18 - వామనావతారము - వామనుని ప్రాదుర్భావము

శ్రీశుక ఉవాచ

ఇత్థం విరించస్తుతకర్మవీర్యః ప్రాదుర్బభూవామృతభూరదిత్యామ్ చతుర్భుజశ్శంఖగదాబ్జచక్రః పిశంగవాసా నలినాయతేక్షణః 

ఈ విధముగా మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క లీలలను, పరా క్రమమును బ్రహ్మగారు స్తుతించేను. అపుడు పద్మము వలె నిడివి కన్నులు గల ఆ శ్రీహరి పీతాంబరుడై నాలుగు భుజములలో శంఖము, గద, పద్మ ము, చక్రములను ధరించి అదితియందు ఆవిర్భవించెను.

శ్యామావదాతో ఝషరాజకుండల

త్విషోల్లసచ్ఛ్రీవదనాంబుజః పుమాన్

శ్రీవత్సవక్షా వలయాంగదోల్లసత్

కిరీటకాంచీగుణచారునూపురః

ఆ పురుషోత్తముడు స్వచ్ఛమైన శ్యామలవర్ణము కలిగియుండెను. పద్మమువంటి ఆయన ముఖముయొక్క శోభ మకరకుండలముల కాంతితో మరింత ఇనుమడించేను. ఆయన వక్షఃస్థలముపై శ్రీవత్సము ఉండెను. కంకణములు, భుజపురులు, కిరీటము, మొలనూలు, అందమైన ఆందెలు అనే ఆభరణములను ఆయన ధరించెను.

మధువ్రతవ్రాతవిఘుష్టయా స్వయా

విరాజితశ్శ్రీవనమాలయా హరిః

 ప్రజాపతేర్వేశ్మతమస్స్వరోచిషా

వినాశయన్ కంఠనివిష్టకౌస్తుభః

తుమ్మెదల గుంపుల ధ్వనితో ధ్వనించుచున్న అందమైన తన అడవి పువ్వుల మాలను, కౌస్తుభ మాణిక్యమును కంఠమునందు ధరించిన శ్రీహరి తన కాంతిచే కశ్యప ప్రజాపతియొక్క గృహమునందలి చీకటిని నశింప జేయుచుండెను.

దిశః ప్రసేదుస్సలిలాశయాస్తదా

ప్రజాః ప్రహృష్టా ఋతవో గుణాన్వితాః

ద్యౌరంతరిక్షం క్షితిరగ్నిజిహ్వా

గావో ద్విజాస్సంజహృషుర్నగాశ్చ

ఆ సమయములో దిక్కులు, జలాశయములు ప్రసన్నముగా నుండెను. ప్రాణులు అధికమగు హర్షమును పొందినవి. ఋతువులు అన్నీ ఏకకాలములో తమ తమ గుణములను ప్రకటించినవి. స్వర్గము, అంతరిక్ష ము, భూమి, పర్వతములు (ఆయా అధిష్టాన దేవతలు), అగ్ని ద్వారా హవి స్సులను భుజించే దేవతలు, గోవులు, వేదవేత్తలు కూడ చక్కని ఆనంద మును పొందినారు.

శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తేఽభిజితి ప్రభుః

  సర్వే నక్షత్రతారాద్యాశ్చక్రుస్తజ్జన్మ దక్షిణమ్

భాద్రపద శుక్ల ద్వాదశినాడు చంద్రుడు శ్రవణములో నుండగా అభి జిత్ (మధ్యాహ్నము) ముహూర్తమునందు శ్రీహరి ప్రభుడు జన్మించేను. నక్షత్రములు, గ్రహములు మొదలగునవి ఆ భగవానుని పుట్టుక మంగళప్ర దమని సూచించినవి.

ద్వాదశ్యాం సవితా తిష్ఠన్మధ్యందినగతో నృప

విజయా నామ సా ప్రోక్తా యస్యాం జన్మ విదుర్హరేః

ఓ మహారాజా! ద్వాదశినాడు మధ్యాహ్నము సూర్యుడు నడినెత్తిని నిలిచియుండగా శ్రీహరి జన్మించెనని మహాత్ములు తెలియుదురు. ఆ దిన మునకు విజయ ద్వాదశి అనే పేరు ప్రసిద్ధి.

