3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

68 - యయాతి చరితము

ఋషయ ఊచుః :-

సూత ఉవాచ :-

ఋషులిట్లనిరి.

మహాత్ముఁడయిన మరుత్తుఁడు (మరుత్తు) తన కుమార్తెను రాజున కొసంగెను? మరుత్తు యొక్క కన్యకకు ఎట్టి వీర్యవంతులు మహాత్ము లుదయించిరి? సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను, ఆ మహారాజు అన్నకాముఁడై మరుత్సోమమనుయజ్ఞము నాచరించెను. ఆ మహారాజు ప్రతిమాసమాయజ్ఞమును అరువదిసంవత్సరములాచరించెను. ఆ మహారాజొనరించినమరుత్సోమమున దేవతలు మరుత్తులు సంతోషించిరి. ప్రీతులై దేవతలతనికి ఆతఁడుకోరు సర్వ వస్తువులతో అక్షయ్యమగునన్న మొసఁగిరి, (3) సుకృదుక్తమైన యా: యన్నము దివారాత్రములు వ్యర్థము కాలేదు. ఆ యన్నమును భుజించినవారు 24 గంటలు ఆకలి లేక యుండిరి. సూర్యోదయముతో నారంభించీ ఆ రాజు అన్నమును కోట్లాది ప్రజల కొసంగిను. మిత్ర జ్యోతీ కుమార్తెకు ధీమంతుఁడయిన మరుత్తునకును చాలమందీపుత్రులు పుట్టిరి. వారందరు మహాసత్తులు, ధర్మజ్ఞులు, మోక్షదర్శినులు. వారు గృహస్థధర్మములను సన్యసించి (విసర్జించి) వైరాగ్యము సమాశ్రయించి యతీశ్వర ధర్మమును ఆశ్రయించి బ్రహ్మత్వమును పొందిరి, (7) క్షత్రధర్ముఁడు అనేనసకుమారుడు ప్రతాపవంతుఁడు. క్షత్రధర్మునకు ప్రతిపక్షుండుదయించెను. ఆతఁడు మహాతపస్వి. ప్రతిపక్షుని కుమారుఁడు సృంజయుఁడు.. ఆతఁడు చాల ప్రఖ్యాతుఁడు. సృంజయునకు పుత్రుండు జయుఁడు. ఆ జయునకు విజయుఁడు పుత్రుఁడు. విజయునకు జయుఁడు పుత్రుడు; జయునకు హర్యశకుఁడు సుతుఁడు హర్యశ్వకునకు సుతుఁడు సహదేవుండు. అతఁడు ప్రతాపవంతుల డైనరాజు. సహదేవుని కుమారుఁడు ధర్మాత్ముఁడు. ఆతఁ డహీనుఁడని విశ్రుతుఁడు. అహీనునకు జయత్సేనుండు పుత్రుఁడు ఆతని సుతుఁడు సంకృతి. ధర్మాత్ముఁడయిన సంకృతికి మహా యశస్వియన కృతధర్ముడు కుమారుఁడు వీరందరు క్షత్రధర్ములు, ఇది ఆయువు సంతతి. ఇంక నహుష సంతతి నెఱుంగుము. నహుషునకు ఆరుగురు పుత్రులు. వారు తేజస్సున ఇంద్ర సమానులు.

