శ్రీపార్వత్యువాచ- పార్వతీదేవి శంకరునితో ఇట్లనెను –
వేదవేదాంగములన్నియు తెలిసిన మునులు, ఇతర కృతఘ్నుల పాప ఫలితమును గూర్చి ఏమనిరో నాకు విపులముగా తెలుపుమనెను.
శ్రీ మహేశ్వర ఉవాచ- మహేశ్వరుడిట్లనెను –
సుయజ్ఞ మహారాజు ఇతర కృతఘ్నుల కర్మవిషయమును ప్రశ్నించినపుడు అచ్చటనున్న మునులలో శ్రేష్ఠుడైన నారాయణఋషి ఇట్లు సమాధానమునిచ్చెను.
శ్రీనారాయణ ఉవాచ- సారాయణమునీ ఇట్లనెను –
తాను దానము చేసినను, ఇతరులు దానము చేసినను బ్రాహ్మణ వృత్తిగా సంక్రమించిన భూమిని అపహరించువానిని కృతఘ్నుడందురు. అతని కర్మఫలమిట్లుండును.
తాను సంపాదించుకొనిన భూమిని ఇతరులాక్రమించిరనీ బ్రాహ్మణుడేడ్చుచుండగా అతని కన్నీళ్ళచే ఎన్ని రేణువులు తడి చెందినవో అన్ని సంవత్సరములా కృతఘ్నుడు “శూలపోత"మను నరకమున నరకయాతనలననుభవించును. అచ్చట అతడు మండుచున్న నిప్పు కణికలను తినుచు వేడిగానున్న మూత్రము తాగుచు మండుచున్న నిప్పు కణికలున్న శయ్యపై యమకింకరులు బాధలుపెట్టుచుండగా పడుకొనవలసి వచ్చును.
ఈవిధముగా యమయాతనలనుభవించిన తరువాత ఆ మహాపాపి దివ్యములైన ఆరువేల సంవత్సరములు మలమున క్రిమిగానుండి తరువాత భూమీ, సంతానములేని మానవుడై పుట్టును. అతడు రోగములచే దరిద్రుడై అందరిచే నిందలు పొందును. అటుపిమ్మట పరిశుద్దుడగుసు.
నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను –
ఇతరుల కీర్తిని గావి తన కీర్తివిగాని చెడగొట్టు దుష్టుడు కృతఘ్నుడని పిలువబడుచున్నాడు. అతడు అంథకూపమను నరకమున పదునలుగురు ఇంద్రులు గతించువరకు నరకదుఃఖములననుభవించుచుండును. అచ్చట ఆ పాపిని కీటకములు, నకులములు, గద్దలు ఎల్లప్పుడు భక్షించుచండును. ఆ నరకముననున్న వేడియైన ఉప్పునీటిని ఎల్లప్పుడు తాగుచుండును. ఆనరకయాతనల తరువాత ఏడు జన్మలు సర్పముగాను ఐదు జన్మలు కాకిగాను పుట్టి తరువాత పరిశుద్దుడగును.
దేవల ఉవాచ- దేవలమునీ ఇట్లనెను –
బ్రాహ్మణుని లేక గురుపు, లేక దేవుని సొత్తునపహరించువానినీ కృతఘ్నుడందురు, అతడు మహాపాపీగా పరిగణింపబడును.
ఆ మహాపాపి పదునలుగురు ఇంద్రులు గతించువరకు అవటోదమను నరకమున బాధలననుభవించి తరువాత నురాపానము చేయువాడుగా జన్మించి పరిశుద్దుడగును.
జౌగీషవ్య ఉవాచ- జౌగీషవ్యుడను ముని ఇట్లనెను –
తల్లిని, తండ్రిని, గురువును భక్తిహీనుడై రక్షింపనివానిని, వారిని మాటలతో నైనను హింసించువానివి కృతఘ్నుడందురు. అట్లే తన భర్తను మాటలతో ప్రతీదినము బాధపెట్టు స్త్రీని కూడ కృతఘ్నురాలని అందురు. వీరిద్దరు మహాభయంకరమైన వహ్నికుండమను నరకమునకు వెళ్ళి అచ్చట సూర్యచంద్రులున్నంతవరకు అగ్నిలో ఉండి బాధలననుభవింతురు. ఆ నరకమునుండి బయటకు వచ్చిన తరువాత ఏడు జన్మలవరకు జలగగా బ్రతుకుదురు. అటుపిమ్మట పరిశుద్దులగుదురు.
వాల్మీకి రువాచ- వాల్మీకి మహర్షి ఇట్లనెను –
వృక్షములలో వృక్షత్వ మే విధముగా శాశ్వతముగానుండునో అట్లే పాపులయందు కృతఘ్న స్వభావముండును.
ఆశవలననో, కోపము వలననో, భయమువలననో తప్పుడు సాక్ష్యము చెప్పువానిని కృతఘ్నుడని అందురు. అట్లే ఇతరులు చేసిన పుణ్యకార్యములను చెడగొట్టువానిని కూడ కృతఘ్నుడని అదరు.
తప్పుడు సాక్ష్యమును కొద్దిగా చెప్పినను అతడువేయి ఇంద్రులు గతించువరకు సర్పకుండమను నరమున నుండును. అచ్చట అతనిని సర్పములు కాట్లు వేయుచుండగా యమభటులు దండించుచుండగా మలమూత్రములను భక్షించును. తరువాత ఏడు జన్మలవరకు తొండగా, ఏడుజన్మలవరకు తన పితృదేవతలతో సహ కప్పుగా బ్రతుకును. ఆ తరువాత మహారణ్యములో బూరుగు చెట్టుగా నుండును. ఆ తరువాత మూగవాడైయుండి చివరకు పరిశుద్ధుడగుమ అనీ వాల్మీకి మహర్షి అనెను.
