3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

63 - ఇక్ష్వాకువంశము

సూత ఉవాచ :-

సూతుఁడిట్లనెను.

కకుర్మీయని పిలువఁబడు రైవతకుండు (బ్రహ్మ) లోకమున కరుగగా, ఆతని నగర మయిన కుశస్థలిని యక్షులు) రాక్షసులు స్వాధీనము : చేసికొనిరి (అపహరించిరి) ధార్మికుఁడయిన ఆ మహాత్ముని నూర్గురు సోదరులు బాణములచే కొట్టబడిరి. ప్రాణ భయమున. వారు నానాదిక్కులకు పారిరి, ఓ ద్విజోత్తములారా భయాక్రాంతులై పలాయితులయిన క్షత్రియులయొక్క అన్వయము చాల గొప్పది. అయినను వారు నలుదిక్కులకు పారిపోయిరి. శర్యాతులనీ వారు సర్వత్ర ప్రసిద్ధులు. వారు ధార్మికులు. దృష్ట యొక్క వంశీయులు ఛార్షకులు, వారందరు యుద్ధమున - ధైర్యవంతులు. ధృష్టవంతులు (అసాధ్యులు). ఆ క్షత్రియ మహాత్ముల వంశము మూడు వేల మంది. నభగుని యొక్క దాయాది నాభాగుండు. నాభాగుని కుమారుఁడు అంబరీషుఁడు. అంబరీషుని కుమారుఁడు విరూపుఁడు. విరూపుని కుమారుఁడు పృషదశ్వుఁడు. పృషదశ్వునీ కుమారుం డు, రథతరుఁడు. వీరందరు క్షత్రియ వంశమున పుట్టినవారు. కానీ వీరినీ ఆంగిరసులనీ స్మరింతురు, రథోతరుని ఉత్తమ వంశీయులు బ్రాహ్మణులు క్షత్రియులు కూడ. (7) పూర్వము మనువు తుమ్మగా ఇక్ష్వాకుఁడు పుట్టెను. ఇక్ష్వాకునకు నూర్గురు పుత్రులు. వారు భూరి దక్షిణలు బ్రాహ్మణుల తృప్తి పరచిరి. వారిలో (ఆ నూర్గురిలో) వికుక్షి, నిమి, దండుడు - అను ముగ్గురు శ్రేష్ఠులు. ఆతనికి ఏబది. పుత్రులు. వారిలో ముఖ్యుఁడు శకుని. (7) వారు ఉత్తరాపథ దేశములకు రక్షకులు. వారిలో విరాటుడు మొదలైన నలుబది యెనమండ్రు. దక్షిణాపథ రక్షకులు. అష్టకమను నొక శ్రాద్ద క్రియయందు, ఇక్ష్వాకుఁడు వికుక్షి కిట్లాదేశించెను. రాజిట్లాదేశించెను. “ఓ మహాబల ! శ్రాద్దము కొఱకు మృగముల చంపి మాంసమును దేమ్ము ఈ శ్రాద్ధాష్టకము నాచే తప్పక ఆచరింపఁ బడవలెను. (11)

రాజోవాచ :-

ధీమంతుఁడయిన యాతని యాజ్ఞచే ఆతఁడు వేటకరిగెను. చాల మృగములను చంపెను. అంత ఆతఁడు అలసిపోయెను. వేటకు వెళ్లిన వికుక్షి యొక కుందేటిని తినెను. వికుక్షి మాంసముతో తన సైన్యముతో తిరిగి రాగా, రాజు “మాంసమును చూడుడు, నీటినీ దానిపై చల్లుఁడు” అనెను. ‘అట్లే’ యనెను వసిషుఁడు. మాంసమును రాజు వశిష్ఠునకు చూపెను. మాంసము కలుషితమగుట చూచి వసిషుఁడు క్రుద్దుఁడయ్యెను. రాజుతో నిట్లనెను. ఓ రాజా ! మాంసము కుమారునిచే కలుషీకృతమయినది. శశమును తినుట వలన - ఓ మహారాజా, మాంసము దుష్టమయినది. ఓ రాజా ! ఈ దురాత్మునిచే శశము పూర్వము భక్షింపఁబడినది. అందుచే పితరులకీ మాంసము దుష్టము” అని. తరువాత ఇక్ష్వాకుఁడు క్రుద్దుఁడై వికుక్షితో - నాచే పితృకర్మకు నిర్దిష్ణుఁడవై వేట కరణ్యమున కరిగితివి. కాని నీవు శశమును ముందుగనే యీ రోజున తీంటివి. నీవు నీర్ఘణుఁడవు. దయాశూన్యుఁడవు. అందుచే నిన్ను నేపరిత్యజించుచున్నాను. నీ కర్మమున నీవెచ్చట కేనియేగుము”, అనెను. ఈ విధముగా నతఁడు ఇక్ష్వాకునిచే పరిత్యజింపఁబడెను. అందుచే నాతఁడు శశాదుఁడయ్యెను. (కుందేలునీ తిన్నవాఁడు) ఆతఁడు పరమధర్మాత్ముఁడు. అయోధ్యాధిపుఁడయ్యెను. వసిష్ఠునిచే ఆదేశింపఁబడి రాజ్యము నతఁడు చేసెను. రాజ్యము చేయుచుండగా రాజు ఆతని పాపముచే బాధపడెను. కొంతకాలము తరువాత శకస్మూత్ర తరంగములలో పడి ఆతడు నరకమేగెను. ఇది చదివిన తరువాత విధి నిషిద్ధముగా బుద్దిమంతుఁడేదియును తినరాదు.

