3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)
69 - కార్తవీర్య సంభవము
సూత ఉవాచ :-
సూతుఁడిట్లనెను. యయాతికి జ్యేషుఁడు యదువు. ఆతఁడుత్తమ తేజస్వి. ఆనుపూర్వికముగా నతని గూర్చి చెప్పెదను. గ్రహింపుఁడు. యదువునకు దేవసుతోపములయిన యైదుగురు పుత్రులు. వారు సహస్రజిత్తు ఇతఁడు జ్యేష్ణుఁడు శ్రేష్టుండు. కోష్ణువు, నీలుఁడు, అంజీకుఁడు, లఘువును. (2) సహస్రజిత్సుతుఁడు శతజిన్నాముఁడు రాజు. శతజిత్తనయులు మువ్వురు. వారు పరమధార్మికులు. ప్రఖ్యాతులు వారు హైహయుం డు, హయుఁడు, వేణుహయుఁడు. హైహయునియొక్కదాయాది ధర్మనేత్రుఁడు అని విఖ్యాతుఁడు. ధర్మనేత్రునకు కుంతి, కుంతికి సంజేయుడు, సంజేయునకు మహిష్మాన్ పార్థివుఁడు పుత్రులు మహిష్మంతునకు భద్రసేనుఁడు పుత్రుఁడు. అతఁడు ప్రతాపవంతుఁడు. ఆతఁడు కాశీరాజు. ఇంతకుంబూర్వము చెప్పబడినాఁడు. (6) భద్రసేనుని దాయాది దుర్మదుఁడు, దుర్మదుని కుమారుఁడు కనకుఁడు. ఇతఁడుధీమంతుఁడుగా ప్రసిద్ధుఁడు. కసకునకుపుత్రులు నల్వురు. లోకవీశ్రుతులు. వారుకృతవీర్యుఁడు, కృతాగ్ని, కృతవర్మ, కృష్ణాజులు కృతవీర్యునికుమారుఁడు అర్జునుఁ డు. ఆతఁడు బాహుసహస్రముచే సప్తద్వీపేశ్వరుఁడయిన రాజు. కార్తవీర్యుఁడు పదివేల సంవత్సరములు తపస్సు చేసెను. ఆ తపస్సు చాలదుశ్చరమయినది. తత్తపస్సుచే ఆతఁడు అత్రిసంభవుఁడయిన దత్తుని ఆరాధించెను. దత్తుఁడు భూరితేజస్వంతములయిన నాలుగు వరముల నతని కొసఁగెను. ముందుగా మొదటి వరముగా వేయిబాహువులను కోరెను రెండవవరము అధర్మమాచరింపగోరువానిని వెంటనే దాని నుండీ, నివారించుట. భూమీని ధర్మముగా జయించి, ధర్మముగా దానిని పాలించుట మూడవ వరము. (10)
ఇక నాల్గవవరము. “నేను బహు యుద్ధములు జయించవలెను. వేలాది శత్రువులను చంపవలయును. నేను యుద్ధము చేయుచుండగ నేను వధింపఁబడవలేను”. ఆ వరముతో సప్తద్వీపము సపత్తనము, సపోదధీ పరీక్షిప్తము, అయిన భూమినీ విధివత్తుగా క్షాత్రము వలననే యతం డు జయించెను. (14) ఆతఁడు యుద్ధము చేయుచు యోగబలమున బాహుసహస్రము పొందెను. యోగేశ్వరునకు యోగమువలన సహస్రబాహువులు కల్గినట్లే మాయచే నతనికి వేయి చేతులు కలుగును. ఆతఁడు సప్తద్వీపముల యందు సప్త యజ్ఞ శతముల నొనరించెనని విందుము. ఆతని యజ్ఞములన్నియును మహా వైభవోపేతములు. ఆ యజ్ఞములలో నన్నియు కాంచనవేదికలు, సర్వ యజ్ఞ యూపములు కాంచనయుతములు, ఆ యజ్ఞయూషములు కాంచనయుతములు, ఆ యజ్ఞములు విమానములలో నాసీనులైన మహానుభావులయిన దేవతలచే నలంకృతములు. గంధర్వులతో అప్సరలతో యజ్ఞములు నిత్యముపశోభితములు. ఆ రాజర్షియొక్క చరితమును మహిమమును చూచి నారదుఁడను గంధర్వుఁడు ఆ రాజుయొక్క కీర్తిని గాథగా పాడెను. “యజ్ఞములచేగాని, దానములచేగానీ, తపస్సులచేగానీ, వీక్రమముచేగానీ, పాండిత్యముచేగానీ మానవులెవ్వరు కార్తవీర్యుని గతిని పొందజాలరు. సప్తద్వీపములయందు సానుచరుఁడై యోగముచే రాజు కనుపించును. ఆతఁడు ధన్వి, ఖడ్డి, శరాసనుఁడు, రథికుఁడు. ఆ రాజు యొక్క ప్రభావముచే ప్రజలు ధర్మయుతముగా రక్షింపఁబడిరి. ప్రజలకు ద్రవ్యనష్టము లేదు. క్లేశములేదు. విభ్రమములేదు. అతఁడు ఎనుబదియైదు వేలసంవత్సరములు సర్వరత్నభాజనుఁడై చక్రవర్తిగా నుండెను. ఆతఁడే పశు పాలుఁడు క్షేత్రపాలుఁడు తనయోగశక్తిచే ఆతఁడే వర్షపురాజు పర్జన్యుఁడు.
