3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

42 - భార్గవచరితము

వసిష్ఠ ఉవాచ :-

 పార్వత్యువాచ :-

వసిష్ఠుఁడిట్లు చెప్పెను.

ఈ విధముగా నిక్కడకునక్కడకు గణేశుని వలన విసరబడి కైలాసమునకు తుదకు వచ్చినదానికి రాముఁడు సంతోషించెను. ఆత్మ పరాభవమునకు విచారించేను. నిర్వికార స్థితిలో నున్న గణేశుని ఎదురుగా చూచి, రాముఁడధికముగా క్రోధావిష్ణుఁడయ్యెను. గణేశునిపై పరశువును విసిరెను. గణేణుఁడది చూచెను. పితరుఁడొసంగిన అమోఘమయిన పరశ్వధము వ్యర్థము కాకుండుట కోరి ఆ పరశ్వధమును గణేశుఁడు తన ఎడమ దంతముతో గ్రహించెను. ఆ దంతము కుఠారముచే విచ్చిన్నమయి భూమిపై రాలేను. వజ్రముచే గొట్టఁబడిన పర్వతమువలె, భూమియంతయును రక్తసిక్త మయ్యెను. దంతపాతము వలన సముద్రములతో సహితము ద్వీపములు పర్వతములు విధ్వస్త్రములయ్యెను. పృథివి కంపించెను. లోకములు భయత్రస్తములయ్యెను. తత్సన్నివేశమును చూచుచున్న దేవతలలో స్వర్గమున గొప్ప “హాహా కారములు వెడలేను. కార్తికేయాదులందరును, మిక్కిలి భయాతురులయిరి. గట్టిగా రోదించిరి. అరచిరి. అంత దంతపాతధ్వనిని, ప్రజలయందలి కోలాహలమును విని, పార్వతీశంకరులచ్చట కేతెంచిరి. తనముందు ఏకదంతుఁడైయున్న హేరంబుని చూచి, స్కదుని పార్వతీదేవి “ఇదేమి? ఏమికారణమని యడిగెను. తల్లియడుగగా దేవతాసేనానియైన స్కందుడు తల్లికిమొదటినుండియు వృత్తాంతము నంతటినీ రాముఁడువినుచుండగనే చెప్పెను. జగజ్జననీ యగుటమే అఖిలవృత్తాంతమును వినెను, కోపముతో ప్రాణనాయకుఁడయిన శంకరునితో నిట్లనెను.

పార్వతి పలికెను :

పరమేశ్వరా ! ఈ నీ శిష్యుండు భార్గవుఁడు నీకు పుత్రసముఁడు. నీవలన నతఁడు ఉత్కృష్టతేజమును కవచమును పొంది త్రిలోక విజయుఁడయ్యెను. అధికశక్తిసామర్థ్యముగలిగిన కార్తవీర్యుని యుద్ధమునందుజయించెను. తనకార్యమునుసాధించుకోని రాముడు నీకో దక్షిణ నొసంగీనాఁడు. ఆదక్షిణ తన కుఠారము చేత నీకుమారునిదంతమును పడఁగోట్టుట. నీవో ఈ కార్యముచే కృతార్థుఁడవైతివి. సంశయములేదు. నీశిష్యసత్తముడయిన భార్గవుని ఓ ఈశ్వరా ! రక్షించు. ఆతఁడు సద్గురుఁడవయిన నీయొక్క సర్వకార్యములను సాధింపఁగలఁడు.

 వసిష్ఠ ఉవాచ :-

 శ్రీకృష్ణ ఉవాచ :-

 ఇక్కడ నేనింక క్షణముండను, ఓవిభో నన్నవమానించితివి. నేనోపుత్రుల యిద్దరితో కూడికొని నాతండ్రిగారి గృహమునకు పోయెదను. సజ్జనులు నేవకురాలికుమారుని తమకుమారునీవలె సత్కరించుదురు. నీకుమారుడో నీచే పల్కుచే మాత్రమయిన గౌరవింపఁబడలేదు (ఆదరింప బడలేదు). అందుచేనేనో దుఃఖితను. నేను వెడలిపోయెదను.

