1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
36 - శేషమన్వంతరాఖ్యానము - పృథివీదోహనము
శాంశపాయన ఉవాచ :-
సూత ఉవాచ :-
శాంశపాయనుఁడు చెప్పెను :-
యథాక్రమము మిగిలిన మన్వంతరములగూర్చి, మన్వంతరాధిపుల గూర్చి, ఇంద్రుఁడు దేవతలు నాయకులనుగా గల వారిని గూర్చి వినఁగోరుచున్నాను.
సూతుఁడిట్లు చెప్పెను :
జరిగిపోయినట్టివియు, జరుగనట్టివి (జరుగునట్టివి)యునగు మన్వంతముల గూర్చి సంక్షేపముగను వివరముగను చెప్పుదును. తెలిసికొనుము. (2) ముందు చెప్పంబడబోవు మనువులారుగురు పూర్వముండెడివారు. పూర్వము (ముందుగా) స్వాయంభువ మనువు; తరువాత స్వారోచిష మనువు; తరువాత ఉత్తముఁడు, తామసుఁడు, రైవతకుఁడు, చాక్షువు మనువును. ఇంక భవిష్యత్మనువులు ఎనమండ్రను గూర్చి చెప్పెదను. వారీలో నల్వురు - సావర్ణి, రౌచ్యుఁడు, భౌత్యుఁడు, వైవస్వతుఁడును. (4) తరువాత వారిని జెప్పెద వైవస్వత మనువును ముందు వర్ణింతును. అతీతులయిన యైదుగురు మనువులను మనసులనుగా నెఱుంగుము (మనోజాతులు). (5) స్వాయంభువమనువు యొక్క మన్వంతరము పూర్వము వివరించితిని. ఇంక క్రమముగా, ద్వితీయుడయిన మనువు, మహాత్ముఁడునైన స్వారోచిష మనువు యొక్క ప్రజాసృష్టిని చేప్పెదను. స్వారోచిష మన్వంతరమున తుషితులు దేవతలు. (7} అట్టివారే విద్వాంసులయిన రావతులు. ఈ విధముగా ఇరువర్గములే (గణములే) సంస్కృతులు. క్రతువు పుత్రులు స్వారోచిషులు తుషిత యందు వారుద్భవించిరి. (8) పార్వతులు వాసిషులు. వారి వర్గములు రెండు. ఒక్కొక్కటి యందు పండ్రెండుగురు. ఛందజులు ఇరువదినలుగురు (24) దేవతలు. దివస్పర్ముఁడు, జామిత్రుఁడు, గోపదుఁడు, భాసురుఁడు, అజుఁడు, భగవానుడు, మహాబలుడయిన ద్రవిణుఁడు.(10)
మహాబాహుఁడైన ఆయుఁడు, వీర్యవంతుఁడయిన మహౌజసుఁడు, సువిదితుఁడైన చికిత్వానుఁడు, అంశుఁడు, పండ్రెండవ వాఁడయిన ఋతుఁడు. వీరందరు తుషితులుగా ప్రశంసింపబడిరి. వీరు క్రతు పుత్రులు. వీరందరు సోమపాయినులు. (సోమరసమును ద్రాగువారు). (12) ప్రకాశవంతుఁడయిన ప్రాచేతసుఁడు, విశ్వదేవుఁడు, సమంజుండు, ప్రఖ్యాతుఁడయిన అజిహ్వుఁడు, అరమర్ధనుఁడు, ఆయుర్దానుఁడు, మహామాను డు, దివ్యమానుఁడు, మహాభాగుఁడయిన అజేయుఁడు మహాబలుఁడైన యవీయానుఁడు (చిన్నవాఁడు) హోతా, యజ్వా వీరందరు పారావతులు. ఈ విధముగా పారావతులు పేర్కొనంబడిరి. వీరందరు స్వారోచిష మన్వంతరమున దేవతలు. (15) ఇరువది నలుగురు దేవతలు సోమపులు, లోకమున సర్వత్ర విశ్రుతుఁడయిన విపశ్చితుఁడు వారి ఇంద్రుఁడు. ((6) వసిష్ఠుని కుమారుఁడయిన ఊర్జుఁడు, కాశ్యప కుమారుఁడయిన స్తంభుఁడు, భృగు కుమారుఁడయిన ప్రాణుఁడు, అంగీరసుని కుమారుఁడగు దత్తుఁడు; అత్రి కుమారుఁడైన నిశ్చల ఆత్రేయుఁడు, పులహుని కుమారుఁడయిన అర్వరీవంతుఁడు వీరందరు సప్తర్షులు. (18) చైత్రుఁడు, కింపురుషుఁడు, కృతాంతుఁడు, విభృతుఁడు, రవి, బృహదుక్తుఁడు, నవుండు, సేతుఁడు, శ్రుతుఁడు. ఈ తొమ్మండుగురు స్వారోచిష మనువు యొక్క కుమారులు, వీరు మనువు యొక్క వంశోద్దారకులు; వారు పురాణములో చెప్పఁబడిరి. ఇది రెండవ మన్వంతరము.
సప్తర్పులు, మనువు, దేవతలు, పితరులు. ఈ చతుష్టయము మన్వంతరమునకు మూలము. వారి సంతానము ప్రజలు. (21) ఈ క్రింద చెప్పినది శాస్త్ర నిశ్చయము. దేవతలు ఋషుల పుత్రులు. పితరులు దేవతల సంతానము. ఇంక ఋషీశ్వరులు దేవతల పుత్రులు. మనువువలన క్షత్రియులు వైశ్యులు; సప్తరుల వలన బ్రాహ్మణులు కలిగిరి. ఈ విధముగా మన్వంతరము సూక్ష్మముగ చెప్పబడినది. అంతీయే కానీ సవిస్తరముగ కాదు, (23) స్వారోచిష మన్వంతరము యొక్క వివరములు, స్వాయంభువ మన్వంతరము వలనఁదెలిసికొనవలయును. అంతియే కానీ ఒక శతపరములలో నయినను దానిని విస్తరముగా వివరించుటకు శక్యము కాదు. దీనికి కారణము ప్రతి వంశము నుండియు, అనేకులయిన ప్రజలు పునః పునః ఉద్భవించి యుండుటయే. ఇంక ఉత్తమమైన తృతీయ మన్వంతరమున దేవతల యందు పంచగణములు మాత్రమే చెప్పం బడినవి. వానిని నేనిప్పుడు చెప్పెదను గ్రహింపుఁడు. వారు సుధామానులు, వశవర్తనులు, ప్రతర్దనులు, శివులు మరియు సత్యులు. వీరిలో ప్రతగణము పండ్రెండుగురు దేవతలను గలిగి యుండును. సత్యుఁడు, ధృతి, దముఁడు, దొంతుఁడు, క్షముఁడు, క్షాముఁడు, ధ్వని; శుచుఁడు, ఇషుఁడు, ఊర్జుఁడు, శ్రేషుఁడు, సుపర్ణుఁడు ఈ పండ్రెండుగురు సుధామానులుగా చెప్పబడిరి. (28) వంశవర్తినులు (వంశావర్తులు) వారు సహస్రధారులు, విశ్వాయువు, సమితారులు బృహత్తు వసువు, విశ్వధ, విశ్వకర్ముఁడు, మానసుఁడు, వీరాజసుఁడు, జ్యోతి, విభాసుఁడు వీరు వంశ వర్తినులుగా కీర్తింపఁ బడిరి. (30) ప్రతర్దనులు కీర్తింపఁబడిరి. వారు, అవధ్యుఁడు, అవరతి, ప్రభువయిన వసువు, ధిష్యుఁడు, విభావసు, విత్తుఁడు, క్రతువు, సుధర్ముండు, ధృతధర్ముఁడు, యశస్విజుఁడు, రథోర్మి కేతుమంతుఁడు (31)
