నారద ఉవాచ- నారదుడు నారాయణునితో ఇట్లనెను-
నారాయణమునీ! నీ అనుగ్రహమువలన అనేక దేవతలయొక్క చరిత్రను వింటిని. వేదార్థ విదులలో శ్రేష్ఠుడా! ఇతర దేవతలయొక్క చరిత్రను కూడా నాకు చెప్పుము.
నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లు నారదునితో ననేను-
నారదా! వేదములందు సమస్త దేవతల చరిత్ర విపులముగా ప్రత్యేకముగా కలదు. నీవు ప్రస్తుతము ఏ దేవతాస్త్రీ చరిత్ర వినదలచితివో నాకు తెలుపుము.
నారద ఉవాచ:- నారదముని ఇట్లనెను-
షష్టీదేవి, మంగళచండి, మనసాదేవి వీరందరు ప్రకృతియొక్క ఆంశలు. అందువలన వీరిపుట్టు పూర్వోత్తరములను తెలిసికొనగోరుతున్నాను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
ప్రకృతియొక్క ఆరవ ఆంశ కావున ఆమెను షఫీ అనీపిలిచిరి. షష్ఠిదేవత బాలురకు ఆధిష్టాన దేవత, పుత్ర సంపత్తినిచ్చునది, విష్ణుమాయకూడ. ఆమె షణ్మాతృకలలో ప్రఖ్యాతిచెందిన “దేవసేన” అనునది. కుమారస్వామికి ఆ దేవత ప్రాణములకంటె ప్రియమైన భార్య. బాలకులకు ఆయుస్సును కలుగజేయుచు వారినెల్లప్పుడు రక్షించుచుండును. ఆమె శిశువుల పక్కనే ఉండి వారిని రక్షించుచుండును. ఆమె సిద్ధయోగినికూడ.
ఆ షష్టీదేవియొక్క పూజావిధానమును చరిత్రను ధర్మదేవత చెప్పగా వింటినీ. ఆ వృత్తాంతమును నీవుకూడ వినుము.
ఒకప్పుడు స్వాయంభువ మనువునకు ప్రియవ్రతుడను కొడుకు కలిగెను. అతడు సుజ్ఞానియై, యోగీంద్రుడై తపస్సుచేసికొనుచు వివాహము చేసికొనలేదు. కాని బ్రహ్మదేవుని ఆజ్ఞపై అతడు వివాహమును చేసికొన్నను అతనికి సంతానము కలుగలేదు. అందువలన కశ్యపప్రజాపతీ ప్రియవ్రతునిచే పుత్రకామేష్టిని చేయించి యాగమందలి చరుపును అతని భార్యయైన మాలినీ దేవికిచ్చెను.
ఆ యజ్ఞ చరువుయొక్క ప్రసాదమువలన ఆ మహారాణి వెంటనే గర్భమును ధరించి పన్నెండు దీవ్యసంవత్సరములు గర్భమును మోసి బంగారువంటి పుత్రువి కనెను. కాని ఆ శిశువు సమస్తావయవములలో నున్నను, కనుపాపలు తిరిగిపోయి మృతుడుగనే జన్మించెను.
అందువలన మాలినీదేవి పుత్రశోకముతో మూర్ఛపడిపోగా ఆమె ఆంతఃపురముననున్న స్త్రీలు, బంధువులయొక్క భార్యలు అందరు దుఃఖము పొందిరి.
రాజు ఆ శిశువును తీసికొని శ్మశానమునకు వెళ్ళినను, పుత్ర ప్రేమచే ఆ శిశువును వదలలేక జ్ఞానము నశించగా తన ప్రాణములను వదలుటకు సిద్ధపడెను.
ఆ సమయమున అచ్చటికొక విమానము వచ్చెను. ఆదిపరిశుద్ధమైన స్ఫటికమువలె మీక్కిలి తెల్లనై, మణులతో ప్రకాశించుచుండెను. ఇంకను ఆది పట్టువస్త్రముతో కప్పబడి, చిత్రవిచిత్రములతో, పుష్పమాలలతో శోభించుచుండెను.
