3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

40 - కార్తవీర్యుని మరణము

వసిష్ఠ ఉవాచ :-

వసిష్ఠుఁడు ఇట్లు చెప్పెను :

రాజ చూడామణీయైన సుచంద్రుఁడు మరణించెను. ఆతని పుత్రుఁడు పుష్కరాక్షుఁడు రామునితో యుద్దము సల్ప పరువెత్తుకొనివచ్చెను.. ఆతఁడు రథస్థుఁడు, మహావీర్యుఁడు, సర్వశస్త్రాస్త్రకోవిదుఁడు, రణము నందత్యంతోగ్రుఁడు, కాలాంతక తుల్యుఁడు అయిన రాముని అభివీక్షించి భార్గవేంద్రుడయిన రాముని కన్నివైపులను శరసమూహముల కురిపించెను. ఒక ముహూర్తకాలము జామదగ్యుఁడు బాణ సంధాదితుఁడయ్యెను. అంత వెంటనే బయటికి వచ్చి మహాబలుఁడయిన భార్గవేంద్రుడు తనపై నున్న శరబంధములను చూచెను. దహించుచున్న పావకుని వలే క్రోధోదగ్రుఁడయ్యెను. క్రోధ పూర్ణుఁడై రాముఁడు వారుణాస్త్రమును విడిచెను. అంత భైరవనాదములతో గర్జించుచు మేఘములు వచ్చిపడెను. భూమి నంతటిని ముంచెత్తుచు జలధారలను వర్షించెను. మహావీర్యుఁడయిన పుష్కరాక్షుఁడు వాయవ్యాస్త్రమును ప్రయోగించెను. ఆ వాయవ్యాసము చే వెంటనే మేఘములు వీడిపోయి కానరావయ్యెను అంత రాముఁడధికక్రుద్దుఁడయి బ్రహ్మాస్త్రముననుసంధీంచెను. మహాబలుఁడయిన పుష్కరాక్షుఁ డు బ్రహ్మాస్త్రము ప్రయోగించి దానితో దానిని విచకర్షించెను. దానిని విసరికొట్టెను. రాముఁడు తన బ్రహ్మాస్త్రమును నిరోధించుట చూచి దండాహత భుజంగము వలె భయంకరుఁడయ్యెను. వెంటనే తీవ్రముగ బుస్సలుకొట్టుచు నిశ్వసించుచు పరశువును చేబట్టి పుష్కరాక్షునిపైకి రాముఁడు పరువెత్తి వెళ్లాను. రాముఁడు మీదికి వచ్చి పడుటచూచి పుష్కరాక్షుడు నిప్పులను క్రక్కుచున్న సర్పములవంటి పంచవిశిఖాస్త్రములను విడిచెను, ఆ పంచదీప్తవహ్ని సర్పతుల్యశరములలో రామునికి ఒకటి హృదయమునందు నాటెను. ఒకటి శీర్వమున, రెండు భుజద్వయమునందు మిగిలినదీ రాముని శీఖయందు క్రమము నోటుకొనెను. రాముఁడు మిక్కిలి సంస్తంభితుఁడయ్యెను. సంక్షుభితుఁడయ్యెను. ఈ విధముగా యుద్దమున పుష్కరాక్షునిచే రాముఁడు పీడింపబడీ ఒక్క క్షణకాలము నేలండి వెంటనే పుష్కరాక్షుని వైపు పరువెత్తుకొని వెడలి తన పరశువుతో నాతని శీర్షమున కొట్టెను. ఆయాఘాతము పుష్కరాక్షుని శీఖనుమొదలిడి పాదాంతము రెండుగా చేసెను. పుష్కరాక్షుని శరీరశకలద్వయము నేలపడెను. ఆ సమయమున వీక్షించునట్టి దేవతలకు ఆశ్చర్యము కలిగెను.

