అథ ప్రకృతి ఖండప్రారంభః- ప్రకృతి ఖండము ప్రారంభింపబడుచున్నది.
నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లనెను -
సృష్టికి కారణమైన ప్రకృతి, గణేశుని తల్లియైన దుర్గగా. రాధగా, లక్ష్మీదేవతగా, సరస్వతీదేవిగా సావిత్రీమాతగా ఐదు మూర్తులతో ఉన్నది కదా. ఆ ప్రకృతి ఎవరి వలన ఉద్భవించినది. ఆమె స్వరూపమేమి. ఐదు విధములుగా ఎందువలన మారినది. ప్రకృతి స్వరూపాలైన దుర్గాదిదేవతల కథను, వారి పూజ విధానమును, దాని వలన కలుగు ఫలితమును, ఆయా. దేవతలు ఎక్కడ ఏవిధముగా అవతరించినారో వాటినన్నిటిని విస్తరించి నాకు తెలుపగలరు.
నారాయణ ఉవాచ- నారాయణు డిట్లనెను.
నారదా! ప్రకృతి యొక్క స్వరూపమును చక్కగా ఎవరు కూడ చెప్పలేరు. ఐనప్పటికినీ ధర్ముని వలన విన్న విషయమును కొంత నీకు చెప్పెదను. “ప్ర" అనునది శ్రేష్ఠము అను నర్థము నిచ్చును. “కృతి" అనగా సృష్టి, సృష్టిలో శ్రేష్ఠురాలైన దేవతను ప్రకృతీ యని అందురు. అట్లే 'ప్ర' అనునది ఉత్కృష్టమైన సత్వగుణమును సూచించును. 'క' అనునది రజోగుణమును, 'తి' అనునది తమోగుణమును తెలుపును. ఈ విధముగా సత్యరజస్తమోగుణ స్వరూపిణి. సర్వశక్తి సమన్వితమైన ప్రకృతి, సృష్టి ఏషయమున ప్రధాన స్థానము వహించుచున్నందువలన ప్రకృతియని పేర్కొనబడినది. అదే విధముగా అనునది ప్రథమము అను అర్థమున ఉన్నందువలన సృష్టి అను అర్థము కృతి అను పదమునకు ఉన్నందువలన సృష్టిలో తొలుత ఉద్భవించిన దేవిని ‘ప్రకృతి’ అని అందురు.
పరమాత్మ తన యోగశక్తివలన రెండు రూపములను ధరించెను. ఆ పరమాత్మయొక్క కుడి భాగము పురుషుడుగా, ఎడమ భాగము ప్రకృతిగా మారినవి.
ఆ ప్రకృతి పరబ్రహ్మ స్వరూప, మాయా స్వరూపిణి, సనాతని. అగ్నికి మండేగుణమువలె ఆ ప్రకృతి పరబ్రహ్మయొక్క శక్తి స్వరూపిణి.
అందువలననే యోగీంద్రులు సమస్తము బ్రహ్మమయమైనదను భావనవల్ల స్త్రీ పురుష భేదమును పరిగణింపరు.
స్వేచ్ఛామయుడైన శ్రీకృష్ణుడు చరాచర జగత్తును సృష్టింపవలెనని కోరుకొన్నప్పుడు పరమేశ్వరియైన "మూలప్రకృతి” పుట్టినది.
శ్రీ కృష్ణుని యొక్క ఆజ్ఞవలన సృష్టికర్మకి మూలప్రకృతి ఐదు రూపములను ధరించినది. లేక భక్తులయొక్క ప్రార్థన ననుసరించి కానిచో భక్తులననుగ్రహించుటకు ఐదురూపములనామె ధరించినది.
గణాధీపతియైన గణేశుని తల్లియైన దుర్గాదేవి ప్రకృతియొక్క మొదటిరూపము. ఆ దుర్గ మంగళ స్వరూప, శివునకు ప్రియమైన భార్య. ఆమెను నారాయణి యని, విష్ణుమాయ ' యని, పూర్ణ బ్రహ్మస్వరూపిణి యని పిలుతురు. సనాతనీ పరబ్రహ్మస్వరూపియగు ఆ దుర్గాదేవి బ్రహ్మాది దేవతలచే, మునులచే, మనువులచే ఎల్లప్పుడు పూజలనందుకొనును. ఆమె కీర్తిని, శుభములను, ధర్మమును, సంపదను, సత్యవాక్కును, పుణ్యమును, సంతోషమును మోక్షమును ఇచ్చును. దు:ఖశోకములను పోగొట్టును. శరణుపొందిన వారిని దీనులను, ఆర్తులను రక్షించు స్వభావము కలది. తేజఃస్వరూప. సర్వశక్తి స్వరూప, బుద్ధి, నిద్ర, ఆకలి, దప్పి, నీడ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, శాంతి, కాంతి, భారతి, చేతన, తుష్టి పుష్టి లక్ష్మి, వృత్తి, మాత ఇవన్నియు ఆమె పేర్లే, ఆమె శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సర్వశక్తి స్వరూపిణి. వేదములలో ఈమే గొప్పతనము చెప్పబడినను సంపూర్ణముగా మాత్రము అని వివరించలేక పోయినవి. అనంత యగునామె గుణములనంతములు.