ఋషయ ఊచుః :-

సూత ఉవాచ :-

‘మాంస’ పదమునకు అర్థము. ఎవరి మాంసమును నేను తినుచుంటినో అయ్యది నన్ను తినును మాం=నన్ను, సః = అతఁడు భక్షయితా = తప్పక తినును) తరువాతి జన్మలో, ఇదీయే మాంసత్వము, శశాదుని యొక దాయాది కకుత్తుడను వీర్యవంతుఁడు. పూర్వము ఆడీబక యుద్ధమున ఇంద్రుడు వృషభరూపమొందెను. ఈ రాజు ఆ వృషభము యొక్క మూపురమున కూర్చుండెను. కకుత్తుఁడు యుద్ధమున జయించెను. (వృషభము (ఇంద్రుఁడు) కకుది మూపురమందు స్థితః ఉన్నవాఁడు) అందుచే నీతఁడు కకుత్తుఁడయినాఁడు. కకుత్తుని కొమరుఁడు అనేవసుడు. పృథువు అనేనస కుమారుఁడు పృథుని కుమారుఁడు దృషదశ్వుఁడు. వీర్యవంతుఁడయిన రాజు అంధ్రుఁడు ఆతని వల్లబుట్టెను, అంధ్రునకు యువనాశ్వుఁడు పుత్రుడు, శ్రావస్తు ఆతని కుమారుఁడు. శ్రావస్తుండు రాజయ్యెను. ఆతఁడే శ్రావస్తీ నగరమును నిర్మించెను. శ్రావస్తుని వారసుండు బృహదశ్వుఁడు. ఆతఁడు ప్రఖ్యాతవంతుడు. బృహదశ్వుని సుతుఁడు కువలాశ్వుఁడు. ధుంధు వధ వలన ఆ రాజు ధుంధుమారుఁడని పేరు . గోంచెను. ధుంధుమారుఁడయ్యెను. ఋషులిట్లడిగిరి. ధుంధువు యొక్క వధను సవిస్తరముగా వీనఁగోరెదము, ఏకారణమున కువలాశ్వునకు. ధుంధుమారత్వమబ్బెనో ఆ వృత్తాంతమును జెప్పుడు. సూతుఁడిట్లు నుడివేను.. కువలాశ్వునకు (21000) ఇరువది యొక వేయి పుత్రులు వారందరు సర్వ విద్యల యందు ఆరితేరినవారు. బలవంతులు. దురాసదులు. అందరు ధార్మికులే. యజ్ఞము లాచరించినవారు. గొప్పగొప్ప దక్షిణల నొసంగినవారు. బృహదశ్వుఁడు, మహావీరుఁడు, శూరుఁడు, ఉత్తముఁడునైన కువలాశ్వుని తన రాజ్యము నందు రాజుగా నభిషేకించేను. పుత్రులకు సర్వైశ్వర్యము లొసంగి రాజు అరణ్యము ప్రవేశించేను. (33) మహారాజు, శూరుఁడు, ఉత్తమ ధార్మికుఁడు నైన బృహదశ్వుని వనమునకు ప్రయాణమై పోవు వానీని మహర్షి యైన ఉత్తంకుఁడు పారించెను. (34)

ఉత్తంక ఉవాచ :-

ఉత్తంకుఁడిట్లు చెప్పెను. ప్రజారక్షణము నీ కార్యము. నీవు దానీ నాచరింప నరుఁడవు. ఓ రాజా ! నిరుద్విగ్నుఁడవై (శాంతమనస్సుతో) తపము చేయలేకుంటివి. ఓ రాజా ! నా యాశ్రమ సమీపములందు, మేరు పర్వతపు ప్రక్కను, సముద్రము ఇసుకతో నిండియున్నది. దేవతలచే, అవధ్యుఁడు, మహాకాయుఁడు, మహాబలుఁడు, రాక్షసుఁడైన, మధుని పుత్రుఁడు ధుంధువను మహా రాక్షసుఁడు, అంతర్భూమిగతుఁడై, (ఇసుకలో అంతర్షితుఁడై) (పూడిపోయి) లోకవినాశనము కొఱకు, దారుణమయిన తపమందుండి యున్నాడు. సంవత్సరాంతమున నొకసారి ఆతఁడు - నిశ్వసింప భూమీ సకాననముగా చలించిపోవును. (39) ఆతని నీశ్వాసవాయువుచే గొప్పగా రజస్సు బయలుదేరును. ఆ వాయువు ఆదిత్యమార్గము నావరించును. భూమి ఏడురోజులు ప్రకంపనము చెందును. విస్ఫులింగములతో, మంటలతో, ధూమముతో అతి దారుణమై యొప్పును. అందుచే నేను నా యాశ్రమమున నిలువ జాలకుంటిని. ఓ మహారాజ ! లోకమునకు హితమాచరింప వానిని వారించుము. నీ తేజము చాల గొప్పది. విష్ణువు నీ తేజస్సును ఇంకను నధీకము చేయును. ఆ రాక్షసుఁడు చంపఁబడినచో లోకములన్నియు. స్వస్థములగును. ఓ.పృథివీపతీ ! నీవు ఆ రాక్షసవధకు నరుఁడవు. పూర్వము ఓ రాజా ! ఆతనిని చంపెదనని విష్ణుతల్యుండవయిన నీవు నాకు వరంబొసంగితివీ. ధుంధుఁడు మహావీర్యుండు అల్పతేజస్సుచే చంపబడ శక్తుఁడు కాడు. పృథివీ పాలురు వర్షశతము యుద్ధము చేసినను, ఆతనినీ దగ్గపటలుని చేయుటకు వీలు కాదు. ఆతని వీర్యము చాల గొప్పది దేవతలకు దరిచేరి జయింపరానిదీ”. అని మహాత్ముఁడు రాజర్షి ఉత్తంకుండు పలుక, రాజు ధుంధుమారుని వధార్థము కువలాశ్వు నొసంగెను.

భగవన్ ! నేను శస్త్రత్యాగము చేసితిని. ఈతఁడు నా కుమారుడు. సంశయింపకుము. ఈతఁడు తప్పక ధుంధుమారకుఁడు కాగలఁడు.” విడువక ధుంధువును చంపుకార్యమును నెరవేర్చుమని ఆతనిని శాసించెను. శంసితవ్రతుఁడయిన రోజు తపస్సునకు అరణ్యమున కరిగెను. ధర్మాత్ముఁడయిన కువలాశ్వుఁడు పితృవాక్యము నాశ్రయించి ఇరువది యొక వేయి సంఖ్య గల తన పుత్ర వర్గముతో, ఉత్తంకునీతో కూడ ధుంధువు యొక్క నివారణము కొఱకు బయలుదేరెను. అంత భగవంతుఁడయిన విష్ణువు స్వతేజస్సుతో నాతనిని ఆవేశించెను. ఉత్తంకుని యొక్క నియోగము వలన లోకములకు హితమాచరించుకోరికతో, దుర్ధర ప్రతాపుఁడయిన ఆ మహారాజు బయలుదేరగా, ఆకాశమున మహా శబ్దమొకటయ్యేను. “నేఁడు మొదలుకొని యీ రాజు ధుంధుమారుడగును. దేవతలందరు దీవ్యములయిన . పుష్పములతో ఆతనిపై నంతట వర్షించిరి. అప్పుడు దేవదుందుభులు గట్టిగా ధ్వనించేను. పురుషవ్యాఘమైన యాతఁడు తన కుమారులతో కూడి వెడలెను. ఇసుకతో అవ్యయముగా నిండియున్న సముద్రమును త్రవ్వించెను. ఆ మహారాజపుత్రులచే త్రవ్వబడి, మౌలుకలో (ఇసుకలో) అంతర్షితుఁడయి పశ్చిమముగా నున్న ధుంధువుని వారు గాంచిరి. ధుంధువు క్రుద్ధుఁడయ్యెను. ముఖము నుండి పుట్టిన అగ్నితో లోకములను తల్లక్రిందులు చేయబూనినట్లుండెను. (55) ఆ అసురశ్రేష్ఠుఁడు తన యొక్క యోగబలముచే మహోదధి చంద్రోదయమున తరంగ సమూహములతో నీటిని గుమ్మరించునట్లు మహోర్మికలతో ప్రవహింప చేసెను. ఆ మహారాజ పుత్రులందరు పూర్తిగా దగ్గపటలులైరి. వానితోడి యుద్దములో ముగ్గురు మాత్రమే మిగిలిరి. అంత మహా బలుఁడు, మహాతేజుఁడునయిన రాజు తన బంధువుల (ఐరి) నెల్లరంజంపిన అతిబలుఁడయిన ధుంధువును చేరెను.

