బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

6 - సరస్వత్యుపాఖ్యానము

నారాయణ ఉవాచ- నారాయణు డిట్లనెను.

వైకుంఠములో నారాయణునీ సమీపమున నిత్యము నివసించు సరస్వతీదేవి గంగాదేవి యొక్క శాపమువలన తన అంశతో ఈ భారత వర్షమున నదీ రూపమున ఆవతరించినది. ఆ సరస్వతీ నది పుణ్యములను కల్గించును. పుణ్యతీర్థముల స్వరూపిణి. పుణ్యవంతులచే సేవింపబడుచున్నది. తాపసుల యొక్క తపఃఫలస్వరూపిణి. తపోరూపిణి. చేసిన పాపములనన్నిటినీ సమూలముగా నాశనము చేయును. ఈ సరస్వతీ నది యొక్క నీటిలో స్నానము చేయువారు ఎల్లప్పుడు వైకుంఠమున శ్రీహరి సమీపమున ఉందురు. వారి సర్వపాపములన్నియు నశించును, చతుర్దశినాడు, పూర్ణిమనాడు, ఆక్షయ తదియనాడు, సాయంకాల సమయమున, గ్రహణసమయమున, వ్యతీపాతకాలమున, ఇతర పుణ్య దీనములలో శ్రద్ధతో స్నానము చేసినమ, శ్రద్ధలేకుండ స్నానము చేసినను వైకుంఠమున శ్రీహరి సారూప్యమును తప్పక పొందుదురు.

సరస్వతీ మంత్రమును ఒకనెల నిష్ఠతో జపించినచో మిక్కిలి మూర్ఖుడైనను మహావిద్వాంసుడు కాగలడు. అట్లే సరస్వతీ నదీ జలమున ప్రతి దినము స్నానము చేయు మానవునకు పునర్జన్మ అనునది ఉండదు.

ఈవిధముగా సుఖమును, మోక్షము నిచ్చు భారతీదేవి స్తోత్రమును తెలిపితిని. ఇంకను చెప్పవలసినదేమైన ఉన్నచో ఆడుగుము అని నారాయణ మునీ పలికెను.

సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లు పలికెను.

ఓ శౌనక మహర్షీ ! నారదముని నారాయణుని మాటలు విని తిరిగి సందేహము తొలగించు కొనుటకు ఈ విధముగా ఆడిగెను.

గంగా సరస్వతీ దేవతలకేందుకు కలహమేర్పడినది. ఆ కలహమున సరస్వతీదేవి పుణ్యప్రదమైన నదిగా ఎందుకు మారినది?

వేదసారములైన కథలను వినవలెనని ఉన్నది. వాటిని ఎన్ని మార్లు విన్నను తృప్తి కలుగదు. మంచివాటి విషయములలో తృప్తి ఎన్నడును కలుగదుకదా.

సత్వగుణస్వరూప, మానవులకెప్పుడును పుణ్యమును కలిగించునది, శాంతురాలైన గంగ పూజ్యురాలైన సరస్వతినేందుకు శపించినది? ఈ వృత్తాంతము పురాణములలో ఎచ్చట కన్పడదు. ఆ విషయమును సమగ్రముగా వివరించుడు.

నారాయణ ఉవాచ- నారదుడిట్లడిగెను-

నారద! స్మరించినంత మాత్రమున అన్ని పాపముల తొలగించు ప్రాచీనమైన ఈ కథను చెప్పెదను.

శ్రీహరికి లక్ష్మి, గంగ, సరస్వతి అను భార్యలు ముగ్గురు కలరు. వారు శ్రీహరి సన్నిధిలో అన్యోన్యముగా ప్రేమతో ఉందురు. ఒకనాడు గంగాదేవి విష్ణువును కామములో చిరునవ్వుతో చూచెను. అప్పుడు విష్ణువు కూడ ఆమె ముఖమును చూచి నవ్వెను. దీనిని చూచి లక్ష్మీదేవి సహించినను, సరస్వతీదేవి మాత్రము ఓర్చుకోలేకపోయెను. సర్వస్వరూపిణియగు లక్ష్మీదేవి సరస్వతీ దేవికి నచ్చ చెప్పినను వాణి క్రోధావిష్ణురాలై శాంతిని మాత్రము పొందలేదు. ఆ విధముగా ఎఱ్ఱనైన ముఖములో, ఎరుపెక్కిన కళ్ళలో కోపముతో వణుకుచున్న పెదవులతో, కంపించుచుండెను.