ఇక ప్రకృతి యొక్క ద్వీతీయ రూపమును తెలుపుదును.
పద్మయగు లక్ష్మీదేవి శ్రీ కృష్ణ పరమాత్మయొక్క శుద్ధ సత్వగుణ స్వరూప. సమస్త సంపదలకు ఆమె అధిష్టాన దేవత. ఆమె చాలా అందమైనది. పరమసంయమస్వరూప. మిక్కిలి శాంతస్వభావము కలది. సర్వమంగళ స్వరూపిణి.
లోభ, మోహ, కామ, రోష మదాహంకారములనే అరిషడ్వర్గమును జయించినది. అందరికంటే ముందు తన భర్తయైన నారాయణుని యొక్క అనురాగమును పొందినది. పతివ్రత. ఆమెను భగవంతుడైన శ్రీమన్నారాయణుడు తన ప్రాణములతో సమానముగా ప్రేమించును. ఆమె ఎల్లప్పుడు ప్రియమైన మాటలనే మాట్లాడును. సర్వసస్యాత్మిక యగు ఆ దేవి ఆన్ని ప్రాణులు సుఖముగా జీవించుటకు కారణమైనది.
ఆమె వైకుంఠములో తన భర్తయైన శ్రీమన్నొరాయణుని సేవించుచు మహాలక్ష్మిగా పిలువబడుచున్నది. స్వర్గలోకములో ఉన్న ఆ లక్ష్మిని స్వర్గలక్ష్మియని పిలుతురు, రాజులయందున్న ఆ లక్ష్మిని. రాజలక్ష్మిగా, గృహములందున్నందువలన ఆమెను గృహలక్ష్మిగా పిలుతురు. సమస్త ప్రాణులయందు, సమస్తద్రవ్యములయందు ఆమె అందమైన శోభగా కన్నీంచును. పుణ్యము చేసికొన్న వారికి ఆనందరూపముతో, రాజులకు కాంతిరూపములో, వర్తకులకు వాణిజ్యరూపముతో ఆమె కన్పించును. పాపములు చేయువారికి ఆమె కలహముల పెట్టుచు కన్పడును.
ఆమె దయకలది. భక్తులకు తల్లివంటిది. భక్తులయొక్క సంపదలను రక్షించునది. ఆ లక్ష్మీదేవి లేనిచో ప్రపంచమంతయు బ్రతికియున్నను చచ్చిన దానితో సమానముగా నుండును, ఆమె గుణగణములను వేదములు అనేకవిధములుగా స్తుతించినవి. ఆమె అందరకు నమస్కరించతగినది, పూజించతగినది,
ఇక ప్రకృతి యొక్క మూడవ స్వరూపమును తెలిపెదను.
సరస్వతీదేవి వాక్కునకు, బుద్ధికి, జ్ఞానమునకు, ఆధిదేవత, సర్వవిద్యాస్వరూపిణి. ఆదేవి మంచి బుద్ధిని, కవిత్వ రచనా శక్తిని, మేధను, ప్రతిభను స్మతి జ్ఞానమును భక్తులకు కలిగించును. అట్లే అనేక విధములైన సిద్దాంత భేదములయొక్క అర్థజ్ఞానము నొసగునది. సమస్త సంశయములను తొలగించునది. ఆలోచనా శక్తిని, గ్రంథరచనాశక్తిని కలిగించునది. సమస్త సంగీతమున ప్రధానాంశమైన శ్రుతి లయల స్వరూపము గలది.
విషయము, జ్ఞానము, వాక్కు ఆమెయొక్క రూపములు, ఆ దేవి లేనిచో ప్రపంచమంతయు మూగదై. జీవరహితముగా ఉండును.