యోగియయిన రాజు తన యోగబలముచే, రాక్షసుఁడు కల్పించిన నీటియొక్క వేగమును శమింప చేసెను, వహ్నినీ నీటిచే చల్లార్చేను, తుదిని మహాకాయుఁడయిన ఆ ఉదకరాక్షసుని తన శక్తిచే చంపెను. కృతకర్ముఁడై రాజు మృతుఁడయిన ధుంధుపును ఉత్తంకునకు చూపెను. మహాత్ముడయిన రాజునకు ఉత్తంకుఁడు వరమొసంగెను. దానమిచ్చిన కొలదీ అధికము అక్షయమునగు విత్తమును, శత్రువులకప్రధష్యత్వము, సతతము ధర్మమునందాసక్తియు, అక్షయముగా సర్గమునందు వాసము, రాక్షసునిచే హతులయిన పుత్రులకు స్వర్గమున అక్షయలోకములు వరములుగా రాజున కొసంగెను. బ్రతీకీయున్న ముగ్గురు పుత్రులు శిష్టులు. వారిలో జ్యేష్ణుఁడు దృఢశ్వుఁడు. భద్రాశ్వుడు, కపిలాశ్వుఁడు చిన్నవారు. దృఢశ్వుండు రౌంధుమారిగా విశ్రుతుఁడు. ఆతని కుమారుఁడు హర్యశ్వుడు. హర్యశ్వునీ పుత్రుఁడు నికుంభుఁడు. నీకుంభుం డెల్లప్పుడు క్షత్రియ ధర్మవిశారదుఁడు. (64) సంహతాశ్వుఁడు నికుంభుని సుతుఁడు, ఇతఁడు రణవిశారదుఁడు. సంహతాశ్వునకు కృతాశ్వుండు, అకృతాశ్వుఁడు అను నిద్దరు కుమారులు, సంహతాశ్వుని పత్ని హైమవతి. ఆమె పతివ్రత. తల్లి దృషద్వతి, త్రిలోకవిఖ్యాత. ఆతని కుమారుం డు ప్రసేనజిత్తు. ఆతని కుమారుఁడు యువనాశ్వుఁడు, లోకత్రయమున విశ్రుతుడు. (65) ఈతని భార్య గౌరి. ఆమె అత్యంత ధార్మికురాలు పతివ్రత. కాని ఆమె భర్తచే శపింపఁబడి ‘బాహుదా’ నదిగా! మారిపోయినది. ఆమె కుమారుడు గౌరికుఁడు, ఈతఁడు చక్రవర్తి యయ్యెను. యువనాశ్వుని కుమారుఁడగు మాంధాత మూడు లోకములను జయించిన రాజు. ఈ విషయములో పౌరాణీకద్విజులు ఈ శ్లోకము నుదహరింతురు. “సూర్యుఁడెందెందుదయించునో, ఎందెందు ప్రతిష్టితుఁడగునో అదియంతయు యౌవనాశ్వుఁడయిన మంధాత యొక్క క్షేత్రమని చెప్పుదురు. ఆతనికి చైత్రరథ భార్య. ఆమె శశబిందునీ కూతురు. (?)

ఆమే బిందుమతి. సాధ్వి, రూపమున ఆమె భూమీయందత్వీయ. ఈ సాధ్వీ వేయిమంది సోదరులకు అక్క ఆమె వలన మాంధాతకు ముగ్గురు కొమరులు, వారు పురుకుత్సుఁడు, అంబరీషుఁడు, ముచికుందుఁడనీ విఖ్యాతులు. యువనేశ్వుఁడు అంబరీషునకు దాయాది (వారసుం డు). ఈమె నర్మదకు జన్మించెను, అతని కుమారుఁడు సంభూతుఁడు. సంభూతునకాత్మజుఁడు అనరణ్యుఁడు. అతఁడు ప్రతాపవంతుఁడు. ఆతనిని రిషణుఁడు చంపెను. రావణుఁడో మూఁడులోకములను జయంచినవాఁడు. (74) దృశ్యుఁడు అనరణ్యుని యొక్క కుమారుడు.. హర్యశ్వుండు దశ్యుని పుత్రుఁడు. హర్యశ్వ దృషద్వతులకు ‘సుమతి’ పుట్టెను. ఆ సుమతి పుత్రుఁడు ధార్మికుఁడు, పేరు త్రిధన్వుఁడు. త్రీధన్వుని కుమారుఁడు త్రయ్యారుడి. ఆతఁడు పెద్ద పండితుఁడు. (76) ఆతనికి సత్యవ్రతుఁడు కుమారుఁడు. ఆతఁడు మహాబలు(డు. దీనౌకలను (దేవతలను - పితరులను)చంపి, సత్యవ్రతుఁడు వీధరుని యొక్క భార్యను ఎత్తుకొని పోయెను. ఆ విద్వాంసునిచే ఈ పాపకృత్యము కామముచే, బలముచే, మోహముచే నొనర్పఁబడెను, ఇయ్యది అనివార్యమయిన భవిష్యత్కాలకర్మచే ఆధీమంతునిచే చేయఁబడెను. పాణిగ్రహణ మంత్రములు సంపూర్ణము కానప్పుడే యీ కార్యమాతఁడు చేసెను. ఆతడొనర్చిన యధర్మకార్యమునకు ఆతని తండ్రి త్రయ్యారణుఁడు కుమారుని బహిష్కరించెను. (71) తండ్రి క్రోధ సమన్వితుఁడై ఈ కార్యము అవమానకరము, అపధ్వంసము అనీ పలుమార్లు చెప్పుచు చేసెను. ఆతఁడు పదేపదే తండ్రిని నేను ఒక్కడను. ఎక్కడ కేగువాఁడ'నని యడిగెను. తండ్రి ‘కుక్కమాంసము వండుకొని తినువారితో కలిసి నర్తించుము. నీవలన పుత్రుని నేను కోరను నీవో కులపొంసుఁడవు’ అనెను. ఇట్లు చెప్పఁబడి తండ్రి ఆజ్ఞచే- నతఁడు నగరము నుండి వెడలేను. భగవంతుఁడు వసిష్ణుండైన నాతని వారింపలేదు. ధీమంతుడైన సత్యవ్రతుఁడు తండ్రిచే వ్యక్తుఁడై శ్వపాకుల నివాసాంతీకమున నివసించేను. తరువాత అతని తండ్రికూడ నరణ్యమున కరగెను.

