తా॥ శతానీకుడిట్లనేను “సాంబుడు సూర్యదేవునెట్లు శరణువేడెను. సూర్యు నారాధింపుమని యెవరు సూచించిరి? దారుణమైన ఆ శాపమును పొంది అతడు తన తండ్రితో నేమనెను?”-1. ఆ ప్రశ్నలు విని సుమంతుముని యిట్లు నుడివెను. “సాంబుడెట్లు శపింపబడెనో లోగడ వివరించితిని కదా! శ్వేత పద్మధరుడైన శ్రీ కృష్ణునిచే సాంబుడు శపింపబడిన మీదట-2. శాప తిరస్కృతుడైన ఆతడు తన తండ్రితో నిట్లనెను. వినయముతో వినమ్రుడై, అంజలి ఘటించి, శిరమువంచి నమస్కరించి-3. "తండ్రీ! నేను చేసిన యపరాధమేమి? ఎందులకు నన్ను శపించితిరి? నేను మీ ఆజ్ఞననుసరించియే త్వరపడుచునిటకేతెంచితిని-4. ఏ అపచారమును చేయని నా మీద మి ఉగ్రమైన శాపఘాతమేందుకు పడినది? ఓ జగత్పతీ! నా కేమియు తెలియదు. నన్ననుగ్రహింపుడు-5. దేవా! ప్రభో! నాపై దయజూపి శాపమునుపసంహరింపుడు. నా తప్పిదమేదియో తెలియకుండగనే శపింపబడినాను. ఈ పాపమునుండి నేనెట్లు ముక్తుడనగుదును?”-6. సాంబుని దోషములేని వానిగ గ్రహించి శ్రీ కృష్ణుడతనితో నిట్లనెను. “కుమారా! ఈ నీ రోగమును తొలగించుటకు నేను శక్తుడనుకాను-7, జగన్నాథుడు, ద్వాదశాత్ముడు, దివాకరుడు, సహస్రకిరణుడునైన సూర్య భగవానుడే నీ వ్యాధిని తొలగింపగల సమర్థుడు-8. నాకు వలెనే మహాత్ముడైన నారదునకు కూడ కోపము కలిగించి యతని చేత కూడా తిరస్కృతుడ నైతివని ఇప్పుడే నాకు తెలిసినది-9. కాబట్టి ఋషి సత్తముడైన ఆ నారద భగవానునే ప్రసన్నునిగ జేసికొని యా మహనీయునే అడుగుము. ఏ దేవుని యనుగ్రహము సంపాదించిన నీ శాపము తొలగునో ఆతడు నీకు చెప్పగలడు-10.
తా॥ జాంబవతీసుతుడైన సాంబుడు తన తండ్రి మాటలు విని శోక మనస్కతతో దీనుడై బాగుగా ఆలోచించి-11. ద్వారకలోనున్న విష్ణుదేవుని దర్శించుటకై ఏనాడో వచ్చియుండిన నారదుని సమీపించి వినయముతో నిట్లు ప్రశ్నించెను–12. “భగవన్! బ్రహ్మ మానస పుత్రా! సర్వలోకజ్ఞా! నాపై దయచూపుడు. భక్తితో ప్రణమిల్లు నీ దీనునియెడ ప్రసన్నులుకండు-13. ఈ నా శరీరమునందలి వ్యాధి, మనస్సునందలి అజ్ఞానము తొలగింపగల యోగమునుపదేశింపుడు. ఆర్తుడనై నమస్కరించుచున్న నన్నను గ్రహింపుడు”-14. సాంబుని దీనాలాపములు విని నారదుడిట్లనెను. “సాంబా! దేవత లందఱికిని పూజ్యుడు, నమస్యుడు, స్తుత్యుడునయిన ఆ దేవుని పూజించినచో నీ రోగమునుండి ముక్తుడవు కాగలవు”-15. సాంబుడిట్లనెను. “ఋషివర్యా! సర్వ దేవతలకును పూజ్యుడు, నమస్యుడు, సుతుండున 6.6 దేవుడెవరు? నేను సగాను నా నగలుషాంగదగిన పరాంతుడెవరు? ఈ అగ్ని చల్లారుటకు నేనే దేవుని శరణు పొందవలెను?. జాలి గొలి పెడి సాంబుని ఈ వ్యాక్యములు విని నారదుడు కోపమును వీడి ఇట్లు పలికెను-18. “యదుశార్దూలా! స్తుతింపదగినవాడు, పూజింపదగినవాడు, వందనమాచరంప దగినవాడు, నమస్కరింపదగినవాడు, ప్రార్థింపదగినవాడు, బ్రహ్మాది దేవతల కందఱికిని ఆరాధ్య దేవత ఎల్లవేళల యందును ఆ సూర్య భగవానుడొక్కడే!”-19.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున, సాంబోపాఖ్యానమున కృష్ణునిచే శపింపబడిన సాంబుడు నారదుని వద్దకు వచ్చుటయను డెబ్బదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 75 of the Bhavishya Purāṇa is as follows:
A second narrative strand is introduced: Sāmba had been earlier cursed by his father Kṛṣṇa himself — for a different offence, involving deception in a game — and it is this curse (or a combination of both) that makes his condition particularly intractable. The grief-stricken Sāmba, after Kṛṣṇa's curse, seeks the counsel of Nārada Mahāṛṣi. Nārada, the eternal wanderer who moves between the worlds and carries the wisdom of all the celestial realms, receives Sāmba with compassion and identifies Sūrya as the only deity capable of reversing the combined effects of two such powerful curses. Nārada's counsel initiates the same trajectory that Durvāsas' directions led to: Sāmba's journey to Mitravana and the beginning of his twelve-year Sūrya tapas.