సరస్వత్యువాచ- సరస్వతీ దేవి ఇట్లనెను-

మంచి భర్త తన భార్యలందరిపై సమాన భావము కలిగి యుండును. భర్త దుష్టుడైనచో దీనికి విపరీతముగా ఎవరినో ఒకరిని ఎక్కువగా ప్రేమించుచుండును. ఓగదాధరుడవైన నారాయణ! నీ చేష్టలవలన నీకు గంగపై మిక్కిలి ప్రేమ ఉన్నట్లు కమలయైన లక్ష్మీదేవిపై కూడా ప్రేమ ఉన్నట్లు తెలియుచున్నది. అట్లే నీకు నాపై ప్రేమలేదు, గంగకు పద్మకు ఇద్దరిమధ్య సఖ్యమున్నట్లున్నది. అందువలననే గంగాదేవి యొక్క ప్రవర్తనను లక్ష్మీదేవి అనుమతించినది. అందువలన నేను బ్రతికి ప్రయోజనము లేదు.

భగవాన్! నిన్ను విద్వాంసులు సర్వేశ్వరుడవనీ, సత్యస్వరూపుడవని అందురు. కాని నా దృష్టిలో వారు మూర్ఖులు. వేదార్థమెరుగని వారు. నీ మనోభావములను గుర్తించనివారు.

ఈవిధముగా కోపముతో మాట్లాడుచున్న సరస్వతీదేవి మాటలు విని నారాయణుడు మనస్సులో బాగుగా ఆలోచించి అక్కడినుండి బయటకు వెళ్ళిపోయెను.

 శ్రీమన్నారాయణుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత సరస్వతీదేవి గంగను వినరానిమాటలతో ఇట్లనెను.

"ఓసిగ్గులేనిదానా కాముకురాలవైస్వామి {భర్త నావాడన్నట్లు గర్వంగా ప్రవర్తించుచు భర్త నిన్నే అధికముగా ప్రేమించుచున్నట్లు దానిని అందరకు తెలుపుటకు ప్రయత్నించుచునోపు, శ్రీహరీ సన్నీధిలోనే నీ గర్వమునడంతును. అప్పుడు నీప్రియుడేమి చేయునో చూచెదను.” అని గంగాదేవి యొక్క వెంట్రుకలు పట్టుకొని లాగుటకు ప్రయత్నించుచున్న సరస్వతీదేవిని మధ్యలో ఉన్న లక్ష్మీదేవి నివారింపజూచెను.

అప్పుడు సరస్వతి లక్ష్మీదేవిని మిక్కిలి కోపముతో చూచి ఇక్కడ విపరీతమైన కార్యము జరుగుచున్నను వృక్షమువలె, నదివలె మాట్లాడక ఉన్నందువలన నీవు వృక్షముగా, నదిగా మారుమని శాపమును పెట్టెను.

సరస్వతీదేవి తనకు శాపమిచ్చినను లక్ష్మీదేవి కోపగించక దు:ఖముతో ఆ సరస్వతీదేవి చేతిని పట్టుకొని నిలుచుండెను.

సరస్వతీదేవి కోపముతో చాలా ఉద్ధతగానున్నట్లు భావించిన గంగ, లక్ష్మీదేవితో కోపముతో ఈవిధముగా అనెను.

గంగోవాచ- గంగాదేవి ఇట్లనెను

ఓ లక్ష్మీదేవి చాలా కోపముతోనున్న ఈ సరస్వతిని వదలి పెట్టుము, ఈమె, వాక్కులకు అధిష్టాన దేవతయైనప్పటికిని, మంచి మాటలు మాట్లాడువది కాదు. కలహములు పెట్టుకొను స్వభావము కలది. ఆమెకు 'యోగ్యత ఎంతవరకున్నదో ఆమె శక్తి కూడ ఆంతనే ఉన్నది. ఆమె నాతోటి మాత్రమే కాదు పెట్టుకొననిమ్ము. ఇద్దరి బలము ప్రభావము అందరికి తెలియును' అవి గంగాదేవి సరస్వతి దేవికి ఈ విధముగా, శాపమునిచ్చెను.

సరస్వతీ దేవి! నీవుకూడ నదిగా మరి భూలోకమునకు వెళ్ళుము. పాపులున్న ప్రాంతములో ప్రవహించుటవలన వారి పాపములలో కొంత భాగము నీకు తప్పక లభించగలదు.