ఈ పాపము కారణముగా ఇంద్రుఁడాదేశమున పూర్తిగా పదిరెండేండ్లు ఒక్క చినుకైన రాల్చలేదు. (84) మహాతపస్వి విశ్వామిత్రుఁడు తన భార్యను ఆ రాజు యొక్క రాష్ట్రమున విడిచిపుచ్చి, సముద్ర సమీపమందలి కయ్యలలో దీర్ఘమయిన తపస్సాచరించెను. (85) ఆతని పత్ని తనకు పుట్టినకుమారులలో మధ్యముని యొక్క గళమున త్రాడు కట్టి పందగోపుల వెలకు అమ్మజూపెను. ఆమె మిగిలిన కుమారులను పోషించుట కొఱకు ఈ కుమారు నమ్మజూపెను. (86) ధర్మాత్ముఁడు సువ్రతుఁడు నైన రాజు, విక్రయము కొఱకు గళమున కట్టబడిన మహర్షి పుత్రుని చూచి యాతని విడిపించేను. (విముక్తిని చేసెను). విశ్వామిత్రుని సంతుష్టిపరచుటకు, ఆతనీ దయకొలకు, బుద్ధిమంతుఁడయిన సత్యవ్రతుఁడు ఆతనిని రక్షించి భరించెను. (పోషించేను) మెడలో త్రాడు గట్టఁబడిన బాలుఁడు కాలాంతరమున గోలవుఁడను మహాతపస్వి యయ్యెను. కౌశికుఁడు (కుశిక వంశోత్పన్నఁడు) వీరుఁడైన సత్యవ్రతునిచే విముక్తుఁడయ్యెను. పూనిన వ్రతము చేతను, భక్తి చేతను, దయచేతను, ప్రతిజ్ఞచేతను సుప్రతుఁడు (రాజు) విశ్వామిత్రుని యొక్క భార్యను కూడ నియబద్ధుఁడై పోషించెను. (90) ఆతఁడు మృగములను, వరాహములను, మహిషములను, జలచరములను చంపి వానీ మాంసమును విశ్వామిత్రునీ సన్నిధికి తీసికొనివచ్చెడివాఁడు. వసిష్టునియొక్క ప్రేరేపణమున సత్యవ్రతుని తండ్రి ఉపాంశువ్రతమును స్వీకరించి, తన్నిమిత్తమై పండ్రెండ్లిండ్ల దీక్ష వహించేను. రాజు అరణ్యమున కేగినప్పుడు, వసిష్ఠుఁడు సత్యవ్రతుని వలన కలుగు దుస్సంబంధము వలన నుండి, అయోధ్యానగరమును, రాష్ట్రమును రాజాంతఃపురమును, రక్షించెను. (73) సత్యవ్రతుఁడు బాల్యముచే, అనివార్యమగు భవిష్యత్తు. యొక్క బలముచే, తన విచారముచే వసిష్ణునీ యెడ కోపము వహించెను. రాష్ట్రము నుండి తండ్రి కుమారుని బహిష్కరించుచుండ వసిష్ఠుఁడు ఆతని నివారింప లేదనుకరణముచేతనే వసిష్టుని యెడ నాతనికి కోపము.

పాణిగ్రహణ మంత్రములలో తుదీదీ సప్తపది, దానిని తలపోసి సప్తమపాదమున సత్యవ్రతుఁడు ఆమెను పరిత్యజించేను. “వసిష్ఠుఁడు ధర్మము నెఱింగియు, నవ మంత్రములను గోరుచున్నాఁడని చెప్పుచు సత్యవ్రతుఁడు తనమనమున వసిషుని యెడకోపించెను. భగవానుఁడైన వసిష్ఠుఁడు వారియొక్క క్షేమము కొఱకు తపమాచరించెను. కాని అతని ‘ఉపాంశు’ వ్రతమును సత్యవ్రతుఁడు గ్రహీంపలేదు. (78) మహాత్ముం డైన యాతని కోపమంతయును కుమారునియందే అధికమయ్యెను. అందుచే ఇంద్రుఁడు పండ్రెండు సంవత్సరములు వర్షింపలేదు. “అందుచే ఏతత్కులమునకు నిష్కృతి కఠినమైన దీక్ష వహించిన నాచే ఇప్పుడు జరుగును” అని వసిష్ఠుఁడు తలపోసెను. అందుచే పుత్రుని దేశ బహిష్కృతుని చేయు తండ్రి తండడ్డుపెట్ట లేదు.” “ఆతఁడు చనిపోయిన వెనుక నీతనిని నేను అభిషిక్తునిచేసెద నని వసిష్ఠుఁడు. తలంచెను. అంతలో, బలవంతుడైన రాజు ద్వాదశవర్ష దీక్షను వహించెను. మాంసమప్పుడు దొరకనందున, నృపాత్మజుండు కోరికలనొసంగు కామదుఘ యైన వసిష్ఠుని ధేనువును చూచెను. దానిని క్రోధముచే మోహముచే, శ్రమచే, ఆకలిచే చూచి, ఛండాలుని ధర్మమును వహించీ దొంగవలే బలవంతులలో శ్రేషుఁడయిన రాజపుత్రుఁడు వసిష్టునీ యందలి కోపముచే ఆ ధేనువును చంపెను. ఆతఁడు ఆ మాంసమును విశ్వామిత్రుని కుమారులచే తినిపించెను. (104) ఏతద్వృత్తాంతమును విని వసిష్ఠుఁడాతనిని త్యజించెను. వసిష్ఠుఁడు రాజకుమారునితో ఓ క్రూరుఁడా నీకిప్పటికే మూడు పాపములు లేకుండ నున్నచో నిన్ను పతితునిచేసేవాఁడను. నీవో ఇంకొక ఫరపాతకము చేసితివి. నీవు మూఁడు విధములుగా పాతకము లాచరించితివి. నీ తండ్రిని అసంతృప్తనీ జేసితివి; నీగురువైన నాయొక్క ధేనువును చంపితిని. నీటితో ప్రోక్షితము చేయకుండగ భుజించితివి. ఇది విధి వ్యతిక్రమము.

