3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)
41 - భార్గవచరితము
వసిష్ఠ ఉవాచ :-
వసిష్ఠుఁడు చెప్పెను.
కార్తవీర్యుని నూర్గురు కొమరులు, తమ తండ్రి వధను చూచి వెంటనే అత్యుగ్రుఁడైన రాముని వారివారీ బలములతో అడ్డగించిరి. వారందరు ఒక్కొక్క అక్షౌహిణీ సంఖ్య సేనతో గూడినవారు, యుద్ధము నందు దుర్మదులు, పితృవధ వలన రామునితో తుములమయిన యుద్ధ మాచరించిరి. రాముడు శూరులు, రణ విశారదులును నయిన కార్తవీర్యుని పుత్రులను చూచి, పరశువును పట్టుకొని వారితో యుద్దము నందు పోరాడెను. శతాక్షౌహిణీ సంయుతమయిన వారి సేనను రాముఁడు ముహూర్తద్వయ సమయములోనే అత్యంత వేగయుక్తుఁడై చంపేను. తమ సైన్యమంతయు సులభముగా లీలగా నిశ్శేషముగా కుఠారముచే చంపఁబడుట చూచి వారు అందరు వీర్యసంయుతులై నానావిధదివ్యప్రహారములతో మహాపరాక్రమతేజముతో మహాత్ముఁడయిన భార్గవుని చుట్టుముట్టి చక్రమండలముగా యుద్దము చేసిరీ. అంత బలవంతుడు భగవంతుం డునగు రాముండు వారీ మండల మధ్యగుఁడై చక్రమునకు మధ్య నుండు నాభిగా ప్రకాశించెను. శతసంఖ్య గల కార్తవీర్యుని కుమారులు ఆతని చుట్టును పరిభ్రమించుచుండ, రాముఁడు వారిలో నొక్కకనికి అభిముఖుఁడై, బృందావనమున గోపికలతో రాసక్రీడా సమయమున నృత్యము చేయు కృష్ణుని చుట్టు తిరుగు గోపికల మధ్య నున్న వాని వలె నగుపించెను. ఆ సమయమున బ్రహ్మ నాయకుఁడుగా దేవతలు తమతమ విమానముల యందుండి, అహీనశౌర్యవీర్యుఁడైనరాముని చుట్టును నెల్లెడల నందనవనపుష్పమాల్యవర్షములనుజల్లిరి. ఆయుధముల సంఘర్షణమున హుంకారముతో నుత్పన్నమైనధ్వనీ ఆకాశము నంటెను శరములవలనగలిగిన పుండ్లు నఖములతో దంతములతో చేయబడినట్టివిగా నగుపించెను. శస్త్రములచే గాయములు పడి దెబ్బలు తినిన వారి యొక్క ఆక్రందనలు గోలలు ఉచ్చైస్స్వరముతో గీతములాలపించు గాయకుల పాటలవలె నుండెను. ఈ విధముగాప్రవృత్తమయిన నృపయుద్దమండలమును విస్మయముచే విప్పారిన నేత్రములతో దేవతలు చూచిరి. అంత రాముఁడు కార్తవీర్యుని కుమారులను, వివిధ అస్త్రసముదాయముతో చంపవలయునని కోరి, అతి శౌర్యవంతుఁడు తన చావమును చేతపట్టి అతిబలవంతులనెల్లరను విడగొట్టి వేలోక పంక్తిగా చేసెను. ఆ వీరులను ఒకోక్కని రాముఁడు చంపెను. ఆ కుమార శతములో నైదుగురు ధైర్యము వీడి పలాయితులైరి. వారు శూరుఁడు, వృషాస్యుఁడు, వృషశూరుడు, వృషసేనుఁడు, జయధ్వజుఁడును. మహాభయపరీతచిత్తులు, ప్రాణమును రక్షించుకొనుఁగోరికతో, వారు హిమాద్రి పొదాంతర కాననమున పరువిడి విడివడి యొక్కొక్క రోక్కొక్క వైపునకు వెడలిపోయిరి. భృశార్హులయిన వారిలో నేయొక్కండును తరువాత కంటికగపడలేదు.
కార్తవీర్యునకు సహాయార్థము వచ్చిన నృపమండలిని రాముఁడు చంపి, అకృతవణునితో కలిసికొని, నర్మదకు వచ్చి సంతోషముతో స్నానమాచరించెను. స్నానమాడి నిత్యక్రియల నాచరించి, వృషభధ్వజుఁడయిన యీశ్వరు నారాధించి, కైలాస వాసియైన శివుని దర్శించుటకు ఓ రాజా ! రాముఁడు బయలుదేరెను. అందు రాముఁడు గురుపత్నియైన ఉమను, కుమారులయిన స్కందవినాయకులను, కూడ చూడగా మనోగతితో అకృతవప్రణసహితుఁడై యరిగెను. కృతకార్యుఁడు, సంతోష సంభరితుండునగు రాముఁడు వెంటనే కైలాసమును చేరి, అచ్చట గొప్ప నగరమయిన అలకాభీదను, నానా మణిగణాకీర్ణభవనములచే నుపశోభితమైన దానిని చూచేను. విచిత్ర భూషణములతో నానా రూపములు దాల్చి ప్రకాశించు యక్షులతో శోభిల్లునదీ నానా వృక్ష సమాకీర్ణమైనదీ, ఉపవనములతో కూడియున్నది. దీర్షికలతో (దిగుడు బావులతో) సుదీర్ఘములయిన తటాకములతో విలసిల్లునట్టిది, సీతయను నామాంతరముతో నొప్పు అలకనందచే బాహ్యమున ఆ వృతమై యున్నట్టిది యునగు ఆ నగరము చూచెను. (అలకనందకడ) దప్పిక లేకపోయినను, ఏనుగులు ఆ నదీ జలములఁద్రాగేను, ఆ నదీ జలములు దేవాంగనలు స్నానము చేసి విడిచి వెళ్లిన కుంకుమలతో పింజర వర్ణములగుట ఆ ఏనుగులు పింజర వర్ణము నొందినవి. గంధర్వులు అప్సరలు కలిసి పాడునట్టి సంగీత నాదము లచ్చట విననగును. వీని నన్నింటిని చూచి భార్గవరాముఁడు అత్యంత ముదాన్వితుఁడయ్యెను. ఎచ్చట శైవ పరమయిన గృహమున్నదో తదూర శిఖరమునకు రాముఁడు వెళ్లెను. అందు రాముఁడు దట్టమయి చల్లనీ స్నిగ చ్చాయమగు మహావటమును చూచేను. ఆ వటము క్రింద ఉత్తమమైన ఆవాసము, సు సేవ్యము, సిద్దులతో కూడికొని యున్నది. అచ్చట నొక ప్రాకారమును రాముఁడు చూచెను. అది శతయోజనమండలము నానారత్నోచితము, రమ్యము, చతుర్ద్వారములు కలదీ, గణావృతము. అట నందీశ్వరుని, మహాకాలుని, రకాక్షుని, వికటోదరునీ, పింగళాక్షుని, విశాలాక్షుని, విరూపాక్షుని, ఘటోదరుని, మందారుని, భైరవునీ, బాణుని, రురుని, వీరకునీ, వీరభద్రుని, చండుని, భృగిని, నీటిని, ముఖుని, సిద్దేంద్రనాథుని, రుద్రులను విద్యాధరులను, మహోరగములను భూతప్రేత పిశాచాదులను, కూష్మాండులను, బ్రహ్మ రాక్షసులను, వేతాళులను, దానవేంద్రులను, యోగీంద్రులను, జటాధరులను, యక్షులను కింపురుషులను, డాకినులను, యోగినులను రాముడు చూచెను. హృదయాంతర్ముదాన్వితుఁడై నందీశ్వరు నాజ్ఞతో లోనికి ప్రవేశించెను.
రామ ఉవాచ :-
వినాయక ఉవాచ :-
అందు చతుర్యోజన విస్తీర్ణము గలిగి, ప్రాగ్ద్వారముతో కూడి, భువనములతో ఆవృతమయి, యొప్పు శివమందిరమును రాముఁడు చూచెను. ప్రాగ్ద్వారమున కార్తికేయ వినాయకులు ఆసీనులై యుండిరి. కార్తికేయుఁడు హిమభాగమునను, వినాయకుడు కుడివైపున నుండిరి. శివతుల్యపరాక్రములయిన వారిరువురను చూచి రాముఁడు నమస్కరించేను. శ్రేష్టులగు, ఈశ్వర పార్శ్యదులను అందును క్షేత్రపాలురను, చూచెను, వారు రత్న సింహాసనస్థులు, రత్నభూషణ భూషితులు. శివమందీరమును ప్రవేశింపఁ బోవు రామునితో వినాయకుడిట్లు భాషించేను. “ఓ మహానుభావ, క్షణము నిలువుము. ఇప్పుడు మహాదేవుఁడు ఉమతో నిద్రించుచున్నాడు. నేనో ఈశ్వరాజ్ఞను గ్రహించీ క్షణకాలంలో వచ్చి నీతోకలిసి ప్రవేశింపగలను. సోదరా ! ఇప్పుడు, క్షణము నిలుష్పము”అని. భార్గవనందనుఁడు వినాయకుని పలుకులు విని, తొందరతో కూడుకొని గణేశునీతో రాముఁడు పలుకనారంభించెను.
రాముడనేను :
ఓ సోదరా ! ఇచ్చట నుండి లోనికరీగీ, జగదీశ్వరులయిన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించి వెంటనే తిరిగి వచ్చి నీజమందిరమునకుం బోయెదను. కార్తవీర్యుఁడు, సుచంద్రుఁడును, సపుత్రబలభాంధవులతో శంభు ప్రసాదమున యుద్ధములో చంపండిరి. అంతీయకాక ఇతరులయిన అన్యభూపతులు సహస్రశః, కాంభోజులు, పహ్లవులు, శకులు, కాన్యకుబ్ధులు, కోశలులు, మాయావంతులు, మహాబలురు యుద్ధమున శంభు ప్రసాదవశమున నెల్లరును హతమొనర్పఁబడిరి. అందుచే నేనా ఈశ్వరునకు నమస్కరించి స్వగృహమున కరిగెదను. ఇట్లు పలికి భార్గవుం డు గణపతి ముందు నిలబడెను. గణాధిపుఁడు భార్గవునితో మధురవాక్యములతో నిట్లు పలికెను.
వినాయకుఁడనేను :
మహానుభావ ! ఒక్క క్షణకాలము నిలువుము. నీకు దర్శనమగును. సోదరా ! ఇప్పుడు విశ్వేశ్వరుఁడు భవానీతో సహ నున్నాడు. ఏకాసనసంస్థితులయి స్త్రీ పురుషులున్న సమయాన సుఖ భంగమాచరించిన వాఁడు నరకమునొందును. ఇది నిశ్చయము.
భార్గవ ఉవాచ :-
అంతియేకాక, పితరుని, కాని, భూపతిని కాని, బ్రాహ్మణుడు రహస్యముగానుపాసీనులై యున్నను చూడరాదని ధర్మ నిశ్చయము. కామయుతుఁడు కాని కామరహితుఁడు కాని, సురతోన్ముఖుఁడయిన యొకనిని, వేటోకడు చూచినచో, ఆతఁడు ఏడు జన్మాంతరములు స్త్రీ విచ్ఛేదము నొందును. ఇది ధ్రువము. పరస్త్రీ యొక్క కాని, తల్లి యొక్క కాని, సోదరి యొక్క కాని, కుమార్తె యొక్క కాని, పిరుందలను, వక్షః స్థలమును వక్రమును ఎవఁడు చూచునో అతఁడు నరాధముఁడు.
భార్గవుఁడిట్లనెను :
ఆహో ! అపూర్వము, ఇంతకుంబూర్వము చెప్పఁబడని దుష్టవచనములు నీ ముఖము నుండి వింటిని. ఆ పలుకులు భ్రాంతిచే చేప్పం బడినవా? లేక పరిహాసము కోలుకొట్లాడితివా? సవికారులు, కాములునయిన వారి విషయమై ఈ వాక్యములు నిదర్శనములు కాని నిర్వికారునకు, పసిబిడ్డకు నెచ్చటను దోషము కాదు. సోదరా ! నేనంతఃపురమున కరిగెదను. ఓ బాలక! నీవూరకొనుము. అక్కడ చూచిన దానిని బట్టి, తత్సమ యోచితముగ వర్తించెదను. మన తండ్రి తల్లి యందున్నారు నీవు నిరూపించితివి కదా ! పార్వతీ పరమేశ్వరులు యావత్ జగతికీ తల్లిదండ్రులని ఈ విధముగా పలికి భార్గవ రాముఁడు లోనికి పోవ సముద్యతుఁడయ్యెను. అంత వినాయకుఁడు లేచి యాతనిని వెంటనే వారించెను. అంత వారిరువురకు వాగ్యుద్ధమయ్యెను, చేతులతో గెంటుకోనిరి. అడ్డగించుకొనిరి. స్కందుఁడు ఇది చూచి సంక్రాంతుఁడై వారిరువురకు వారి దోషమును తెలియచెప్పెను. వారిరువురను చేతులతో పట్టుకొని విడదీసి గెంటెను. పరవీరనాశకుడయిన భార్గవుఁడు క్రుద్దుఁడయ్యెను. పరశ్వధమును తీసికొని గణేశ్వరునిపై విసర సముద్యుతుఁడయ్యెను. వినాయకుఁడు భార్గవుఁడు కోపముతో తనపై గదను వేయబూనుట చూచెను. అప్పుడు గణేశుఁడు భార్గవుఁడు తనపై పరశును విక్షేపింప బూనుకొన, వెంటనే తన కరముతో భార్గవుని ఎత్తే వెంటనే ఆతనిని భూర్లోకము, భువర్లోకము, స్వర్లోకము, తపోలోకము, ఊర్థ్వలోకము, మహర్లోకము, జనలోకము, సత్యలోకము, తీసికొనిపోయి వైకుంఠమునకు తెచ్చెను. ఈశ్వర సుతుఁడు గోలోకమును భార్గవునకు చూపెను. అచ్చటి నుండి క్రిందకు అధోలోకములకు పడవైచి ఏడు పాతాళలోకముల చూపెను. అచ్చటి నుండి యతనిని ఊర్థ్వలోకములకు నెత్తి, అచ్చటి నుండి వెంటనే జలమధ్యములో విసరెను. భార్గవుఁడు భీతుఁడయ్యెను. తన ప్రాణమును రక్షించుకొన ఆత్రము వహించెను. అంత గణేశుఁడు రాముని పూర్వము నిలుచుండి యున్న స్థానమునకుఁ దీనికొని వచ్చి నిలిపెను.
ఇదీ వాయుప్రోక్త బ్రహ్మాండమహాపురాణమునందు మధ్యమభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమున భార్గవచరితమున నలుబది యొకటవ అధ్యాయము.