జ్యాఘాతకఠినములైన తనబాహుసహస్రముతో రాజు శరత్కాలమందలి భాస్కరునీవలె కిరణ(రశ్మి సహస్రముతో ప్రకాశించెను. వేయి ఏనుఁగులతో రాజు, మాహిష్మతియందు కర్కోట సభను జయించి, తనపట్టణమునచ్చట నిర్మించెను. ప్రావృట్కాలమందలి అంబుజముల వంటి నేత్రములు కలిగిన రాజు, వర్షాకాలమున సముద్ర తరంగములను నిరోధించి సుఖోద్విగ్నుఁడై క్రీడించిన వానివలెనే కృత్రిమ ప్రావృట్కాలమును చేసెను. (27) ఆతనిచే ఇటునటు కంపింపఁబడి తరంగములచే ముక్తమై ఆర్తసన్నాదయై శంకింపఁబడి నర్మద ఆ మహారాజును చేరెను. పూర్వమొకప్పుడు రాజు, భుజసహస్రముతో సముద్రములో ప్రవేశించి, అకాలమున లేచిన మహాకల్లోల తరంగమువలె సముద్రవేలను చేసెను. సముద్రమాతని సహస్రబావులచే సంక్షోభింపఁబడగా పాతాళమందలి రాక్షసులు అందే నిశ్చేష్టులయి లీన మయియుండిరి. సహస్రబాహువులతో, క్షీరసముద్రమును రాక్షసులు దేవతలు మధించినట్లు క్షోభింపచేసెను. మహావీచుల యందు లీనమయిన మహామీనములను ఆరాజుచూర్ణీకృత మొనర్చెను. ఫేనము(నురగలు) పైకి క్రిందికి కొట్లాడెను. ఎన్నియో సుడిగుండములు ఏర్పడి సముద్రము కెరటములతో దుస్సహమయ్యెను. కార్తవీర్యునిచే సముద్ర సంక్షోభము పూర్వము క్షీరసముద్రము అమృతముకొలకు మందరపర్వతముతో చిలికినట్లుండెను. భయంకరమైన కార్తవీర్యునిచూచి మహోరగములు భీతావహములయ్యెను. ఆషాములు తమతలలడించుకొని వెంటనే పారిపోయెను. మహోరగములు తలలు వంచుకొని యున్నప్పుడు సాయాహ్నమున, గాలిలేనప్పుడున్న కదలీఖండములవలెనుండెను. దృఢమయిన చాపమునందు నారీని అనుసంధించి, ఐదువందలబాణములను పూంచెను. తన శౌర్యముచే లంకేశుఁడయిన రావణుని మూర్చ పొందజేసెను. ఆతనిని యుద్ధమున జయించి వశపరచుకొనెను. “ఆతనిని మాహిష్మతీ నగరమునకు తీసికొనివచ్చి బంధించెను. తరువాత పులస్త్యుఁడు కార్తవీర్యునిచేరీ, శాంతపరచి ప్రసన్నుని చేసెను. (34)
పులస్త్యునిచే యాచింపఁబడి రాజు పౌలస్త్యుని (రావణుని) విముక్తుని చేసెను. ఆతనిబాహుసహస్రముచే కలిగిన వంటి శబ్దము యుగాంతమున పిడుగులతో దద్దరిల్లఁజేసిన మేఘధ్వనివలే నుండెను. అహో ! భార్గవుండు మహావీరుఁడు. ఏలయన యుద్దభూమీలో ఆతని సహస్రబాహువులను, బంగారు తాళవనమేమోయన్నట్లు నరికి వైచెను. ఒకప్పుడు దాహపీడుతుఁడు, క్షుధార్తుఁడునైన అగ్నిహోత్రునిచే బిక్ష యాచింపఁబడెను. అగ్నిహోత్రునకు రాజు సప్తద్వీపములను బిక్షమొసంగెను, పట్టణముల ఘోషములు, గ్రామములు