గంగాదేవి మాటలు విని సరస్వతీదేవి కోపముతో “నీవే భూలోకమునకు వెళ్ళి అచ్చటి పాపాత్ముల పాపమును పొందెద" వని గంగను శపించెను.

అప్పుడు చతుర్భుజుడైన నారాయణుడు, చతుర్భుజులైన తన సహచరులతో అక్కడకు వచ్చెను. అతడు సరస్వతీ దేవి చేయిపట్టుకొని ఆమెను తన రొమ్మునకు చేర్చుకొని వారి కలహ కారణమును, శాపమును తెలుసుకొని సమయానుకూలమైన మాటలతో వారితో ఇట్లనెను. శ్రీభగవానువాచ- భగవంతుడైన నారాయణు డిట్లనెను-

ఓలక్ష్మి! నీవు నీ ఆంశాంశరూపముతో ఆయోనిజ ధర్మధ్వజుడను మహారాజునకు, కూతురుగా పుట్టి దైవాపచారము వలన వృక్షముగా తులసియను పేరుతో ముల్లోకములను పవిత్రము చేయగలవు, ఆట్లే నా ఆంశవలన పుట్టిన శంఖ చూడుడమ రాక్షసునకు భార్యపై తరువాత కొంతకాలమునకు మరల. నాకు భార్యపు కాగలవు. అదే విధముగా వీపు ఈ భరతఖండమున పద్మావతీ యనుపేర సదిగా మారగలవు.

ఓగంగ! నీవు కూడ నీ ఆంశస్వరూపముతో ఈ భరత ఖండమున ముల్లోకములను పవిత్రము చేయు పాపాత్ముల పాపములను ధ్వంసము చేయునదిగా మారగలవు. భగీరథుడను రాజర్షి చేసిన అఖండ తపస్సువలన భాగీరథిగో భూలోకమునకు వచ్చి నా ఆంశస్వరూపుడైన సముద్రునికి, నా అంశాంశరూపుడైన శంతను మహారాజునకు భార్యపు కాగలవు.

ఓ సరస్వతీ! నీవు గంగాదేవియొక్క శాపముననుసరించి భారతదేశమునకు వెళ్ళి, మీ కలహ ఫలమును నీ సవతులతో కలిసి అనుభవింపుము.

వీవు బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మదేవునకు భార్యగా కమ్ము, గంగాదేవి శివలోకమునకు పోవును.

శాంతురాలు, నాభక్తురాలు, మహాపతివ్రత, సుశీల, ధర్మచారిణి యగు లక్ష్మీదేవి సో దగ్గరనే ఉండుమ. ఆ లక్ష్మీదేవియొక్క ఆంశాంశవలన జన్మించిన స్త్రీలందరు పరమ ధార్మికులు, పతివ్రతలు, సౌశీల్యవతులు శాంత స్వరూపలుగా నుందురు.

భిన్న మనస్తత్వం గలిగిన భార్యలు. భృత్యువులు, బంధువులుండుట వేదములకు విరుద్ధమైన విషయము. ఇటువంటి వారెన్నడును మేలుమ కలిగించరు. ఎవరి ఇంట స్త్రీ పురుషుని వలె ప్రవర్తించునో, ఏపురుషుడు పశమై యుండునో వారి జన్మ నిప్పులమగును. వారికి ఆడుగడుగునో కష్టములే దాపురించుము. కలహములు పెట్టుకొనుస్త్రీ, దుర్భాషలాడుసీ వ్యభిచారి - కలపురుషునకు ఇంటికంటే ఆడవిలో ఉండుటయే శ్రేష్టమైనది. ఆడవిలో నీరు, స్థలము, పండ్లు పుష్కలముగా సులభముగా లభించును గదా.

అగ్నిలో సైతముండవచ్చును. క్రూర జంతువుల సమీపముననైన ఉండవచ్చును. కాని దుష్టసీల సమీపములో ఉండలేము. దుష్టస్త్రీల ముఖఙ్వాల కంటే (పరుషమైన మాటలకంటే) వ్యాధి బాలయైనను, ఏషజ్వాలయైనను సులభమైనవే. స్త్రీకి సంపూర్ణముగా లొంగిన మానవుని జీవితము వ్యర్థమైనది. ఆతడు తాను చేసిన సత్కర్మల ఫలితముననుభవింపజాలడు. ఆతడు ఇహలోకమున మీందలు పొందుచు పరలోకమున నరకమును పొందును. కీర్తిలేని - మానవుడు జీవించిసమ చనిపోయినవాడే అగును.

