మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము

Table of Contents

110 - వంశానుచరితా మందు నాభాగోపాఖ్యానము

 

మార్కండేయుడు:

 

మార్కండేయుడు:

మహావీరులు కారూష క్షత్రియ గణాలు కరుషుని పుత్రులు. వారి సంఖ్య ఏడు వందలు. మరియు ఆ కారూషు లందరి వలన ఇంకా వేల కొలది వీరులు ఉత్పన్న మైనారు. దిష్ట పుత్రుడు నాభాగుడు ప్రథమ యౌవన సమయ మందు ఒక దినమున అతి సుందరముగా మున్న ఒక వైశ్య కన్యను చూచెను. రాజ కుమారుడు కేవలము ఆమెను చూచి నంతనే అత్యంత కామాసక్త మనస్కుడై దీర్ఘ నిశ్వాసను విడుచుచూ. ఆమె తండ్రి సమీపమునకు వెళ్లి ఆ వైశ్య కన్య నిమ్మని ప్రార్ధించెను. కామముచే పరాధీన ప్రవృత్తుడైన రాజ కుమారుని జూచి, ఓ విప్రా! ఆమె తండ్రి మహారాజగు దిష్టునకు భయపడి చేతులు జోడించి కామాసక్త చిత్తుడై యున్న రాజ నందనునితో వినయావనతుడై ఇట్లనెను.

 

 

“మీరు రాజ పుత్రులు, మరి మాది మీకు పన్ను చెల్లించు కులము. మీరు ఇట్టి అసమానులతో సంబంధము నకు ఎట్లు అభిలషించు చున్నారు?”

 

రాజపుత్రుడు:

 

రాజ పుత్రుడు:

విధాత మానవుణ్ణి దేహములో కామ క్రోధాదులను సమాన భావముతోనే నిర్మించెను. కాని సదా ఈ కామ క్రోధాదులు మానువుని నుండవు. ఒక్కొక్క సమయములో ఉత్పన్న మగు చుండును. మఱియు విభిన్న జాతుల మనుష్యులు యందును కామ క్రోధాదులు ఉపకారిగా నుండినచో అనగా మనుష్య గణాలు కామ క్రోధాదులను అవలంభింపనిచో అన్య భావములను అవలంభింతురు. కామ క్రోధాదులు, మరియు ఇంకను ఏదేని యోగ్యము లగునపుడు కాలము ననుసరించి యోగ్యము లగును. మఱియు యోగ్యములు అయోగ్యము లగును. అందు వలన యోగ్యత అనునది కాలమునకు అను గుణముగా నుండును. ఆహారాది ఇష్టమగు పదార్ధములచే ఎట్టి దేహమును తృప్తి పరచు చున్నామో. అట్టి దేహము కూడా స్థిరము గాదు, కేవలము యోగ్యతా నియమాలను పాడు చేయునట్టి కాలము భుక్తము చేసి దానిని శుష్కింప చేయును.

 

 

అదే విధముగా నీ కన్య యందు నాకు కోరిక కలిగినది. ఆమెను నాకు ఇమ్ము. లేనిచో నా శరీర నాశనమును చూచెదవు.

 

వైశ్యుడు:

 

వైశ్యుడు:

“నేను పరాధీనుడను. మఱియు మీరును రాజు యొక్క ఆధీనములో నున్నారు. అందు వలన మీరు మీ తండ్రి గారి అనుజ్ఞ తీసికొని స్వీకరింపుడు. నేను నాకన్య నిచ్చెదను.”

 

రాజ పుత్రుడు:

 

రాజ పుత్రుడు:

గురు జనుల ఆజ్ఞ యందున్న మనుష్యులకు అన్ని విషయములను గురువు నడుగుట ఉచితము. కాని ఇట్టి విషయమును గురువునకు తెలుప కుండుటయే మంచిది. ఎక్కడ కామ కథా ప్రసంగము? ఎక్కడ గురు జనుల శ్రవణ గోచరత్వము? ఈ రెండింటి యందు చాలా అంతరము మున్నది అందు వలన అది విరుద్దము. అట్టి విషయము తప్ప మిగిలిన అన్ని కార్యము లందు గురువు యొక్క ఆజ్ఞను తీసుకొన వలెను.

 

వైశ్యుడు:

 

వైశ్యుడు:

మీరు చెప్పినది నిజము. గురువు గారి ఆజ్ఞను పొందుట మీ పక్షమున కామ కథ యగును. నేను ఈ విషయమును అడిగెడను. అప్పుడు కామ కథ అన్న అభిప్రాయము నాకు లేదు గదా!

 

మార్కండేయుడు:

 

మార్కండేయుడు:

ఎప్పుడయితే వైశ్యుడు ఈ మాట చెప్పెనో, అప్పుడు రాజపుత్రుడు మౌనమును దాల్చెను. ఆ

సమయమున వైశ్యుడు రాజపుత్రుని సంపూర్ణ మగు నభిప్రాయమును రాజుతో చెప్పెను. అప్పుడు రాజు ఋచీకుడు మొదలగు ద్విజ శ్రేష్టులను పిలిపించి కుమారుని గూడ రప్పించి పూర్వోక్త సమస్త విషయములను నివేదించెను. ఓ ద్విజ శ్రేష్టులారా! మీరు ఈ విషయము నందు నాకు ఏది కర్తవ్యమో దానిని ఆదేశించుటకు అర్హులు, అని పలికెను.