వారు యతి యయాతి, సంయాతీ, ఆయాతి, వియాతి మరియు కృతి వారిలో యతిష్యేషుఁడు, యయాతి ఆతని అవరుఁడైన సోదరుఁడు (చిన్నతమ్ముఁడు). యతి కాకుత్స వంశకన్యయైన ‘గాం’నుభార్యగా పొందెను. ఆ ‘యతి’ మోక్షపథమును స్వీకరించి మునియై బ్రహ్మా ద్వైతుఁడయ్యెను. మిగిలిన యైదుగురిలో యయాతి పృథివీపతి. శుక్రుని కుమార్తెయైన దేవయానిని భార్యగా పెండ్లియాడెను. అంతియేకాక వృషపర్వునీ కూతురు ఆసురీకన్యయు నైన శర్మిష్టను కూడ భార్యగా గైకొనెను. దేవయాని యదువును, తుర్వసుని కనెను. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ ద్రుహ్యుని, అనుని, పూరునీ కనెను. వీరు మహావీరులు. దేవసుతోపములు. ఆతనికి పరమభాస్వరమయిన రథమును ఇంద్రుఁడొసంగెను. ఆరథమెందును సంసక్తమై యుండిపోవదు, అది కాంచనమయము. దివ్యమైనది. మనోజవము గలిగిన అశ్వములతో యుక్తమయినది. ఈ రథములోనే ఆ కన్య నాతఁడు తీసికొనివచ్చెను. ఇంద్రుఁడాతనికీ అక్షయ శరములు గల అంబులపొదుల రెంటి నొసంగెను. ఆ ప్రసిద్ధమైన రథముతోడనే, ఆతఁడు ఎల్లప్పుడు భూమిని జయించెను. యయాతి దేవదానవ మానవులకు యుద్ధమున దుర్గరుండు. ఆ రథము పురు సంతతి సర్వరాజులకు కౌరవ వంశీయులయిన జనమేజయుని వరకు కౌరవుల పౌత్రుఁడు పరీక్షిత్తు వరకు చేరి తరువాత ధీమంతుఁడయిన గార్యుని శోషము వలన ఆ రథము నాశము చెందెను. దుర్బుద్ధియైన జన మేజయ రాజునకు లోహగంధియని పేరు. ఆతఁడు గార్యుని సుతుఁడు బాలుఁ డు నైన వాని హింసించెను. లోహగంధి యైన యారాజు ఇచ్చటకచ్చటకు (రక్షణకై) పరువులెత్తెను, పౌరజానపదులచే పరిత్యక్తుఁడు. ఆ రాజు మనశ్శాంతి పొందలేక పోయెను. దుఃఖ సంతపుఁడయ్యెను. ఎచ్చటను సుఖము పొందలేకపోయేను. వ్యధితుఁడై యతఁడు తుదకు శౌనక ఋషిని శరణుజొచ్చెను. ఈ ఋషి ఉదారధీమంతుఁడు. ఇంద్రోతుఁడను నామాంతరుఁడు. (ఓ బ్రాహ్మణోత్తములో) ఆతనిని పవిత్రీకరించుటకు, ఇంద్రోతుఁడు.