ఆ దేవీ పరిశుద్ధమైన సత్వగుణరూపిణి, అందువలననే శ్రీహరీ ఆమెను మన్నించును. ఆమె మంచువలె, చందనమువలె, మల్లెపూవువలె, తెల్లనిపద్మమువలె, కలువవలె తెల్లనీది. ఆమె ఎల్లప్పుడు తన చేతిలోని రత్నమాలతో శ్రీ కృష్ణనామమును జపీంచుచుండును. ఆమె తపస్వరూప, తపఃఫలితముల నొసగునది. సిద్ధి విద్యా స్వరూప. సమస్త సిద్ధులనొసగునది. యథాగమం యథాకించి దపరాం సంనిబోధమే.
మూల ప్రకృతి యొక్క నాలుగవ స్వరూపమును నాకు తెలుపుమని నారదుడడిగెను.
నారదా! పవిత్రమైన స్వరూపముగల సావిత్రి లేక గాయత్రి సమస్త వేదములకు, వేదాంగములకు ఛందస్సులకు, సంధ్యావందన మంత్రములకు, తంత్రములకు మాతృస్వరూప. ఆ సావిత్రిదేవి జవరూపిణి. బ్రహ్మతేజోవిరాజిత. సమస్త సంస్కారములను కలిగించునది. బ్రహ్మదేవునకు ఇష్టమైన భార్య. సమస్త పవిత్ర తీర్థములు ఆ దేవియొక్క దర్శనమును, ప్పర్శనుపొంది తాము పవిత్రము కావలెనని కోరుకొనుచున్నవి.
ఆ దేవి శుద్ద సత్వగుణ స్వరూపిణి, శుద్ధ స్పటికమువలె తెల్లనిది. ఆనందస్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె తన భక్తులకు మోక్షమునిచ్చును. బ్రహ్మతేజస్సునకు ఆమె ఆధిదేవత. ఆ దేవియొక్క కాలి ధూళిచేతనే ఈ జగమంతయు పవిత్రమగుచున్నది.
నారదా! ఇంతవరకు మూలప్రకృతి యొక్క నాల్గవ రూపమైన సావిత్రీ దేవి గురించి తెలిపితివి. ఇక ప్రకృతి యొక్క ఐదవ స్వరూపమైన రాధాదేవి విషయము వినుము.
ఆ రాధాదేవి ప్రేమకు, ప్రాణమునకు అధిదేవత. పంచప్రాణ స్వరూపిణి. పరబ్రహ్మయగు శ్రీకృష్ణునకు ప్రాణములకంటే మిన్నయైన ప్రియురాలు. మిక్కిలి ఆందమైనది. సమస్త సౌభాగ్యములు కలది. గొప్ప గౌరవము కలది. ఆమె శ్రీ కృష్ణ పరబ్రహ్మ యొక్క వామార్థ భాగస్వరూపిణి. ఆమె యొక్క సుగుణములతో, తేజస్సుతో శ్రీకృష్ణునకు సమానమైనది. ఆమె పర్వశ్రేష్ఠురాలు. అందరికి తల్లివంటిది. సనాతని. పరమానందరూపిణి, మామ్యరాలు. అందరిచే పూజింపబడినది. శ్రీ కృష్ణపరమాత్మ యొక్క రాసక్రీడకు అధిదేవత. గోలోకముననున్న ఆ దేవి గోపికావేషముననుండి పరమానందమున తేలియాడుచుండుమ. ఆమె సంతోషామర్షరూపిణి, నిర్గుణ, నిరాకార, నిర్లిప్త, నిరీహ, నిరహంకార, భక్తులననుగ్రహించుటకై అవతరించినది. వేదోక్త ప్రకారముగా ధ్యానించు మహనీయులు మాత్రము ఆమెను తెలిసికొందురు.
రాధాదేవి బంగారు వన్నె గల వస్త్రములను, రత్నాభరణములను ధరించుచుండును. ఆమె శరీర కాంతి కోటి చంద్రుల కాంతి కంటే మిన్నయైనది. ఆమె తన భక్తులకు సమస్త సంపదలను శ్రీకృష్ణునిపై దాస్య భక్తినీ ఇచ్చును.