ప్రియవ్రతు డా దేవిని చూడగనే తన ఒడిలోనున్న మృత శిశువును భూమిపై వదలి భక్తి భావముతో ఆమెను పూజించెను.
గ్రీష్మకాలమందలి సూర్యుని ప్రకాశముతో వెలిగిపోవుచున్నప్పటికి, పరమశాంతముగానున్న దేవసేనను చూచి రాజు ఇట్లడిగెను.
ప్రియవ్రత ఉవాచ- ప్రియవ్రతమహారాజిట్లనెను-
ఆమ్మా నీవెవరవు? నీ భర్త ఎవడు? నీ తలిదండ్రులెవరు? నీవలన స్త్రీలందరకు గౌరవమేర్పడుచున్నది అని మహారాజనగా ప్రపంచమునకంతయు మంగళమును కలిగించు ఆ దేవసేన ఇట్లనెను, పూర్వము దేవతలు రాక్షసులకు భయపడగా తానే దేవతలకు సేనగా మారి వారికి విజయము చేకూర్చినందువలన ఆమె దేవసేన యైనది.
దేవసేనోవాచ- దేవ సేన ఇట్లు పలికెను-
మహారాబి! నేను బ్రహ్మదేవునియొక్క మానసపుత్రిని. బ్రహ్మ నన్ను సృష్టించి కుమారస్వామికి భార్యగా వమ్న ఒసగెను. నేను షణ్మాతృ దేవతలలో ప్రఖ్యాతిగాంచిన స్కందసేనను. ప్రకృతియొక్క ఆరవంశను కావున నన్ను షష్ఠి అని కూడ పిలుతురు.
నేను పుత్రులులేని వారికి పుత్రులను, ప్రేయసిలేవి వారికి ప్రేయసిని, దరిద్రులకు ధనమును కర్మలు చేయువారికి శుభకర్మలను, ఇత్తును. జీవులకు పంపదయైనను, ఆపదయినను వారువారు చేసికొన్న కర్మలవలననే జరుగుమ. ఆ కర్మవలన జీవుడు బహుసంతానవంతుడుగామ, సంతాన హీనుడుగామ, రూపవంతుడుగాను, రోగిగాను, మృతపుత్రుడుగామ, చిరంజీవిగాను అగుచున్నాడు.
అందువలన కర్మ అన్నిటికంటే గొప్పదని వేదములందు చెప్పబడినది. శ్రీహరి ఆయా జీవులు చేసిన కర్మల ననుసరించి ఆయా ఫలితముల నొసగుచున్నాడు.
షష్టీదేవి మహారాజుతో పై విధముగా అని చనిపోయిన ఆ బాలుని చేతిలోనికి తీసికొని అతనిని బ్రతికించెను. తనపుత్రుడు బ్రతికి నవ్వుతున్నట్లు కన్పించెను. అప్పుడు దేవి బాలకుని పట్టుకొని ఆకాశములోకి ఎగిరిపోపుటకు ప్రయత్నించినది, అప్పుడా రాజు తన పుత్రుడు బ్రతికినను సంతోషముతో ఉండగానే, దేవసేన శిశువుమ తన లోకమునకు తీసికొని పోమండుట చూచి పెదవులు గొంతు, నాలుక ఆరిపోగా. బాధతో ఆ దేవిని మరల స్తుతించెను,
రాజు చేసిన ప్రతికి సంతోషపడి ఆ దేవీ అతనితో ఇట్లనెను.
దేవసేనోవాచ- దేవసేన ఇట్లు పలికెను-
ప్రియవ్రత మహారాజా! నీవు ముల్లోకములకు రాజుపు, నీ తండ్రి మనుసైన స్వాయంభువు. అటువంటి వీపు నా పూజను స్వయముగా చేయుచు ఇతరులతో కూడ చేయింపుము. అప్పుడు నేను నీ పుత్రుని నీకు తిరిగి ఇత్తును.
