20 - గుణదోషముల వ్యవస్థ - వేద తాత్పర్యము

గుణదోషభిదాదృష్టిమంతరేణ వచస్తవ

నిశ్శ్రేయసం కథం నౄణాం ని షేధవిధిలక్షణమ్  

విధిని షేధరూపమగు వేదము నీ వాక్కే. గుణదోషములయొక్క భేదదర్శనము లేకుండా ఆ వేదము మానవులకు పురుషార్థసాధనము ఎట్లు కాగల్గును? (గుణదోషదర్శనమే దోషమనే మాట యెట్లు చెల్లును?)

పితృదేవమనుష్యాణాం వేదశ్చక్షుస్తవేశ్వర

శ్రేయస్త్వనుపలబ్రేఽర్థే సాధ్యసాధనయోరపి

ఈశ్వరా! పితృదేవతలకు, దేవతలకు, మానవులకు ప్రత్యక్షాది ప్రమాణ ములచే తెలియబడని స్వర్గమోక్షాదుల విషయములో మాత్రమే కాకుండా, సాధనసాధ్యములయందు (యజ్ఞము సాధనము, స్వర్గము సాధ్యము) కూడ నీ వాక్కు అగు వేదమే శ్రేష్ఠమైన కన్ను (తెలుసుకొనే ఉపాయము).

గుణదోషభిదాదృష్టిర్నిగమాత్తే న హి స్వతః

నిగమేనాపవాదశ్చ భిదాయా ఇతి హ భ్రమః

ఏ వ్యక్తి కైతే ప్రయత్నము లేకుండానే నా గాథలు, నా పూజలు మొదలగువాటియందు శ్రద్ధ కలిగినదో, వైరాగ్యము లేకున్నా అధికమగు విషయాసక్తి లేదో, అట్టివానికి భక్తియోగము సిద్ధిని కలిగించును.

తావత్కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా

మత్కథాశ్రవణాదౌ వా శ్రద్దా యావన్న జాయతే  

ఎంతవరకైతే వైరాగ్యము కలుగదో, నా గాథలను వినుట, మననము చేయుట మొదలగువాటిపై శ్రద్ధ కలుగదో, అంతవరకు కర్మలను చేయవలె.

స్వధర్మస్థో యజన్ యజ్ఞైరనాశీఃకామ ఉద్ధవ

న యాతి స్వర్గనరకౌ యద్యన్యన్న సమాచరేత్

ఓ ఉద్ధవా! ఫలకామన లేకుండా స్వధర్మనిష్ఠుడై నన్ను యజ్ఞములతో ఆరాధించే వ్యక్తి, కామ్య-నిషిద్ధకర్మలను చేయకున్నచో, స్వర్గనరకములను పొందడు.

వివేకవంతుడగు మానవుడు నరకజన్మను వలె స్వర్గ ప్రాప్తిని కూడ కోరరాదు (ఆ కర్మలను చేయరాదు). ఈ భూలోకములో మనుష్యజన్మ నైననూ కోరరాదు. ఎందుకంటే, మనుష్యజన్మలో కూడ దేహమునందలి అభిమానముచే పురుషార్థమునుండి జారిపోవుట సంభవమే.

ఏతద్విద్వాన్ పురా మృత్యోరభవాయ ఘటేత సః

అప్రమత్త ఇదం జ్ఞాత్వా మర్త్యమప్యర్థసిద్ధిదమ్  

ఆ వివేకి ఈ విషయము (దేహాభిమానము పతన హేతువు) ను తెలుసుకొని, ఈ దేహము పురుషార్థసిద్ధికి సాధనమే అయినా మరణించే స్వభావము గలదని గుర్తించవలెను. ఆతడు మరణించుటకు ముందే పునర్జన్మ లేని మోక్షము కొరకు ప్రయత్నము చేయవలెను.

ఛిద్యమానం యమైరేతైః కృతనీడం వనస్పతిమ్

ఖగస్స్వకేతముత్సృజ్య క్షేమం యాతి హ్యలంపటః

ఏలయనగా, లంపటము (ఆసక్తి) లేని పక్షి తాను గూడు కట్టుకొని నివసిస్తున్న చెట్టును యమునివంటి (నిర్దయులైన) ఈ జనులు (అహో రాత్రములనే యమదూతలు) నరుకుచుండగా, దానిని విడిచి పెట్టి క్షేమమును పొందును.

యదారంభేషు నిర్వణ్ణో విరక్తస్సంయతేంద్రియః

అభ్యా సేనాత్మనో యోగీ ధారయేదచలం మనః  

కర్మలయందు నిర్వేదము, కర్మఫలములయందు విరక్తి గల సాధకుడు జితేంద్రియుడై అభ్యాసముచే తన మనస్సును నిశ్చలముగా నిలుపవలెను.