వరాహావతారసమయమున ఈమె వృషభానుడను రాజునకు పుత్రికగా అవతరించినది. ఈ భూమి రాధాదేవి పాదపద్మ స్పర్శవలన పవిత్రమైనది. బ్రహ్మాది దేవతలు ఈ దేవిని కఠిన తపస్సు చేసినా చూడలేకపోయిరి. కాని భారత వర్ష వాసుల కీమె ఎల్లప్పుడు కనిపించును. చక్కని నల్లని మబ్బులోనున్న మెరుపుతీగవలె ఈమె శ్రీకృష్ణునివక్షస్థలముపై నుండును.
బ్రహ్మదేవుడు రాధాదేవియొక్క పదపద్మములోని గోటిని దర్శించుటకై ఆరువై వేల సంవత్సరములు కష్టపడి తపస్సు చేసినను చూడలేకపోయినాడు. ఆమె దర్శనము కలలో సైతము కన్పించ లేదన్నచో ప్రత్యక్షముగా కనిపించునను ప్రసక్తి లేదు.
కాని బ్రహ్మ దేవుడు చాలా కష్టపడి తపస్సు చేసి బృందావనములో మాత్రము రాధాదేవి యొక్క పాదపద్మములను దర్శించుకొనగలి గెను.
ఈ విధముగా మూలప్రకృతి యొక్క ఐదవ రూపముగా రాధాదేవిని పేర్కొందురు.
అన్ని లోకములలో నున్న స్త్రీలు ప్రకృతి యొక్క ఆంశ స్వరూపాలుగా, కళారూపాలుగా, కళయొక్క ఆంశాంశ స్వరూపాలుగా పేర్కొనవచ్చును. ఇంతకు పూర్వము పేర్కొనబడిన దుర్గాది దేవతలు ప్రకృతియొక్క పరిపూర్ణస్వరూపము కలవారు.
ఇక ప్రకృతి యొక్క ప్రధానాంశ స్వరూపాలైన దేవతల గురించి తెలుపుదును.
సమస్తలోకమములను పవిత్రము చేయు గంగాదేవి ప్రకృతి యొక్క ప్రధానాంశ స్వరూపిణి. ఆ గంగ శ్రీవిష్ణువు యొక్క పాదముల వద్ద పుట్టి పాపములు చేసిన వారియొక్క పాపములను సమూలముగా పోగొట్టుచున్నది. ఆ గంగను చూచినను. తగిలినను, స్నానము చేసినను నీటిని తాగినను మోక్షము సిద్ధించును. నదిగా నున్న ఆ గంగా దేవి గోలోకమునకు వెళ్ళుటకు మంచిమెట్లవంటిది. అన్ని పుణ్యతీర్థములలో, అన్ని నదులలో ఆ గంగానది మిక్కిలి గొప్పది. శంకరుని శిరస్సుపై నున్న ఆ గంగానది ముత్యాల వరుసవలె కన్పించును. శంఖమువలె తెల్లని పద్మమువలె, పాలవలె తెల్లనైన ఆ గంగానది భారత వర్షమున నున్న మహర్షులకు తపఃఫలితముమ వెంటనే కల్గించును.
ప్రకృతి యొక్క ప్రధానంశమైన తులసీ దేవి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. ఆమె నిర్మలమైనది. అహంకారములేనిది. విష్ణుమూర్తికి హారముగా, ఆర్చనా సమయములో పాదములపై ఉండును. తుప్పంకల్ప సమయమున పూజాది సందర్భములలో తులసి యొక్క ఆవశ్యమెంతేని కలదు. ఆ తులసి పుష్పములన్నిటిలో సారమైనది. పవిత్రమైనది, సదా పుణ్యము కల్గించునది.
ఆ తులసి మొక్క దర్శన, స్పర్శనలవలన మోక్షము లభించును. కలియుగమున మావపులు చేయు పాపములనే కట్టేలను ఆగ్నివలె క్షణములో భస్మము చేయును. భూమి ఆ తులసి యొక్క పాద స్పర్శవలన (వేళ్ళస్పర్శ) పవిత్రమగుచున్నది. సమస్త పుణ్య తీర్థములు తాము పరిశుద్ధి నొందుటకు తులసి మొక్క స్పర్శ దర్శనములను కోరుకొనుచున్నవి. ఆ తులసి లేనిచో సమస్త కర్మలు నిష్పలమై పోవును. మోక్షము కోరుకొనువారికి 'మోక్షమును, కోరినవారికి అన్ని కోరికలను కల్పవృక్షమువలె తీర్చును. భారత వర్షమున ఈ తులసి వృక్షరూపమున కన్పించుచున్నది.