శంఖదుందుభయో నేదుర్మృదంగపణవానకాః

 చిత్రవాదిత్రతూర్యాణాం నిర్ఘోషస్తుములోఽభవత్

శంఖములు, దుందుభులు, మద్దెళ్లు, తప్పెట్లు, భేరీలు మ్రోగినవి. వివిధవాద్యములు మరియు తూర్యములయొక్క సంకులమైన ధ్వని కలిగె

ప్రీతాశ్చాప్సరసోఽనృత్యన్ గంధర్వప్రవరా జగుః

తుష్టువుర్మునయో దేవా మనవః పితరోఽగ్నయః

అప్సరసలు ప్రీతితో నాట్యమాడగా, హాహా హూహూ మొదలైన గంధర్వశ్రేష్ఠులు పాడిరి. మహర్షులు, దేవతలు, మనువులు, పితృదేవతలు, అగ్నులు స్తుతించిరి.

సిద్ధవిద్యాధరగణాస్సకింపురుషకిన్నరాః

చారణా యక్షరక్షాంసి సుపర్ణా భుజగోత్తమాః

 గాయంతోఽతిప్రశంసంతో నృత్యంతో విబుధానుగాః

అదిత్యా ఆశ్రమపదం కుసుమైస్సమవాకిరన్

దేవతల అనుచరులగు సిద్ధుల మరియు విద్యాధరుల గణములు, కింపురుషులు, కిన్నరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, గరుడులు, శ్రేష్ఠులైన నాగులు పాడుతూ అధికముగా కొనియాడుతూ నాట్యము చేస్తూ, అదితియొక్క ఆశ్రమస్థానమును పుష్పములతో అంతటా వర్షించిరి.

దృష్ట్వాఽదితిస్తం నిజగర్భసంభవం

పరం పుమాంసం ముదమాప విస్మితా

గృహీతదేహం నిజయోగమాయయా

ప్రజాపతిశ్చాహ జయేతి విస్మితః

పురుషోత్తముడు మూడు గుణముల ఘటనయగు తన మాయాశ క్తిచే దేహమును స్వీకరించేను. తన గర్భమునుండి పుట్టిన ఆయనను గాంచి అదితి ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కశ్యప ప్రజాపతి కూడ ఆశ్చర్యపడి, జయమగు గాక! అని పలికెను.

 యత్తద్వపుర్భాతివిభూషణాయుధైరవ్యక్తచిద్వ్యక్తమధారయద్ధరిః

 బభూవ తేనైవ స వామనో వటుస్సంపశ్యతోర్దివ్యగతిర్యథా నటః

ఇంద్రియగోచరము కాని చైతన్యమే స్వరూపముగా గల శ్రీహరి ఆభరణములతో మరియు ఆయుధములతో ప్రకాశిస్తూ ఇంద్రియగోచర మయ్యే రూపముతో ఎదుట ప్రకటమయ్యెను. అద్భుతమగు నేర్పు గల , నటుడు వలె ఆయన అదే దేహముతో వారిద్దరు చూచుచుండగానే పొట్టి బాలకుడుగా మారిపోయెను.

తం వటుం వామనం దృష్ట్వా మోదమానా మహర్షయః

కర్మాణి కారయామాసుః పురస్కృత్య ప్రజాపతిమ్

వామనుడుగు ఆ బాలకుని చూచి మహర్షులు చాల ఆనందించిరి. వారు కశ్యప ప్రజాపతిని ముందడుకొని, ఆ బాలకునకు జాతకర్మ మొద లగు కర్మలను చేయించిరి..