రాజయిన జనమేజయుని అశ్వమేధయాగము చేయింపగా జేసెను. ఆ యజ్ఞాంతమున అవభృధ స్నాన సమయమునకు వచ్చి లోహగంధి దానిని నశింపజేసెను. (26) ఆ దీవ్య రథము ఆతని నుండి తీసికొనఁబడి (ఉపరిచర) వసువైన చేదిపతికి, ఆతనితో సంతుష్టుడైన ఇంద్రుఁన జేరెను. ఆతని నుండి ఆ రథమును బృహద్రథుఁడు గ్రహించెను, (27) కౌరవ వంశ్యుఁడయిన భీముఁడు, జరాసంధుని చంపి, ఆ యుత్తమమయిన రథమును ప్రీతితో వాసుదేవున కొసంగెను. సహుషాత్మజుఁడు రాజర్షియునైన యయాతి పొర్ణక్యమును పొందెను. పుత్ర శేషుఁడు, వరిష్ణుండునైన యదువును (యయాతి) పిలిచి గోవత్స ! కుమార ! ముసలితనము, శరీరపు ముడతలు, కేశముల పలితత్వము శుక్రాచార్యుని శాపము వలన నన్నావరించినవి. యౌవనభోగమున తృపఁడను కాలేదు. ఓ యదూ ! ఈ నా వార్ధక్యముతో నా పాపమును నీవు స్వీకరింపుము. నా జంభారమును వహింపుము” అనెను. యదువు ఇట్లు ప్రత్యుత్తర మొసంగెను. (31) “ఈ భీక్ష (అభ్యర్ధనము) అనిర్దిష్టమయినది. బ్రాహ్మణునిచే ప్రతిశ్రుతము. నాచే అంగీకృతము కాదు. ఆజర వ్యాయామముచే సాధ్యమైనది. ఆవార్ధక్యమును నేను గ్రహింపను. జరయందు పాన భోజనాదుల వలనం గలుగ బహుదోషములున్నవి. అందుచే, ఓరాజా! జరను గ్రహించుటకు నేనుత్సహించను. (33) వార్ధక్యమున తెల్లఁబడిన గెడ్డము మీసములు గలిగి, దీనత్వమొంది, శిథీలీకృతుఁడనై, ముడుతలు పడ్డ శరీరము, నిరాశ, దుర్బలాకృతి, కార్యకరణమున శక్తిహీనత యౌవన క్రీయాదుల యందు తోడివారీతో పరీభవత్వము, పొందకోరను. ఓరాజా! నాకంటే ప్రియతరులైన పుత్రులు నీకెందరో కలరు. ఇతరులెవ్వరైన ప్రతిగ్రహింతురుగాక యదువిట్లు పలుక యయాతి కోపసమన్వితుఁడయ్యెను. వదతాం శ్రేష్ఠుఁడయిన రాజు తన జ్యేష్ఠ సుతుని గర్జించి, ఇట్లు పలికెను. ఓ దుర్బుద్దీ ! నీ తండ్రినైన నన్ను అనాదరించుటకు, నీకెట్టి ధర్మమున్నది? నీకెట్టి యితరాశ్రమ ధర్మమునీకున్నది” అని యదునితో పలికి, క్రుద్దుఁడయిన తండ్రి ఆతనిని శపించెను. నీవు నా హృదయము నుండి సంజాతుఁడవైనను నీవు నీ యౌవనమును నా కొసంగకుంటివి.

తుర్వసు రువాచ :-

యయాతి రువాచ :-

సూతఉవాచ :-

ద్రుహ్యురువాచ :-

యయాతి రువాచ :-

అందుచే ఓ మూధ ! నీ సంతతీ రాజ్యమును పొందదు” ఓ తుర్వసు ! నాపాపమును వార్ధక్యముతో పాటు పొందుము తుర్వసుఁడిట్లు సమాధానమొసఁగెను. ఓ జనక ! నీవార్ధక్యమును కోరను. అయ్యది కామభోగ ప్రణాశిని. ముసలితనమున కామభోగము కైన దోషములు చాలాకలవు. అందుచే ఓ రాజా ! నీ వార్ధక్యమును గ్రహించుటకు నేనుత్సహింపను. అంత యయాతి ఇట్లనెను. నీవు నా యాత్మజుఁడవయినను నీ వయస్సును నాకిచ్చుటలేదు. అందుచే నీ సంతానము రాజ్యార్హతనుపొగొట్టుకొనును. నీవు సంకీర్ణములయిన మతధర్మము కలిగినవారికి మనకంటే వ్యతిరిక్తమయిన ఆచారములుగల ప్రతిలోమ నరులకు మాంసభుక్కులకు ఇతరులకు రాజవగుదువు. నీ నివాసము నిశ్చయముగా, గురుదార సంయోగ దోష మాచరించిన వారలలో తిర్యగ్యోనిని పొందినవారలతో పాపులతో మ్లేచ్చులతో కాగలదు. సూతుఁడిట్లనెను. తనకుమారుం డయిన తుర్వసునీనిట్లు శపించి యయాతి శర్మిష్ణ కుమారుఁడయిన ద్రుహ్యునిపిలిచి యిట్లనెను. ఓద్రుహ్యూ! వర్ణరూపవినాశనకారియైన ముసలితనమును . ఒక వేయి సంవత్సరములు స్వీకరింపుము. నీయొక్క యౌవనమును నా కీయుము. వెయ్యి యేండ్లు నీండిన తరువాత నీయౌవనమును మరల నీకొసంగెదను. నేను నా పాపమును వార్థక్యమును మరల గ్రహించెదను. ద్రుహ్యుఁడిట్లనెను. వృద్ధుఁడు రథమునధిరోహింపలేడు. గుఱ్ఱము నెక్కలేడు. స్త్రీలననుభవింపలేఁడు. ఆతనికి సుఖముండదు. నీజరాయోగమును నేనంగీకరింపను. యయాతి ఇట్లనెను, నా యాత్మజాతుఁడవయినను నీవయస్సును నాకీయవు. కాన, ఓద్రుహ్యూ ! నీ కోరిక లేవియు నీకు కావు. నీవెప్పుడును పడవలలో తెప్పలలో దోనెలలో సంచారము కలిగిన వాఁడవు అగుదువు.

