తా ॥ బ్రహ్మదేవుడిట్లు చెప్పెను. “ఇట్లు యథావిధిగ పూజించిన వానికిగాని నిండారుభక్తి గలిగి జలముతో పూజించిన వానికిగాని సూర్యభగవానుడు సుదుర్లభమైన ఫలమిచ్చును. నిజమునకు భానుదేవుని జలములతో గాని పుష్పములతోగానీ, ఫలములతోగాని పూజింపనక్కరలేదు. కేవలము పరిశుద్ధమైన హృదయముతోఁ బూజించిన చాలును . రాగద్వేషాదిరహితమైన హృదయము, అసత్యాదులచేత దుష్టము కాని వాక్కు, హింసారహితమైన కర్మ ఈ మూడును సూర్యారాధనములే. రాగాదులచే దూషితమైన చిత్తమునందు తిమిరనాశకుడైన సూర్యభగవానుని వెలుగులు ప్రసరింపనేరవు. అట్టి మనుష్యునాదేవుడు సంసార పంకమునఁ గట్టివేయును. చీఁకటిని జీల్చివేయుటకు చంద్రరేఖ యొక్కటిచాలును. (అట్లేదేవతారాధనమునకు స్వచ్ఛమైన హృదయమొక్కటిచాలును) హింసాదులచే దూషితమైన కర్మసూర్యనారాయణుని పూజకెట్లు పనికివచ్చును?. మానవుడు ప్రసన్నచిత్తములేనిదే సూర్యదేవుని పొందజాలడు. అందువలన సత్యస్వభావుని యెడ, సత్యవచనుని యెడ. అహింసకుని యెడ ఆదిత్య భగవానుడు సహజముగనే తుష్టుడై ప్రసన్నుడగును. కుటిలాశయుడు దేవునకు తన సర్వస్వ మర్పించియు. నాతనికి తుష్టి కలిగించునట్లు పూజింపలేడు, కావుపననో కృష్ణా! రాగద్వేషరహితమైన నీ హృదయమునే భాస్కరునకు సమర్పింపుము. అప్పుడే దుమ్ర్పొప్యుడైన భాస్కరదేవుని నీవు ప్రాప్తింపగలవు. విష్ణుదేవుడిట్లనెను. దేవేశుడైన భాస్కరుడే యారాధనీయుడని మిరునాకుఁ దేలిపియుంటిరి. ఆతని నారాధించు విధానమెట్టిదో వివరముగఁజెప్పుడని యడుగుచున్నాను. ఓ జగత్పతీ! ఉత్తమ కులమున జన్మించుట, ఆరోగ్యముగనుండుట, దుర్లభమైన ధనవృద్ధి - ఈ మూడును ప్రాప్తించు విధానమును నాకుఁజెప్పుడు.
తా ॥ బ్రహ్మదేవుడిట్లు చెప్పఁదొడంగెను. “మాఘమాస శుక్ల పక్ష సప్తమీ దినమున హస్తా నక్షత్రము యోగించెనేని జగత్సృష్టి కర్తయగు భానుదేవుని, సుగంధ ధూపములు, శ్రేష్ఠములైన ఆహారపదార్థములు, ఉపాయనములు మున్నగు వానితో ప్రతియైనవాడు పూజింపవలెను. గృహస్థుడు పుష్పాదులచే పూజ నిర్వర్తించుచు, దానాదులొసంగుచు నొక సంవత్సరము వఱకును నీ వ్రత మాచరించి మునిశ్రేష్ఠులకు ప్రత్యేకముగ దానముచేయవలెను. ఆ వివరములను చేప్పబోవుచున్నాను. తెలిసికొనుము. వజ్రము, నువ్వులు, వడ్లు, యవలు, బంగారము, యవాన్నము, నీరు, వడగల్లు, దానిమ్మపండ్లు, పాదరక్షలు, ఛత్రము, గుడము, ఫేకలతోడి పాయసము అనునీ వస్తువులను క్రమముగ పన్నెండు మాసములలో దానమీయవలెను. విధ్యుక్త ప్రకారముగ నొక సంవత్సరమంతయును సప్తమీ తిథులందు లోకగురువగు సూర్యభగవాను నర్చించు వ్రత దీక్ష స్వీకరించువాడు ప్రాశనము చేయదగిన పాపదాహకములు, ఆత్మవిశుద్ధి హేతువులునైన సాయా వస్తువులను గూర్చి తెలిసికొనుము. గోమూత్రము, జలము, రసములు శాకము, దూర్వ, దధి, ప్లీహి, తిలలు, యవలు, సూర్యకిరణతప్తమైన జలము, క్షీరము అను వానిని క్రమముగ పన్నెండు మాసములందు ప్రాశనమునకు వినియోగింపవలెను. ఈ విధానమున నీ సప్తమీ వ్రతమాచరించువాడు ధనధాన్యపూర్ణము, లక్ష్మీయుక్తము, దుఃఖరహితమునైన ప్రధానకులమున అవికలేంద్రియుడై జన్మించును. ఆరోగ్యవంతుడు, బుద్ధిమంతుడు, సుఖియునగును. కాబట్టి విష్ణుదేవా! నీవుకూడ నప్రమత్తుడవై ప్రభావశాలి, భగవానుడు, జగత్ర్పభువునైన దివాకరునారాధించి సకలాభీష్ట సిద్ధినొందుము .
శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు తృతీయపదవత వర్ణనమను నూటపన్నెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 112 of the Bhavishya Purāṇa is as follows:
The Tṛtīya-pada vrata is timed to the third quarter of the day — the mid-afternoon period when Sūrya is at his third and declining phase of daily power. Offerings made at this specific time of day are described as particularly effective for propitiating the ancestors (pitṛ-tarpana) because the afternoon is the time most closely associated with the ancestral world in the Vedic cosmology. The vrata combines Sūrya worship and ancestral worship, affirming the deep connection between solar veneration and the propitiation of the ancestral lineage. The man who performs this vrata faithfully throughout the year both receives Sūrya's solar blessing and ensures the satisfaction and liberation of his departed ancestors.