కశ్యపమహర్షి పుత్రికయగు మనసా దేవి కూడ ప్రకృతి యొక్క ఒక ప్రధానాంశమే. ఆమె చాలా గొప్ప జ్ఞానము కలది. శంకరునికి చాల ఇష్టమైన శిష్యురాలు, సర్ప శ్రేష్టుడైన అనంతునకు సోదరి. ఆమెను సర్పములెప్పుడూ కొలుచుచుండును. ఆమె భూషణములు సర్పములే. ఆమె సిద్ధయోగిని, విష్ణుభక్తురాలు. విష్ణురూప. ఆమె శ్రీహరి గురించి మూడు లక్షల దివ్య సంవత్సరములు తపస్సు చేసినది. అందువలననే ఆమె భారత వరమందలి తపస్వులందరికి పూజనీయురాలైనది. ఆమె నమస్త మంత్రములకు అధిదేవత. బ్రహ్మతేజస్సుతో వెలిపోవుచున్న ఆ మనసాదేవి బ్రహ్మ భావనలో ఎల్లప్పుడు ఉండును. ఈమెకు జరత్కారు అనే పేరు కూడా ఉన్నది. ఈమె జరత్కారు మహర్షిని పెండ్లియాడి తపోధనులలో శ్రేష్ఠుడని కీర్తిపొందిన ఆస్తీక మహర్షిని కన్నది.
ప్రకృతి యొక్క మరియొక ప్రధానాంశము దేవసేన. ఆమె ప్రకృతి యొక్క ఉషాంశ రూపగావున మ అని కూడా ఆమెను ఏలుతురు. ఆమె మిక్కిలి గౌరవించదగిన “మాతృక'. సమస్త విశ్వములలో ఉండే శిశువుల నామే కాపాడుచుండును. అందరకు పుత్రపౌత్ర సంపదనిచ్చును. భర్త సమీపమున ఆందమైన యువతీగా ఎల్లప్పుడు కన్పించుచున్నమ శిశువుల దగ్గర యోగిని యైన పండుముసలివలె ఉండును.
ఈషష్టీదేవి యొక్క పూజను ఎల్లప్పుడు సంవత్సరమున పన్నెండు నెలలు చేయవచ్చును. శిశువు పుట్టిన తరువాత సూతీక గృహములో, ఏడవ దినమున లేనిచో ఇరువది యొకటవ దినమున ఈమె పూజు చేసినచో శిశువువకు ఆయురారోగ్యములు కలుగును. మాతృ రూపిణియగు నీ దేవసేన మిక్కిలి దయగలది. ఆమె శిశువులను నీటిలోను, భూమి సైనమ, ఆకాదువందును రక్షించును. వారికి ఆమె స్వప్నములో దర్శనమొసగుచుండును.
‘ప్రకృతి’ దేవీయొక్క మరొక ప్రధానాంశము ఆమె ముఖముమండి పుట్టిన మంగళచండిక, ఆమె సమస్త మంగళములను తన భక్తుల కిచ్చును. ఆమె సృష్టి జరుగునప్పుడు మంగళ స్వరూపిణిగా సంహారసమయమున చండీ స్వరూపిణిగా కనిపించుచున్నందువలన మంగళ చండియనీ కీర్తింపబడుచున్నది. ఆమె సమస్తలోకములలో ప్రతి మంగళవారము స్త్రీలచే పంచోపచారములచే పూజింపబడుచున్నది. ఆమె తనను పూజించువారికి పుత్రపౌత్ర ధనైశ్వర్యములను, కీర్తిని, సంతోషమును ఇచ్చును. అట్లే వారికి శోకము, సంతాపము, ఆర్తి, దుఃఖము. దారిద్ర్యము, పాపములు కలుగనివ్వదు. ఆమె సంతుష్టురాలైనచో స్త్రీలందరకు అన్ని కోరికలు తీర్చును. కోపగించినచో క్షణములో సమస్త ప్రపంచమును సంహరించును.