యజ్ఞము నందు తమ భాగములను గ్రహించుటకు అర్హులైన వారు మరి పండ్రెండుగురు దేవతలు కలరు. వారు ప్రతర్గనులలో వదాన్యులయిన హంసస్వరులు, యశస్కరులు, సుదానుఁడు, వసుదోనుఁడు, సుమంజసుఁడు, వీశ్వుడు, యముఁడు, వహ్ని, యతి, సుచిత్రుఁడు, సుతపుడు. వీరందరు శివులుగా తెలిసికొనవలసినవారు. (33) సత్యవర్గమునకుఁ జెందిన ,దేవతలను, వారి పేరును దెలిసికొనుము.. పోరు దీకృతి, వాక్పతీ, వీశుఁడు, శంభువు, స్వమృడీకుడు, దీవి, వరోధాముఁడు, ఇృహద్వపుఁడు, అశ్వుఁడు, సదశ్వుండు, క్షేముఁడు, ఆనందుఁడు, యజ్ఞము నందు పాల్గొనుటకరులయిన పండ్రెండుగురు దేవతలు సత్యులుగా పరిగణీంపఁబడుచున్నారు. ఈ విధముగా వీరు ‘ఉత్తమ’ మన్వంతరమున భగవంతులు (దేవతలు). వీరందరు ఆంగీరసుఁడయిన ఉత్తమ ప్రజాపతి పుత్రులు. వారలలో (ఆ దేవతలలో) ‘సుశాంతి’ యను పేర ప్రసిద్దుం డయిన వాడు ఇంద్రుఁడు. (37) వసిష్ఠునకు ఏడుగురు పుత్రులు. వారు వాసిష్ఠులుగా ప్రఖ్యాతులు. ఉత్తమ మన్వంతరము వారందరును సప్తర్షులు. మహాత్ముఁడయిన ఉత్తమునకు పదీముగ్గురు మానసీక పుత్రులు. వారు అజుఁడు, పరశుఁడు, దివ్యుఁడు, దీన్యౌషధి, నయుఁడు, దేవాంబుజుండు, అప్రతిముఁడగు మహోత్సాహుఁడు, గజుఁడు, వినీతుఁడు, సుకేతుఁడు, సుమతి, శ్రుతి; వీరు క్షత్తమన్వంతరము. ఈ విధముగా స్వారోచిష మనువుతో సహా ఉత్తముని యొక్క సృష్టి వివరింపబడినది. (41) ఇంక విస్తరముగా ఆనుపూర్వీకముగా తామసుని (మనువుయొక్క సృష్టి నెఱుంగుఁడు. మనువయిన తామసుని నాలుగవ మన్వంతరమున చెప్పఁబడిన దేవతల వర్గములు - సత్యులు, సురూపులు, సుధీయులు, హరులు. ఈ దేవతలు తామస మన్వంతరమున పులస్త్యుని సంతానము. (43)
వీరిలో ఒక్కొక్క గణములో ఇరువది యైదుగురు దేవతలు. తామస మన్వంతరమున ఇంద్రియములు దేవతలుగా స్మరింపఁబడుచున్నారు. జ్ఞానేంద్రియముల మూలముననే జనులు విషయముల (వస్తువుల) గ్రహించెదరు. ఈ విషయమును ఋషులు నిశ్చయము చేయుదురు. వారి యొక్క ప్రమాణములున్నవి. ఎనిమీదవయది యైనదీ మనస్సుగా స్మరింతురు. (45) ప్రతాపవంతుఁడయిన శిబి ఈ దేవతల కధిపతి. ఆతఁడే ఇంద్రుఁడు. ఓ సత్తములారా ! ఆ మన్వంతరమందున్న ఏడుగురు ఋషులను దెలిసికొనుఁడు. వారు ఆంగీరస పుత్రుఁడయిన కావ్యుఁడు, కశ్యపుని పుత్రుఁడయిన పృథువు, అత్రి కుమారుఁడయిన అగ్ని, భృగు పుత్రుడయిన జ్యోతిర్గాముఁడు, పులహుని కుమారుఁడు చరకుఁడు, వసిష్ఠ సూనుడయిన పీవరుండు, పులస్త్యుని కుమారుఁడయిన చైత్రుఁడు. ముందు చెప్పఁబోవు వారు తామస మనువు యొక్క సంతానము. వారు జాను జంఘుఁడు, శాంతి, నరుఁడు, ఖ్యాతి, శుభుఁడు, ప్రియభృత్యుఁడు, పరీక్షిత్తు, ప్రస్థలుఁడు, దృఢీషుధి, కృశాశ్వుఁడు మరియు కృతబంధువు. వీరు తామసుని మానససుతులు. స్వారోచిషుని యొక్క యైదవ మన్వంతరమున చెప్పఁబడిన దేవతా వర్గముల నెఱుంగుము. (50) పోరు అమితాభులు, భూతదయులు, వైకుంఠులు, సుమేధసులు. వసిష్ఠుని యొక్క పవిత్రులయిన పుత్రులు. (వారు వాసిష్ట ప్రజాపతి బిడ్డలు?) ఈ నాల్లు గణముల యందు నొక్కొక్క దానిలో పదునాలుగురు సుభాస్వరులు కలరు. (52) ఉగ్రుఁడు, ప్రజుఁడు, అగ్నిభావుఁడు, ప్రజ్యోతి, అమృతుఁడు, సుమతి, విరావుఁడు ధాముఁడు, నాదుఁడు, శ్రవసుఁడు, వృత్తి, రాశి, వాదుఁడు, శబరుఁడు. ఈ పదునలుగురు అమితాభులయిన దేవతలుగా సంస్మృతులు. (54)
అభూతయసుల గణము వారి యొక్క నామములు ఇటీవని వారెరుంగుదురు. మతి, సుమతీ, ఋతుఁడు, సత్త్యుఁడు, ఏధనుఁడు, అధృతి, విధృతి, దముఁడు, నీయముఁడు, ప్రతుఁడు, విష్ణువు, సహుఁడు, ద్యుతిమంతుఁడు సుశ్రవసుఁడు. (56) వృషుఁడు, భేత్త, జయుఁడు, భీముఁడు, శుచి, దాంతుఁడు, యశుఁడు, దముఁడు, నాథుఁడు, అజేయుఁడు, విద్వాన్, కృశుఁడు, సౌరుఁడు, ధ్రువుఁడు, వీరందరు వైకుంఠులుగా కీర్తింపఁబడిరి. ఇంక సుమేధసులను వినుడు. మేధాతిథి, సత్యమేధుఁడు, పృశ్నిమేధుఁడు, అల్పమేధుఁడు, మేధుడు (ప్రభువు) దీప్తిమేధుఁడు, యశోమేధుఁడు, స్థిరమేధుఁడు, సర్వమేధుఁడు, సుమేధుఁడు, ప్రతిమేధుఁడు, మేధజుఁడు, మేధాహంతుఁడు