అనురువాచ :-

యయాతి రువాచ :-

సూత ఉవాచ :-

నీవు రాజవంశ్యుఁడ వయినను అచ్చటనీవు రాజువుకాకుండగనే నిత్యమువసింతువు. ఓ అనూ !నాపాపమును వార్ధక్యముతో సహా నీవుస్వీకరింపుము. ఇట్లు నేను నీయౌవనముతో వెయ్యి యేండ్లు సంచరించెదను. అనుఁడిట్లనెను, వృద్ధుఁడు శిశువువలె బలహీనుఁడు నీరసుఁడు ఆతఁడెప్పుడును అశుచిమంతుఁడు, అగ్నియందాతఁడు సకాలమున హోమము చేయఁడు. అట్టి వార్ధక్యమును నేనంగీకరింపను. యయాతి ఇట్లనెను. నీవు నాకాత్మజాతుఁడవయినను, నీయౌవనమును నాకీయనంగీకరింపవు. నీవు వానిన జరాదోషము నీవు పొందుదువు. ఓ అనూ!నీవప్పుడే ముందుగానే వృద్ధుఁడవు. నీసంతానము యౌవనమును పొంది మరణించును. నీవు. నీ కుమారులను నీవే దహనము. చేయుదువు. ఓ పూరూ ! నా పాపమును జరాబాధతో స్వీకరింపుము. వార్ధక్య లోపములయిన శరీరపు ముడతలు, వెండ్రుకలు తెల్లబడుట కాశ్యపుఁడయిన ఉశనసుని శాపము వలన నన్నావరించినవి. నేను యావనమున తృప్తుండనుకాలేదు. నీయావన వయస్సుతో కొంతకాలము విషయభోగముల ననుభవించెదను. వేయి సంవత్సరములకాలము పూర్తికాగా నీయౌవనమును నీకొసంగెదను. నేనును నా పాపముతో నా ముదుసలితనమును స్వీకరించెదను. సూతుఁడిట్లనెను, ఇట్లు తండ్రిచే చెప్పఁబడి వెంటనే పుత్రుఁడు తండ్రితో నిట్లనెను. “ఓ జనక ! నీవు. తలంచినట్లే నేను చేసెదను. ఓరాజా ! నీ పాపమును వార్ధక్యముతో గ్రహింతును. నానుండి యౌవనమును నీవు గ్రహింపుము. యథేప్సితములయిన కామములననుభవింపుము, నేను నీ వార్థక్యముతో ప్రతిచ్ఛన్నుఁడనై (కప్పఁబడి) నీ వయస్సును రూపమును దాల్చి యుందును. నా యౌవనమును నీ కొసంగీ, నేను ముదుసలినైయట్లో సంచరించేద.