తస్యోపనీయమానస్య సావిత్రీం సవితాఽబ్రవీత్

 బృహస్పతిర్బ్రహ్మసూత్రం మేఖలాం కశ్యపోఽదదాత్

ఆ వామనునకు ఉపనయనము జరిగెను. ఆ సమయములో సూర్యుడే స్వయముగా సవిత (సూర్యుడు, పరబ్రహ్మ), దేవతగా గల . గాయత్రీ మంత్రమునుపదేశించెను. బృహస్పతి యజ్ఞోపవీతమును, కశ్య

పుడు మొలత్రాడును ఇచ్చిరి.

దదౌ కృష్ణాజినం భూమిర్దండం సోమో వనస్పతిః

కౌపీనాచ్ఛాదనం మాతా ద్యౌశ్ఛత్రం జగతః పతేః

వామనరూపధారియగు ఆ జగన్నాథునకు భూదేవి కృష్ణమృగ చర్మమును, ఓషధులకు ప్రభువగు చంద్రుడు కర్రను, తల్లియగు అదితి కౌపీనమును మరియు నడుమునకు కట్టే వస్త్రమును, స్వర్గాధిదేవత గోడుగును ఇచ్చిరి.

కమండలుం వేదగర్భః కుశాన్ సప్తర్షయో దదుః

అక్షమాలాం మహారాజ సరస్వత్యవ్యయాత్మనః  

వినాశము లేని చైతన్యమే స్వరూపముగా గల శ్రీహరి వామనుడా యేను. ఆయనకు వేదనిధియగు బ్రహ్మగారు కమండలమును, సప్తర్షులు దర్భలను, సరస్వతి జపమాలను ఇచ్చిరి.

తస్మా ఇత్యుపనీతాయ యక్షరాట్ పాత్రికామదాత్

భిక్షాం భగవతీ సాక్షాదుమాఽదాదంబికా సతీ

ఈ విధముగా ఉపనయనము చేయబడిన వామనునకు యక్ష ప్రభువగు కుబేరుడు భిక్షాపాత్రను ఈయగా, సాక్షాత్తుగా పతివ్రత మరియు జగన్మాతయగు ఉమా భగవతి భిక్షనిచ్చెను.

స బ్రహ్మవర్చ సేనైవం సభాం సంభావితో వటుః

 బ్రహ్మర్షిగణసంజుష్టామత్యరోచత మారిషః

ఈ విధముగా సత్కరించబడిన శ్రేష్ఠుడైన ఆ వామనుడు బ్రహ్మవ ర్చస్సుతో, బ్రహ్మర్షుల సమూహముచే చక్కగా సేవించబడిన ఆ సభను అతిక్రమించి ప్రకాశించెను.

సమిద్దమాహితం వహ్నిం కృత్వా పరిసమూహనమ్

పరిస్తీర్య సమభ్యర్చ్య సమిద్భిరజుహోద్ద్విజః

ఆ బ్రహ్మచారి అగ్నిని స్థాపించి, ప్రజ్వరిల్ల జేసి, చుట్టూ దర్భలతో - తుడిచి, దర్భలను పరచి, చక్కగా పూజించి, సమిధలతో హోమము చేసెను.

శ్రుత్వాఽశ్వమేధైర్యజమానమూర్జితం

బలిం భృగూణాముపకల్పితైస్తతః

 జగామ తత్రాఖిలసారసంభృతో

భారేణ గాం సన్నమయన్ పదే పదే

 సంపదలతో సమృద్దుడైయున్న బలి భృగువంశీయుల సాహాయ్య ముతో అనేకములగు అశ్వమేధ యాగములను చేసేను. ఆయన మరల యాగమును చేయుచుండెను. సకలజగత్తుయొక్క సారము (సత్త) తో పూర్ఖుడైన ఆ వామనుడు ఆ విషయమును విని తన స్థానమునుండి ఆ బలి యొక్క స్థానమునకు వెళ్లాను. ఆయన నడచుచుండగా ప్రతి అడుగునందు ఆ భారమునకు భూమి బాగా క్రుంగిపోవుచుండెను.

