వామన మహా పురాణము

Table of Contents

అధ్యాయము 43

ప్రమథుల చేతిలో హతమైన తన సైన్యాన్ని చూచి ఆ అంధకుడు రాక్షసగురువైన శుక్రుని సమీపించి యిలా అన్నాడు. "భగవన్ ! తమ అండ చూచుకొని మేము దేవ కిన్నర గంధర్వాదులను సంహరిస్తున్నాము. బ్రహ్మర్షీ ! ఇటు చూడుడు. నాచే రక్షితమైన సేన అంతయు ప్రమథులచేత పరాభవింపబడి అనాథవలె పారిపోయి వచ్చినది. నా సోదరులయిన కుజంభాదులు చనిపోయారు. ఓ భార్గవా ! ఇక ప్రమథులో కురుక్షేత్ర ఫలంలాగా అక్షయంగా ఉన్నారు, కాబట్టి మేము శత్రువుల చేతిలో పరాజయం పొందకుండా తగిన ఉపాయం చేయండి. అంధకుని మాటలు విని, దేవర్షీ ! ఆ బ్రహ్మర్షి దానవేశ్వరునితో అద్భుత వచనాలు పలికాడు. అంధకా ఊరడిల్లుము. నీమేలుకోసం యత్నిస్తాను. నీకు ప్రియం కలిగిస్తాను. అలా ఓదార్చి ఆ కవి, శుచియై సంజీవని విద్యను విధివిధానంగా వినియోగించగా అంతకు ముందు యుద్ధంలో చనిపోయిన దైత్యదానవ శ్రేష్ఠులంతా లేచి కూర్చున్నారు. కుజంభాది దైత్యులు మరణించి మరల లేవడం యుద్ధానికి రావడం చూచి నందీశ్వరుడు శంకరునితో ఇలా అన్నాడు. మహాదేవా ! ఈ అద్భుతాన్ని ఆలకించండి. అనూహ్యంగా అసంభవమైనది. చచ్చిన వారలు మరల బతుకుట సంభవించినది. ప్రమథుల శక్తిశౌర్యాల వల్ల యుద్ధంలో మరణించిన దైత్యులనందరనూ భార్గవుడు తన విద్యచేత బ్రతికించాడు. ఆ విధంగా మేము గావించిన మహత్ సంగ్రామమంతా వ్యర్థం గావించబడింది. నంది మాటలు విని శివుడు స్వకార్యసిద్ధికై అతనితో నీవు వెళ్ళి ఆ శుక్రుని నా ఎదుట గొనిరమ్ము. నేను సమయోచితంగా మాటలాడి అతనిని నిరోధించెదనని, వానిని పంపాడు. అలా శంకరునిచే ఆదేశింపబడి ఆ గణాధిపతి అయిన నంది, శుక్రుని పట్టుకొనుటకై రాక్షస సైన్యం వద్దకు వెళ్ళాడు.

అలా వస్తూన్న నందిని చూచి రాక్షసవీరుడైన హయకంధరుడాయనను అడ్డగించాడు. అడివిలో సింహాన్నెదిరించిన లేడిలాగ తనకెదురైన ఆ దైత్యునిమీదకు లంఘించి నంది, నూరు అంచులుగల తన వజ్రాయుధంతో మోది మూర్ఛ బడగొట్టాడు. వానిని తప్పించుకొని వస్తూన్న నందిని కుజంభ, జంభ, బలి, వృత్ర, అయఃశిరులను అయిదుగురు దైత్య శార్దూలాలు చుట్టుముట్టారు. మయుడుహ్లాదుడాదిగా గల యితర దానవ వీరులు గూడ అనేక ఆయుధాలు చేపట్టి నందిమీద దాడిచేశారు. అలా ఆ రాక్షసవీరులచే దెబ్బలు తింటూన్న ఆ గణాధిపతిని ఆకాశంలో నిలబడి బ్రహ్మమొదలయిన దేవతలు చూచారు. ఆ పరిస్థితి గమనించిన బ్రహ్మ యింద్రునితో, వెళ్ళండి మీరంతా వెళ్ళి ఈ అదనున శంకరునకు సహాయపడండని పంపాడు. దానితో యింద్రాదులంతా వాయువేగంతో శివసైన్యానికి బాసటగా ఆకాశాన్నుంచి ఊడిపడి నిలచారు. మహానదులంతా త్వరత్వరగా మహాసముద్రంలోపడి కలిసినట్లా దేవతలు శివసైన్యంలో పడి కలిసిపోవడంతో భయంకరమైన ఘోషతో యిరువర్గాలు తలపడ్డాయి. ఆ గందరగోళంలో తప్పించుకుని ఆ నందీశ్వరుడు వెళ్ళి రథంమీద నుంచి సింహం కుందేలును లాగినట్లు శుక్రుణ్ణి ఒడిసి పట్టుకొని, ఆయన రక్షణ కోసం వచ్చిన వారందరినీ నేలబడగొట్టి శివుని ముందుతెచ్చి పడవేశాడు. ఆ శుక్రుని అమాంతంగా శివుడు తన నోటిలో వేసికొని మింగివేశాడు. అలా శివుని ఉదరంలో బంధింపబడి ఆ భార్గవుడు భక్త్యాదరాలతో నా మహాదేవుని యిలా స్తుతించాడు.