వీరందరు సుమేధుసులుగా కీర్తింపః బడిరి. (60) వారికీ విక్రాంత పౌరుషుఁడు విభువు ఇంద్రుఁడు, రైవత మన్వంతరమున, పులస్త్యుని కుమారుఁడయిన దేవభాహుఁడు, కశ్యపుని సంతానమయిన సుధాముఁడు అంగీరసుని వంశీయుఁ డయిన హిరణ్యరోముఁడు, భృగు సంతానమయిన వేదశ్రీ, వసిష్ఠుని బిడ్డడయిన ఊర్ధ్వబాహు డు, పులహుని వంశీయుఁడయిన పర్జన్యుఁడు, అత్రీవంశీయుఁడయిన సత్యనేత్రుఁడు వీరు సప్తర్షులు, రైవతుని పుత్రులు. మహావీర్యుఁడు, సుసంభావ్యఁడు, సత్యకుఁడు, హరుడు, శుచి, బలబంధువు, నిరామిత్రుఁడు, కంబుఁడు, శృంగుఁడు, ధృతవ్రతుఁడును. ఇది యెదవ మన్వంతరము. (64) స్వారోచిషుఁడు, ఉత్తముఁడు, తామసుఁడు, రైవతుఁడు. ఈ నల్వురు మనువులు ప్రియవ్రతుని అన్వయులని భావింపం బడుచున్నారు. (65) ఆరవ మన్వంతరమున అనఁగా చాక్షుష మన్వంతరమున, పంచగణ దేవతలు భావింపఁబడుచున్నారు. వారు ఆద్యుఁడు, సూతుఁడు, భావ్యుఁడు, పృథుకుఁడు, మహాతేజోవంతుఁడయిన లేఖుఁడు, వీరందరు దివొకసులు; వీరందరు మాతృనామములచే చెప్పబడు చున్నారు. (67)
వారు ఆరణ్యప్రజాపతీ మనుమలు. ఆరణ్యుఁడు ప్రజాపతి, అతఁడు అత్రి కుమారుడు. వీరి గణములోక్కొక్కటి ఎనమండ్రు దేవతలు కలిగినవిగా భావింపఁబడుచున్నవి. (68) అంతరిక్షుఁడు, వసువు, హవ్యుఁడు, అతిథి, ప్రియవ్రతుఁడు, శ్రోత, మంత, అనుమంతయు. వీరు ఆద్యులుగా ప్రకీర్తితులు. (69) శ్యేనభద్రుఁడు, శ్వేతచక్షువు, మహాయశుఁడు, సుమనసుఁడు, ప్రచేతసుఁడు, నేనుఁడు, సుప్రచేతసుఁడు మహాసత్తుఁడయిన ముని వీరందరు ప్రసూతులుగా ప్రకీర్తితులు. (70) విజయుడు, సుజయుఁడు, మనుఁడు, స్యోదుఁడు (ఉదానుఁడు) మతి, పరిమతి, విచేతుఁడు, ప్రియనిశ్చయుఁడు ఈ దేవతలు భవ్యులుగా సంస్కృతులు. ఇఁక పృథుకులను నెఱుంగుము. (72) ఓజీషుఁడు, శకునుం డు, దేవుఁడు, వానహృష్ణుఁడు, సత్యదృష్టి, జిగీషుఁడు, విజయుఁడు, మహాభాగుఁడయిన (కీర్తిమంతుఁడయిన) అజితుఁడు - వీరు పృథుకులు. దివాకసులు (స్వర్గధాములు) లేఖులను దేవగణమును పేర్లతో చెప్పెదను, ఎలుంగుము. (74) మనోజవుఁడు, ప్రఘాసుఁడు, ప్రచేతసుఁడు, మహాయశుఁడు, ధ్రువుఁడు, ధ్రువక్షితి, వీర్యవంతుఁడయిన అచ్యుతుఁడు (75) యువనుఁడు, బృహస్పతి వీరు లేఖులుగా ప్రకీర్తితులు. మహావీర్యుం డయిన మనోజవుఁడు వీరలకు ఇంద్రుఁడయ్యెను. (76) భృగు కుమారుడు, ఉత్తముఁడు, అంగీరసుని సుతుఁడు హవిష్యుఁడు, కశ్యపసుతుఁడయిన సుధాముఁడు, వసిష్ఠకుమారుఁడయిన విరజసుఁడు, పులస్త్యసుతుఁడు అతినాముండు, పులహుని కుమారుఁడు సహీషుఁడు, అత్రికుమారు డయిన మధురాత్రేయుఁడు వీరేడుగురు చాక్షుషమన్వంతరమున ఋషులు. (78)
ఋషయః ఊచుః :-
సూత ఉవాచ :-
ఊరు, పురు, శతద్యుమ్నుఁడు, తపస్పీ, సత్యవాక్కు కృతి అగ్నిష్టుతుఁడు, అతిరాత్రుండు, సుద్యుమ్నుఁడు, అభిమన్యుఁడు ఈ పదుగురు నడ్వలకు జనించిన చాక్షుష మనువు కుమారులు. ఇదీ ఆరవ మన్వంతరము. (80) జరుగుచున్న (సాంప్రతమైన) వైవస్వత మనువు ఆధారముగా ఆతని సృష్టి వర్ణింపఁబడినది. ఈ విధముగా చాక్షుష మన్వంతరము విస్తరముగా, ఆనుపూర్వికముగ వర్ణింపఁబడినది.
ఋషీశ్వరులిట్లు పలికిరి :
చాక్షుషుఁడెవని దాయాది? ఆతఁడెవ్వని అన్వయమున జన్మించెను? ఆయన్వయమున జన్మించిన యితరుల నెల్లరను మాకు యథాతథముగా చెప్పుము.
సూతుఁడిట్లు చెప్పెను :
ఓ ద్వీజులారా ! చాక్షుష మను సృష్టిని సంక్షేపముగా వినుఁడు. ఆ చాక్షుషుని వంశము నందే ప్రతాపవంతుఁడు వైన్యుఁడైన పృథువు పుట్టెను. (83) ప్రచేతసునీ కుమారుఁడయిన దక్షుఁడు, ఇతరులును, ప్రజాపతులు. ప్రజాపతియైన అత్రి ఉత్తానపాదుని పుత్రునిగా గ్రహించెను. ప్రజాపతి రాజగుట, ఆతడు (ఉత్తానపాదుఁడు) రాజయ్యెను. ఏదియో కారణమున స్వాయంభువమనువు అత్రీకి ఉత్తానపాదుని దత్తునిగా నొసంగెను. ఓ బ్రాహ్మణులారా ! ఇదీ ఉపోద్ఘాతముగా చాక్షుష మన్వంతరమును గూర్చి చెప్పెదను. (86) ధర్మునీ కూతురు, అందమయినది (చక్కని పీఱుందులు గల్గినది) సూనృతయని ప్రసిద్ధ నామ ధేయురాలు. ఆమె ఉత్తానపాదునికీ నల్గురు పుత్రులను కనెను. (87) పవిత్రురాలైన సూనృత ధ్రువుని యొక్క జనని. శుచిస్మితయైన సూనృత ధర్ముని పత్నియైన లక్ష్మికి జన్మించెను. ఉత్తానపాదుఁడు ధ్రువుని, కీర్తిమంతుని, ఆయుష్మంతుని, వస్తువును కుమారులుగాను, శుచిస్మిత అయిన స్వర, మనస్వినులను కుమార్తెలను గాను కనెను. వీరి పుత్రులింతకు పూర్వమే చెప్పఁబడిరి.
