైటభులతో యుద్ధము చేయుచున్నపుడామ్ విష్ణశక్తిస్వరూపిణియై అతనికి విజయమును కలిగించినది. హిరణ్యకశిపుతో నృసింహస్వామి పోరాడునపుడు నృసింహశక్తిగా, హిరణ్యాక్ష వధ జరుగుచున్నపుడు వరాహస్వామికి వరాహశక్తిగా అవతరించింది. ఆమె రక్తబీజులను, ఇతరరాక్షసులను సంహరించినది. పరబ్రహ్మస్వరూపిణి. ఆ సర్వశక్తిరూపిణియగు ఆ దేవతను ఎల్లప్పుడు నమస్కరింతును అని సురథమహారాజు ఆ దుర్గాదేవిని భక్తిపూర్వకముగా ధ్యానించెను.
ఇది భగవతీయొక్క ధ్యాస విధానము-
ఈవిధముగా దుర్గాదేవిని ధ్యానించి తన శిరస్సుపై ఒక పుష్పమునుంచుకొని మరల ఆ దేవిని ధ్యానించీ ఆవాహన చేయవలెను. ప్రకృతిరూపిణియగు ఆ దుర్గాదేవియొక్క ప్రతిమను చేతిలో ధరించి ఈ మంత్రముచే జీవన్యాసమును చేయవలెను.
సనాతనియగు ఓ తల్లి శివలోకమునుండి ఇచ్చటకు వచ్చి నేను చేయు శరత్కాలపూజను స్వీకరింపుము, జగత్పూజ్యమైన మహేశ్వరి! ఇచ్చటకు వచ్చి ఈ అర్చామూర్తిలో నీవుండుము. ఓ అచ్యుతే! నీ ప్రాణములు అధిప్రాణములతో కలసి ఈ ఆర్చామూర్తియందు ప్రవేశించుగాక! అట్లే సర్వశక్తులు వెంటనే ఈ మూర్తియందు గానీమ్ము,
ఓం హ్రీం శ్రీం క్లీం దుర్గాయై స్వాహా అను మంత్రముచే ఆ దేవి ప్రాణములను ఈ మూర్తియందు ఆవాహన చేయవలెను. అట్లే సర్వేంద్రియాధిదేవతలను, సర్వశక్తులను, “ఇహాగచ్ఛ” అని ఆవాహనము చేయవలెను. తరువాత ఈ మంత్రముచే సంహారమును చేయవలెను.
ఓ తల్లి శివలోకమునుండి వచ్చిన నీకు స్వాగతము. ఓ భద్రకాళి! నన్ను ఎల్లప్పుడు అనుగ్రహింపుము, ఓ దుర్గా! నీవు నా ఇంటికి వచ్చినందువలన నేను ధన్యుడనైతిని. నా జన్మ ధన్యమైనది. నిన్ను ఈ పుణ్యక్షేత్రమగు భారత క్షేత్రమున పూజించుచున్నందువలన నా జీవితము ధన్యమైనది. ఈ భారత భూభాగమున నిమ్న పూజించువాడు పరమైశ్వర్యమును, జీవితాంతమున గోలోకమును పొందును.
వైష్ణవియగు ఈ దేవతను పూజించినచో విష్ణులోకము సులభముగా లభించును. అట్లే మాహేశ్వరియగు ఈ దేవిని పూజించినచో శివలోకమగు కైలాసము లభించును. ఆ దుర్గాదేవియొక్క పూజ సాత్వికీ, రోబిసీ, తామసీ అని మూడు విధములు. వీటిలో సాత్వికీ పూజ చాలా శ్రేష్ఠమైనది. రాజసీపూజ మధ్యమమైనది. తామసీపూజ అధమమైనది.
వైష్ణవులు పాత్వికపూజ చేయగా శాక్తులు, శైవులు మొదలగువారు రాజసీ పూజను చేయుదురు. శ్రీకృషమంత్రమును గురుముఖతః పొందనివారు. ఆసత్పురుషులు చేయుపూజ తామసి, జీవహత్య జరుపక చేయు పూజ ప్రసవపూజ. ఇట్టి పూజచేసిన విష్ణుభక్తులు గోలోకమునకు పోవుదురు. జీవహత్య లేక బలితోనున్న పూజను చేసి కైలాసమును పొందుదురు. తామసీపూజ చేసిన కిరాతులు మొదలగు ఆనాగరికులు స్వర్గలోకమునకు వెళ్ళుదురు. నీవు లోకములు కన్నీటికి మాతృదేవతవు, నీ పూజవలన ధర్మార్థ కామ మోక్షములనే చతుర్వర్గములు లభించును. నీపు శ్రీకృష్ణ పరమాత్మయొక్క పర్వశక్తి స్వరూపిణి. పరాత్పరవగు నీవు జన్మ, మృత్యు. జర, వ్యాధి మొదలగు వానిని పోగొట్టెదవు. నీవు నారాయణివి, మహామాయవు, దుర్గతులను తొలగించు దుర్గాదేవివి. నీవు శ్రీకృష్ణపరమాత్మయొక్క శక్తి స్వరూపిణివి.