"హరా ! వరదా ! గుణశాలీ నీకు నమస్కారము. శంకరా త్య్రంబకా మహేశా నీకు నమస్సులు, జీవనా ! లోకేశ్వరా ! వృషాకపీ ! మదనాంతకా! కాలనాశనా ! వామదేవా నీకు అంజలులు ! స్థాణూ, విశ్వరూపా, సదాగతీ, వామనా, మహాదేవా శర్వా ! ఈశ్వరా నమోవాకములు. త్రినేత్రా హరా, భవా శంకరా ఉమాధవా జీమూతకేతూగుహావాసీ, శ్మశానప్రియా, భస్మధరా, శూలధరా పశుపతీ గోపతీ తత్పురుషోత్తమా ! నీకు మాటిమాటికీ నమస్సులు. ఇలా స్తోత్రం చేసిన శుక్రుని పట్ల ప్రీతుడై శంకరుడు వరము కోరుకోమనగా నతడు నీ ఉదరం నుండి బయటపడునట్లనుగ్రహించమని వేడుకొన్నాడు. అంతట హరుడు తన నేత్రాలు మూసికొని, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా ! నా కడుపులోనుండి బయటకు వెళ్ళమని ఆదేశించాడు. అలా శివుని ఉదరంలో నుంచి బయటకు వచ్చుటకు ప్రయత్నిస్తూ అందులో పాతాళాది భువనాలను సాగరాలను సచరాచర జీవులను ఆదిత్య రుద్ర వసు విశ్వదేవాదులను యక్షకిన్నర గంధర్వాప్సరస సమూహాలను, మునులను, మనుష్యులను చూచి, పరిభ్రమించసాగాడు.

శివుని ఉదరంలో తిరుగుతూ ఆ భార్గవుడు పశుకీటపిపీలికాలను వృక్షగుల్మలతాదులను ఫలమూలాలను ఓషధులను జలచరాలను అనిమిషులను నిమేషులను, చతుష్పాదులను, ద్విపాదులను, వ్యక్తావ్యక్త సగుణ నిర్గుణ ప్రాణులను చూస్తూ అత్యంత కౌతుకంతో ఒకే దివ్య సంవత్సరకాలం తిరుగాడుతూ నడపినా బయట పడే దారి కనుగొనలేకపోయాడు. ఓ నారదా! అలా తిరిగి తిరిగి అలసిపోయి కర్తవ్యం తోచక భక్తితో ఆ పరమ శివునకు శరణాగతుడై ఇలా ప్రార్థించాడు.

"ఓ మహారూపా! అక్ష సూత్రాలను ధరించిన విశ్వమూర్తీ సహస్రాక్షా మహాదేవ ప్రభో! నీకు శరణాగతుడనయ్యాను. ఓ శంకరా శర్వా శంభో సహస్ర నేత్ర చరణ ధరా భుజగభూషణా! నీ విశాల హృదయంలో సకల భువనాలను దర్శించి అలసిపోయి పాదాలకడ ఆత్మ సమర్పణం చేస్తున్నాను. నన్ను కరుణించుము". శుక్రుని దీన పరిదేవనం విని మహాత్ముడగు శంభుడు నవ్వి ఇలా అన్నాడు. "భార్గవా! నీవు నాకు పుత్రుడవైనావు. నా శిశ్నం ద్వారా బయటకు రమ్ము. ఇతర విచారాలన్నీ ?నుము. నేటి నుంచి నీవు 'శుక్రు'డనే పేరుతో చరాచర జీవులందరకు స్తపనీయుడవు అవుతావు". అలా చెప్పి శంకరుడా భార్గవుని శిశ్న మార్గాన బయటకువదిలాడు. అలాశిశ్న ద్వారాన వెలువడి భార్గవుడు శుక్రమహానుభావుడుగా ఖ్యాతుడయ్యాడు. అంతట నాతడు శర్వునకు ప్రణమిల్లి త్వరగా రాక్షస సేనలోకివెళ్ళి చేరాడు. తమ గురువు తిరిగి వచ్చినందులకా దానవులంతా సంతోషించి గణాధిపతులతో మరల యుద్ధానికి సన్నద్ధులయ్యారు.శివగణాధిపతులు గూడ దేవగణాలతో కలిసి ఆ దానవులతో విజయకాంక్షతో సంకుల సమరం గావించారు. "ఓ తపోధనా ! పరస్పర జయకాంక్షతో తలపడిన వారల పోరు భయంకరమైన ద్వంద్వ యుద్ధాలతో మరింత ఘోరమైంది. అంధకుడు నందితో, అయఃశిరుడు శంకరునితో, బలి కుంభ ధ్వజునితో, విరోచనుడు నందిషేణునితో, అశ్వగ్రీవుడు విశాఖునితో, వృత్రుడు శాఖునితో, బాణుడు నైగమేయుడగు బలునితో తలపడ్డారు. మహా వీర్యుడగు వినాయకుడు గండ్రగొడ్డలి ధరించి రాక్షస శ్రేష్ఠుడు తుహండునితో ఢీకొనగా దుర్యోధనుడు మహాబలి ఘంటాకర్ణునితో పెనగులాడ మొదలుపెట్టాడు.

అందులకామె నాధా, ఆ విషయాలు మరొకప్పుడు చెప్పెదను. నేడు కాదనగా నా బ్రాహ్మణుడలా కాదు. నాకిప్పుడే చెప్పవలయును. లేనిచో నేనీ రోజు భోజనమే చేయనని పట్టుబట్టాడు. అంతటనామె సరే మీరు గందరగోళంలో పడి అడుగుతున్నారు గనుక హిత వాక్యాలు చెబుతాను వినండి. ఈ బాలుడు రథచోదకు (కారు) డౌతాడు". అని చెప్పినది. ఆమె నోటి నుండి ఆ మాటలు వెలువడినంతనే ఆ బాలుడు ఏమీ తెలియనివాడై యుండియు పైకి ఎగిరి ఇంద్రునకు సహాయం చేయుటకు వెళ్తున్న సంగతి గ్రహించిన విశ్వావసు మొదలైన గంధర్వులంతా తమ తేజస్సునాతనికి ధారబోశారు. అలా గంధర్వ తేజోయుక్తుడై ఆ శిశువు శక్రుని సమీపించి, దేవరాజా! రండు రండు! నీకు ప్రియం కలగునట్లుగా సారథ్యం చేస్తానన్నాడు. అది విని యింద్రుడిలా అడిగాడు. "నీవెవరి పుత్రుడవు బాబూ? అశ్వాలనెలా అదుపులో పెట్టగలుగుదువా యని నాకు నందేహంగా ఉన్నది". అందులకా శిశువు- సురేశ్వరా! ఋషి తేజస్సుతో భూమి నుండి ఉద్భవించాను. గంధర్వ తేజంతో వృద్ధి నొందాను. ఆశ్వయానంలో విశారదుడనని చెప్పగా, యోగులలో శ్రేష్ఠుడగు నా యింద్రుడూ, మాతలి అని పేరు గల ఆ బాలుడూ వినువీధికి వెళ్ళారు. త్రిదశాధీశ్వరుడగు నా యింద్రుడు ఉత్తమ రథం మీద కూర్చొనగా నాబాలుడు శమీక ఋషి పుత్రుడు గుర్రాల పగ్గాలను పట్టుకొని నిలబడ్డాడు. అంతట నాదేవరాజు మందరగిరికి వెళ్ళి శత్రు సేనలోకి ప్రవేశించాడు. అక్కడ తేజస్వికి ఒక మహాధనుస్సు పంచ వర్ణాలతో - తెలుపు, ఎరుపు, గోధుమ, పసుపు రంగులలో - బాణ సమూహంతో కూడి కనిపించింది. అంత సంతోషంతో నాసురశ్రేష్ఠుడా ధనుర్బాణాలను గ్రహించాడు.