ప్రథమ త్రేతాయుగమున, స్వాయంభువ మనువు యొక్క పౌత్రుఁడు, మహావీర్యవంతుఁడునునైన ధ్రువుఁడు, పది సంవత్సరములు, భగవన్నిర్దేశమున, నిరాహారుండై తపమాచరించెను. ఆతఁడు మహాయశస్సు పొందవలయునని కోరెను. మహాయశస్సును ప్రార్థించీ ఆతఁడు యోగక్రియల నన్నింటి నాచరించెను. బ్రహ్మ ఆగనీ తపస్సు వలన ప్రీతుఁడయ్యెను. ఆతనికి జ్యోతిర్గణములలో నత్యుత్తమమయిన స్థానము నొసంగెను. అది దివ్యము. ఉదయాస్తమానవర్జితము, అయ్యది సర్వభూత ప్రలయము కలిగినను శాశ్వతము. ఆతని అతిమాత్ర వృద్ధిని మహిమను నిరీక్షించి, దైత్యులకు అసురులకు పురోహితుఁడయిన ‘ఉశనుఁడు’ ఈ శ్లోకమును గానము చేసేను. “అహోస్య తపసో వీర్య మహోత్రుతమహోవ్రతమ్” ఈతని తపః ప్రభావము ఎంత ఆశ్చర్యకరమైనదీ? ఈతని పాండిత్యమెంతటిది ! ఆతని పవిత్రతపశ్చరణమెంత యమోఘము! ఈ ధ్రువుని కుపరి భాగమున నుండి సప్తర్వులు చుట్టు నిలంబడి యుందురు. ధ్రువునకు స్వర్గము ఆసక్తమయి (సంబంధించి) యున్నది. ఈతఁడే దీవమున కీశ్వరుఁడు. ఈతఁడే దివస్పతి. (95) ధ్రువుని రాజ్జయైన ‘భూమి’ ‘సృష్టిభవుఁడు’ అను నిద్దర రోజులంగనియెను. (వీరు ధ్రువుని పుత్రులు), ప్రభువైనసృష్టి తన ఛాయతో “నారీభవ” స్త్రీని కమ్మనెను. ఆతఁడు సత్యవాక్కు అగుట, వెంటనే ఆ ఛాయ, దివ్య దేహ సౌందర్యముతో స్త్రీ యయ్యెను. దీప్యాభరణ భూషితయ్యేను. (97) సృష్టి తన భార్యయైన ఛాయయందు, పంచ పుత్రులను గనెను. వారకల్మషులు, వారు ప్రాచీనగర్బుఁడు 2. వృషభుఁడు. 3.వృకుడు, 4వృకలుఁడు, 5. ధృతీ (98) ప్రాచీన గరుని పత్నియైన సువర్చ ఉదారధీయను (పుత్రుని) రాజును కనెను. ఆతఁడు పూర్వజన్మ యందు ఇంద్రుఁడు. (99) మన్వంతరము వఱకు, సహస్ర వరానంతరమే ఆహారము గ్రహించుచు, యోగాచరణ మాచరించి యితఁడు ఇంద్రత్వమును పొందెను. (100) ఉదారథ్యొక్క సుతుఁడు దీనంజయుండు. ఆతఁడు భద్రకు జనించెను. (వెఱొకభార్య) వరాంగి రిపుని కనెను. ఇతఁడు దివంజయుని పుత్రుఁడు. ఆతఁడు తన శత్రువుల నెల్లర జయించెను. (101)
ఋషయః ఊచుః :-
సూత ఉవాచ :-
‘రిపు’ని భార్య బృహతి. ఆమె చక్షుషుని కనెను. ఆ చక్షుషుఁడు సర్వతేజస్వీ ఆ చక్షుషుని కుమారుఁడు మనువు. ఆ మనువు మహా విద్వాంసుఁడు, ఆతఁడు బ్రాహ్మణ క్షత్రియ ప్రవర్తకుఁడు. వారుణీ, యను నామాంతరముగల పుష్కరిణి చాక్షుష మనువును కనెను. (102)
ఋషీశ్వరులిట్లు చెప్పిరి :
ఓ పాప రహితుఁడా ! వారుణి యనంబడునట్టి కూతురు ప్రజాపతికెక్కడిది? వివరించుట యందు నీవు కుశలుండవు. యథార్థముగా నీ విషయమును చెప్పుము.
సూతుఁడిట్లనియెను:
అరణ్యునీయొక్క కుమారుఁడయిన ఉదకుండు వరుణత్వమును పొందెను. అందుచే ఆమె వారుణి యైనది, తన సోదరునీ వలన ఆమె ఖ్యాతిని పొందినది. (104) ప్రజాపతియైన విరజుని కూతురు నడ్వల, ఆమె వలన మనువునకు పదిమంది కుమారులు కలిగిరి. వారు ఊరుం డు, పురుఁడు, శతద్యుమ్నుఁడు, తపస్వి, సత్యవాక్కు కృతి, అగ్నిష్ణుతుఁడు, అతిరాత్రుఁడు, సుద్యుమ్నుండు, పదవవాఁడు, అభిమన్యుఁడు, వీరు మనునకు నడ్వలకు కలిగినవారు. ఆగ్నేయి ఊరుని యందు మహాప్రభావులయిన ఆరుగురు పుత్రులంగనియెను. వారు అంగుఁడు. విఖ్యాత్మంతుం డగు సుమనుఁడు 3.గయుఁడు, 4. శుక్రుడు, 5. ప్రజుఁడు; 6. అజినుఁడు. అంగరాజు భార్య సునీథ. వారి కుమారుడు వేనుఁడు, (108) వేనుని అపరాధము వలన నధీకమయిన ప్రకోపము కలిగెను. (అలజడీ - విప్లవము). మహరులు పుత్రులకోలకు ఆవేనుని దక్షిణకరమును మథించిరి. ఆతని కరము మధింపఁబడఁగా సురూపవంతుఁడయిన పృథువు జనించెను. ప్రథత పౌరుషుఁడయిన పృథుని పుట్టింపజేసిన తరువాత ఋషులిట్లనిరి. ఓ ప్రజలారా ! సమ్ముదీతులు కండు. ఈతఁడు మీకు రాజు. ఆతఁడో ధనువుతో, కవచములో పుట్టెను. ఆతఁడు తన తేజస్సుచే లోకములను దహించునట్లుండెను. మీకందరకు ఈ రాజు వృత్తి (జీవనాధారము) నొసంగును. వేనుని కుమారుఁడయిన పృథువు, క్షత్రియులకాది. ఆతఁడు ప్రపంచమునంతటిని రక్షించెను. (112)
శాంశపాయన ఉవాచ :-
సూత ఉవాచ :-
ఆ ప్రభువు రాజసూయ మాచరించి, అభిషిక్తులయిన వారిలో ప్రథముఁడు, ఆతని స్తోత్రము చేయుటకే నిపుణులయిన వంది మాగధు లుత్సన్నులైరీ. ధీమంతుఁడయిన యతనిచే ఈ గోవు నుండి (భూమి) జీవిత వృత్తిని కోరునట్టి ప్రజలకు, సస్యములు (వృక్షలతాదులు) పిదుకంబడినవి. దేవతలచే, మునిగణములచే, పితరులచే, దానవులచే, అప్సరలచే, సర్పములచే (నాగులచే), పుణ్యజనులచే (రాక్షసులు - పిశాచముల) పర్వతములచే, వృక్షములచే, లతలచే ఆయా వివిధ పాత్రముల యందు వసుంధర పితుకబడి వారు కోరినట్లుగా క్షీరము నొసంగెను.. తన్మూలమున ప్రజలు వారి ప్రాణావధారణము చేసికొనిరి. ఓ మహావ్రత ! ఓ మహాముని ! వివరముగా పృథువు యొక్క జనమును, పూర్వ మా మహాత్ముడైన పృథునిచే వసుంధర నుండి ఎట్లు క్షీరము పిదుకబడినది; ఆతఁడెట్లు దేవతలచే, నాగులచే, బ్రహ్మరులచే, యక్షులచే, రాక్షసులచే, గంధర్వులచే, అప్సరోగణముచే అనుగమింపఁబడెను? పూర్వము ఎట్లు ఏ సాధనమున క్షీరమును బీదికెనో విస్తరించి చెప్పుము. వారి పాత్ర విశేషము లెవ్వి ! పాలు పిదుకు వాడెవ్వఁడు? పాలెట్టివి? వారుపయోగించిన లేదూడలు (వత్సము) లెట్టివి. వీనిని గూర్చి యడుగునట్టి మాకు తెల్పుము. ఆ వసుంధర యొసంగిన క్షీర విశేషములఁ చెప్పుము. పూర్వము పూర్వులు క్రుద్దులునయిన మహరులచే వేనుని హస్తమేకారణమున మధితమైనది? తత్కారణములెవ్వి మా కొఱకు చెప్పుము (12) సూతుఁడిట్లు చెప్పెను. ఓ విప్రులారా ! పృథుని కుమారుఁడైన వేనునీ జననమును. మీకు చెప్పెదను. ఓ బ్రాహ్మణులారా ! ఏకాగ్రము, పరిశుద్ధము నయిన మనస్సులతో వినుఁడు, ఈ బ్రాహ్మణమును (వేదము నందలి గాధ) పవిత్రుఁడు కాని హానికీ, పోపునకు, వినయ భావమున శిష్యుడు కాని పానికి ఎవఁడు వ్యతిరేకుఁడో వానికి, ఏ పరిస్థితుల యందు ప్రతనిష్ఠ పూర్తి ఆచరింపని వానికి చెప్పరాదు. (123) ధన్యమయినది, యశస్కరము, ఆయుఃకరము, పుణ్యమయినది వేదసమ్మితము ఋషి ప్రోక్తమయిన యీ రహస్యమును అసూయారహితులరై వినుఁడు.