 క్రోధముతో మహాబలుఁడయిన పుష్కరాక్షుని చీల్చి చంపి ఆతని సైన్యమును అగ్నీ అరణ్యమును భస్మీపటలము చేయునట్లు, రాముఁడు క్రోధోగ్రుఁడై దహించి వైచెను. భార్గవేంద్రుఁడు వాయుమనోవేగములతో ఎందెందు పరువెత్తి పరశుతో కొట్టెనో ఆయా ప్రదేశములలో గుర్రములు ఏనుగులు, మానవులు శరీరములు తెగి వందలాది పడిపోయిరి. యుద్దము నందు బలవంతుఁడయిన రామునిచే పరశ్వధముచే కొట్టబడి ఓ అమ్మ ! ఓ అయ్య ! యనుచు అరచుచు ఆక్రోశించుచు చూర్ణీకృతులై మానవులందరు భస్మీకృతులయిరి. ఒక ముహూర్త కాలములో అనేక రాజన్య కులములో నవాక్షౌహిణీ సంఖ్యతో సంపూర్ణముగా నున్న పుష్కరాక్షుని బలము అధీపులు చావగా హతము చేయఁబడినదీ.. పుష్కరాక్షుఁడు మరణింపగా మహావీర్యుఁడయిన కార్తవీర్యుఁడు సువర్ణ రథము నారోహించి స్వయము యుద్ధమునకు వచ్చెను. ఆ సువర్ణ రథము నానాశస్త్ర సమాకీర్ణము. నానావిధ రత్నములచే స్థగితము. 400 అడుగుల ప్రమాణము కలది. శతాశ్వములతో కూడియున్నది.  కార్తవీర్యుఁడు నానావిధ ఆయుధములతోనున్న బాహు సహస్రములతోగూడికొని, దేహాంతమునందు పుణ్యమాచరించిన వ్యక్తి సుకృతి స్వర్గము నారోహించుచున్నట్లు, ప్రకాశించెను. అతనికి నూరుగురు పుత్రులు వారందరు యుద్ధ విశారదులు వారందరు తండ్రి ఆజ్ఞచే సేనను సమాయత్తము చేసికొని యుద్దభూమియందు నీల్చీరి. మహాబలవంతుఁడు కార్తవీర్యుఁడు యుద్ధభూమిలో కాలాంతమున ప్రత్యక్షమగు యమునివలె నున్న రాముని చూచి యుద్దముచేయ ప్రారంభించెను. యుద్దమున భార్గవ రాముని జయించుటకై కుడిప్రక్క 500 చేతులలో శరములను ఎడమ ప్రక్కనున్న యైదువందల హస్తములలో ధనువులను ధరించి కార్తవీర్యుఁడు యుద్ధమునకు పూనుకొనెను. పర్వతముపై మేఘము వర్షధారల కురిపించునట్లు రామునిపై కార్తవీర్యుఁడు బాణవర్షమును కురిపించెను. బాణ వర్షముచే గౌరవింపఁబడిన భార్గవరాముఁడు స్వధనువును గ్రహించి యుద్ధమున బాణవర్షమును కురిపించేను.