నీ కుమారుడు సువ్రతుడను పేరుతో మంచిగుణములు కలవాడై, పండితుడై, తన గతస్మతి కలవాడై యుండును. అతడు శ్రీమన్నారాయణభక్తుడగును. అట్లే ఆతడు . నూరు రాజసూయయాగములు చేసి ఈ లోకమందున్న క్షత్రియులందరిచే మన్ననలు పొందును. అతడు మదించిన లక్ష ఏనుగుల బలము కలవాడై యోగియై, జ్ఞానియై తపస్వియై, యశస్వియై వెలుగొందుమ.
ఈ విధముగా దేవసేన సుప్రియవ్రత మహారాజుతో అనగా ఆతడు సరే అనెను. అప్పుడా దేవీ ఆ శిశువును మహారాజువకు ఇచ్చెను. ఆతనికి శుభములను కలుగజేయుచు స్వర్గమునకు వెళ్ళాను.
మహారాజు సంతోషముతో ఇంటికివచ్చి ఆందరకు తన పుత్రుని వృత్తాంతమును వినిపించగా వారందరు సంతోషించిరి.
తరువాత మహారాజు తనకు పుత్రుడు కలిగిన వేడుకను జరిపించెను. అట్లే దేవసేనను పూజించి బ్రాహ్మణులకు ధనమును పంచి పెట్టెను.
ప్రియవ్రతుడు ప్రతినెలలో శుద్ధషష్ఠినాడు షష్ఠీదేవీ పూజను ఆంతట అందరిచే చేయించేను. పిల్లలు పుట్టిన ఆరవ దినమున, ఇరువది ఒకటవ నాడు అన్నప్రాశనము చేయించునాడు దేవసేనా దేవిపూజ అంతట జరుగునట్లు ఏర్పాటుచేసెను. ఆట్లే తానుకూడ ఆ దీనములలో దేవిని పూజించెను.
నారద! “దేవసేన" యొక్క ధ్యానశ్లోకములను, స్తోత్రమును, పూజావిధిని వినుము. ఇదీ కొథుమశాఖయందు కన్పించును, దీనిని ధర్మదేవత నాకు తెల్పెను.
. తొలుత సాలగ్రామమున లేక కలశమున కాకపోయినచో వటవృక్షముయొక్క మూలమున లేక గోడపై షష్ఠీదేవి బొమ్మను వేసి ఆమెను పూజింపవలెను.
ఆమె ప్రకృతియొక్క ఆరవ అంశ, పరిశుద్ధురాలు, మంచి ప్రతిష్ఠగలది. చక్కని పుత్రులనిచ్చునది. శుభములనిచ్చునది. కృపామయి. లోకములకు తల్లి, తెల్లని చంపక పుష్పములవంటి కాంతిగలది. రత్నాలంకారములు కలది పవిత్రమైనది. అట్టి దేవసేనను నేను సేవించుచున్నాను.
ఈవిధముగా ధ్యానించి పుష్పములను సమర్పించి మరల మూలమంత్రముచే ధ్యానము చేయవలెను. ఆ తరువాత ఆర్యము పాద్యము, ఆచమనీయము, గంధము, ధూపము, దీపము నైవేద్యము మొదలగు షోడశోపచారములతో దేవసేవా దేవిని పూజింపవలెను.
ఓం హీం షష్ఠిదేవ్యై స్వాహా ఆను ఆష్టాక్షరీ మంత్రము మూలమంత్రము. ఆ మంత్రమును యథాశక్తి జపించవలెను. దీనిని లక్షమార్లు జపము చేసినచో సంతానము కలుగునని బ్రహ్మదేవుడు చెప్పెను.
నారదమునీ! దేవసేనాదేవియొక్క సోత్రము అందరకు శుభమును కలిగించును, అన్ని కోరికలు తీర్చును. ఇది వేదములందు నిగూడమై ఉన్నది. ఆ స్తోత్రమును నీకు వినిపించెదను.