వసిష్ఠుఁడిట్లు పలికేను :-

భగవంతుఁడయిన ఈశ్వరుఁడు పార్వతీవచనములను వీని మంచిదని కాని, మంచిది కాదని గాని నోరువిప్పి పల్లెత్తయినను పలుకలేదు. వెంటనే ఈశ్వరుఁడు నమస్కరించి ప్రార్థించిన వారిక్లేశమును నాశనమొనరించు కృష్ణుని మనసా స్మరించెను, కృష్ణుఁడుగోలోకనాథుఁడు గోవులకు ప్రభువు. ఇతరులననేకవిధముల ననునయించీ యోదార్చుటలో పండితుఁడు. తలచి నంత మాత్రముననే ప్రణతార్తిహరుఁడు, దయాసింధువు. భక్తులకు వశుఁడు, అఖిలేశ్వరుఁడు, మేఘశ్యామవర్ణుఁడు, విశదవదనుఁడు, రత్నకేయూరపోరుఁడు, విద్యుత్తువలె ప్రకాశించు వస్త్రముకలవాం డు మకర సదృశమయిన కర్ణ కుండలములుకలవాఁడు బరీపింఛసదృశమయిన శిరః ఓంఛముకలవాఁడు మజీగణయుతుఁడు చిరునవ్వుకలపాం డు గోపీనాథుఁడు అత్యంతప్రథితయశస్వి, కౌస్తుభమాణిక్యముచే ప్రకాశించు వక్షస్థలము కలవాఁడు భగవానుండు, కేశవుఁడు, రాధాసహితుం డు, దామోదరుడు, శ్రీమంతుఁడు, అపరాజితుఁడు, జ్ఞానసముద్రుఁడు, స్వతేజస్సుల నెల్లర తేజస్సును అతీశయించినవాడు వచ్చినకృష్ణుని చూచి,ఈశ్వరుఁడు సంహృష్టమానసుఁ డయ్యెను. న్యాయానుగుణముగ నాతనికి శివుడు నమస్కరించెను. (పూజించెను). రాధతోకూడప్రభువును అభ్యంతరగృహములోనికి ప్రవేశింప జేసెను. అత్యంతాదరముతో నతనినీ రత్నసింహాసనమున ఆసీమనిచేసెను. తనకుమారులతో నచ్చటకు వచ్చిన పార్వతీదేవి పుత్రులతో కూడికొని సంతోషముతో నతనికి నమస్కరించేను, శిరస్సు వంచుకోని రాముఁడచ్చటకు వచ్చి పార్వతీదేవి చరణోపాంతమున నేలపై పడెను. ఆతఁడధికముగా ఆకులమానసుడయ్యెను. తనముందు నేలపై వ్రాలి నమస్కరించిన భార్గవుని పార్వతి అభినందింపక పోవుట చూచి జగన్నాథుఁడయిన కృష్ణుఁడు పాక్కులచే పార్వతిని ననునయించుచు నిట్లు పలికెను.

కృష్ణుఁడిట్లనెను :-

ఓ పర్వతరాజపుత్రి కే చంద్రుని మించిన సౌందర్యము కలదానా ! ఈ జమదగ్నికుమారుని నీఅంకదేశమున జేర్చుకొనుము. నీహస్త సరోజమును ఆతని శీర్షముపై నుంచుము.

 భవభయహారిణి ! అనంతగుణ ! శంభువిహారిణి, కల్మషనాశిని, కృతకిల్బిషుఁడయినను, నీ చరణములపై పడి ప్రార్థించినవాఁడు, అగుట ఈతనికీ వరము నొసంగుము. ఓ పూజ్యురాలా ! వేదోక్తమయిన నా వచనమును వినుము. దానినివిని నీవు తప్పక హర్షితురాలవగుదువు. సందేహము లేదు. వినాయకుఁడు నీకుమారుఁడు. మహానుభావులలో మహానుభావుడు. ఆతనిని కామము క్రోధము, ఉద్వేగము, భయము నెప్పుడును చేరవు. ఓ పుణ్యురాల ! ఆతని పుణ్యమయిన నామములు వేదములలో స్మృతులలో, పురాణములలో చెప్పం బడినవి అయ్యవియన్నియు పాపహరములు. వానిని చెప్పుచున్నాను. ప్రమథగణములు నానారూప మహాబలములు. వానికి ఈతఁడు ఈశుఁడు అధిపతి. అందుచేగణేశుఁడని కీర్తింపఁబడినాఁడు,  ఆతని యుదరము నందు భూత భవిష్య ద్వర్తమాన స్థితములయిన బ్రహ్మాండము 'లఖిలములు కలవు. అందుచేలంబోదరుఁడు. డ్రైవయోగముచే శీరము భిన్నమయి ఏనుగు తలచే మరల స్థిరమగుటవలనగజాననుఁడు. పూర్వము చతుర్థినాడుదయించిన చంద్రుఁడు ‘దర్శి'చేశపుఁడై ఆతురుడు, అప్పుడు విఘ్నేశ్వరుఁడాతనిని (చంద్రుని) ఫాలమునధరించెను. అందుచే నతఁడు (విఘ్నేశ్వరుడు) భాలచంద్రుఁడయినాఁడు. జాతవేదుఁడు(అగ్ని) పూర్వము సప్తఋషులచే శపింపఁబడెను. అందుచే సంక్షయమొందెను, అయినను ఈ వినాయకునిచే జాతవేదుఁడు మరల (విసరబడి) ప్రజ్వలింపబడెను. అందుచే గణేశుఁడు శూర్పకర్ణకుఁడయినాఁడు. పూర్వము దేవాసురయుద్ధమున దేవతాగణములచే నతఁడు పూజితుఁడయ్యెను. వారి వీఘ్నములను నివారించెను. అందుచే విఘ్ననాశకుఁడని స్మరింపం బడుచున్నాఁడు, ఓ దేవి! ఇప్పుడు రామునిచే దైవికముగా కుఠారముచే పడగొట్టఁబడి ఏకదంతుఁడయినాఁడు, ఓ హరవల్లభే !. భవిష్యత్కాలమున బ్రహ్మ సృష్టిలో ఈతని తొండము వక్రమగును. అందుచే బుధులీతనిని వక్రతుండునిగా స్మరింతురు. ఓ తల్లి ! నీకుమారునకు నామములున్నవి. స్మరణమాత్రము చేతనే యవి పాపహరములు శ్రీకాలానుగతములు కూడ. ఈ పదమూడవ కల్పమునకుఁబూర్వము, పదియవ సృష్టిలో (దశమభవే). అందరి దేవతలచే మున్ముందుగా పూజనొందువానినిగా నీతనికి నేనువరము నొసంగితిని. జాతకర్మాదిసంస్కారములందు గర్భాధానదీకములయందు యాత్రయందు, వాణిజ్యమునందు,దేవతార్చనము నందు