మహాతపస్వీ యీ మూఁడుపాపములోతని యందు చూచెను. అందుచే నతనిని త్రిశంకువనిరి. తాను లేనప్పుడు తన భార్యను రక్షించుటచే నతనీ యంద్రు ప్రీతుఁడయ్యెను.ఆతడతనికి వరమీడేను. వరము కోరుకొమ్మనీ. బలాత్కరింప ఆ రాజపుత్రుఁడు “నీవు నాకు గురుఁడవు కావలెను. స్వశరీరముతో స్వర్గమునకు నేను వెళ్లవలయు ననీ వరము యాచించెను. (110) పండ్రెండు సంవత్సరములు అనావృష్టి భయముచే, ముని యీతనినీ ప్రీత్యరాజ్యమున నభిషిక్తునీ చేసెను. దేవతలు,మునియైన వసిష్ఠుఁడు, సశరీరముగా నీరాజ పుత్రుని విశ్వామిత్రుఁడు దీవమున కారోహింప జేయచూచిరి. ఇది యత్యంతమాశ్చర్యకరమయ్యెను. ఏలయన, వసిష్ఠుఁడు తాను స్వయముగా చూచుచుండుటచే ఈ సందర్భమున పురాణ పరిచితులైన వారీ శ్లోకము నుదహరించెదరు. విశ్వామిత్రుని ప్రసాదము వలన, దేవతలతో సహా మహా తేజస్వి త్రిశంకుండు ఆకాశమున ప్రకాశించుచున్నాఁడు” అని. ఆతని భార్య సత్యరత, ఆమె కైకయవంశమున పుట్టెను. ఆమెకు హరిశ్చంద్రుఁడు కుమారుఁడు. ఆతఁడకల్మషుఁడు. ఆ రాజయిన హరిశ్చంద్రుఁడు త్రిశంకుఁడని సంస్కృతుఁడు. ఆతడు రాజసూయ యజ్ఞముల నాచరించినవాడని, సమ్రాట్టని ప్రఖ్యాతి పొందెను, (116) హరిశ్చంద్రుని కుమారుఁడు రోహితుఁడు. ఆతఁడు వీర్య వంతుండు. రోహితుని కుమారుడు హరీతుఁడు. హరితుని కుమారుడు చంచును. చంచువు యొక్క పుత్రులు వీనయుఁడు, సుదేవుఁడును. సుదేవుఁడు సర్వక్షత్రియవిజేత అందుచేనతఁడు వీజయుఁడుగా ప్రసిద్ధుఁడు. విజయునికుమారుఁడు రురుకుఁడు, రాజయిన రురుకుఁడుఁడు ధర్మము నందు అర్థశాస్త్రమునందు కోవిదుఁడు. గురుకునకు వృకుఁడు పుత్రుం డు వృకుని పుత్రుఁడు బాహువు. బాహువు వ్యసనపరుఁడైన రాజు, హైహయులు, తాలజంఘులు, శకులు, యవనులు, కాంభోజులు, పారదులు, పహ్లవులు - వీరందరతనిని పదచ్యుతుని చేసిరి.

ఋషయః ఊచుః :-

సూత ఉవాచ :-

ఆ యుగము ధర్మమున కనుకూలముగా నున్నను ఆ రాజు (బాహువు) అత్యర్థముగా ధర్మరహితుఁడయ్యెను. ఆబాహువు కుమారుఁడు సగరుండు. గరము (వీషము)తో జన్మించెను. (121) భృగుని ఆశ్రమమున నాతఁడు జన్మించెను. ఔర్వునిచే రక్షింపఁబడెను. భృగుని మనుమం డయిన ఔర్వుని వలన ఆగ్నేయాస్త్రమును బడసి, రాజయిన సగరుఁడు విజయయాత్రకు ప్రపంచమున బయలుదేరి, తాలజంఘులను, హైహయులను చంపెను. ధర్మవిదుఁడయిన రాజు. శకుల యొక్క పహ్లవుల యొక్క ధర్మమును నిరాకరించెను. ధర్మము యొక్క సత్యస్వభావము నెఱిఁగిన సగరుఁడు పారదులనెడు క్షత్రియులను స్వవర్ణము నుండి బహిష్కరించెను, ఋషులిట్లడిగిరి, విషము నుండి సగరుఁడు ఎట్లు జన్మించెను? కుదుఁడయిన రాజు ఎన్నడును దోషమాచరింపనివాఁడు, మహౌజసులు ధర్మవంతులు క్షత్రియులునయిన శకాదులను వంశపరంపరయా వచ్చు ధర్మము ననుసరించు వారలను ఏల పరిత్యజించెను. (కులము నుండి వెలివేసెను)? (125) సూతుఁడిట్లు, సమాధాన మొసంగెను. ఇంతకు పూర్వమే చెప్పఁబడినది - దుర్వ్యసనియైన బాహువు యొక్క రాజ్యము శకులతో కూడివచ్చిన హైహయులచేతను తాలజంఘులచేతను అపహృతమయినది. (126) యవనులు, పారదులు, కాంభోజులు, పహ్లవులు (శకులు) ఈ యైదు జాతులవారు హైహయులకొఱకు పరాక్రాంతులయిరి. (ఒండొరులతో యుద్ధము చేసిరి) సంహృతరాజ్యండయిన బాహువు తన గృహాదులనెల్లను విడిచి పుణ్యవనమును ప్రవేశించెను. ధర్మాత్ముడయిన బాహువు తన భార్యతో తపమాచరించెను. (128) దుర్భలుడయినను రాజు ఒకనాఁడు నీరు తెచ్చుటకు వెడలెను. పద్ధత్వముచే, దుర్భలత్వముచే నతఁడు ఆయరణ్యములో మరణించెను. యాదవ వంశ్యురాలయిన ఆ రాజపత్ని, ఆపన్నసత్త్వ, ఆతని వెనుకనే వేడలేను. ఆమె సవతి, ఆమె గర్భస్థమయిన శిశువు మరణింపవలెనని విషమామేకిడెను. ఆమె భర్తకు చితిపై నిప్పు పెట్టి, తాను కూడ ఆ చీత్ నారోహించెను. భృగుని మనుమఁడయిన ఔర్వుఁడు ఆమెను చూచి, దయపుట్టి, చితినుండి ఆమెను విరమింపఁజేసెను.

