శ్రీనారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
యమధర్మరాజు సావిత్రికి శ్రీమన్నారాయణుని మంత్రమును విధిపూర్వకముగా ఉపదేశించీ ఆ తరువాత అశుభకర్మల విపాకమెట్లుండునో తెల్పసాగెను.
యమ ఉవాచ- యమధర్మరాజు ఇట్లు అనెను-
ఓసావిత్రి! నీవు అనేక పుణ్యకర్మల ఫలితమెట్లుండునో తెలిసికొంటివి కదా! ఇప్పుడు నీవు కోరినట్లు ఆశుభకర్మల విపాకమెట్లుండునో తెలిపెదను. జీవుడు పుణ్యకర్మలు చేసి అనేక విధములైన స్వర్గములను పొందుచున్నాడు. అట్లే అశుభ కర్మలవలన అనేకవిధములైన నరకములను పొందుచున్నాడు.
పురాణములలో నరకముల పేర్లు అనేక విధములుగా కన్పించుచున్నవి. అవి జీవులకు చాల క్లేశమును కలిగించును. చాలా భయంకరమైనవి. చాలా ఘోరమైనవి. చాలా నీచమైనవి కూడ. అట్టి నరకకుండములు ఎనుబది యారు, వేదములలో ప్రసిద్ధముగా కన్పించుచున్నవి.
అవి వహ్నికుండము, తప్తకుండము, భయంకరమైన క్షమ కుండము, మలకుండము, మూత్రకుండము, సహించరానీ శ్లేష్మకుండము. గరళకుండము, దూషికాకుండము, వసాకుండము, శుక్రకుండము, రక్తకుండము, అశ్రుకుండము, శరీరమలున్నకుండము, చెవిలోని మలమున్న కుండము, మజ్ఞకుండము, మాంసకుండము, నఖకుండము, రోమకుండము, కేశకుండము, ఆస్థికుండము, చాలామేడిగామండి భయంకరమైన తామకుండము, లోహకుండము, వాడియైన ముళుకలకుండము, విషకుండము, ధర్మకుండము, మిక్కిలి మరుగుతున్న సురాకుండము అనునవి.
ఇంకను ప్రతప్త శైలకుండము, దంతకుండము, కృమి కుండము, పూయకుండము, సర్పకుండము, మశకకుండము. దంకుండము, గరళకుండము, వజ్రదంష్ట్రకుండము, వృశ్చిక కుండము, శరకుండము, శూలకుండము, ఖడ్గకుండము, గోళకుండము, సక్రకుండము, కాకకుండము, సంచాలకుండము, వాజకుండము, బంధకుండము, తప్తపాషాణకుండము, తీక్షపాషాణకుండము, లాభాకుండము, అసికుండము, చూర్ణకుండము, చక్రతుండము, వఱకుండము, కూర్మకుండము, జ్వాలాకుండము, భస్మకుండము, చెప్తసూర్యకుండము, అసిపత్రకుండము, క్షురధాగకుండము, షూచీముఖ కుండము, గోధోముఖకుండము, సక్రముఖకుండము, గజదంశకుండము, గోముఖకుండము, కుంభీపాకకుండము, కాలసూత్రకుండము, ఆటోదకుండము, అరుంతుదకుండము, పాంశుభోజకుండము, పాశవేష్టకుండము, శూలప్రోతకుండము, ప్రకంపన కుండము, ఉల్కాముఖ కుండము, ఆంధముఖకుండము, వేధనకుండము, దండతాడనకుండము, జాలాబంధకుండము, దేహచూర్ణకుండము, దళనశోషణకుండము, సర్పజాలాముఖ కుండము, జిహ్మకుండము, ధూమాంధకుండము, నాగవేష్టన కుండము, అసునవి నరకములో వివిధములైనవి.
ఓసావిత్ర! ఈ నరకములన్నీ పాపాత్ములకు ఆధికమైన దుఃఖముమ కలిగించును.
పై నరకములనన్నిటినీ దండము, శూలము, పాశము, శక్తి, గద కలిగినవారు, మదము కలవారు, భయంకరులు, తమోగుణము కలవారు, దయలేని వారగు. కింకరులు కాపాడుచున్నారు. పోరు. తేజసమాయుక్తులు. వారి కండ్లు రాగివలె పింగళవర్ణమున నుండును. పాపము చేసికొన్న సమస్త జీవులకు మృత్యువాసన్నమైనప్పుడు వారు కన్పింతురు. తమతమ ధర్మములను చారించుకొనుచున్న శైవులు, శాక్తేయులు, సూర్యభక్తులు, గణపతి భక్తులకు పుణ్యము చేసికొన్న వారికి, సిద్ధయోగులకు వారెన్నడు కన్పించరు. అట్లే తమ తమ ధర్మములను చక్కగా ఆచరించుచు తమ ఇష్టదేవతను స్వప్నమందైనను సందర్శించిన వైష్ణవులకు యమకింకరులెన్నడు కన్పించరు.
ఓ సావిత్రి! నీకు నరక కుండములెన్ని కలవో వాటి పేర్లేమిటో కూడా తెలిపితిని. ఇప్పుడు ఆయా నరక కుండములందు నివసించువారిని గూర్చి వివరింతును. జాగ్రత్తగా వినుమని యమధర్మరాజు సావిత్రితో పలికెను.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున సావిత్రి ఉపాఖ్యానమున కనిపించు యమధర్మరాజు సావిత్రీ సంవాదమున నరకములోని కుండ సంఖ్యను వివరించు ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 29 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
The narrative moves to the glorification of Goddess Lakshmī, the fourth primary manifestation of Parā Prakṛti who reigns as the eternal consort of Lord Śrī Nārāyaṇa and the supreme deity of fortune, beauty, and prosperity. Manifesting from the mind of Lord Śrī Kṛshṇa in Goloka and later emerging from the churning of the milk ocean, Goddess Lakshmī bestows both material abundance and spiritual wealth upon Her devotees. The text explains Her various expansions such as Rāja-Lakshmī in royal palaces, Gṛha-Lakshmī in virtuous households, and Mahā-Lakshmī in Vaikuṇṭha, warning that arrogance, impurity, and disrespect toward women cause Her to instantly depart from any home or kingdom.