వసిష్ఠ ఉవాచ :-

శ్రీ రాధోవాచ :-

శుభ సమయమునందు, సంకట సమయమునందు, ఎవ్వఁడు గజాననుని పూజించునో, ఆతనికి సర్వకార్యములు సిద్ధించును. ఇందు సంశయము లేదు.

వసిష్ఠుడిట్లనెను :-

మహాత్ముఁడయిన కృష్ణుడిట్లనుటవిని, జగజ్జననీ పార్వతీ, ఆశ్చర్యచకితానన యయ్యెను. శివసన్నిధి యందు పార్వతీ ప్రత్యుత్తరమీయక యుండ, శివరూప, సనాతని యగు రాధ దేవితో నిట్లనెను.

 శ్రీరాధ ఇట్లు పలికెను :-

ప్రకృతి పురుషుఁడు ఈ రెండును అన్యోన్యాశ్రయములు. ఈ ప్రపంచమున మాత్రమా రెండు భిన్నముగా నున్నట్లు కనవచ్చును. నీవు నేనును ఒకటియే. మనలో నిద్దరకు భేదములేదు. నీవు విష్ణువువు. నేను శివుఁడను. ఆకారమున ద్వీగుణత్వము నొందితిని. శివుని హృదయమున విష్ణువు నీరూపము నొందెను, మజీ విష్ణునీ హృదయమున శివుఁడు నారూపము నొందెను. ఈ మన యిరువురిలో ప్రభువులలో భేదము కానరాదు. ఓ పూజ్యురాలా ! ఈ రాముఁడు వైష్ణవుఁడు శైవత్వము నొందెను. ఈ గణేశుఁడు సాక్షాత్తువైష్ణవత్వము నొందిన శివుఁడు ఈ విధముగా రాధ పలికి, గజాననుని తన యొడిలో పెట్టుకొని శీర్షము నాఘ్రాణించి తన హస్తముతో ఆతని కపోలమును తాకెను. స్పృశించినంతమాత్రమున ఆతనిచెక్కిలిపై పుండు మానిపోయేను, రాధచే ఆశ్వాసింపఁబడి పార్వతి సుప్రసన్నయయ్యెను. ఆమె పాదములపైపడి నమస్కరించిన రాముని తన చేతులతో లేవనెత్తి తొడమీఁద కూర్చుండ బెట్టుకొని మూర్ధమాఘ్రాణముచేసి దీవించెను. రామగణేశుల యొక్క యీ సత్కారమును చూచి కృష్ణుఁడు స్కందుని తన తొడమీఁద కూర్చుండఁ బెట్టుకొనెను. అంత వచ్చిన శ్రీ రాముని వలన శంభుఁడు ప్రీతుఁ డయ్యెను. శంభువు ఆతనిని తన యుత్సంగమున ప్రేమతో కూర్చుండ బెట్టుకొని సత్కరించెను.

ఇదీ వాయుప్రోక్త మహాపురాణమయిన బ్రహ్మాండమునందు, మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున భార్గవ చరితమున నలుబది రెండవ అధ్యాయము.