అనేక భార్యలు కలవాడు ఎన్నడు సుఖమనుభవింపలేడు. అందువలన ఒకే భార్య ఉండుట అన్ని విధములుగా శ్రేయస్కరమైనది.

ఓ గంగాదేవి! నీవు శివలోకమునకు పొమ్ము, సరస్వతి నీవు బ్రహ్మలోకమునకు పొమ్ము. సౌశీల్యవతియగు లక్ష్మీదేవి నా దేహముననే ఉండును.

సుశీలవతి, పతివ్రతయగు భార్య కలవానికి ఇహలోకమున స్వర్గసౌఖ్యములు, పరలోకమున మోక్షము కలుగును. శీలవతికాని స్త్రీ యొక్క భర్త దుఃఖములనను భవించును. అతడు బ్రదికియున్నను చచ్చినవానితో సమానము.

ఈ విధముగా జగన్నాయకుడైన నారాయణుడు లక్ష్మీ, గంగా, సరస్వతులతో పలికి ఊరకుండెను.

శ్రీమన్నారాయణునీ మాటలు విని లక్ష్మీ, గంగో, సరస్వతులు ఒకరి నొకరు కౌగిలించుకొని, ఉచ్చ స్వరముతో ఏడ్చిరి. కొంతసేపైన తరువాత వారందరు తమలో తామాలోచించుకొని, శోకభయములతో కన్నీళ్ళు కారగా కంపించుచు నారాయణునితో ఇట్లు పలికిరి.

సరస్వత్యువాచ- సరస్వతి దేవి ఇట్లనెను-

భర్త వదలివేసినచో స్త్రీ లేవిధముగా బ్రతుకుదురు. అందువలన మా జన్మను పవిత్రము చేయు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుము. లేనిచో యోగము ద్వారా ఈశరీరమును . వదిలివేతును. కానిచో ఎత్తైన శిఖరము నుండి కిందపడియైనను దేహత్యాగమును చేయుదును.

గంగోవాచ- గంగాదేవి ఇట్లనెను-

నేను ఏ తప్పువలన వదిలి వేయబడినానో తెలుపుము. లేనిచో నేను దేహత్యాగము చేయుదును. అందువలన నిర్దోషురాలిని చంపిన పాపమును నీవు పొందుదువు. తప్పులేని భార్యను వదలివేసినచో ఆతనికి కల్పకాలము నరకము సిద్ధించును. సర్వేశ్వరుడవగు నీకు దీనిని గురించి ప్రత్యేకముగ చెప్పవలసిన పనిలేదు.

 లక్ష్మీరువాచ - లక్ష్మీదేవి ఇట్లనెను-

హే నాథ! నీవు సత్వగుణ స్వరూపుడవు. నీకు కోపము ఎట్లు వచ్చును. నీవంటివానికి క్షమించేగుణము ఉండును. అందువలన మమ్ములనందరిని క్షమించుము.

సరస్వతీ దేవి శాపముననుసరించి నేను నా అంశస్వరూపముతో భారతదేశమునకు పోయినచో అక్కడ ఎంతకాలముందును? మరల నిన్ను ఎప్పుడు చూడగలను?

నదీరూపమున నున్న నా నీటిలో పాపులు స్నానము చేసి తమ తమ పాపముల నాకిచ్చినచో ఆ పాపములనుండి నాకు విముక్తి ఏవిధముగా లభించును? అట్లే నా ఆంశవలన ధర్మధ్వజ మహారాజ పుత్రికయైన తులసిగా మారినచో తిరిగి నీపరమ పదమునెప్పుడు చేరుకోగలను. తులసిగా వృక్షాధిష్టాన దేవతగా వృక్షరూపమున ఉండుపన్ను ఎప్పుడు పునరుద్ధరించగలవు? ఈవిషయమును దయాసముద్రుడవైన నీవు తెలుపగలవు.

సరస్వతీ దేవి శాపముననుసరించి గంగ భారతదేశమునకు పోయినచో ఆ శాపమునుండి, పాపుల పాపముల నుండి ఎప్పుడు ముక్తి చెందును?

సరస్వతిని బ్రహ్మలోకమునకు పొమ్మని గంగను శివమందిరమునకు పొమ్మని అనిన నీ మాటను ప్రస్తుతము క్షమించి వదలివేయుము.

ఈవిధముగా లక్ష్మీదేవి తన భర్త పాదములను పట్టుకొని నమస్కరించుచు మాటిమాటికి ఏడ్చెను.