దుర్గా అను పదమును విన్నంతనే మానవుల కష్టములన్నియు నశించును.
ఈవిధముగా దేవి పరిహారమును చేయు సాధకుడు దేవియొక్క ఎడమవైపున కూర్చుండవలెను అని నారాయణుడు నారదునితో ననెను.
శంఖమును ముక్కోలిపీటపైన పెట్టి ఆ శంఖమునీండ వీరును పోయవలెను. ఆందు గజకను, పుష్పమును, చందనమును వేసి ఆ శంఖమును కుడిచేతిలోనుంచుకొని ఈ మంత్రమును పఠించవలెను.
ఓ శంఖమా నీవు చాలా పవిత్రమైనదానిని. మంగళములకు మంగళమైనది. పూర్వము నీవు శంఖచూడునివలన పుట్టిన దానవు. అందువలననే పరమ పవిత్రమైన దావవగుచువాపు అని అర్ఘ్యపాత్రమున స్త్రీ పద్ధతిలో అచ్చటనుంచి దుర్గాదేవిని షోడశోపచారములలో పూజింపవలెను.
తడిసిన దర్భతో త్రికోణాకృతి గల మండలమును చేసి అచ్చట కూర్మమును, ఆదిశేషుని, భూమిని ఒకదానినొకటి ఉన్నట్లు భావించి పూజింపవలెను, ఆ స్థలమున ముక్కాలిపీటను వేసి దానిపై శంఖమునులచపలెను. ఆ శoఖమున మూడువంతులవరకు వీరుస పోసి ఆ నీటినిట్లు భావింపవలెను.
ఓ గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, పింధు, కావేరి, చంద్రభాగ, కౌశికి, స్వర్ణరేఖ, కనబలమా, పారిభద్రమా, గండకి, శ్వేతగంగా, చంద్రరేఖ, పంప, చంప, గోమతి, పద్మావతి, త్రిపశ, విపాళ, వీరజ, శతప్రద, ఇంకను భూమిపైనున్న గంగలారా మీరందరు నా పూజలమున ఉండుడని నదులనన్నిటిని ప్రార్థింపవలెను.
తొలుత అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు, వరుణుడు, శివుడు ఆమవారివీ నీరు, తులసి, చందనములతో పూజింపవలెను, తరువాత ఒక్కొక్క దేవతను ప్రత్యేకముగా షోడశోపచారములతో పూజింపవలెను. ఆవి ఆసనము, వస్త్రము, పాద్యము, స్నానీయము, అనులేపనము, మధుపర్కము, గంధము. ఆర్ఘ్యము, పుష్పము, నైవేద్యము, ఆచమనీయము, తాంబూలము, రత్నభూషణము, ధూపము, ప్రదీపము, తల్పము అనునవి. వీటిలో
ఆసవమంత్రము-
ఓ శంకరప్రియా! అనేక రత్నరచితము అనేక చిత్రములు కలదీ ఆగు పింహాసనమున నీవు పరిగ్రహింపుము.
వస్త్రమంత్రము-
ఓ శివుని ప్రియురాలా! అనేకమైన సూత్రములతో, ఈశ్వరుని కోరిక ప్రకారము నిర్మించబడినది పహ్నివలె పరిశుద్ధమైనది అగు వస్త్రమును స్వీకరింపుము.
పాద్యమంత్రము-
ఓ దుర్గా! ఆమూల్యమైన. రత్నపాత్రలోనున్న ఈ గంగా జలమును నీ పాదములు కడుగుట కొరకు స్వీకరింపుము.
అనులేపన మంత్రము-
ఓ జగన్మాతా కస్తూరీ. కుంకుమలు, చందనములతో సువాసితమైన ఈ అనులేపనమును నీవు స్వీకరింపుము.
మధుపర్కమంత్రము-
ఓ దేవి రత్నపాత్రలో ఉన్న పవిత్రమైన మధుపర్కమును వీపు స్వీకరింపుము.
గంధమంత్రము-
ఓ దేవి! సువాసనగల చూర్ణములు, ద్రవ్యములు. కల ఈ గంధము చాలా పవిత్రమైనది. మంగళకరమైనది. దీనిని వీపు దయతో పరిగ్రహింపుము. .
అర్ఘ్యమంత్రము-
ఓ చండి ఆకాశగంగయొక్క నీటిని శంఖపాత్రలో ఉంచితిని. అందు దర్భ, పుష్పములు, అక్షతలు కలపు, ఇట్లు పవిత్రమైన ఈ అర్ఘ్యమును నీవు గైకొనవమ్మా!