ప్రకృతియొక్క మరియొక ప్రధానాంశము కాళికాదేవి, దుర్గాదేవి శుంభనిశుంభ రాక్షసులతో యుద్ధము చేయుచున్నప్పుడు కోపించిన ఆమె ముఖమునుండి తదర్ధాంశముగా కాళికాదేవి పుట్టినది. ఆ కాళిక తన గుణములతో తేజస్పులో దుర్గాదేవితో సమానమైనది. కోటి సూర్యుల కాంతితో సమానమైన కాంతి గలది. దివ్య సౌందర్యముచే ప్రకాళీంచునది. ఆమె తన భక్తులకు సకల సిద్దులనొసంగును. కృషభక్తురాలైన కాళీక శ్రీకృష్ణుని సంతతము ధ్యానించుచున్నందువలన శ్రీకృష్ణుని వలే నల్లని శరీరముతో ప్రకాశించుమ. లోకములను రక్షించుటకై రాక్షసులతో ఆమె యుద్ధము చేయుచుండును. ఆమెకదీ ఒక ఆట.. ఆమె తన నిట్టూర్పులో సకల బ్రహ్మాండములను హరించును. బ్రహ్మాది దేవతలతో, మునులతో, నరులతో పూజలందుకొను ఆ కాళీక ధర్మార్థ కామ మోక్షములనిచ్చును.
ప్రకృతి యొక్క మరియొక ప్రధానాంశము వసుంధర. ఈ భూమి అందరకు ఆధారమైనది. సమస్త సస్యములను పండించునది. ఈ భూమి రత్నములకు నిలయమైనదీ, సమస్త సముద్రములు దీనిని ఆశ్రయించుకొని యున్నవి. ఈమె నరులచే నరాధిపతులచే పూజలందుకొనును. అందరు జీవించుటకు కారణమగుచున్నది. అందరకు సంపదలను కల్గించునది. ఈ భూమిలేనిచో ఈ చరాచర జగత్తంతయు నిరాధారమై నశించిపోవును.
ఓ నారదా! ప్రకృతి యొక్క ఆంశ స్వరూపలను, వారి భర్తల పేర్లను నీకు తెలుపుదును.
'స్వాహాదేవి' అగ్నిదేవుని భార్య. యజ్ఞములలో ఆమెలేకుండ హవిస్సునిస్తే దేవతలు దానిని తీసికొనలేరు. 'దక్షిణాదేవి" యజ్ఞపత్ని, ఆమె లేనిచో సమస్త కర్మలు నిష్ఫలమగుచున్నది. "స్వధా దేవి" పితృపన్నీ, స్వధాకారము లేక పితృకర్మలలో చేసిన దానము వ్యర్థమగుచున్నది.
స్వస్తిదేవి వాయువుభార్య. ఆమెలేకుండ చేసిన ఆదాన ప్రదానములు వ్యర్థమగుమ.
‘పుష్టిదేవి’ గణపతి యొక్క భార్య. అనంతుని భార్య “తుష్టిదేవి". “సంపత్తి" ఈశ్వరుని భార్య. “ధృతి" కపిలమహర్షి భార్య. "క్షమ" యముని భార్య. ఆమె లేనిచో సమస్తలోకములు కోపముతో పిచ్చెక్కినట్లుండును.
రతికేళీకౌతుకమునకు కారణమైనది, రతిక్రీడకు అధిష్టాన దేవతయగు 'రతీదేవి' మన్మథుని భార్య. అందరకు ఇష్టమైన “ముక్తి దేవత" సత్యపత్ని. “దయాదేవి" మోహపత్ని. పూణ్య స్వరూపిణియైన "ప్రతిష్టాదేవి" పుణ్యపత్ని. పేరు ప్రతిష్ఠలకు కారణభూతురాలైన "కీర్తిదేవి” సుకర్మపత్ని. క్రియాదేవీ" ఉద్యోగపత్ని- సమస్త దుష్టులచే గౌరవింపబడుచున్న “మిథ్యాదేవి" ఆధర్ముని భార్య. ఆమె సత్య(కృత) యుగములో కనిపించలేదు. త్రేతా యుగములో సూక్ష్మరూపములో ఉండినది. ద్వాపరయుగములో ముడుచుకొని పోయి ఆల్ట్రావయవములున్నట్లు కనిపించును. కాని కలియుగములో అంతటా కనిపిస్తూ కపటుడను తన సోదరునితో కలిసి ఇంటింటికి తీరుగుచుండును.
సుశీలుని భార్యలు "శాంతి, లజ్జ", జ్ఞానదేవునకు "బుద్ధి, మేధ, సతీ" అను ముగ్గురు భార్యలు కలరు.
కాంతి రూపమైనది. అందమైనదీ అగు ‘మూర్తీదేవి' ధర్మపత్ని. ఆమె లేనిచో సమస్త లోకములు పరమాత్మ నిరాధారులగుదురు. కాంతి రూపిణియగు ఆ దేవి లక్ష్మీదేవి స్వరూపిణి, ఆమె అందరిచే గౌరవింపబడుచున్నది. శ్రీ మూర్తి ఈమె యొక్క రూపములు.