తర్వాత, సత్వరజస్తమో గుణాత్మకులైన త్రిమూర్తులకు మనసానమస్కరించి, ఆ మహాచాపాన్ని సంధించి బాణం తొడిగాడు. అంతనా శతక్రతువు ధనుస్సు నుంచి నెమలి ఈకల రెక్కలతో రెపరెపలాడుతూ పుంఖానుపుంఖాలుగా మహోగ్ర శరాలు వెలువడి శత్రు సంహారకాండ సాగించాయి. బ్రహ్మ విష్ణు శివనామాంకితాలయి శత్రువులనుదునుమాడుతూ వెడలిన ఆ బాణాలు భూమ్యాకాశాలను దిశవిదిశనూ కప్పివేశాయి. నారదా! వాని తాకిడికి ఏనుగులు పీనుగులయ్యాయి, రథాలు విరిగిపోయాయి. అశ్వాల శ్వాసలెగిరిపోయాయి. మావటివాండ్రు విలవిల్లాడుతూ నేలకొరిగిపోయారు. శత్రువాహినిలో అత్యధిక భాగం హతమైపోయింది. ఇంద్రుని బాణాగ్నికి దహించుకపోతున్న తమ సైన్యాన్ని చూచి కుజంభ జంభిలులిద్దరూ భయంకరమైన గదాదండాలు త్రిప్పుతూ క్రోధోన్మత్తులై ఆ మహాత్ముడగు సురనాయకుని సమీపించారు. అలా యింద్రుని మీద కురుకుచున్న వారలను చూచి శ్రీహరి శత్రు వినాశకరమైన సుదర్శన చక్రం వేగంగా త్రిప్పి కుజంభుని మీదకు వదలగా దాని అగ్ని జ్వాలలకు వాడు ప్రాణాలుగోల్పోయి రథం మీద నుంచి క్రిందబడిపోయాడు. అలా మాధవుని చేతిలో తన సోదరుడు చచ్చుట చూచి జంభుడు కోపంతో నిప్పులుమియుచూ, చావుమూడిన లేడి సింహం మీదకు లంఘించినట్టులా దేవరాజు మీద విరుచుకపడ్డాడు. అలా ఎత్తి వస్తూన్న జంభుని చూచి శక్రుడు ధనుర్బాణాలు వదలి మృత్యుదండంలాంటి అగ్నిదత్తమైన శక్తిని తీసికొని వానిమీదికి గట్టిగా విసిరాడు. గంటలు గలగల ధ్వనులతో తనమీదకు వస్తున్న ఆ శక్తిమీదకు వాడు గదను ప్రయోగించాడు. ఆ గదను క్షణకాలంలో భస్మంచేసి ఆ శక్తి సూటిగా వెళ్లి జంభుడి వక్షాన్ని చీల్చివేసింది. దాంతో ఆ దేవ విరోధి విగత ప్రాణుడై నేలకొరగిపోయాడు. వాని మరణం చూచి రాక్షసులు కూడ పలాయనం గావించారు. జంభుడు హతుడై రాక్షస బలాలు విరిగిపోవుటతో ప్రమథ దేవగణాలు జనార్దనుని పూజించారు. ఇంద్రుణ్ణి ప్రశంసించారు. అంతటనా పర్వతభేది శర్వుని ఎదుటకు వెళ్ళి నిలచాడు.

అధ్యాయము 43 Complete