అది (ఆగాథ) వేదతుల్యము. ఇది యొక రహస్యము. ఋషులు చెప్పిరి. అసూయా రహితుఁడైన వ్యక్తి బ్రాహ్మణులకు నమస్కరించి యితరులకు వివరించిన, ఆతఁడు కృతాకృతకార్యముల గూర్చి పశ్చాత్తాప మొందవలసిన పనిలేదు. ‘అంగుఁడు’ అను మహారాజు కలఁడు. ఆ ప్రభువు అత్రి తుల్యుఁడు. అంతియేకాక అత్రి వంశసముద్భవుఁడు. అతఁడు ప్రజాపతి ధర్మగోష్ణ. ఆతనీ పుత్రుఁడు వేనుఁడు, ఆతఁడు ధార్మికాభిమానీకాఁడు. ఈతఁడు సునీథ కుదయించెను. సునీథ మృత్యువు యొక్క కూతురు. వేనుఁడు కాలుని (మృత్యువు) యొక్క కూతురయిన సునీథకు కలిగిన ప్రజాపతి. (127) వేనుఁడు తన మాతా మహుఁడయిన కాలుని దోషముచే కోలుని పుత్రికకు పుట్టెను. ఆ వేనుఁడు ధర్మమునకు తన పృష్ఠమును జూపి (ధర్మమును నుల్లంఘించి) కామ పరుఁడై తన యిష్టము వచ్చినట్లే లోకమున ప్రవర్తించెను. (128) ఆ ప్రభువు (వేనుఁడు) ధర్మ క్రియాకలాపములను వేద విధులను స్తంభింపజేసెను. వేదానుశాసనము నతిక్రమించి అధర్మ కార్య నిరతుం డయ్యెను. (129) ఆతఁడు వేదాధ్యయన క్రియను పరిత్యజించెను, వేదాధ్యయనమునకు విరుద్ధ శాసన మొనర్చెను. యజ్ఞ సంబంధవషట్కారములు లేవు. ఆతఁడు రాజ్యము పరిపాలింప మహాయజ్ఞముల యందు దేవతలు సోమమును గ్రహింపలేదు. “యజ్ఞము లాచరింపరాదు. (నయష్టవ్యం) దానము లీయరాదు (నదాతవ్యం) అను క్రూరమయిన ప్రతిజ్ఞ, స్వవినాశనమునకు ఆసన్నమయ్యెను. అప్పుడు ఆ ప్రజాపతి “నేనే పూజింపం బడవలయును. నేను యజ్ఞముల దేవరులచే బ్రాహ్మాణాదులచే గౌరవింపఁబడవలయును. యజ్ఞములు నా యందే చేయవలయును (నాకే యొనర్పవలెను). నన్నే ధ్యేయముగా హోమములు ఆచరింపఁ బడవలయును. (182) ఆతఁడు మర్యాదావధులను నతిక్రమించి గర్వపూరితుం డయ్యెను. ఇట్టి వీరకృత్యము లెన్నింటికో ఆతడధిపతి. మహరు లందరు మరీచి నాయకత్వమున ఆతనితో నిట్లనిరి. “ఓ రాజా ! వత్సరశత యుతమైన యొక దీక్షను మేము పూనుచున్నాము. ఇట్టి అధర్మ కృత్య మాచరింపకుము. ఇది సనాతన ధర్మము కాదు (నీవాచరించు అధర్మక్రియలు), నీవో యముని వంశమున పుట్టితివీ, అసంశయముగా నీవే ప్రజాపతివి. ఇంతకుఁబూర్వము “ప్రజలను సవ్యముగా పాలించెదనని సమయమొండు (ప్రతిజ్ఞ) చేసియుంటివి. ఈ విధముగా బ్రహ్మవాదులు పలుకగా దుర్బుద్ధియైన వేనుఁడు వికటాట్టహసము చేసి ‘నాకు తెలిసిన విషయములు నెఱింగిన కోవిదుఁడెవఁడు. (156)
ధర్మసష్ట వేడొకఁడు నా కంటే నెవఁడు? ఎవరి పలుకులు (శ్రోతవ్యం) నేను విని ఆచరించవలెను. వీర్యము నందు గానీ, తపస్సుచేగానీ, సత్యము నందు గాని ఈ ప్రపంచమున నెవ్వడు నాకు సమానుఁడు? మీరందరు మందబుద్దులరు. మీరు యథార్థముగా నన్నెఱుంగరు నేను సమస్తమయిన లోకమునకు అందును విశ్లేషించి ధర్మములకును ఆధారభూతుఁడనయిన ప్రభవస్థానమును. నేనే కోరినచో యావదూమిని దహింపఁగలను లేదా జలములచే ప్రపంచమును ముంచెత్తగలను. నేను సృజింతును లేదా గ్రసింతును. ఈ విషయమున నెట్టి సంశయము (విచారణ) అవసరము లేదు.” (139) అత్యధికముగా వేనుఁడు గర్వోద్రేకమున ప్రతిఘటించేను. ఆతని దౌష్ట్య ప్రవృత్తి నుండి నివారింప నశక్యము కాగా మహరులంరదు సంక్రుద్దులయిరి. ఆతఁడు అధికముగా పెనుగులాడు కొనుచుండ, సంక్రుద్ధులయిన మహర్పులు ఆతనిని రెండు చేతులు గట్టిగా పట్టిరి. ఆతఁడో ప్రకాశవంతుఁడు, మహాబలుడు. వారాతని వామహస్తమును విరిచి పట్టిరి. ఆ మహారాజు వామ హస్తమును మిక్కిలిగా కుపితులయిన ఋషులు మథించిరి. (141) ఇట్లు మధింపంగా మొట్టమొదట హ్రస్వాకృతి గల యొక పురుషుండుదయించెననీ విందుము. ఆ వ్యక్తి (పుట్టినవాఁడు) నల్లగ నుండెను. (142) ఆతఁడు అత్యధికముగా భీతుఁడయ్యెను.దోసిలి యొగ్గి ఆ కులేంద్రియుఁడై యందు నీలంబడెను విహ్వలుఁడు, విచారథిన్నుఁడునయిన యతనిని (ఆహస్వపురుష వ్యక్తిని) చూచి " నీమీద కూర్చుండుము)” అనీ ఆ ఋషీశ్వరులనిరి (143) ఆతఁడు అనంత విక్రముండై ‘నీషాద’ వంశమునకు కర్తయయ్యెను. అంతియేకాక ఆతఁడే వేనుని పాపముల నుండి ధీవరులను ()జలరులను) సృజించెను.(144) వింధ్య పర్వతము నివాసముగా గల ఇతర - ఆరణ్య జాతులయిన తంబురులు, తుంబురులు, ఖశులు మొదలగువారు అధర్మ క్రియాభిరుచులు, వేనునీ కల్మషము నుండి సంభవించిన వారినిగా దెలిసికొనుము.