ధార్యమాణం మనో యర్హి భామ్యదాశ్వతవస్థితమ్

అతంద్రితోఽనురోధేన మార్గేణాత్మవశం నయేత్  

మనస్సును ధారణ చేస్తూ ఉన్నా అది స్థిరము లేనిదై వెంటనే ఇటునటు తిరుగాడును. అప్పుడు సాధకుడు సోమరిదనము లేకుండా, నచ్చజెప్పుట అనే ఉపాయముచే ఆ మనస్సును తన వశము చేసుకొనవలెను.

మనోగతిం న విసృజేజ్జితప్రాణో జితేంద్రియః

సత్త్వసంపన్నయా బుద్ద్యా మన ఆత్మవశం నయేత్

సంసారమునందు రోత పుట్టి విరక్తు డైన వ్యక్తి గురువు యొక్క ఉపదేశమును గ్రహించును. ఆతడు ఉపదేశించబడిన తత్త్వమును నిరంతరముగా ధ్యానించును. అప్పుడాతని మనస్సు దుష్ట స్వభావము (విషయాసక్తి) ను విడిచి పెట్టును.

యమాదిభిర్యోగపథైరాన్వీక్షిక్యా చ విద్యయా

మమార్చోపాసనాభిర్వా నాన్యైర్యోగ్యం స్మరేన్మనః  

యమనియమాదియోగాంగములు, తత్త్వవిచారరూపమగు విద్య, నన్ను పూజించి ధ్యానించుట అనే ఉపాయములలో ఏదో ఒక దానిచే మనస్సు స్థిరమై యోగగమ్యమైన పరమాత్మపై నిలబడును. మనస్సును జయించుటకు ఇంతకు మించి ఉపాయములు లేవు.

యది కుర్యాత్ప్రమాదేన యోగీ కర్మ విగర్హితమ్

యోగేనైవ ద హేదంహో నాన్యత్తత్ర కదాచన

నా గాథలయందు శ్రద్ధ కలిగిన భక్తునకు నిర్వేదము కర్మలయందు కలిగి వాటి ఫలములయందు కలుగకపోవచ్చును. ఆతడు భోగ్యవిషయములు దుఃఖమయములని తెలిసినా వాటిని విడిచి పెట్టలేక పోవచ్చును. ఆతడా స్థితియందు కూడ దుఃఖమే ఉత్తరఫలముగా గల ఆ భోగములననుభవిస్తూనే, అవి నింద్యములని దృఢనిశ్చయము చేసుకోవాలి. ఆతడు ప్రసన్నచిత్తుడై మరింత శ్రద్దతో నన్ను భజించవలెను.

ప్రోక్తేన భక్తియోగేన భజతో మాఽసకృన్మునేః

కామా హృదయ్యా నశ్యంతి సర్వే మయి హృది స్థితే  

పైన చెప్పిన విధముగా భక్తియోగముతో నన్ను నిత్యము భజించే భక్తుని హృదయములో నేను స్థిరముగా నుండెదను. అప్పుడాతని కామనలన్నియు నశించును.

భిద్యతే హృదయగ్రంథిశ్చిద్యంతే సర్వసంశయాః

క్షీయం తే చాస్య కర్మాణి మయి దృష్టేఽఖిలాత్మని

అష్టాంగయోగము, దానధర్మ ములు, ఇతరత్రేయస్సాధనములు (ప్రతాదులు) అనువాటిచే ఏ ఫలము - స్వర్గము, మోక్షము, లేదా నా ధామము - లభించునో,

 ఆ సర్వమును నా భక్తుడు నాపై భక్తి అనే సాధనముచేతనే తేలికగా పొందును. నా భక్తుడు దేనినీ కోరడు. ఒకచో ఏదో విధముగా కోరినట్లైతే అలవోకగా పొందును.

న కించిత్సాధవో ధీరా భక్తా హ్యేకాంతినో మమ

పాంఛంత్యపి మయా దత్తం కైవల్యమపునర్భవమ్  

ఏలయనగా, నాయందు ఏకాంతమగు నిష్ఠ గల భక్తులు సాధువులు, వివేకవంతులు. వారు దేనినీ కోరరు. పునర్జన్మ లేని మోక్షమును నేను ఇచ్చినా, దానిని కూడ వారు కోరరు.

నైర పేక్ష్యం పరం ప్రాహుర్నిశ్శ్రేయసమనల్పకమ్

తస్మాన్నిరాశిషో భక్తీర్నిర పేక్షస్య మే భవేత్

అపేక్ష లేకుండుట సర్వోత్కృష్టము, పురుషార్థసాధనములలో గొప్పది అని మహాత్ములు చెప్పెదరు. కావున, అపేక్ష, అ పేక్ష వలన పుట్టే కోరికలు లేనివానికి నాయందు పూర్ణభక్తి కలుగును.

న మయ్యేకాంతభక్తానాం గుణదోషోద్బవా గుణాః

సాధూనాం సమచిత్తానాం బుధేః పరము పేయుషామ్