“నిద్రాదేవి" కాలాగ్ని రుద్రుని యొక్క భార్య. ఈమేయొక్క మాయయందు సమస్తలోకములు రాత్రివేళలో మునిగిపోవుచున్నవి. సంధ్య, రాత్రి, దినములను ముగ్గురు కాలముయొక్క భార్యలు. 'క్షుత్పిపాసలు' లోభదేవత యొక్క భార్యలు. తేజస్సునకు “ప్రభా,దాహికా" అను ఇద్దరు భార్యలు. కాలుని కుమార్తెలైన మృత్యు. జరలు ప్రజ్వరుని యొక్క భార్యలు. నిద్రాదేవి కూతురైన "తంద్ర" సుఖదేవుని భార్య. అతని యొక్క మరియొక భార్య పేరు ప్రీత", "శ్రద్ధా, భక్తి" వైరాగ్యునీ భార్యలు.
ఇంకను దేవతల తల్లియైన "ఆదితీ", గోవులకు మూలమైన 'సురభి'. దైత్యులకు తల్లియైన 'దితి', కద్రువ, వినత, దనువు వీరందరు సృష్టి క్రమములో ఉపయోగింపబడినవారు.
పైన పేర్కొన్న వారందరు ప్రకృతి యొక్క సూక్ష్మాంశస్వరూపలు. ఇంకను ప్రకృతి యొక్క సూక్ష్మాంశ స్వరూపలు చాలా మంది గలరు.
“రోహిణీదేవి" చంద్రుని భార్య కాగా "సంజ్ఞాదేవి" సూర్యుని భార్య. “శతరూపాదేవి, మనువుభార్య. ఇంద్రుని భార్య పేరు "శని". 'తార' బృహస్పతి భార్య. వసిష్ఠుని భార్య పేరు “అరుంధతి”. “అహల్యాదేవి" గౌతమ మహర్షి భార్య. ఆత్రీ మహర్షి భార్య “అనసూయదేవి”. దేవహూతీ కర్దముని భార్యకాగా "ప్రసూతి" దక్షప్రజాపతి భార్య. మనసాదేవి కూతురైన మానసీదేవి పితృభార్య. పార్వతీదేవిని గన్నతల్లి "మేనక", లోపాముద్ర, హోలి, వరుణానీ, యమపత్ని, వింధ్యావళీ, కుంతి, దమయంతి, యశోద, దేవకీదేవి, గాంధారి, ద్రౌపది, సత్యవంతుని భార్యయైన సావిత్రి, రాధకు తల్లియైన కళావతి, మండోదరి, కౌసల్య, సుభద్ర, కైకేయి, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, మిత్రవింద, నాగ్నజితి, జాంబవతి లక్ష్మీదేవి స్వరూపాలైన సీత, రుక్మిణి, వ్యాసుని తల్లియైన యోజనగంధ, బోణాసురుని కూతురైన ఉషాదేవి, ఆమె స్నేహితురాలైన చిత్రలేఖ, ప్రభావతి, భానుమతి, మాయావతి, పరశురాముని తల్లియైన రేణుకాదేవి, బలరాముని తల్లియగు రోహిణీ, శ్రీకృష్ణునకు సోదరియగు దుర్గ మొదలైన వారందరు ప్రకృతి యొక్క ఆంశ స్వరూపలు. అట్లే గ్రామ దేవతలందరు ప్రకృతి యొక్క సూక్ష్మాంశ స్వరూపాలే.
స్త్రీలందరు ప్రకృతి యొక్క అంశాంశ స్వరూపలు. కావున స్త్రీలనవమానించినచో ప్రకృతిని అవమానించినట్లే అగును. భర్త, పుత్రులు గల స్త్రీని వస్త్రాలంకారములచే గౌరవించినచో ప్రకృతిని పూజించినట్లే అగుమ. ఎనిమిది సంవత్సరముల వయసు కలిగిన కన్యను వస్త్రము, ఆలంకారము చందనములతో గౌరవించిన ప్రకృతిని పూజించినట్లగును.