మాల్యమంత్రము-
ఓ జగన్మాతా! పారిజాతపుష్పములు మొదలగు పుష్పములచే చేయబడిన. ఈ పుష్పమాలలను నీవు స్వీకరింపుము.
నైవేద్యముంత్రము-
సిద్ధాన్నము, పప్పన్నము, పిండివంటలు, పాయసము, లద్దాలు కల ఈ అన్నమును నైవేద్యముగా స్వీకరింపుము.
ఆచమనీయ మంత్రము-
ఓ శైలకన్యకా! నీవు కర్పూరము మొదలగు సువాసనా ద్రవ్యములు కలిపిన ఈ చల్లని నీరును స్వీకరింపుము.
తాంబూల మంత్రము-
ఓ దేవి తమలపపాకులు, సున్నము. కాచుపంటి చూర్ణములు, కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములలో సువాసితమైనదీ అగు తాంబూలమును నీవు స్వీకరింపుము.
భూషణ మంత్రము-
ఓదేవి! మిక్కిలి విలువైన ఉత్నముఖచే నిర్మించబడినవి, సమస్త అవయవములకు అందమును చేకూర్చు ఈ ఆభరణములన దయలో స్వీకరింపుము.
ధూపమంత్రము-
ఓ దేవికి చెట్లనుండి వెలువడిన జిగురు పదార్ధముల చూర్ణమున సుగంధ ద్రవ్యములన్నీ కలిసి వాసనభరితమై పరమశుద్ధమైన ఈ ధూపమున నీవు స్వీకరింపుము.
దీపమంత్రము-
ఓ పరమేశ్వరి! నేను నీకిచ్చు దీపము దీవ్యరత్నములచే నిర్మితమైనది. ఇది దట్టమైయున్న చీకట్లను సహితము పారద్రోలును, ఇది పరమపవిత్రమైనది. ఈ దీపమును నీవు తీసికొనుము.
తల్ప మంత్రము-
ఓ దేవి! ఈ మంచము అమూల్యరత్నములచే నిర్మితమైనది. దీనిపై నున్న తల్పము పన్నని వస్త్రములచే నిర్మితమైనది. ఇట్టి పాన్పుమ పీవు స్వీకరింపుము.
ఈ విధముగా షోడశోపచారములతో ఆ దుర్గాదేవిని పూజించి పుష్పాంజలిని ఇవ్వవలెను. తరువాత అష్టనాయకులను ఆస్టదేవతాస్త్రీలను పూజించవలెను. ఆ దేవతాస్త్రీల పేర్లు ఇవి. ఉగ్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, ఆతిచండ, చండ, చండ, చండవతి ఆనువారు. వీరిని అష్టదళ పద్మమున తూర్పునుండి కుడిగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది దళములపైనుంచీ పంచోపచారములచే పూజింపవలెను. తరువాత అష్టదేవతా స్త్రీలమధ్య ఆస్టభైరవులనుంచీ వారిని పూజింపవలెను. వారి పేర్లివి. మహాభైరవుడు, సంహార భైరవుడు, అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, కాలభైరవుడు, క్రోధ భైరవుడు, తామచూడుడు, చంద్రచూడుడను ఇద్దరు భైరపులు. వీరందరిని పూజించిన తరువాత అష్టదళ పద్మములో తొమ్మండుగురు శక్తిదేవతలనుంచి పూజింపవలెను.
బ్రహ్మాణి, వైష్ణవి, రౌద్రి, మాహేశ్వరి, నారసింహ, వారాహి, ఇంద్రాణి, కార్తికీ వీరు కాక తొమ్మిదవ శక్తి సర్వశక్తిసంపన్నురాలైన సర్వమంగళ.
శక్తి దేవతలను పూజించిన పిదప కలశమున ఆహ్వానింపబడిన దేవతలను పూజింపవలెను. వారి పేర్లు శంకరుడు, కుమారస్వామి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు . వీరితర్వాత దుర్గాదేవియొక్క చేటిని, వటువును ఆటుపిమ్మట ఆరవై నలుగురు యోగినీ స్త్రీలను విధిప్రకారము పూజించి శక్తికొద్ది బలిని ఇచ్చి ఆ దేవీస్తోత్రమును చేయవలెను.
దుర్గాదేవి కవచమును కంఠమున కట్టుకొని దానిని భక్తితో చదివి పరిహారమంత్రములను పఠించీ ఆటుపిమ్మట నమస్కరింపవలెను.