భక్త జనముననుగ్రహించు నారాయణుడు ఆమెను తన అక్కునకు చేర్చుకొని చిరునవ్వుతో ఇట్లు పలికెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

ఓ సురేశ్వరి, లక్ష్మీదేవి! నీమాట, నామాట రెండు జరుగునట్లు చేయుదును. ఆదెట్లనగా సరస్వతీదేవి తన ఆరశాంశ స్వరూపమున నదీ రూపు వహించి భారత దేశమునకు వెళ్ళును. అట్లే ఆమె యొక్క అర్థాంశ రూపము బ్రహ్మలోకమునకు పోవును. ఇక మిగిలిన ఆంశలో ఇచ్చటనే ఉండును.

గంగాదేవి భగీరధుని వలన ముల్లోకములను పవిత్రము చేయుటకు భారతదేశమునకు పోవుము. అట్లే చంద్రశేఖరుడైన పరమశివుని శిరస్సుపై చేరి సహజముగా పవిత్రమైనదైనా అతి పవిత్రము కాగలదు.

ఓ లక్ష్మీదేవి నీవు నీ ఆరశాంశాంశ స్వరూపముతో భారతదేశమున "పద్మావతీ" యను నదిగా తులసీ వృక్షముగా జన్మించుము.

కలియుగమున ఐదువేల సంవత్సరముల పిదప నదీ రూపముననున్న మీరందరు మోక్షము చెంది నాసాన్నిధ్యమున కేతెంతురు.

సమస్త జీవులకు ఆపదలు సంపత్తుకు కారణమగుచున్నవి. ఈ సంసారమున ఆపదలు లేకుండా ఆభివృద్ధి ఎవరికి జరుగును.

నామంత్రమును ఉపాసన చేయు భక్తులు స్నానము చేయుట వలన పాపులను తగిలిన పాపమునుండి మీకు మోక్షము లభించును.

ఈభూమిపై నున్న అంతులేని తీర్థములన్ని నా, భక్తుల స్పర్శవలన దర్శనము వలన పునీతములగును. నామంత్రమును ఉపాసన చేయు భక్తులు ఈ భూమిని పవిత్రమొనర్చుటకై తిరుగుచున్నారు. నా భక్తులు ఎక్కడ ఉందురో పాదప్రక్షాళనము చేయుదురో ఆ స్థలము అత్యంత పవిత్రమైన మహాతీర్థము కాగలదు. నా భక్తులయొక్క స్పర్శవలన, దర్శనమువలన స్త్రీ హత్య చేసిన వాడైనను గోవులను చంపినను, బ్రాహ్మణుని చంపినను, గురుభార్యా సమాగమము చేసినను, కృతఘ్నుడైనను పవిత్రుడై జీవన్ముక్తుడగును. అట్లే ఆయుధములను నమ్ముకొని బ్రతుకు సైనికుడు మొదలగువారు, ఇతరులకు కాగితములు వ్రాయుచు బ్రతికి లేఖకులు, శూద్రయాజకుడు, వృషభమునెక్కి తిరిగేవాడు, విశ్వాసములేనివాడు, మిత్రులను చంపినవాడు, తప్పుడు సాక్ష్యములు చెప్పువాడు, తన వద్ద దాచి యుంచిన సొమ్మును అపహరించువాడు, ఋణగ్రస్తుడు, జారత్వమువలన పుట్టినవాడు పుంశ్చలీపతి, పుంశ్చలీపుత్రుడు, అన్యాయమైన వడ్డీలవల్ల బ్రతుకుపాడు వీరందరు నా భక్తుల స్పర్శవలన దర్శనమువలన ముక్తిని పొందుదురు. అదేవిధముగ శూద్రుల ఇంటిలో వంటచేయువాడు, దేవాలయమున పూజలు చేసి బ్రతుకువాడు, దీక్షితుడు కానీవాడు, రావిచెట్టును పడగొట్టినవాడు, నా భక్తులను నిందించువాడు, నాకు నివేదింపబడనీ అన్నము తినువాడు. తల్లిని, తండ్రిని, భార్యను, పుత్రులను, సోదరునీ, గురువుయొక్క వంశమును, సోదరిని, సంతానములేని బంధువును, అత్తమామలను పోషింపనివాడు మహాపాతకి ఐనను నా భక్తుల స్పర్శ దర్శనమువలన అతడు పవిత్రుడగును. అట్లే దేవ ద్రవ్యమును అపహరించువాడు బ్రాహ్మణద్రవ్యమును అపహరించువాడు. కన్యాశుల్కము తీసికొన్నవాడు, లత్తుక, లోహద్రవ్యములు. రసద్రవ్యములను అమ్ముకొనువాడు, శూద్రశవములను దహించువాడు వీరందరు కూడ మహాపాతకము చేసి కొన్నవారు. వీరు సైతము నా భక్తుల పాదస్పర్శవలన, వారి దర్శనమువలన పవిత్రులగుదురు.