రాజన్యుల వధించుటచే రామునిచే సర్వలోకములు జయింపఁబడినవి. ప్రథితప్రభావుఁడయిన రాముఁడు, ఆ బ్రహ్మాస్త్ర ద్వయమును ప్రశాంత మొనర్చి మరల హైహయ వంశ పతాకమయిన కార్తవీర్యుని వధించుటకు యుద్ధరంగమున ప్రవృత్తుఁడయ్యెను. ఆతఁడు తన తూణీరము నుండి (అమ్ముల పొది నుండి) రెండు బాణములను గ్రహించెను. ఈకలుగల బాణముల భాగమును ధనుర్గుణమున నమర్చెను. కార్తవీర్యుని శిరోరత్నమును ఖండింప కోరి ఆతని కర్ణయుగ్మమును లక్ష్యము చేసెను. వానీని తరువాత ఖండించెను. కర్ణములు ఖండింపఁబడి మహాత్ముఁడు పూర్వము అశేష జగత్ర్పవీరుఁడు అయిన రాజు తన కర్ణద్వయము ఖండింపబడి తన పరాక్రమము వీర్యము ప్రణష్టమైనదిగా తలంచెను. రామునిచేతను తిరస్కృతాత్ముఁడయ్యెను. ఆతనిశరీరము ఓ రాజా ! వివర్ణమయ్యెను. గతమయిన అనుభావము ప్రతాపము గలవాఁడయ్యెను. ఆతఁడు మంచి చిత్రకారునిచే చిత్రింపఁబడిన చిత్రమువలె అయ్యెను, సుదీనచిత్తుఁ డయ్యెను. విలక్షణముగ గోచరించెను. అంత రాజు, లోకాధికతనొంది విరాజిల్లిన తన వీర్య వైభవము నష్టమై పోయినదీగా తలపోసెను. రావణునితో పూర్వము యుద్ధముచేసి చేగొన్న జయాదీకముల తలంచి విచారించెను. ఇంకను రాజు జయాభీకాంక్షియై పున ర్మీలిత నేత్రుఁడై అత్రీకుల ప్రదీపమయిన దత్తాత్రేయుని గూర్చి ధ్యానించెను. ఆ దత్త ప్రభుని ప్రభావమున అనుగృహీతమయిన తేజస్సుచే, పరాక్రమముచే అఖిల లోకపాలురను తిరస్కరించేను. జయించెను. మహానుభావుం డయిన దత్తాత్రేయుఁడతనికి దర్శన మొసంగని కారణమున కార్తవీర్యుఁడు అత్యంతము దుఃఖితుఁడయ్యెను. అప్పటికిని మరల మరల దత్తుని గూర్చి ధ్యాన పథ మొందెను. రాజు ధ్యానించినను, దత్తుఁడా తనికి మనోగోచరము కాలేదు.  

 దానికి కారణము రాజు, తపస్వి, అత్యంత దాంతగుణముచే ఇంద్రియ నిగ్రహ మొనర్చినవాఁడు, పాప రహితుఁడు, అయిన మునియెడ దోషమాచరించెను. అందుచే అత్రీ తనయుఁడు కార్తవీర్యుని దృష్టి పథమునకు రాలేదు. అప్పుడు రాజు అతి దుఃఖముచే దోదూయ మానుం డయ్యెను, శోకమోహయుతుఁడయ్యెను. రాముఁడు సర్వజన చిత్తవృత్తి నైజీంగినపొండు. శోక మగ్నునితో రాజుతో మహాత్ముఁడు రాముఁడు ఇట్లు పలికెను. ఓ రాజ ! శోకభావమును పొందకుము. మహానుభావులు శోకభావము నొందరు. శోకింపరు. ఈ సృష్టిలో నీకు వరము నీయ నవతరించిన వాఁడను నేను. ఆనేను ఇప్పుడు నీన్ను వధించుటకై వచ్చితినీ. మనస్సున ధైర్యము వహింపుము సమాహితుఁడవగుము. సంగ్రామ సమయమున విచార చర్చ నాచరించ కూడదు. లోకమున నెల్లరును స్వకృత కర్మ ఫలితమునే అనుభవింతురు. పరిణామమున విపాకమున శుభాశుభములు దైవకృతములు. ఓ రాజా ! శుభా శుభములకు విపర్యయము (మార్పును) కలిగింపగల పొడొకరుండు వేరుగా లేడు. బహుజన్మ సంచితమయిన యే నీ పుణ్యమున్నదో అయ్యదియే నీకు దత్తునివలన వరార్షపాత్రత్వమును కలిగించినది. ఇప్పుడో నీవొనర్చిన దుష్కృతమునకు ఫలము ననుభవింపుము. నా తండ్రి వివేకము లేని నీచే అపకృతుడయ్యెను. అందుచే నీకర్ణములు నాచే ఖండింపఁబడినవి. పరాక్రమముచే నీయొక్క చూడామణి నాచే హిరింపఁబడినది. నీయశస్సు అపహృతమైనది. ఇట్లు పలికి భార్గవరాముఁడు, బాణమును సంధించి, చాపమునులాగి, విడిచెను. రాజు యొక్క మణిని, నిపుణముగా ఛేదించి, బాణము రాముని చేరెను. ముని కుమారుఁడయిన రాముని యా కార్యమును చూచి హైహయ వంశకర్తయైన కార్తవీర్యార్జునుడు