నారదమునీ! బలిదానముచేయతగిన వాటిని గూర్చి నీవు తెలిసికొమ్ము,
మాయాతి, దున్నపోతు, గొఱ్ఱె, మేకలు మొదలగు వాటిని బలిగా ఇవ్వవలెను. మాయాతిని బలిచేసినచో ఆ దేవి వేయి సంవత్సరములవరకు సుప్రీతయైయుండును, దున్నపోతును బలిఇచ్చినచో మారుపంవత్సరములు, గోలెను బలి ఇచ్చిన పది సంవత్సరములు, మేకను, గుమ్మడికాయను, పక్షులను, లేళ్ళను బలి ఇచ్చినచో ఆ దేవి సంవత్సరము వరకు సంతోషముగానుండును. ఆట్లే కృష్ణసారమను లేడిని బలిఇచ్చినచో పది సంవత్సరములు, గండకమును బలిఇచ్చినచో వేయి సంవత్సరము లా దేవి సంతోషపడును. కృత్రిమములైన పిండివంటలలో, ఇతర పశువులతో ఆరుమాసములు, పండిన పండ్లు, అక్షతలతో ఒక నెలవరకు ఆ దేవి సంతోషముతోనుండును.
వ్యాధి లేనిది. మంచి వయసులో నున్నది, కొమ్ములు కలది, మంచి లక్షణములు కలదీ, వికారమైన అవయవములు లేనిది మంచి రంగుగలది, బాగుగా పోతరించినది ఆగు పశువును ఆ దేవికి బలీగా ఈయవలెను.
అట్లుకాక పిల్లను (తక్కువ వయస్సులోనున్న పశువును) బలిగా ఇచ్చినచో బలినిచ్చినవానీ పుత్రుడు చనిపోవును. అట్లే వయసుమీరిన పశుపునిచ్చినచో తలిదండ్రులు చనీపోపుదురు. ఆధీకాంగములు గల పశువును బలి ఇచ్చినచో ధనమును, కొన్ని అవయవములు లేని పశునిచ్చినచో సంతానమును, కొమ్ములు లేని పశువును బలి ఇచ్చినచో భార్యను, గుడ్డిదైన పశుపునిచ్చినచో పోదరుని ఆ దేవి చంపుము. దూడను బలిచేసినచో తనకే మృత్యువు కలుగును. విచిత్రమైన శిరస్సుగల పశువును బలి ఇచ్చినచో విఘ్నము, రాగిరంగుగల వెంట్రుకల పశువునిచ్చినచో మిత్రుని, తోకలేని పశువును బలి ఇచ్చినచో పరపదవంతయు ఆదేని హరించును.
అథర్వవేదమునందు చెప్పబడిన మాయాతి స్వరూపమును నీకు చెప్పెదను.
నారదమునీ! తల్లిదండ్రులు, వ్యాధులు లేని యువకుడు వివాహితుడై, విష్ణుమంత్ర దీక్షను స్వీకరించి, జారత్వ దోషములు లేనివాడు కావలెను. ఆ యువకుడు జారత్వ దోషమువలన పుట్టకూడదు. ఆతనిని పోషించినవారు కూడ సత్పురుషులు కావలెను. ఇట్టి పురుషుని బంధువులకు ధనమునిచ్చి అతనిని కొనవలెను. ధనమునిచ్చికొన్న ఆ పురుషుని ఇంటికి తెచ్చి స్నానముచేయించి అతనికి వస్త్రము, చందవాదులచే అతనినలంకరించి ఒక సంవత్సరము వరకు అతనిని యథేచ్చగా తిప్పుచు అతనివెంట తన భృత్యునీ ఉంచవలెను. ఇట్టి యువకునీ మాయాతి ఆందరు.
ఈ మాయాతిని ఆశ్వయుజమాసమున అష్టమి నవమీ తిథుల మధ్య దుర్గాదేవికి బలినీయవలెను.
నారదా! బలిదానము చేయవలసిన పశువుల వివరముల నన్నిటిని నీకు తెలిపితిని.
బలి వస్తువును స్తుతించి దేవికి బలినిచ్చి ఆ దేవియొక్క కవచమును ధరించి ఆ దేవికి సాష్టాంగదండము సమర్పింప వలెను. ఆ తరువాత బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి పంపించవలెను.
శ్రీబ్రహ్మ వైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున వారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్లోపాఖ్యానమున దుర్గాదేవిని పూజించుపద్ధతి, ఆ పూజలో సమర్పింపవలసిన బలిపశువుయొక్క లక్షణములుగల అరవై నాలుగవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 64 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Expanding further upon moral ethics, this chapter emphasizes that respecting women is not merely a social virtue but an indispensable spiritual discipline for anyone desiring spiritual progress. The narrative illustrates through various historical accounts how kings and sages who honored noble women flourished in righteousness, while those who insulted or oppressed virtuous women met with catastrophic ruin and complete annihilation of their lineages. The text concludes with a solemn prayer urging all spiritual aspirants to cultivate pure thoughts, gentle speech, and deep reverence toward the divine motherly presence in all female beings.