యయాతీ రువాచ :-

సూత ఉవాచ :-

యయాతి ఇట్లనెను. పూరూ ! ప్రీతుఁడనయితినీ, నీకు భద్రమగుగాక. నీకు ప్రేమతో దీనిని నొసంగుచున్నాను. నీసంతతి సర్వసమృద్ధమగును. వారు వారి కోరికల పొందుదురు. వారు రాజ్యమును పాలింతురు. సూతుఁడిట్లనెను. పూరుని యొక్క అంగీకారముతో రాజయిన యయాతి తనజరను అప్పుడాతనికి సంక్రమింపఁజేసెను. అంత భార్గవానుగ్రహమున నహుషుని కుమారుఁడయిన యయాతి గౌరవముగా (వైభవముతో) యౌవనముతో సంతోషవంతుఁడయ్యెను. నరశ్రేష్ఠుఁడయినయయాతి స్వకీయములయిన విషయభోగములను యథాకామము యథోత్సాహముగా, యథాకాలము యథాసుఖముగాననుభవించెను. యథాశక్తి ధర్మమునకవిరోధియై రాజేంద్రుఁడు యజ్ఞములచే దేవతలను సంతుష్టులఁజేసెను. అట్లే శ్రాద్ధక్రియాదులచే పితరులను తృప్తిపరచెను. అనుగ్రహముతో భార్యలను ఇష్టములయిన కోరికల నొసంగీ ద్విజసత్తములను, అన్నపానదానములచే అతిథులను, పరిపాలనములచే వైశ్యులను, శూద్రులను కాఠిన్య రాహిత్యము చేతను దుర్మార్గులయిన దస్యులను నిగ్రహణము చేతను, ధర్మక్రియా కలాపములచే ప్రజలను యథావిధిగ ననురంజనము చేసెను. అపర ఇంద్రునివలె యయాతి పాలించెను. సింహవిక్రాంతుం డైన రాజు, యువకుఁడై విషయభోగగోచరుఁడై, ధర్మమున కెచ్చట విరోధము లేకుండ సుఖముగా నుత్తమముగా సంచరించెను. కామములయందు దోషరాహిత్య నిదర్శనమున కామములనెల్ల వెదకికొని, విశ్వాచి (దేవతావేశ్య అప్సర)తో కూడి నందనవనము నందు వైభొజవనము నందు రాజు భోగించెను. యయాతి ప్రభువు కామములు వృద్ధి పొందుటేకానీ తరుగుట లేమి గమనించి, పూరునీ దగ్గర కరిగెను. తన వార్ధక్యమును నాతని నుండి గ్రహించెను. కామముల నన్నింటిని పొంది రాజు ఖిన్నుడయ్యెను. వర్ష సహస్ర పరిమితి స్మరించెను. రాజు కలలతో, కాష్ఠములతో కాలమును లెక్కించి నిర్ణీతకాలము పరిపూర్ణముకాగా, పుత్రుఁడైన పూరునితో నిట్లనెను.