ఆ ఔర్వుని ఆశ్రమములో విషముతో సహితముగా. మహాబాహుడు ధార్మికుఁడునైన సగరునీ ఆమె కనెను. (132) ఆ మహాత్మునకు ఔర్వుడు జాతకర్మాదు లాచరించెను. వేదాలను శాస్త్రములను అధ్యయనము చేయించెను. తరువాత ఆస్త్రవిద్యను ప్రసాదించెను. తరువాత ఆ.. రాజు (సగరుఁడు) శకులను, యవనులను, కాంభోజులను, పారదులను, పహ్లవులను నిశ్శేషము చేయుటకు నిశ్చయించుకొనెను. (134). వారందరు వీరుఁడు, మహాత్ముఁడునైన సగరునిచే బాధింపఁబడ, వారందరు శరణాభిరతులయి వసిష్ఠునీ శరణుజొచ్చిరి. వినయవంతులయిన వారందరిని వసిష్ఠుఁడు చూచి, భయము నుండి వారికి అభయమొసఁగి, సగరుని వారిని చంపుట నుండి వారించేను. సగరుండు తన ప్రతిజ్ఞను, గురుఁడయిన వసిష్ఠునీ వాక్యమును విని, వారి వంశాగత కులాచారములను, ధర్మమును ఛేదించెను. వారి వేషములను, వస్త్రధారణములను మార్చుకొనునట్లు చేసెను. ఆతఁడు శకులయొక్క తలలను సగము గొరిగించెను; యవనుల యొక్క తలలను పూర్తిగా గొరిగించి విడిచెను, కాంభోజులకు నట్లే యొనర్చెను. పారదులను జుత్తు విదల్చుకొనియుండునట్లును, పహ్లవులను వారి మీసములను గడ్డమును మాత్రమే పెంచుకోనునట్లును చేసెను. వీరందరు స్వాధ్యాయ రహితులుగను, వషట్కారమంత్రములు లేకుండువారలగను సగరుఁడు చేసెను. శకులు, యవనులు, కాంభోజులు, ప్రహ్లవులు, పారదులు, కలిస్పర్థులు, మహిషికులు, దార్పులు, చోళులు, ఖశాసులు మొదలగు క్షత్రియగణములు వారి వారి ధర్మములను నిరాకించియుండునట్లు వసిష్ఠుల యాజ్ఞచే మహాత్ముఁడు సగరుఁడు చేసెను. సకల పృథ్విని ధర్మవిజయము చేసి జయించి, వాజిమేధ యజ్ఞమును చేయుటకు దీక్షితుఁడై అశ్వమేధాశ్వమును సగరుఁడు వీడిచిపెట్టెను. ఇట్లు పూర్వదీక్షితుని యశ్వము సముద్రపరీత భూముల సంచరించుచుండ సముద్రతీరమున అశ్వము అపహృతమై భూమిలోనికి తీసికొని పోబడెను. ఆ ప్రదేశము నంతటినీ రాజు తన. సుతులచే త్రవ్వించేను. సేతువు పర్యంతము సముద్రము త్రవ్వబడగా మహార్ణవము యొక్క అంతఃప్రదేశమున ఆది పురుషుడు, దేవుడు, హరీ, కృష్ణుఁడు, ప్రజాపతి, హంసుఁడు, నారాయణుఁడు, ప్రభువునయిన విష్ణువును కపిల మహర్షి రూపమున వారు చూచిరి. (45)

ఋషయః ఊచుః :-

సూత ఉవాచ :-

ఆతని దృష్టిపథము లోపడి సగరునిపుత్రులందరుదగ్గులయిరి. నలుగురు మాత్రము బ్రతికిరి. (146) వారు బర్షికేతువు, సుకేతువు, ధర్మ రథుఁడు, శూరుడైన పంచరథుఁడును. పోరా రాజవంశకరులయిరి. నారాయణుఁడు, హరి, భగవానుఁడు వారికీ వరములొసంగేను. ఆ వరములు స్వవంశమునకు అక్షయత్వము, వంద వాజేషయము లొనర్చుశక్తి, సర్వవ్యాపకమయిన సముద్రుఁడు పుత్రుఁడుగ, స్వర్గమున శాశ్వత వాసము ను బొందెను. అశ్వమును తీసికొని వచ్చి సరితాంపతియైన సముద్రుఁడు రాజునకు నమస్కరించెను. తానొనర్చిన యాకర్మచే నతనికి సాగరము (సగరత్వము)అని పేరు వచ్చెను. సముద్రము నుండి అశ్వమేధికాశ్వమును పొందిన తరువాత రాజు మొత్తము అశ్వమేధ యాగములను నూరింటినొనర్చెను. ఆతని అరువది వేల కుమారులను క్రోధముతో కపిలుఁడు దగ్గుల నొనర్చెను. తేజస్వంతులయిన ఆ అరువదివేల పుత్రులు విష్ణుని తేజస్సులో లీనమయిరని యింతకు పూర్వము వంటిమీ. ఋషులీట్లడిగిరి. సగరుని కుమారులు మహాబలులు, పరాక్రమవంతులు షష్టి సహస్రసంఖ్యాకులు ఏ వీధిచే పుట్టిరో తెలుపగోరెదము. సూతుఁడిట్లు చెప్పెను. సగరునకు ఇరువురు భార్యలు. వారు తపస్సుచేసి దగ్గకిల్బిషలయిరి. జ్యేష్ణురాలు విదర్భరాజు కూతురు పేరు కేశిని. చిన్నభార్య అరిష్టనేమి యొక్క కూతురు. ఆమె పరమధార్మికురాలు. రూపము నందు అసామాన్యురాలు. సాటి లేనిది. మునిసత్తముఁడయిన ఔర్వుని వారు తపస్సుచే నారాధించిరి. ఆ మహార్షి వారలకు వరము లొసంగెను. ఒకతె ఒక కుమారుని కనును. ఆతఁడు శాశ్వత వంశకర్తయగును.