తం నర్మదాయాస్తట ఉత్తరే బలేః

 య ఋత్విజస్తే భృగుకచ్చసంజ్ఞకే

 ప్రవర్తయంతో భృగవః క్రతూత్తమం

వ్యచక్షతారాదుదితం యథా రవిమ్

             నర్మదానదియొక్క ఉత్తరతీరములో భృగుకచ్ఛము అనే పేరు గల క్షేత్రమునందు భృగువంశీయులగు ఋత్విక్కులు బలిచే గొప్ప యజ్ఞము (అశ్వమేధము) ను చేయించుచుండిరి. వారు వామనుని, దగ్గరగా ఉద

యించిన సూర్యుడా యన్నట్లు, చూచిరి.

త ఋత్విజో యజమానస్సదస్యా

హతత్విషో వామనతేజసా నృప

సూర్యః కిలాయాత్యుత వా విభావసుః

సనత్కుమారోఽథ దిదృక్షయా క్రతోః

 ఓ మహారాజా! ఆ ఋత్విక్కులు, యజ్ఞమును చేయుచున్న బలి మరియు సభాసదుల తేజస్సు వామనుని తేజస్సు ముందు వెలవెల బో యెను. ఈతడు యజ్ఞమును చూడగోరి వచ్చుచున్న సూర్యుడా యేమి? లేక అగ్నియా? లేక, సనత్కుమారుడా? అని వారు తలపోసిరి.

ఇత్తం సశిష్యేషు భృగుష్వనేకధా

వితర్క్యమాణో భగవాన్ స వామనః

 ఛత్రం సదండం సజలం కమండలుం

 వివేశ బిభ్రద్ధయమేధవాటమ్

ఈ విధముగా భృగువంశీయులు, వారి శిష్యులు వామన భగవా నుని గురించి పలు పలు విధములుగా ఊహాగానములను చేయుచుండిరి.ఇంతలో ఆయన దండమును, గొడుగును, నీటితో కూడిన కమండలమును పట్టుకొని అశ్వమేధ యాగశాలను ప్రవేశించెను.

మౌంజ్యా మేఖలయా వీతముపవీతాజినోత్తరమ్

 జటిలం వామనం విప్రం మాయామాణవకం హరిమ్

  ప్రవిష్టం వీక్ష్య భృగవస్సశిష్యాస్తే సహాగ్నిభిః

 ప్రత్యగృష్ణన్ సముత్థాయ సంక్షిప్తాస్తస్య తేజసా

కపట బాలకుని రూపమును దాల్చిన శ్రీహరి ముంజగడ్డితో చేసిన మొలత్రాడును దాల్చేను. జటాధారియగు ఆ బ్రహ్మచారి చర్మమునే ఉత్తరీ యముగా ఉపవీత పద్దతి (యజ్ఞోపవీతము వలె) లో ధరించెను. యజ్ఞశా లలో ప్రవేశించిన ఆ వామనుని తేజస్సు ముందు భృగువంశీయులు వెల వెల బోయిరి. వారు ఆ వామనుని చూచి శిష్యులతో బాటు లేచి అగ్నులను పట్టుకొని ఆయనకు స్వాగతమును పలికిరి.

యజమానః ప్రముదితో దర్శనీయం మనోరమమ్

 రూపానురూపావయవం తస్మా ఆసనమాహరత్

వామనుడు రూపమునకు తగ్గ అవయవములతో ఒప్పారే అంద గాడు. మనస్సునకు ఆహ్లాదమును కలిగించే వామనుని చూచి యజ్ఞమును చేయుచున్న బలి చాల ఆనందించి, ఆతనికి ఆసనమును సమర్పించెను.

స్వాగతేనాభినంద్యాథ పాదౌ భగవతో బలిః

అవనిజ్యార్చయామాస ముక్తసంగం మనోరమమ్

సర్వసంగరహితుడగు వామనుడు మనస్సునకు ఆహ్లాదమును కలి గించుచుండెను. బలి ఆయనను స్వాగతము వచనముతో అభినందించి, తరువాత ఆయన పాదములు కడిగి పూజించేను. 