యయాతి రువాచ :-

ఓ పుత్ర ! ఓ అరిందమ ! యథాసుఖము, యథోత్సాహము, యథాకాలము నీ యౌవనముతో విషయ భోగములను నేను సేవించితిని. ఓ పూరూ ! సంతుష్టుఁడనైతిని. నీకు మంగళమగుగాక. నీ యౌవనమును నీవు స్వీకరింపుము. (74) నీవు నాకు ప్రియమాచరించిన సుతుఁడవు. ఈ రాజ్యమును నీవు గ్రహింపుము. నహుషాత్మ జుఁడయిన యయాతి జరను స్వీకరించెను. పూరువు స్వకీయమైన యౌవనమును. మరల స్వీకరించెను. కనీయుఁడైన పూరునికి అభిషేకమొనరింప నృపుఁడు కోరెను. ఆ రాజుతో బ్రాహ్మణులు ఆదిగా. సర్వవర్ణములవారు ఇట్లనిరి. ఓ ప్రభూ ! శుక్రాచార్యుని మనుమఁడు దేవయాని కుమారుఁడు జ్యేష్ఠుడు నయిన యదువును, విడిచి పూరునకు రాజ్యమిచ్చుచుంటివి. యదువు నీ జ్యేష్ఠ సుతుఁడు, తరువాత తుర్వసుఁడు పుట్టెను. తరువాత ద్రుహ్యుఁడు శర్మిష్ఠకుమారుడు. ‘అనువు’. ఆతని తరువాత పుట్టెను. తరువాత పుట్టినవాడు పూరువు. జ్యేష్ఠులయిన సోదరుల నతిక్రమించి కనీయసుఁడైన పూరువు రాజ్యమున కెట్లరుఁడు? మేము ధర్మమును జ్ఞప్తి జేయించుచుంటిమి. ధర్మమును పాలింపుము. యయాతి. ఇట్లు ప్రత్యుత్తరమొసంగెను. బ్రాహ్మణ ప్రముఖులయిన సర్వవర్ణములవారు నా పలుకులు వినుఁడు. నేనేల జ్యేష్ఠునకు రాజ్యమీయరాదో వినుఁడు. తల్లిదండ్రుల వచనముల నాచరించిన వీరుఁడైన పుత్రుఁడే ప్రశస్యుఁడు. జ్యేష్ఠుఁడైన యదునిచే నా. నియోగము పాలింపఁబడలేదు. తండ్రికి ప్రతీకూలుఁడైన పుత్రుఁడు పుత్రుఁడు కాడనీ సజ్జనుల సిద్దాంతము. తల్లిదండ్రుల యందు పుత్రునివలె నెవఁడాచరించునో యతఁడే పుత్రుఁడు. యదువు నన్నతిక్రమించెను. అట్లే తుర్వసుడు ద్రుహ్యుఁడు అనువు కూడ నట్లే నన్ను మిక్కిలి నిర్లక్ష్యముచేసిరి. పూరువు నా వాక్యమును గౌరవించెను. విశేషముగా నొనర్చెను. ఎవ్వఁడు నా జరను వహించెనో కనిషుఁడు ఆతఁడే నాదాయాది. పుణ్యకారియయిన పూరునిచే నా కోరికలన్నియు సఫలితములైనవి.

ప్రజా ఊచుః :-

కావ్యుఁడు, ఉశనసుఁడు అయిన శుక్రునిచే స్వయముగా నొక వరమీయబడెను. “ఓ మహామతీ! పుత్రుడెవ్వఁడు నిన్ను అనుసరించి వర్తించునో అతఁడు రాజగును”. ప్రజలిట్లనిరి. ఈ విధముగా నీచే ననుమతింపఁబడిన పూరువు రాజ్యమునందభిషిక్తుఁడగుగాక. ఏ కుమారుఁ డు గుణసంపన్నుండో, తల్లిదండ్రులకు హితుఁడో ఆతఁడు కనిష్ణుఁడయినను ప్రభువుగా కల్యాణమునకర్యడు. ఈ పూరువు, నీకు ప్రియమాచరించినవాఁడు, ప్రియుడు రాజ్యమునకరుడు. శుక్రునియొక్క వరదానముచే ప్రత్యాఖ్యానము చేయశక్యము కాదు. సంతుష్టులయిన జనులిట్లు చెప్పగా, సహుషాత్మజుండయిన యయాతి తన కుమారుఁడైన పూరునీ తన రాజ్యమున నభిషిక్తుని చేసెను. దక్షిణ పూర్వమైన ఆగ్నేయదిక్కున తుర్వసుని స్థాపించేను. రాజు యదువును నైరృతిదీశయందు నెలకోల్పెను. పడమటి దశయందు ఉత్తరదిశ యందు ద్రుహ్యుని నేలకొల్పేను. ఉత్తరదిశయందు అనునీ స్థాపించెను. నహుషుని కుమారుడైన యయాతీ ససాగరవృతమైన సప్తద్వీప వసుంధరను జయించి ఐదువిధములుగా రాజపుత్రులకు రాజ్యమును విభజించెను. వారందరిచే పత్తనములతో కూడిన యీ పృథివి ధర్మజ్ఞులచే ధర్మముగా పాలింపం బడును, యయాతి పుత్రులకు పృథ్వీరాజ్యము నీవిధముగా విభజించి, పుత్రులకు, సంక్రమిత సంపదతో ప్రీతిమంతుఁడయ్యెను. (94) ధనువును బాణములను రాజ్యమును కుమారుల యందు విశ్వసించి, బంధువులయందు భారముంచి, యయాతి సంతుష్టుఁడయ్యెను. ఈ సందర్భములో యయాతి ఈ క్రింది శ్లోకములను పూర్వము చదివేను. కూర్మము తయంగములను లోపలికి నిగ్రహించుకొనునట్లే ప్రతివ్యక్తి కామములను నిగ్రహించవలెను. హవిస్సుచే అగ్నిహోత్రుఁడు శాంతిపండు. పైపెచ్చు అభివృద్ధినొందును. అట్లే కామములేప్పుడును అనుభవముచేత శాంతిపవు. (97)