ఇంక రెండవది అరువది వేల మంది కుమారులను గాంచును. ఆ మహర్షి వాక్యములు వీని, వంశకరణుఁడు, శ్రేష్ఠుడునగు ఒక్క కుమారునీ కేశిని కోరెను. రాజసభలో సుపర్ణుని భగినియైన సుమతి సంతోషముతో అరువదివేల పుత్రులను కోరెను, కాలము సాగినది. జ్యేష్ఠురాలు జ్యేష్ఠుఁడైన పుత్రుని కనినది. (157) అతఁడు సగరుని జ్యేష్ఠుఁడు. అసమంజసుఁడు అని వీఖ్యాతుఁడు. ప్రసిద్ద కుకుత్స వంశీయుం డు. యశస్వినీయైన సుమతీ గర్బతుంబమును గనెను. (సొరకాయ వంటి పిండమును) అరువదివేల సంఖ్యల పుత్రులు ఆగర్భ తుంబము నుండి బహిర్గతములయి పుట్టిరి. ఘృత పూర్వములయిన కుంభములలో ఆగర్భతుంబజులనతఁడుంచెను. వారిని పోషించుటకై రాజు ఒక్కొక్క గర్భశకలమునకొక్కోక్క రాత్రిని (మంత్రసానిని) నియోగించెను. తరువాత తొమ్మిది మాసములలో పుత్రులందరు మహాభాగులు, సగరప్రీతి వర్గనులు నయిరి. చిరకాలమునకు వారందరు యౌవన వంతులయిరి. సగరుని వలన కేశిని యొక్క మరియొక్క కుమారుఁడు బర్షికేతువు, ఆతం డు మహాబలుడు. ఆతఁడు అసమంజసుఁడుగా ఖ్యాతిగాంచేను. ఆతఁడు పురప్రజలకు అహితుఁడుగా నున్నందున పట్టణము నుండి తండ్రి యతనిని బహిష్కరించెను. అసమంజసునకు అంశుమంతుఁడు కుమారుఁడు, ఇతఁడు వీర్యవంతుఁడు. అతని కుమారుడు దిలీపుఁడు. ధర్మాత్ముం డు ప్రసిద్ధుఁడు. దిలీపునకు మహాతేజుఁడయిన భగీరధుడు పుట్టేను. ఆతఁడే విమానోపశోభితమును సరిచ్చేష్ఠమునయిన గంగా నదినీ భూమికీ తెచ్చెను. అయ్యది భగీరథునీ దుహితగా సురేశునిచే చేయఁబడినది. ఆ విషయమును పౌరాణికులు శ్లోకములో నుదహరింతురు. “భగీరథుఁడు గంగను కర్మలచే భూమికి తీసుకొనివచ్చెను. వంశ వృత్తాంత మెలింగినవారు ఆ కారణముచే గంగను భాగీరథీ” యని చెప్పుదురు.

భగీరథుని కుమారుఁడు శ్రుతుఁడు. ఆతని కుమారుడు నిత్యధర్మ పరాయణుఁడు నాభాగుండు. నాభాగుని కుమారుఁడు అంబరీ షుఁడు. ఆతని కుమారుఁడు సింధుద్వీపుఁడు పూర్వము వంశ చరిత్రలు పురాణములు తెలిసినవారు ఇట్లు కీర్తించుట తెలిసినదే. “నాభాగ సుతుఁడయిన అంబరీషుని భుజములచే పరిపాలింపఁబడి ఈ భూమి తాపత్రయ బాధచే అత్యంతము విసర్జితము”. వీర్యవంతుఁడయిన అయుతాయువు సింధుద్వీపుని కుమారుఁడు. అయుతాయువుయొక్క దాయాది మహాయశస్వియయిన ఋతుపర్ణుఁడు. ఈ ఋతుపర్ణుఁడు దీవ్యాక్ష హృదయము తెలిసినవాఁడు. ఇతఁడు మహాబలవంతుఁడు నలునీ సఖుఁడు. (173) పురాణములందు దృడప్రతులగు నిరువురు నలులు ప్రఖ్యాతులు. ఒకఁడు వీరసేనకుమారుఁడు, రెండు వాఁడు ఇక్ష్వాకుకులోద్వహుఁడు, ఋతుపర్ణుని కుమారుఁడు సర్వకాముఁడు. ఇతడు మహాప్రభువు . సుదాసుని కుమారుఁడు సుదాసనాముఁడయిన రాజు కల్మాష పాదుఁడుగా వీఖ్యాతుఁడు, ఆతఁడే మీత్ర సహుండను నామమున కూడ నొప్పెను. ఇక్ష్వాకు కులవృద్దికొకు, మహాతేజుఁడయిన వసిష్ఠుఁడు, కల్మాషపాదుని భార్యయందు అశ్మకునీ పుత్రునిగా గాంచేను. (177) మూలకుఁడు అశ్మకుని యారస పుత్రుఁడు. ఈ సందర్భములో మూలక నృపుని గూర్చి ఇట్లుదాహరించెదరు, “నిజముగా ఆతఁడు పరశురాముని వలనీభయముచే (ఆరాజ) స్త్రీలతో పరివృతుఁడై వారి మధ్య నుండేను. రక్షణము కోరి వీవస్తుఁడై ఆ ప్రభువు నారీలోకమునే కవచముగా ధరించెను.” ధర్మాత్ముం డైన శతరథుఁడు మూలకుని యొక్క కుమారుఁడుగా ఖ్యాతుఁడు ‘ఇడవీడు’డను మహాబలుఁడు శతరథుని యొక్క పుత్రుఁడు.

శ్రీమంతుడు ప్రతాపవంతుఁడు. ఆతడు విశ్వసహుని కుమారుఁడు పుత్రిక ఎవతేయందు జనించేను? దిలీపుఁడు విశ్వసహుని కుమారుఁడు. దిలీపుఁడు ఖట్వాంగుఁడుగా ప్రఖ్యాతుఁడు. ఇతఁడు ముహూర్త కాల పరిమిత జీవితముతో స్వర్గము నుండి భూమికి వచ్చి మూఁడు లోకములను తన బుద్ధి వైభవము చేతను, సత్యము చేతను అభిసంహితము చేసెను. (ఏకీభవింపచేసెను). ఆతని కుమారుఁడు దీర్ఘబాహువు. దీర్ఘబాహుని కుమారుఁడు రఘువు. రఘువు యొక్క పుత్రుఁడు అజుఁడు, వీర్యవంతుఁడయిన దశరథమహారాజు ఈతని పుత్రుఁడు. దశరథుఁడు ఇక్ష్వాకు కులనందనుఁడు. రాముఁడు, భరతుఁడు లక్ష్మణుఁడు శత్రుఘ్నుఁడు దశరథుని కుమారులు. వీరు మహాబలురు, రాముఁడు వీరుం డు, ధర్మజుండు లోకప్రఖ్యాతి గన్నవాఁడు. శత్రుఘ్నుఁడు మధువనమున కరీగి మధు కుమారుఁడైన లవణుని చంపెను.. అచ్చట శత్రుఘ్నుఁడు మధురాపురమును నెలకొల్పేను. సుబాహువు, శూరసేనుఁడు శత్రుఘ్నుని కుమారులు. వారు విదేహరాజసుతయందు పుట్టిరి. వారు మధురాపురమును పాలించిరి (187). అంగదుఁడు చంద్రకేతువు. ఇరువురు లక్షణుని కుమారులు, వారి నగరములు హిమవత్పర్వతాంతదేశమున విస్తరించబడినవి. అయ్యవి అత్యంతైశ్వర్యవంతములు, వృద్దీమంతములు. అంగదునీ పురి యంగదయని పిలువబడును. చంద్రకేతుశీపురీ చంద్రచక్రయనబడును. అదీశుభమైనది. (189) వీరులయిన తక్షుఁడు పుష్కరుఁడు భరతుని పుత్రులు. వీరిరువురి యొక్క పట్టణములు గాంధారదేశమందున్నవి. ‘తక్షశిలా’ యను తక్షుని పట్టణము సర్వదీక్రసిద్ధము. వీరుఁడైన పుష్కరునీ నగరము విఖ్యాతమయిన పుష్కరావతీ. పురాణ విదులయినవారు ఈ గాథను కీర్తింతురు. ఇది రామునికి సంబంధించినది. “ధీమంతుఁడైన యాతని మాహాత్మ్యము యొక్క గొప్పదనము గూర్చి ఇది వర్ణించును.