మరల క్రుద్ధులయిన మహర్షులు వేనుని యొక్క దక్షిణ హస్తమును అరణిని వలె (యజ్ఞ యాగాదుల యందు రెండు కఱ్ఱలను ఒకదానిపై నొకదాని నుంచీ, పైదానీ నొక్కిపట్టి మథనము చేయగా అగ్నీ పుట్టును. ఆ అగ్ని జనకములయిన కర్రలకు అరణులనీపేరు) అధికముగా కోపోద్రిక్తులై మథించిరి. పద్మమువలె నున్న ఆ వేనుని కరము నుండి పృథువు పుట్టెను. పెద్దదియయిన కరతలము నుండి పుట్టుటచే ఆతఁడు పృథువయ్యెను. సాక్షాదగ్నివలె ప్రజ్జ్వలించు ప్రకాశవంతమయిన శరీరముతో, నతఁడొప్పెను. ఆద్యమయిన ఆజగవ మనునదియు మహారవము చేయునట్టిదియు నగు ధనువు నాతఁడు వహించును. ప్రజా రక్షణము కొఱకు భద్రము కొఱకు శరములను మహాకాంతి మంతమయిన కవచమును దాల్చెను. ఆతఁడుద్భవింపఁగా అంతటను సర్వ భూతకోటియు అత్యంతానందమొందెను. వారందరు మహారాజయిన పృథువును సమీపించిరి. వేనుడు స్వర్గస్థుడయ్యెను. రాజర్షియైన యాతడు తన పుత్రుడైన పృథునిచే పున్నామ నరకము నుండి రక్షింపఁబడెను. నదులు, సముద్రములు అన్నింటి నుండి రత్నములను తీసికొనివచ్చి అభిషేకార్థము జలములతో ఉపస్థితములై యుండెను. పితామహుఁడగు బ్రహ్మ ఆంగీరసునితోడను, దేవతల తోడను వచ్చేను. స్థావరములు జంగమములయిన భూతములు అన్ని దిక్కుల నుండి వైన్యుఁడైన పృథువును వచ్చి చేరుకోనెను. పృథువు నరాధిపతి. మహాద్యుతిమంతుఁడు. ఆతనిని పవిత్రోదకములచే వారభిషేకించిరి. మహారాజయిన పృథువు, అంగీరస కుమారులయిన దేవతలచే నభిషేకింపఁబడెను. ప్రతాపవంతుఁడు, వేనుని కుమారుఁడునయిన పృథువు మొట్టమొదటిరాజు ఆదీరాజు మహానుభావుం డు. ఆతని ప్రజలు తండ్రియయిన వేనునిచే పీడింపఁబడిరి. కాని తరువాత ఆ పృథువుచే ననురంజితులయిరి. (155) అప్పటి నుండి ప్రజల యనురాగముచే ఆతఁడు “రాజు” నామము చెందెను. పృథువు సముద్రము పై దండెత్త జలములు స్తంభించినవి. పర్వతములు పొడియై నేలకొరిగినవి. అంతీయేకాని పృథు పతాక భంగము కాలేదు. దున్నబడకుండగనే భూమి భూరి సస్యమును పండచేను అందరి కోరికల ననుసరించి ఆవులు పాలొసంగినవి కోర్కెలఁదీర్చినవి.
ప్రతి పుష్పమును మధుసంపన్నమయ్యెను. ఆ సమయముననే పృథువు యజ్ఞ మాచరించుచుండ, సోమము పిండబడుచుండగా దీనమున సూతుఁడు సౌత్యమున నుద్భవించెను. సూతుని ఆవిర్భావమీవిధముగా జరుగగా స్తోత్ర పాఠకుండయిన మాగధుఁడు పుట్టెను, (వంది మాగధులలో నితఁడు రెండవవాఁడు) (159) సామవేద వేత్తలు గానము చేయుచుండిరి. విశ్వేదేవతల భాండము నుండి మాగధుడు పుట్టెను. అందుచేతనే ఆతఁడు మాగధుఁడని పిలువఁబడెను. (160) బృహస్పతి కొసంగిన హవిస్సులు ఇంద్రునకొసంగిన హవిస్సులతోఁ గలిసి పోయేను. అది దైవికముగా నింద్రునకు హోమము చేయబడెను. అప్పుడు సూతుఁడు పుట్టెను. (161) అందుచే నచ్చటోక ప్రమాదము సంభవించెను. యజ్ఞకర్మల యందు ప్రాయశ్చిత్తము కలిగినది. శిష్యునీ యొక్క హవ్యముతో గురువున కర్పించిన హవిస్సు కల్సిపోయినదీ. (162) అధమ ఉత్తమముల సంసర్గముచే వర్ణవైకృతము కలిగినది. అది యెట్లన - క్షత్రియహీనయోనినుండీ బ్రాహ్మణ్యము జనించినది. సూతుఁడు తనకు ముందు పుట్టిన వానీతో సాధర్మ్యమును పొందెను. ఆతఁడాతనితో తుల్యధర్ముండని కీర్తింపబడెను. క్షత్రియ ధర్మములు సూతునకు మధ్య ధర్మములు. ఆ సూతుని ధర్మములు, రథములను భద్రముగా నుంచుట, రథములు, గజములు, అశ్వములు, వీని నిర్వహాణము. ఈ వృత్తి అధమమయినవిధి. పృథువును స్తోత్రము చేయుటకు సూతుఁడు, మాగధుడును అచ్చటకు మహరులచే పిలువబడిరి. ఋషీశ్వరు లందరా సూతమాగధులతో మీరీ రాజును స్తుతిగావింపుఁడు. ఈ కార్యము మీ కరమయినదీ, ప్రజాపతియైన యీ రాజు స్తోత్రము చేయబడుటకు అరుండు.” అనీరి. అంత సూతమాగధులు ఋషులతో నిట్లనిరి”, మా కార్య కలాపములచే మేము దేవతలను ఋషీశ్వరులను సంతోషపెట్టెదము. అంతియేకాని యీ మహారాజు యొక్క మహత్కార్యములుగానీ, లక్షణములుగాని, కీర్తి విశేషముగానీ, స్వభావముగాని మేమెఱుంగము. అందుచే ఎట్లు మేము స్తోత్రము చేయుదుము ! అప్పుడు తేజస్వులయిన బ్రాహ్మణులిట్లు చెప్పిరి. (168)
ఈ రాజు నిత్యము స్వకర్మతుఁడు. సత్యవచస్వి. జితేంద్రియుఁడు, జ్ఞానశీలుఁడు, వదాన్యుఁడు. సంగ్రామముల యందపరాజితుఁడు. సూతమాగధులిర్వురు ఋషులచే వానిని కీర్తింప నియోగీంపఁబడిరి. ఆతనిని ఆతని భవిష్యత్కార్య కలాపాలను స్తోత్రము గావింపుఁడు అనిరి. సూతుఁడు మాగధుఁడును పరాక్రమ వంతుఁడయిన పృథు మహారాజును పూర్వ విజయ కర్మాదులచే స్తోత్ర మాచరించిరి. (170) స్తవాంతము నందు పృథు మహారాజు మీక్కిలి సంప్రీతుఁడయ్యెను. ఆ ప్రజాపతి సూతునకు ‘అనూప’ దేశమును {మాల్వాకు దక్షిణమున నున్నట్టిది), మాగధునకు మగధ దేశము నొసంగెను. అది మొదలుగా సూత మాగధులు పృథివీ పాలురను స్తోత్రము చేయుచున్నారు. రాజులు సూత మాగధుల వందుల యొక్క ఆశీర్వాదములతో నిద్ర మేల్కొందురు. ఆతనిని చూచి ప్రజలు పరమ ప్రీతులైరి. మహర్షులు - “నరాధిపుండైన, వైన్యుఁడు, మీకు ఇట్టి జీవితాధారపు వృత్తినిచ్చెను.” అనిరి. అంత ప్రజలు మహాభాగుఁడైన వైన్యుని కడకేగిరి. “మహర్షి వచనానుగుణముగ మాకు ఆధార భూతమగు వృత్తినిమ్ము ఈ విధముగా ప్రజలు తన్ను చేరి అర్జింపఁగా ప్రజాపాలకుడయిన వైన్యుఁడు, ప్రజలకు హితమాచరించు కోరికతో ధనుర్బాణములను గ్రహించి, ‘వసుధ’ వైపు తొందరగా వెళ్లాను. అంత వైన్య భయముచే భూమి గోరూపమును దాల్చి పరువెత్తెను. (176) పృథువు ధనువును దాల్చి, ఆ గోరూప పృథ్వి పరువెట్టుచునుండ దాని ననుసరించెను. వేనుని కుమారుని యందలి భయముతో నది బ్రహ్మలోకమునకు ఇతర లోకముల కరిగెను. తుదకు తన ముందు ఉద్యత కార్ముకుఁడయి ప్రకాశించు వాడియైన బాణములతో కూడి దీప్తతేజుం డు అచ్యుతసముఁడు మహాయోగీ మహాత్ముఁడు దేవతలచేఁగూడ జయింపబడరానివాఁడు అయిన వైన్యుని చూచెను. రక్షణ మీతరత్ర లభింపమిచే అయ్యది వైన్యునే పొందెను.
త్రిలోక పూజ్యురాలయిన భూమి కృతాంజలి పుటయై వైన్యునితో నిట్లనెను. స్త్రీ వధయందెట్టియధర్మమును నీవు గణింపకయుంటివి. అట్టిఁడవు నీవు నాచే సంవర్షితులయిన ప్రజలనేట్లు భరింపగలవు? ఓ రాజా! నా యందే లోకములన్నియు నున్నవి. ఈ ప్రపంచము నాచే భరింపఁబడుచున్నది. ఓ రోజు! నాచే సంవర్ణితులయిన ప్రజలు నీ కొఱకు నశింపరాదు. నన్ను వధించుట నీకు తగదు. నీవో! ప్రజలకు శ్రేయస్సు కల్పింప నభిలషించుచుంటివి. (182) ఓ పృథ్వీపాల ! ప్రజారక్షకుండా! నో యీ పలుకులు వినుము. ఉపాయముతో ఆచరించిన సర్వ సమారంభములును సిద్ధించును. నన్ను చంపి కూడ ప్రజలను ఓ రాజో పాలింప శక్తుఁడవు కావు. నేనో అంతర్భూతనైయుండెదను. అందుచే ఓ మహాద్యుతిమంతుఁడో! కోపము నిగ్రహింపుము. తిర్యగ్యోనుల యందుఁగూడ స్త్రీలు వధింపబడ కూడదని చెప్పుదురు. సర్వ సత్త్వముల యందు ఓ పృధ్వీపాల! ధర్మమును విడిచి వర్తింపఁదగవు. ఆ వసుధ యొక్క బహు విధములయిన వాక్యములను మహామతి వైన్యుఁడు వినెను. ఆ ధర్మాత్ముఁడు క్రోధమును విడిచి వసుధతో నిట్లనియెను. ఒకప్రాణి తనయొక్కని కొఱకుగాని, పరునొక్కరీ కొణకు గాని బహుప్రాణుల జంపుట పాపము. ఓ పూజ్యురాలా! ఎవ్వడు వధింపఁబడ పలువురు సుఖముగా జీవింతురో ఓ మంగళకరురాలా! ఆతని వధయందు పాతకము కానీ ఉపపాతకము కాని లేవు అందుచే ఓ వసుంధరా ! ప్రజల కోలుకు నిన్ను వధించెదను. నీవు జగద్ధితకరమయిన నా ఆజ్ఞను అనుసరించనీచో నిన్ను వధించెదను. నీవు నా శాసనమును త్రోసి రాజన్న (కాదుపోమ్మనీ తృణీకరించీన) నీన్ను ఒకే యొక శరముతో వెంటనే వధించెదను. నన్ను నేనే విశాలముగా జేసికొని నేనే యీ ప్రజను స్వయముగా భరించెదను.
సూత ఉవాచ :
నా వచనముల కంగీకారముగా ధర్మము రక్షించు వారిలో శ్రేష్ఠురాలా ! ప్రజలను ఎప్పుడు సంజీవింపజేయుము. నీవు సమర్ధురాలవు. ఇందు సందేహము లేదు. నీవు నాకు కూతురవు కమ్ము, అట్లయినచో నిన్ను చంపుటకై యేత్రంబడిన భయంకర దర్శనము కలిగిన ఈ ధనువును నేనుపసంహరించెదను.” అనెను. ఈ విధముగా చెప్పఁబడి భూసతి వైన్యునితో నీట్లనీయేను. నిస్సంశయముగా ఓ రాజా, నీ వచనముల నెల్ల నేను నిర్వహించెదను. నేను వాత్సల్యముతో పొలను స్రవింపఁజేయుటకు నీవోక వత్సమును తీసికొని రమ్ము, ధర్మ రక్షకులలో నుత్తముండా! నన్ను నీవు ఎత్తు పల్లములు లేకుండ సమతలముగా చేయుము ఎందులకన నేను స్రవించు పాలు సర్వత్ర సమానముగా వ్యాపించును.