తత్పాదశౌచం జనకల్మషాపహం

 స ధర్మవిన్మూర్ద్న్యదధాత్సుమంగలమ్

యద్దేవదేవో గిరిశశ్చంద్రమౌలిః

దధార మూర్ధ్నా పరయా చ భక్త్యా

 వామనుని పాదములను కడిగిన నీరు జనుల పాపములను పోనా డునది. పరమకల్యాణకారియగు ఆ నీటిని ధర్మవేత్తయగు బలి తలపై చల్లు కొనెను. దేవదేవుడు, కైలాసవాసి, చంద్రవంక తలపై గలవాడు అగు శివుడు ఆ పాదముల నీటిని (గంగను) ఒకప్పుడు సర్వోత్తమమైన భక్తితో తలపై దాల్చెను. .

బలిరువాచ

స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కరవామ తే

 బ్రహ్మర్షీణాం తపస్సాక్షాన్మన్యే త్వాఽఽర్య వపుర్ధరమ్  

బలి ఇట్లు పలికెను --- ఓ బ్రహ్మచారీ! నీకు స్వాగతము. నీకు నమస్కారము. నీకు నేను ఏమి చేయవలెను? ఓ పూజనీయా! సాక్షాత్తుగా బ్రహ్మర్షులయొక్క తపస్సు నీ రూపమును దాల్చి వచ్చినదని నేను తలచే దను.

అద్య నః పితరస్తృప్తి అద్య నః పావితం కులమ్

 అద్య స్విష్టః క్రతురయం యద్భవానాగతో గృహాన్

ఈనాడు నీవు మా ఇంటికి వచ్చుటచే మా పితృదేవతలు సంతృ పులైనారు; మా కులము పవిత్రమైనది; ఈనాడు ఈ యజ్ఞము నీ రాకచే సుసంపన్నమైనది.

అద్యాగ్నయో మే సుహుతా యథావిధి

ద్విజాత్మజ త్వచ్చరణావనేజనైః

 హతాంహసో వార్భిరియం చ భూరహో

తథా పునీతా తనుభిః పదైస్తవ

             ఓ బ్రాహ్మణ బాలకా! ఈనాడు నీ పాదములను కడిగిన నీరు నా పాపములను నశింప జేసినది. నేను నా అగ్నులలో యథావిధిగా చక్కగా చేసిన హోమము సఫలమైనది. అహా! నీ చిన్న చిన్న అడుగులతో ఈ భూమి కూడ పావనమైనది.

యద్యద్వట్ వాంఛసి తత్ప్రతీచ్ఛ మే

త్వామర్థినం విప్రసుతానుతర్కయే

 గాం కాంచనం గుణవద్ధామ మృష్టం

తథాన్న పేయముత వా విప్రకన్యామ్

గ్రామాన్ సమృద్ధాంస్తురగాన్ గజాన్ వా

రథాంస్తథాఽర్హత్తమ సంప్రతీచ్ఛ

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే వామనావతారే

వామన ప్రాదుర్భావో నామ అష్టాదశోఽధ్యాయః

ఓ బ్రహ్మచారీ! నీవు దేనినో కోరదలచుకున్నావని నాకు తోచుచు న్నది. ఓ బ్రాహ్మణ బాలకా! నీకు ఏ వస్తువు పై కోరిక ఉంటే దానిని నానుండి స్వీకరించుము. పరమ పూజనీయా! గోవులను గాని, బంగార మును గాని, అన్ని సౌకర్యములు గల ఇంటిని గాని, రుచ్యమైన అన్నపాన ములను గాని, సంపన్నములైన గ్రామములను గాని, గుర్రములను గాని, ఏనుగులను గాని, నీవేది కోరితే దానిని నావద్దనుండి హాయిగా స్వీకరించు ము, నీవు కోరినచో నీకు ఒక బ్రాహ్మణ బాలికతో వివాహమునైననూ నేను ఏర్పాటు చేయగలను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో వామన ప్రాదుర్భావమును వర్ణించే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది .