నారద ఉవాచ- నారదుడు నారాయణునితో ఇట్లనెను-
నారాయణమునీ! గోలోకమునుండి మనపాదేవిని అభిషేకించుటకు వచ్చిన సురభి ఎవరు? ఆ సురభి ఎచ్చట ఏవిధముగా పుట్టినదో దాని చరిత్ర ఏమిటో తెలుసుకొనగోరుతాను. వారాయణ ఉవాచ. వారాయణుడిట్లనెను.
గోవులకు ఆధిష్టాన దేవత, అన్నీ గోవులకు తల్లి, గోపులలో ప్రధానభూతన సురభి గోలోకమున పుట్టినది. వారదా సృష్టి ప్రారంభమును గూర్చి మీకు చెప్పెదను, సురభియొక్క జన్మ ఆ సమయమున బృందావనమున జరిగినది.
ఒకప్పుడు శ్రీకృష్ణుడు రాధాదేవి గోపికా స్త్రీలతో కలసి బృందావనమునకు వెళ్ళెను. అచ్చట రాధాదేవితో రహస్యముగొనున్న సమయమున స్వపరుడైన ఆ పరమపురుషునకు పాలు తాగవలెనని కోరిక కలిగినది. అందువలన వెంటనే తన ఎడమ భాగముమండి దూడలో, పాలనిచ్చు సురభిని సృష్టించెను.
దూడలోనున్న సురభిని చూచి పరమాత్మ దాని పాలను రత్నభాండమున పిదికిపట్టేను, సురభియొక్క పాలు అమృతమువలె జన్మమృత్యువులను పోగొట్టును. వేడిగామన్న ఆ పాలను శ్రీకృష్ణుడు తాగెను. తరువాత రత్నభాండములోనున్న ఆ పాలు ఒలికి శతయోజన విస్తారమైన క్షీర సరోవరముగా మారెను. ఆ సరోవరము గోపికలకు రాధాదేవికి క్రీడించుటకు ఏర్పాటు చేసికొన్న దిగుడుబావియైనది. దాని మెట్లు గోడలు రత్నములచే కట్టబడినవి.
ఆ సురభియొక్క , రోమకూపములనుండి అనేక లక్షలకోట్ల కామధేమపులు, దూడలతో పుట్టినవి. ఆ కామధేమపుల దూడలకు దూడలు, వాటికి మరల దూడలు ఇట్లు ఆపులు అసంఖ్యాకముగా గోలోకమున ఏర్పడినవి. గోవుల సృష్టి ఈవిధముగా జరిగినది.
పూర్వము పరమాత్మయగు శ్రీకృష్ణుడు సురభిని పూజించెను. ఆ పూజ ముల్లోకములందు చాలా గొప్పవిది. ఆ తరువాత శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞవలన దీపావళి పండుగ దాటిన తరువాత తెల్లవారీ సురభిపూజను భూలోకమున జరుపుచుండినట్లు ధర్మునివలన వింటిని.
ఆ సురభియొక్క ధ్యానము, స్తోత్రము, మూలమంత్రము వేదమున చెప్పబడినవి. వాటిని నీకిప్పుడు వివరింతుమ.
ఓం సురభ్యై నమః అను ఆరక్షరముల మంత్రమును లక్షమార్లు జపించినచో మంత్రసిద్ది జరుగును, అదీ భక్తులకు కల్పవృక్షము వంటిది. సురభియొక్క పూజావీధీ, ధ్యానము యజుర్వేదమున కన్పించును.
సురభి బుద్ధిని, వృద్ధిని, ముక్తిని కలిగించును. సమస్తమైన కోరికలను తీర్చును, సురభి లక్ష్మీ స్వరూపము, రాధాదేవియొక్క సహచరి. గోవులకన్నిటికి అధిష్టాన దేవత. గోవులకు మూలమైనది. వాటికన్నిటికి తల్లి, మిక్కిలి పవిత్రమైనది. పూజించదగినది. ఆ సురభీదేవి వలన ప్రపంచమంతయు పరమపవిత్రమైనది.
ఆట్టి సురభీదేవిని నేనెల్లప్పుడు ధ్యానింతును.
సురభిని కలశమందైనను, ఆవు శిరస్సునందైనను, ఆవులను కట్టివేయు స్తంభమునందైనను, సాలగ్రామమున, జలమున, అగ్నియందు వీటిలో దేనియందైనను దీపావళి పండుగ మరుసటి దీనమున పూర్వాష్ణ కాలమున సురభిని ఆవాహన చేసి పూజ చేయవలెను.
ఒకప్పుడు వరాహ కల్పమున శ్రీమన్మహా విష్ణువుయొక్క ఆజ్ఞవలన సురభి పాలిచ్చుట మానివేసెను. అందువలన దేవతలందరు చాలా బాధపడి బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని స్తుతించగా అతని ఆజ్ఞననుసరించి దేవేంద్రుడు సురభిని ఈవిధముగా స్తుతించెను.
మహేంద్ర ఉవాచ- దేవేంద్రుడిట్లనెను-
దేవి, మహాదేవి అగు సురభికి నమస్కారము. ఆవులకన్నిటికి మూలరూపము జగన్మాతవగు నీకు నమస్కారము. రాధాదేవికి ప్రియురాలు, లక్ష్మీదేవియొక్క ఆంశవగు నీకు నమస్సులు. శ్రీకృష్ణునకు ప్రియమైనది గోవులకు తల్లివగు నీకు నమస్కారములు. శోభ, ధనము, బుద్ధి, శుభములు, గోవులను ఇచ్చు నీకు నమస్కారములు. ప్రసన్న బుద్ధి, శుభములు, గోవులను ఇచ్చు నీకు నమస్కారములు. ప్రసన్న స్వరూపిణి, యశోదాదేవికి సౌఖ్యమును కలిగించిన నీకు నమస్కారములు.
మహేంద్రుడు చేపివ స్తోత్రమును విని లోకమాత, సనాతనియగు సురభి బ్రహ్మలోకముననే కనిపించి మహేంద్రునకు కోరిన కోరికలనన్నిటినీ ఇచ్చి గోలోకమునకు పోయెను. అందువలన దేవతలందరు సంతోషముతో తమతమ స్థానములకు చేరుకొనిరి.
అప్పటినుండి ప్రపంచమున పాలు మరల కనపడసాగినవి.
పాలవలన నేయి కలిగెను. నేయివలన యజ్ఞములు చేయుటకు వీలయ్యెను. యజ్ఞములవలన దేవతలకు సంతోషము కలిగినది.
మహాపుణ్యప్రదమైన ఈ స్తోత్రమును భక్తితో ప్రతిదినము చదివినచో ఆతడు గోసంపద కలవాడగును. ధనవంతుడు, కీర్తివంతుడు, పుణ్యవంతుడగును. ఆతడు సమస్త తీర్థములలో స్నానముచేసిన పుణ్యమును, సమస్త యజ్ఞముల వాచరించిన సుకృతమును పొందును. ఇంకను ఇహలోకమున సుఖముగానుండి చివరకు గోలోకమునకు పోవును. ఈస్తోత్రమును సర్వదా పఠించు పుణ్యాత్మునకు పునర్జన్మ అనునది లేనేలేదు.
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారద నారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన సురభి చరిత్రలో సురభియొక్క పుట్టుక, దాని పూజాదులను తెలుపు నలభై ఏడవ అధ్యాయముపమాప్తము.
Summary of chapter 46 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Following the dramatic fall of Mahishāsura, the entire universe resounded with cosmic joy, showered celestial flowers from the heavens, and sang songs of victory. Lord Brahmā, Lord Śiva, Lord Indra, and all the Devas assembled on the battlefield, falling prostrate before Goddess Durgā and offering magnificent hymns of devotion that glorified Her as Mahāmāyā, Chandī, and the supreme savior of the universe. Touched by their sincere worship, Goddess Durgā blessed the Devas with peace, promising that whenever demonic forces rise to oppress the righteous, She will manifest again to restore cosmic equilibrium.