సూతుఁడిట్లనియెను :
అంత సర్వత్ర వ్యాపించియున్న శిలాజాలములను ధనుష్కోటిలో ఉత్తోరణము (తీపి) చేసెను. గతించిన మన్వంతరముల యందు భూమి విషమముగా ఎత్తు పల్లములతో నుండెను. ఇప్పుడో విషమముగా నున్న వసుంధరా భాగములు సహజముగా సమతలములయ్యెను. (196) గతించిన సృష్టియందు భూమి విషమతలముగా నుండెను. అప్పుడు పట్టణములకు గ్రామములకు భేదము లేకుండెను. అప్పుడు మొక్కలు లేదా పంటలు లేవు, అప్పుడు వ్యవసాయముకానీ గోరక్షణముకాని లేవు. వణిక్పథములు (బజారులు) లేవు. చాక్షుష మన్వంతరము నందలి స్థితీయది. వైవస్వత మన్వంతరమున ఇవన్నియును సంభవములయ్యెను. ఎందెందు సమతల ముండెనో యందందు సర్వత్ర ప్రజలు నివసించిరి. పూర్వము ప్రజలకాహారము ఫలములేమై యుండెను, (200) అప్పుడు ప్రజల జీవిత వృత్తి కష్టముగా సాగుచుండెడిదనీ విందుము. వేనునీ సంతతి కాలము నుండి సర్వము సుసంపన్నమైనది. పృథువు చాక్షుష మనువును వత్సముగా జేసి సస్యములను, వృక్షములను, తన భూమి యందే పిదికేను.
ఆమపాత్ర (పక్వము కానిది; బాగుగా కాలనీదీ)
అప్పటి నుండి శుభవంతులయిన ప్రజలు, ఆహారముచే తమ్ము నిలుపుకొనిరి. ఋషీశ్వరులచే మరల నింకొక మారు పృథివీ సీదుకంబడినదని విందుము. ఆ ఋషీశ్వరుల సమయములో సోముఁడు (చంద్రుఁడు) వత్సము. బృహాస్పతి దోగ్ధ (పాలు పితుకువాఁడు). గాయత్రి మొదలగు వేద ఛందో విధానములు పాత్ర స్థానమును వహించేను. ఆ క్షీరము తపస్సు, వేదములు. అయ్యెను. తరువాత దేవతలు ఇంద్రుఁడు తమ నాయకుఁ డుగా సౌవర్ణ పాత్రము గ్రహించి పాలను ఓదీకిరని విందుము. వత్సము ఇంద్రుఁడు (మఘవాన్) సూర్యుఁడు పితుకువాఁడు. ఊర్ణము తేనే అప్పుడు క్షీరము. వానిచే దేవతలు వర్తించిరి. (జీవనోపాధిగా బ్రతికిరి). పితరులచే మరల వసుంధర పాలంబిదుకబడినదని విందుము. వారు రజత సంబంధమైన పాత్రను తీసికొని వచ్చిరి. క్షీరము స్వధ, అయ్యదీ వారి సంతృప్తికి సహకరించెను. వివస్వంతుని కుమారుఁడు బలవంతుఁ డునైన యముఁడు - వారికి వత్సము. శక్తి మంతుఁడయిన అంతకుఁడు పితరులకు పాలుఁబీదుకువాఁడు. అసురలచే భూమీ మరల పాలంబీదుకబడినదనీ విందుము. ఆ యసురులు ఆయస పాత్రను దెచ్చిరి. వారు పొందినవి మాయలు (క్షీరము). ప్రహ్లాదుని కుమారుఁడు యశస్వియన విరో చనుఁడు వత్సము. ప్రతిర్లిమూర్ఖుఁడు (?) దైత్యులకు దోర్ట. వారు మాయ యను క్షీరము నొంది మాయావులయిరి. మహావీరులయిన వారు పరమబలకరమయిన మాయచే వర్తింతురు. తక్షకుని వత్సముగా చేసి నాగులు భూమిని పీవీకిరని విందుము. వారు ఆలాబు' పాత్రమును దెచ్చిరి. వారు విషమును క్షీరముగా భూమి నుండి పీవీకిరి. వారికి వాసుకి దేగ్గ. ఆతఁడు కాద్రవేయుఁడు ప్రతాపవంతుఁ డు. ఓ ద్విజశ్రేష్ట! ఆ వ్యక్తులు ఆ ఉగ్ర విషముతో జీవింతురు. వారు మహాకాయులు. అత్యధికముగా విషము గలవారు. ఆ విషమే వారికి అన్నము. దాని వలననే వారు వీర్యవంతులు. ఆమ పాత్రలో యక్షులచే పుణ్యజనులచే భూమి మరల పిదుకంబడెను.
వైశ్రవణుని వత్సముగా జేసిరి. ఆ వైశ్రవణుఁడు అంతర్జానప్రియుఁడు. దోద్ద రజతనాభుఁడు. ఈతని కుమారుఁడు మణిధరుఁడు యక్షాత్మజుండు మహాతేజుండు, వశీ మరియు మహాయశస్వి ఇది పరమార్థతయా సత్యము. ఏలయన పోరు దానితోడనే బ్రతుకుదురు (కనఁబడకుండ అంతర్థానము నొందుచుందురు). రాక్షసులు, పిశాచములు మరల భూమిని పీదికిరి. వారికి దోద్ద కుబేరుడు. బ్రాహ్మి యొక్క బ్రహ్మయు బలవంతుఁడయిన సుమాలి .వత్సము. ఇంక క్షీరమో రక్తము. కపాల పాత్రలో పీపుకబడినది. అంతర్గాన (శక్తి) ని రాక్షసులు పీదికిరి. అన్నీ విధముల రాక్షసులు ఆ క్షీరముతోడనే వర్తింతురు. (జీవింతురు) గంధర్వులు, ఉరగులు, భూమిని మరల పద్మపాత్రలో పాలు .షీదీకిరి. వారు చిత్రరథుని వత్సముగా చేసిరీ. పాలు శుచిముంతములయిన పరిమళ గంధములు. వారికి దోగ్గ వసురుచి. ఈ వసురుచి యొక మునీ కుమారుఁడు ఈ వసురుచి గంధర్వరాజు అతిబలుఁడు. మహాత్ముఁడు, సూర్య సదృశ్యుడు. మరల శైలములు వసుంధరను మరల పాలంబిదికెనని విందుము. దోగ్ధ మేరుమహాగిరి. వత్సము హిమవంతుఁడు. పాత్రము శైలమే యయ్యెను. అందుచేతనే శైలములు సుప్రతిష్ఠితములు. వృక్షములు, లతలు, భూమిని పాలంబిదికినవనీ మరల విందుము. పాలేశమును పాత్రగా బూనిరి. ఆ పొలాశము నరుకబడినను .దగ్గమయినను మరల మొలకెత్తును. ఇక వత్సము. సృష్టించిన శాలము.పక్షము వారు కోరినట్లుగా భూమి కామధుక్ పాలొసంగెను.ఈ విధముగా సర్వకామదుఘ యైన దోగ్రీ, భూమి, భూతభావిని. అయ్యదీయే ధాత్రి, విధాత్రి, ధారణీ వసుంధరా లోకహితము కొఱకు పృథు మహారాజుచే భూమి పిదుకబడినదని విందుము. అయ్యది చరాచర లోకమునకు ప్రతిష్టాకరమైన (యోని) జన్మ స్థానము.
ఇది పోయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహా పురాణమున పూర్వభాగమున ద్వీతీయానుషంగపాదమున శేషమన్వంతరాఖ్యానము, పృథివీ దోహనమను ముప్పదియారవ అధ్యాయము.