పృథివి యందు ధాన్యములు, యవలు, బంగారము పశు సంపద స్త్రీలు - ఇవన్నియును నెవ్వనీకిని తృప్తి నొసంగలేవు. ఎవ్వఁడు ఈ సత్యము నెఱుంగునో యతఁడు విచారింపఁడు. మోసపోఁడు. సర్వభూతములకు అమంగళమెవఁడు కర్మచే, మనస్సుచే, వాక్కుచే నొనరింపండో ఆతఁడు బ్రహ్మత్వమొందును. (99) ఎవఁడు ఇతరుల వలన భయపడడో, ఎవనీ వలన ఇతరులు భయపడరో ఎవ్వఁడు ద్వేషింపండో, ఎవ్వఁడు ఎప్పుడు కోరడో, ఆతఁడు. బ్రహ్మత్వమొందును. (100)దుర్మతులచే నేయ్యది త్యజింపఁబడదో, వార్ధక్యమున శరీరము జీర్ణించినను ఏయది జీర్ణించిపోదో, ఎయ్యది ప్రాణాంతకమయిన రోగమో అట్టి తృష్ణను త్యజించిన సుఖము. వార్ధక్యమున కేశములు జీర్ణించును, చిక్కువడును, దంతములు రాలిపోవును. కాని జీవితమునందలి ఆశయు, ధనముకొలకు ఆశయ శరీరము చివికిపోవుచున్నను జీర్ణించిపోవు. (102) లోకము నందలి కామసుఖము, స్వర్గసుఖము, తృష్ణా పరీత్యాగము వలనఁగలుగు సుఖములో పదీయారవ భాగముతో గూడ సమానమైనను కావు. (103) ఇట్లు చెప్పి రాజర్షి భార్యా సహితుడై వనమున కరిగేను. భృగుతుంగమున తపస్సాచరించి, అచ్చటనే అర్షమయిన వ్రతమును పాలించి అచ్చటనే స్వర్గమును పొందెను. అతని వంశమునకు చెందిన రైదుగురు పుణ్యులు, దేవతలచే వారు సత్కృతులు. సూర్యుని యొక్క కిరణములెట్లు భూమిని వ్యాపించినవో యట్లే వారిచే పృథివి యంతయు వ్యాప్తము. ధన్యమైన యయాతియొక్క చరిత్రమును పఠించువారు ధన్యులు. పుత్రవంతులు, ఆయుష్మంతులు కీర్తిమంతులు నగుదురు.

ఇది వాయుప్రోక్తమైన బ్రహ్మాండ మహాపురాణమున మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున అరువది యెనిమిదవ అధ్యాయము.