పట్టణములు వీని. నన్నింటిని, చిత్రభానువు తన బాణములచే జ్వలింపఁజేసెను. మహాయశస్వి పురుషేంద్రుఁడయిన అగ్ని, కార్తవీర్యుని ప్రతాపముచే పర్వతములను వనములను దహించి వైచెను. హైహయునీతో కూడి చిత్రభానువు (వరుణుని కుమారుని) యొక్క శూన్యమైన యాశ్రమమును సర్వము దగ్గ పటల మొనర్చెను. అతని పేరు వసిష్ఠుఁడు. ఆతని వరుణుఁడు పొందెను. ఆ వసిష్ఠసాముఁడయిన ముని తరువాత ‘ఆపవ’ అనునామమును చెందెను. ఆ యాపవ మునీ క్రోధముతో అర్జునుని శపించెను. (44) “ఓహైహయ! సావనమును నీవు విడువని కారణమున, వేళకరాజు అర్జునుఁడనువాఁడు. కుంతీసుతుఁడు, రాజగును. ఆప్పుడు నీవు చేసిన దుష్కరమైనకర్మలను అతిశయించును. ప్రహరించువారిలో శ్రేష్ఠుఁడగు పరశురాముఁడు, నీసహస్రబాహువులను ఖండించును. ఒకముని రాముఁడు గొప్ప పరాక్రమము శౌర్యముగల బ్రాహ్మణుఁడు, అర్జునునివధించును. ధీమంతుఁ డయిన ఆ ఋషియొక్క శాపముచే రాముఁడు ఆ మృత్యువునకు కారణుఁడయ్యెను. పూర్వము రాజేయిట్టీ వరమును స్వయముగా కోరుకొనేను.
ఆతనికి నూర్గురు పుత్రులు. వారిలో ఐదుగురు సుహారథులు. వారు అస్త్ర విద్యయందారితేరినవారు. బలవంతులు, శూరులు, ధర్మాత్ములు, యశస్వంతులు. వారు శూరుఁడు, శూరసేనుఁడు, వృషాస్యుఁడు, వృషుఁడు, జయధ్వజుఁడును. వారి వంశకర్త జయధ్వజుఁడు: ఆతఁడు అవంతికీ రాజు, (50) జయధ్వజుని పుత్రుఁడు తాలధ్వజుఁడు. ఇతఁడు ప్రతాపవంతుఁడు. ఆతనికీ నూరుగురు పుత్రులు, వారు తాలజంఘులనుపేర ప్రఖ్యాతులు. ఈ విధముగా హైహయులలో పంచవర్గములవారు మహాత్ములు వారు వీతిహోత్రులు, భోజులు, ఆవంతులు, వీక్రాంతులయిన తుండికేరులు మఱియు తాలధ్వజులు. వీతిహోత్రునీ సుతుఁడు అనంతుఁడను పార్థివుండు. అనంతుని పుత్రుఁడు. దుర్జయుఁడు. ఆతఁడు శత్రుకర్శనుండు. “అనష్టద్రవ్యత” (ధనము పోకుండనుండుట) అనువరమును రాజు పొందెను. ఆత్మీయమైన గొప్ప ప్రభావముతో మహారాజు తన ప్రజలను పాలించెను. ఆతఁడు విత్తమునెన్నడును పోగొట్టుకోనలేదు. పోయినదెల్ల నాతఁడు మరల పొందెను. ధీమంతుఁడైన కార్తవీర్యుని యొక్క జన్మ చరిత్రనెవ్వఁడు చెప్పుతో ఆతని వీభవ మధికమగును అతని ధర్మము శాశ్వతముగా వృద్ధిపొందును. ఆతఁడు స్వర్గమున యజ్ఞముల చేసినయతఁడు, దానము లాచరించిన యతఁడు గౌరవింపబడునట్లు గౌరవింపఁబడును.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరితమున కార్తవీర్యసంభవమను అరువదితొమ్మిదవ అధ్యాయము.