ప్రియవ్రత ఉవాచ- ప్రియవ్రత మహారాజిట్లనెను-
షష్ఠీదేవి మహాదేవి సిద్ధిరూపిణి, శాంతి స్వరూపిణి, సుఖమును ప్రసాదించునది. మోక్షమును కల్గించునది. వరములను, పుత్రులను, ధనమును ఇచ్చునది. శక్తిరూపిణియైన ప్రకృతియొక్క ఆరవ అంశ. సిద్ధరూపిణి మాయాస్వరూపిణి, సిద్ధయోగిని, పరా, పారద, సార, పారద, పారారూపిణి, బాలురకు ఆధిష్టానదేవత. కల్యాణముల కలిగించునది. కల్యాణ రూపిణి. సమస్తకర్మల ఫలితము నొసగునది. భక్తులకు ప్రత్యక్షమగువది. పూజించ తగినది. కుమారస్వామికి భార్య, దేవతలను రక్షించునది. శుద్ధసత్వస్వరూప. మానవులందరిచే నమస్కరించదగినది. హింస, క్రోధము మొదలగు దుర్గుణములు లేనిది, అట్టి షష్ఠి దేవతమ నేను మాటిమాటికి నమస్కరింతును..
ఓ తల్లీ! నీవు నాకు ధనమును, భార్యను, పుత్రుని, ధర్మమును, కీర్తిని, భూమిని, సత్సంతానమును, శుభమును, జయమును, కల్గింపుము.
ఈవిధముగా ప్రియవ్రతుడు షష్ఠీదేవిని స్తుతించి ఆమె అనుగ్రహమునువలన తన పుత్రుని పడసెను.
షష్ఠిదేవతయొక్క ఈ స్తోత్రమును సంవత్సర పర్యంతము ఎవరు విందురో వారికి పుత్రులు లేనిచో చిరంజీవియగు పుత్రుని, పొందుదురు. ఆ స్త్రీ ఎంత గొడ్రాలైనను సమస్త పాపములనుండి ముక్తిపొంది వీరుడు, మంచిగుణవంతుడు, విద్యావంతుడు కీర్తివంతుడు మంచి ఆయుస్సు కలవాడగు పుత్రుని ప్రసవించును. ఒకే సంతానము కలిగిన స్త్రీ లేక సంతానము కలిగిన తరువాత ఆ పంతానము నశించు స్త్రీ సైతము ఒక సంవత్సరకాలము ఈస్తోతమును భక్తితో పిన్నచో దీర్గాయుస్సు కల సంభావమును పొందును. అనారోగ్యముగా తమ సంతానమున్నచో ఆ శిశువు తలిదండ్రులు ఒక నెలవరకు నీయమముగా షష్ఠీదేవియొక్క స్తోత్రమును వినినచో ఆ శిశువు షష్ఠీదేవియొక్క అనుగ్రహమువలన రోగనిర్ముక్తుడగును.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండమును నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన షష్ఠిదేవత ఉపాఖ్యానము షష్ఠీదేవి జననము, ఆమె పూజా స్తోత్రాదులు గల నలభైమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 42 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
In this synthesizing chapter, Śrī Sūta Gosvāmī provides a comprehensive recapitulation of all the secondary manifestations, partial expansions, and gentle forms of Parā Prakṛti described in the preceding chapters. He summarizes the divine roles of Sarasvatī, Lakshmī, Gaṅgā, Tulasī, Sāvitrī, Svāhā, Svadhā, Dakshiṇā, Shashṭhī, Mangalachaṇḍikā, Manasā, and Surabhi, illustrating how each goddess fulfills a specific cosmic function necessary for maintaining physical order and spiritual elevation. The text re-emphasizes that all these diverse divine mothers are unified expressions of the single, supreme divine energy of Lord Śrī Kṛshṇa.