 ఆయుధము నెత్తిపట్టి యుద్దమునందు తన శత్రువైన ద్విజాత్మజుఁడైన రామునితో యుద్దముచేయ సముద్యతుఁడయ్యెను. వెంటనే రాజు, శూలము, శక్తి, గద, చక్రము, ఖడ్గము, పట్టిసము, తోమరము మొదలగు నానా ప్రహరణాస్త్ర సమూహమును విసరీ లాఘవముతో ద్విజాత్ముం డైన రాముని కొట్టెను. రాముఁడు స్వనైపుణ్యముతో లాఘవత్వముతో ఆ ఆయుధములను మధ్యలోనే ఖండించెను. ఆ రాజు ఆచమనము చేసి (వారిస్పర్శ చేసి) ఉత్తమమైన ఆగ్నేయాస్త్రమును విడిచెను, ఆ యస్త్రమును రాముడు వారుణాస్త్రముచే శమింపఁజేసెను. అంత రాజు గాంధర్వాస్త్రమును విడిచెను. దానిని రాముఁడు వాయవ్యాస్త్రముచే ఖండించెను. రాజు నాగాస్త్రమును ప్రయోగింప రాముఁడు గారుడాస్త్రముచే దానిని ఛేదించేను. రాజు యుద్ధమున రాముని చంపుటకు దత్తునిచే నీయబడిన శూలమును విసరెను. అయ్యదీ వ్యర్థముకానిది. రాజు మంత్ర పూర్వకముగా, భార్గవ రాముని వధకై యుద్దమున చేపట్టిన శూలమును శత సూర్య ప్రతాప పరాక్రమాభమయిన దానీనీ, సురాసురలచే అవార్యమైన దానిని రాముని లక్ష్యముచేసి, తనకున్న సమగ్రమైన బలముతో విసరెను. ఆ శూలము భార్గవుని మూర్థమునఁబడెను. భార్ధవుఁడా శూల ప్రహారముచే వ్యధితుఁడయ్యెను. మూర్చనొందెను, హరిని తలంచుచు రాముఁడు నేల కొరిగెను, రాముఁడు నేలకొరుగగా, దేవతలందరు భయాకులులయిరీ. బ్రహ్మవిష్ణుమహేశ్వరులను పురస్కరించుకొని ముందుంచుకొని) సమావేశమొందిరి. మహాజ్ఞాని మృత్యుంజయుఁడు, ప్రభువు, నైన శంకరుఁడు సంజీవిని విద్యచే భార్గవుని బ్రతికించెను, రాముఁడు చైతన్యమొందెను. తన ముందు దేవతలను దర్శించెను, భక్తితో నమస్కరించెను, బ్రహ్మాదులను స్తుతించెను. భార్గవునిచే స్తుతింపఁబడి వారందరు వెంటనే అదృశ్యులైరీ. రాముఁడు జలమును స్పర్శించి, కృష్ణ కవచమును జపించేను.

సుసంరబుఁడై నేత్రములచే దహించుచు రాముఁడు ఉళితుఁడయ్యెను. శివుఁడొసంగిన పాశుపతమును రాముఁడు స్మరించెను. దానితో వెంటనే మహాబలుఁడయిన కార్తవీర్యుని రాముఁడు కొట్టెను. ఆ రాజు దత్తభక్తుఁడు. విష్ణువుని చక్రము సుదర్శనము. ఆ రాజు సుదర్శనములో ప్రవేశించెను.

ఓ రాజా!

అతని శరీరము భస్మసాత్కృతమయ్యెను.

ఇది వాయుప్రోక్తము, మహాపురాణమునయిన బ్రహ్మాండపురాణమున మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున కార్తవీర్యవధయను నలుబదవ అధ్యాయము సంపూర్ణము.