 

ఋషులు:

 

ఋషులు:

రాజ పుత్రునితో రాజకుమారా! నీకు వైశ్య కన్య యందు అనురాగ మున్నచో ఇందు ధర్మ విరుద్ద మేమియు లేదు. అయితే న్యాయ క్రమముగా జరుగుట ధర్మమై యున్నది. ముందుగా మూర్దాభిషిక్త రాజ కన్యను వివాహమాడి ఆనంతరము ఈ వైశ్య కన్యను వివాహము చేసుకొన గలవు.

 

 

నీవు ఈ ప్రకారము ఈ కన్యను పొందిన యడల దోష ముండదు. లేనిచో బాలిక నపహరించిన కారణమున ఉత్తమ జాతి నుండి నీచ జాతిని పొంద గలవు.

 

మార్కండేయుడు:

 

మార్కండేయుడు:

ఎప్పుడైతే ఆ మహాత్ము లందఱు యీ విధముగా తమ అభిప్రాయములను ప్రకటించినారో, అప్పుడు వారి మాటలను అంగీకరింపక అచట నుండి వెళ్లి ఖడ్గమును ధరించి ఆ కన్యను గ్రహించి వారితో ఇట్లు చెప్ప సాగెను. నేను యీ వైశ్య కన్యను రాక్షస వివాహ విదానముగా అపహరించితిని. ఎవరికైనా సమర్ధత యున్నచో ఈ కన్యను విడిపించు కొనుడు. ఓ బ్రాహ్మణోత్తమా! అప్పుడు వైశ్యుడు రాజ పుత్రుడు అపహరించిన కన్యను చూచి రాజ పుత్రుని తండ్రి వద్దకు బోయి రక్షించ మని శరణు బొందెను. పిమ్మట రాజ పుత్రుని తండ్రి అత్యంత కృద్దుడై ఈ ధర్మ దుష్యుడగు నాభాగుని వెంటనే వదింపుడు, అని సైన్యము నాజ్ఞాపించెను.

 

 

అప్పుడు రాజు ఆజ్ఞచే సైన్యము రాజు కుమారునితో యుద్దమును ప్రారంభించెను. కాని రాజ కుమారుడు అస్త్రములచే ఆ సైన్యము లోని చాలా మందిని పడవేసెను. పిమ్మట రాజ పుత్రుని ద్వారా సైన్యము చని పోవుట విని భూపతి స్వయముగానే మరి కొంత సైన్యమును తీసుకొని యుద్దమునకు బోయెను. తండ్రి కొడుకులు యుద్దమున శస్త్ర అస్త్రాదులచే రాజ కుమారుని కన్నా తండ్రిదే పై చేయిగా నుండెను. అదే సమయమున ఆకాశము నుండి నారదుడు ప్రత్యక్షమై రాజుతో నిట్లు పలికెను మహీపాలా! యుద్దమును విరమించుము. ఓ రాజా! నీ కుమారుడు నిధర్ము డయ్యెను. అందు వలన వైష్యునితో నీ యుద్దము ధర్మము గాదు.

 

 

బ్రహ్మణుడు ముందుగా బ్రాహ్మణ స్త్రీని వివాహ మాడి పిమ్మట ఇతర వర్ణములు స్త్రీని గ్రహించి నప్పటికిని ఆతని బ్రాహ్మణత్వమునకు హాని కలగదు. అట్లే క్షత్రియుడును ముందుగా క్షత్రియ కన్యను వివాహ మాడి పిమ్మట వైశ్య, శూద్ర కన్యలను గ్రహించినచో తన ధర్మము నుండి విడువ బడడు. వైశ్యుడును అదే విధముగా ముందు వైశ్య కన్యను పరిణయమాడి తరువాత

శూద్ర కన్యను వివాహము చేసుకోన్నచో వైశ్య కులము నుండి పతితుడు గాడు. ఈ విధముగా క్రమానుసారముగా ప్రవర్తించుట ధర్మమని చెప్పబడి యున్నది. ఓ రాజా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తమ తమ వర్ణముల కన్యలను వివాహము చేసుకొనక ఇతర కన్యలను వివాహము చేసు కొన్నచో, ఏ హీన వర్ణజాతి యొక్క స్త్రీని పరిణయ మాడునో, అతడు పతితుడై ఆమె జాతినే పొందును. మరియు ముందుగా సవర్ణ జాతి యొక్క స్త్రీని పాణి గ్రహణము చేసుకొననిచో, అతడు దయాధికారి కాలేడు.

 

 

మంద బుద్ది యగు నీ కుమారుడు వైశ్యత్వమును పొందెను. నీవు క్షత్రియుడవు. అందు వలన నీతో ఇతడు యుద్దము చేయుటకు అధికారి గాడు. ఓ నృపనందనా! దీని వలన ఏ విధమగు కారణ ముత్పన్న మగునో, అది నే నేరుగను. ఇప్పుడు నీవు యుద్ద కర్మను విరమించుము.