లక్ష్మీరువాచ- లక్ష్మీదేవి ఇట్లు పలికెను-

భక్తుల ననుగ్రహించు పరమాత్మా! నీ భక్తులు పాదస్పర్శవలన, వారి దర్శనమువలన హరిభక్తిరహితులు, మిక్కిలి గర్వించువారు, ఆత్మప్రశంస చేసికొనువారు, సాధుపురుషులను నిందించు దుష్టులు పునీతులగుదురు. ఆ హరిభక్తులు స్నానము చేసినందువలన సమస్త పుణ్యతీర్థములు, వారి పాదధూళివలన, పాదోదకమువలన భూమి పవిత్రమగును. దేవతలందరు ఆహరి భక్తుల సందర్శనమును, పాదస్పర్శమును ఎల్లప్పుడు కోరుకొందురు. ఆవైష్ణవులలోటి సమాగమము అందరకు లాభమును చేకూర్చును. పుణ్యతీర్థములు, దేవతా విగ్రహములు పవిత్రము చేయ బోలని వారిని విష్ణుభక్తులు క్షణములో పునీతులుగా నొనర్తురు. అందువలన ఆ హరిభక్తుల లక్షణము తెలుపుము.

సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను-

మహాలక్ష్మీ దేవి మాటలు విని నారాయణుడు చిరునవ్వుతో నిగూఢతత్వమగు విషయమునిట్లు చెప్పెను.

శ్రీనారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

ఓ లక్ష్మీదేవి! నా భక్తుల లక్షణము వేదపురాణములకు సహితముందనిది. పుణ్యస్వరూపమైనది. పాపముల పోగొట్టువది. ముక్తిని కలిగించునది కావున దీనిని దుర్మార్గులకు చెప్ప తగదు. నీవు పరమ పవిత్రమైన దానవు. నా ప్రాణములతో సమానమైన దానవు కావున నీకు నా భక్తుల లక్షణమును చెప్పుచున్నాను.

ఏ భక్తుని చెవీలో విష్ణుమంత్రము గురువుయొక్క ముఖము నుండి ప్రవేశించునో ఆ భక్తుడు వేద వేదాంగములకంటె పవిత్రుడు. ఆతని జన్మవలననే ఆతని పూర్వీకులు నూరు తరములవారు పవిత్రులగుదురు. వారు నరకమందున్నా, స్వర్గమందున్నా వెంటనే ముక్తిని పొందుదురు. అతని పూర్వీకులు ఎట్టి జన్మపొందినను జీవన్ముక్తులై కాలక్రమమున శ్రీహరి స్థానమును పొందుదురు. నా భక్తి కలవాడు, నాపూజలు సేయువాడు. నావంటి గుణములు కలవాడు ఎల్లప్పుడు కీర్తింపబడును. నా కథలు వినినంతమాత్రమున ఆనందముతో పులకాన్వితుడై కన్నీరుకారగా తనను తాను మరచిపోవును, అతనికి నాసేవ తప్ప ముక్తి సుఖము, స్వర్గాది భోగములవసరములేదు. వాటిని కలలోనైనా స్మరింపడు. బ్రహ్మాండాదీలోకములు. దేవతలు, బ్రహ్మాదులు నశించినప్పటికిని నా భక్తుడు మాత్రము నశింపడు.

నా భక్తులు భారతదేశమున జన్మించి దేశాటనము సేయుచు ఈ భూమిని పవిత్రము చేసి, చివరకు నేనుండు ప్రాంతమును చేరుదురు.

ఓలక్ష్మీ! నా భక్తుల లక్షణమును సర్వము నీకు తెలిపితిని అని నారాయణుడనిన తరువాత అతని ఆనుజ్జగైకొని అందరు ఆచ్చట సుఖాసనములందు కూర్చొనిరి.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదగు ప్రకృతిఖండములోని నారదనారాయణ సంవాదములో సరస్వత్యుపాఖ్యానము అను ఆరవ అధ్యాయము సమాప్తము.