ఆస్తీక ఉవాచ- ఆస్తీక ముని ఇట్లనెను –
గురుభార్యతో సంగమించువాడు తల్లితో సంగమించినంత పాపమును పొందును. అట్లే శూద్రుడు బ్రాహ్మణ స్త్రీలో సంగమించినను, బ్రాహ్మణ స్త్రీ శూద్రునితో తిరిగినను, తన కూతుళ్ళు, కోడలు, అత్త, అన్నదమ్ముల భార్యలు, చెల్లెలు మొదలగువారితో వ్యభిచారము చేసినచో కలుగు పాపము కలుగునని ఆస్తీకముని చెప్పెను.
పైవారీతో వ్యభిచరించు మహాపాపి బ్రతికియున్నను చనిపోయినవానితో సమానుడగును. అస్పృత్యుడగును. ఆ పాపికి సూర్యమండలమును దర్శించు అధికారములేదు, సాలగ్రామము, సాలగ్రామ జలము, తులసీదళము, తులసీజలము, పవిత్రమైన తీర్ణముల జలము, బ్రాహ్మణులయొక్క పాదోదకము వీటిని ముట్టుటకు కూడ అధికారములేదు. అట్లే ఆ పాతకి దేవతలను, గురువును. బ్రాహ్మణుని నమస్కరించు అధీకారము కోల్పోవును. వారు ఆ పాపాత్ముడు చేయు పూజను స్వీకరింపరు. ఆ పాపాత్ముని శరీరమునకు తగిలిన గాలి సోకినచో పుణ్యతీర్థము కూడ నిప్పుల కుంపటియగును.
ఆ పాతకినీ పొరపాటున తగిలినను ఏడు దినములు ఉపవాసముండవలెను. ఇంతమంది ప్రాణుల భారమును మోయుచున్న భూమి ఆ పాపాత్ముని బరువును మోయలేదు. తన కన్యలను అమ్ముకొను వానివలె (కన్యా విక్రయం) ఈ పాపియున్నందువలన ఆ స్థలము అపవిత్రమగును.
ఆ పాపిని తగిలినను, అతనితో మాట్లాడినను, అతనితో కలసి పడుకొన్ననను, భోజనము చేసినను వారికి ఆ పాపితో సమానమైన పాపము లభించును. ఆ పాపి కుంభీపాకనరకమున బ్రహ్మయొక్క జీవితకాలమువరకుండును. ఆ నరకమున ప్రతిదినము నిరంతరము చక్రమునకు కట్టివేయబడి తీరుగుచుండును. అతనిని యమభటులు ఎల్లప్పుడు బాధించుచుందురు. అతనిని నిప్పులలో పడద్రోయుదురు. ఈవిధముగా ఆ పాపి కుంభీపాక నరకమున మలమూత్రములను భుజించుచు నరకయాతనల ననుభవించును.
ప్రకృతి సంబంధమైన ప్రళయముగడిచి మరల సృష్టి ప్రారంభమైనను ఈ పాపి అట్లే నరకయాతనలననుభవించును. అతడు అరవైవేల సంవత్సరములు మలములోని పురుగుగా బ్రతుకును. తరువాత చండాలుడై, భార్యాహీనుడై నపుంసకుడగును. తరువాత ఏడు జన్మలవరకు శూద్రుడైపుట్టి కుఘ్ఠరోగముతో బాధపడుచు, నపుంసకుడగును. ఆ తరువాత బ్రాహ్మణజన్మ లభించినను గుడ్డివాడై నపుంసకుడుగానుండును. ఈ విధముగా ఏడుజన్మలవరకు గుడ్డివాడై చివరకు పవిత్రమగును అని ఆస్తీక మహర్షి అనేను.
మునయ: ఊచుః - మునులు ఇట్లనిరి –
ఓ మహారాజా కృతఘ్నులు ఏవిధముగానుందురో వారు ఎట్టి కర్మఫలితముననుభవింతురో ఇంతవరకు చెప్పితిమి. ఇంటికి వచ్చిన అతిథని పరాభవించినను ఇంతటి పాపము కలుగును.
అందువలన నీపు ఈ బ్రాహ్మణునకు నమస్కరించి అతనిని తృప్తిపరచి కష్టపడియైనమ నీ ఇంటికి తీసుకొనివెళ్ళి అతని ఆశీర్వచనములను స్వీకరింపుము, అటుపిమ్మట అడవికి వెళ్ళి తపస్సు చేసినచో బ్రాహ్మణ శాపదోషమునుండి విముక్తుడవగుదుపు.
ఈ విధముగా సుయజ్ఞమహారాజుతో మహర్షులు పలికి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అట్లే దేవతలు, రాజులు, అతని బంధువులందరు తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి.
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతీఖండములోని నారదనారాయణ సంవాదములో కనిపించు గౌరీశంకరుల సంపాదములోని రాధోపాఖ్యానమున చెప్పబడిన సుయజ్ఞోపాఖ్యానమున కర్మవిపాకమను యభైరెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 51 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
This enchanting chapter narrates the divine meeting of the young Śrī Kṛshṇa and Goddess Śrī Rādhā in the sacred forest of Bhāṇḍīravana under the shade of a majestic banyan tree. While walking with His father Nanda Bābā, a sudden celestial storm gathered, darkening the skies and showering divine blossoms. At that moment, Goddess Śrī Rādhā appeared in Her full transcendent glory, and Nanda Bābā humbly entrusted the young child Śrī Kṛshṇa into Her motherly care. As soon as Nanda Bābā departed, Lord Śrī Kṛshṇa assumed His youthful, four-armed and two-armed enchanting divine forms, reuniting with His eternal beloved in deep spiritual romance.