ప్రకృతి వలన పుట్టిన స్త్రీలలో ఉత్తమస్త్రీలు, మధ్యమ స్త్రీలు, అధమ స్త్రీలు అవి ఉందురు. మంచి నడవడిక గలిగిన పతివ్రతలు సత్వగుణాంశలైన ఉత్తమ స్త్రీలుగా పరిగణింపబడుదురు. సుఖసంభోగమునిచ్చుచు తమ పనులను తాము చేసికొను ప్రీలు రజోగుణాంశగల మధ్యమస్త్రీలు, కలహప్రియులు. కులటలు, దుష్టలు ఐన స్త్రీలు తామసాంశగల అధమ స్త్రీలు. ఈ భూమీపై నున్న కులటలు, స్వర్గ మందున్న అప్పరసలందరు అధమస్త్రీలుగా పరిగణింపబడుదురు.
ఈ విధముగా ప్రకృతి యొక్క పంచభేదములన అంశాంశములుగా వివరించుట జరిగినది. ఆ ప్రకృతియొక్క అంశస్వరూపలందరు పుణ్యక్షేత్రమైన ఈ భారతవర్షమున సదా పూజింపబడుచుందురు.
మిక్కిలి గొప్పనైన ఆర్తులను తొలగించు దుర్గాదేవిని సురధుడను రాజు తొలుత పూజింపగా రావణవధకై వెళ్ళుచు శ్రీరామచంద్రుడు తరువాత పూజించెను. ముల్లోకములకు తల్లియగు ఆ దుర్గాదేవి సమస్తలోకములయందు ఆ తరువాత పూజింపబడినది. దుర్గాదేవి దైత్యులను దానవులను చంపుటకై తొలుత దక్షప్రజాపతి ఇంట పుట్టినది. దక్షయజ్ఞమున తండ్రియైన దక్షుడు తన భర్తను నిందించుచుండగా సహింపలేక యజ్ఞాలో తన దేహమును చాలించి హిమవంతునకు కూతురుగా జన్మించి శంకరుని మరల భర్తగా పొందిను, శ్రీకృష్ణస్వరూపుడైన గణపతి, శ్రీకృష్ణాంశ రూపుడైన కుమారస్వామి ఆమెకు పుత్రులైరి.
లక్ష్మీదేవిని తొలుత మంగళభూపతి పూజించెను. అట్లే సావిత్రి దేవిని తొలుత భక్తి పూజించెను. సరస్వతీదేవి తొలుత బ్రహ్మదేవుని చేత పూజింపబడినది,
రాధాదేవి తొలుత గోలోకమున రాసమండలమున పరమాత్మయగు శ్రీకృష్ణునిచే కార్తీక పూర్ణిమనాడు పూజింపబడినది. ఆ తరువాత గోపి, గోపికలతో, బాలబాలికలతో గోగణముతో, దేవతాగణముతో పూజింపబడినది.
భూలోకమున ఆ రాధాదేవిని తొలుత సుయజ్ఞుడను రాజు శంకరుని ఉపదేశముననుసరించి భారతవర్షమున పూజించెను. ఆ తరువాత శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞవలన దేవతలు, మునులు ఆమెను పూజచేసిరి.
ప్రకృతీదేవి యొక్క అంశలలో పుట్టిన గ్రామదేవతలు పల్లెలలో పట్టణములలో ఈ భారతదేశమున పూజలను అందుకొనుచున్నారు.
నారదా! నీకు ఈ విధముగా ప్రకృతి యొక్క చరిత్రమ శాస్త్రబద్దమైన దాని యొక్క లక్షణమునంతయు వివరించితిని. ఇంకను నీవు వినవలసినదేమైన ఉన్నచో తెలుపుము.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాద సందర్భమున చెప్పబడిన ప్రకృతి స్వరూపము, దావీ భేదములను తెలుపు ప్రథమాధ్యాయము సమాప్తము.
Summary of chapter 1 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
In the beginning of the discourse, the venerable sage Śrī Sūta Gosvāmī explained to Maharshi Śaunaka the transcendent nature of Parā Prakṛti, the supreme divine energy of Lord Śrī Kṛshṇa. At the mere desire of the Supreme Being to manifest the cosmos, this primordial potency expanded into five magnificent forms to execute the functions of creation, preservation, and spiritual elevation. These five primary goddesses are Goddess Durgā who is the personification of courage and power, Goddess Rādhā who embodies supreme divine love and sweetness, Goddess Lakshmī who bestows all beauty and opulence, Goddess Sarasvatī who reigns over wisdom and speech, and Goddess Sāvitrī who is the sacred mother of the Vedas and noble virtue. Each of these divine forms represents an essential attribute of the Supreme Lord, demonstrating that all cosmic potencies and spiritual graces emanate from the single unmanifest Divine Mother.