రాముఁడు శ్యామవర్ణుఁడు. యువకుఁడు, లోహితాక్షుఁడు. ప్రకాశవంతమయిన ముఖము కలవాఁడు, మితభాషి ఆజానుబాహువు. సుముఖుఁడు, సింహస్కంధుఁడు, మహాభుజుఁడు ఆతఁడు పదివేల యేండ్లు రాజ్యమును పాలించేను. ఆతని రాజ్యమున ఋక్ యజుస్సామ వేదముల అధ్యయన (పఠన) ఘోష యొక్క మహానాదము, దీయతాం - (దానమీయుఁడు) - భుజ్యతాం - (భుజింపుఁడు). అను శబ్దములు అవిచ్చిన్నములై ధ్వనించెను. రాముఁడు. జనస్థానమున నివసించుచు ద్రోదశులయొక్క (దేవతలయొక్క కార్యమును నెరవేర్చెను. సీతయున్న స్థానమును అన్వేషించుచు, పురుషరభుఁడయిన రాముఁడు, మహాయశస్వి, పౌలస్త్యుఁడయిన రావణునీ మహాషాపకార్యము లాచరించిన వానిని చంపెను. రాముడు సత్త్వవంతుఁడు, గుణసంపన్నుఁడు, దీప్యమానుఁడు స్వతేజముచే సూర్యుని వహ్నిని అతీశయించినవాఁడు. దశరథ సూనుఁడు. అతని కుమారులిద్దరు ఆతనీ వంటివారు. వారు కుశుఁడు, లవుఁడును. ఇంక వారి దేశాదికముల నెఱుంగుఁడు. కోసలము కుశునీ రాజ్యము. ఆతని నగరము కుశస్థలి. గమ్యమయిన యీ నగరము వింధ్య పర్వత సానువుల యందు ఆతనిచే నిర్మింపబడినది, ఉత్తర కోసలము మహాత్ముఁడయిన లవుని రాజ్యము. అతనీ నగరము శ్రావస్తి. అది సర్వలోక ప్రఖ్యాతము, ఇంక ‘కుశ’ వంశమును గూర్చి యెమింగుము. కుశుని కుమారుఁడు అతిథి ఇతఁడు ధర్మాత్ముఁడు. అతిథి సపర్యాసక్తుఁడు. అతిథి కుమారుఁడు నీషధుడు. నీషధునకు పుత్రుడు నలుఁడు. నలుని కుమారుఁడు నభుఁడు ఆ నభునికుమారుఁడు పుండరీకుఁడు, ఆతనీ తరువాత రాజు క్షేమధన్వుఁడు. క్షేమధన్వునీ సుతుఁడు ప్రతాప వంతు డయిన దేవానీకుఁడు దేవానీకుని సుతుఁడు అహీనుడు. ఆహ్నగునీ వారసుఁడు మహాయశస్విమయిన పారియాత్రుఁడు.దలుఁడు పారియాత్రుని కుమారుఁడు. ఈతని కుమారుడు బలుఁడు. ధర్మాత్ముడయిన ఉలూకుఁడు దలుని పుత్రుఁడు. ఆతని పుత్రుడు వజ్ర నాభుఁడు. వజ్రనాభుని కుమారుడు శంఖణుఁడు.

శంఖణుని పుత్రుఁడు వ్యుషితాశ్వుఁడు. ఇతఁడు విద్వాంసుఁడుగా ప్రఖ్యాతిగన్నవాడు వ్యుషితాశ్వుని కుమారుఁడు విశ్వసహుఁడు. (206) హిరణ్యనాభుఁడు కౌశల్యనామాంతరుఁడు అతని కుమారులలో విష్ణుఁడు. ప్రాచ్యములందు సామమంత్రములయందు ఆతఁడు పౌష్యంజీ యొక్క శిష్యుడు. (207) ఆతఁడు (హిరణ్యనాభుఁడు) పౌష్యంజీతోడ ఐదువందల సంహితలను గఱచెను. తరువాత ధీమంతుఁడయిన యాజ్ఞవల్క్యునితోడ యోగము నేర్చెను. (208) పుష్పండు ఆతని కుమారుఁడు. ఆతఁడు విద్వాంసుఁడు. ఆతనీకుమారుడు ధ్రువసంధి. ఆతని పుత్రుఁడు సుదర్శనుఁడు. సుదర్శనుని కుమారుఁడు అగ్నివర్ణుఁడు, అగ్నివర్ణునకు శీఘ్రుఁడు, శీఘముని కుమారుఁడు మరువు. మరుపు యోగము నభ్యసించి కలాపగ్రామము నందుండెను, (210) ఈ ప్రభువు 21వ ప్రయుగమున క్షత్రియ ప్రావర్తకుండు. మరుని కుమారుండో ప్రభుసుతుండు. ప్రభుసుతుని కుమారుఁడు సుసంధీ. సుసంధికుమారుడు మరుఁడు. ఇతనికి సహస్పంతుఁడు అను నామాంతరము. సహస్వంతునికి పుత్రుఁడు విశ్రుతవంతుఁడు. విశ్రుతవంతుని పుత్రుఁడు బృహద్బలుడు. వీరందరు ఇక్ష్వాకుల దాయాదులు. వందలకొలదీ రాజులున్నారు. వంశము నందెవ్వరెవ్వరు ప్రధానులో వారిని గూర్చి కీర్తించితిని. ఆ దివ్య వివస్వతుని యొక్క వంశమును (సృష్టినీ) పఠింప పుత్రవంతుఁడగును. వైవస్వత మనువుతో సాయుజ్యమును పొందును. మనువు వివస్వంతుని కుమారుఁడు. ఆతఁడే శ్రాద్ధదేవుఁడు. ఆతఁడే ప్రజలకు పుష్టి నొసంగువాడు పఠించునట్టివాఁడు. పాపరహితుఁడగును. రజోరహితుఁడు ఆయుష్మంతుఁడగును. ధర్మ పథము నుండి యెన్నడును ఆతఁడు వ్యతిక్రమింపఁడు.

ఇది వాయుప్రోక్తమైన బ్రాహ్మండమహాపురాణమున మధ్యమభాగమునందు, తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరితము నందలి ఇక్ష్వాకువంశసంకీర్తనమను అరువదిమూఁడవ అధ్యాయము.