1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
22 - దేవగ్రహానుకీర్తనము
సూత ఉవాచ :-
ఋషయః ఊచుః :-
సూత ఉవాచ :-
సూతుఁడు చెప్పెను.
స్వాయంభువమనుసృష్టియందలి అన్నీ మన్వంతరములు వ్యాఖ్యానింపఁబడినవి. ఇంక నేను క్రమముగా భవిష్యత్మన్వంతరములను చేప్పెదను. ఆ పలుకులు వినీ సూర్యునీయొక్క చంద్రునియొక్క గ్రహముల యొక్క గతినీ (చారమును) ఋషులు రోమహర్షణునీ (సూతుని) అడీగిరీ. (2) ఋషులు ఇట్లనిరి.
ఈ జ్యోతిర్మండలము సంకర్షణముకాని, సాంకర్యముకానీ, వ్యూహ నిర్మాణముకాని లేకుండ ధ్రువమండలముచుట్టు ఎట్లు భ్రమించుచున్నవి? (3) ఎవ్వఁడయిన యొకఁడు వానినీ భ్రమింప (చలింప) చేయునా? లేక. యవియే స్వయముగా భ్రమించునా? ఓ ఉత్తమ పురుషా ! దీనిని మే మేలుంగఁ గోరుచున్నాము మా కొఱకు దీనిని వివరింపుము. (4) సూతుఁడిట్లనియెను, సర్వ ప్రజానీకమును మోహింపఁజేయునదిది. నేను చెప్పెదను వినుడు. ఇయ్యది (ఈ జ్యోతిగ్రహాదుల గమనము) ప్రత్యక్షము దృశ్యమును నయినను ప్రజలను సంమోహపరచును. (5) నాలుగు దిక్కులకు ప్రకాశమును వ్యాపింపచేయును, ఆ నక్షత్రము శింశుమారము యొక్క పుచ్చమున వ్యవస్థితమై యున్నది. అది ధ్రువుఁడు. ఉత్తానపాదుని పుత్రుఁడు. అయ్యదీయే ప్రధానమైన; ఆధారము. దానికే అన్నీ నక్షత్రములు గ్రహములు ఆకాశమున అనుబంధింపఁబడియున్నవి. (6) ఆతఁడే (ఆ ధ్రువ నక్షత్రమే) చంద్రునీ, సూర్యుని, గ్రహములతో సహా భ్రమింపఁజేయును. అయ్యది చక్రమువలె భ్రమీంచుచుండ నక్షత్రములు కూడ దానీ ననుసరించి తిరుగును. (7) జ్యోతిర్గణములు అన్నియును, సూర్యుడు, చంద్రుఁడు తారలు నక్షత్రములు గ్రహములతో సహా ధ్రువుని ఇచ్చపై మనస్సు ననుసరించి చలించును. (8) అయ్యవి వాతానీకమయ బంధములచేతనువలె ధ్రువునకు బద్దములై యున్నవి. వానీ యోగములు, భేదములు, కాలము, సంచారము, ఉదయము, అస్తమయము, ఉత్పాతములు, దక్షిణోత్తర యానములు విషువత్తులు, గ్రహముల యొక్క వర్ణములు అన్నియును ధ్రువుని వలననే కలుగును. (10)
ప్రజలకు వరము, వేడిమి, మంచుపడుట, పగలు, రాత్రి, సంధ్య, శుభము, అశుభము మొదలగునవి యన్నియు ధ్రువుని వలననే సత్యముగా సంభవించును. (11) ధ్రువునిచే నధిస్థితుఁడయి సూర్యుఁడు నీటిని స్వీకరించును. మరియు వర్షించును. ప్రకాశవంతములయిన కిరణములు గల సూర్యుఁడు ప్రపంచనాశనమునకయిన కాలాన్నీ, ఓ బ్రాహ్మణులారా ! సూర్యుఁడు తన పరిభ్రమణక్రమములో దీక్కులను ప్రకాశింపఁజేయును. సూర్యుఁడు పోయువుచే నంతటను కూడిన తన కిరణజాలముతో ప్రపంచమందలి జలము నంతటిని గ్రహించును. ఓ ద్విజసత్తములారా ! సూర్యుడు త్రాగిన నీటినంతటినీ చంద్రుడు సంక్రమింపఁజేసికొనును. (14) వాయువుచే కూడియున్న నాడులచే లోకధార ప్రవర్తించును. సోముని నుండి స్రవించునీరు అన్నములందేయుండును. (మొక్కల యందు, అన్నము కొఱకయిన పంటలయందుండును.) (15) వాయువుల తాకిడిచే మేఘములు భూమియందు నీటిని విసర్జించును (కురియును). ఈ విధముగా జలము మాటిమాటికి పైకీ (ఆవిరి రూపమున) తేబడును మరల వర్షరూపమున క్రిందభూమిపై పడవేయ (కురీయ) బడును. (16) ఉదకమునకు నాశము లేదు. ఆ నీరే పరివర్తనము చెందును, ఇయ్యది సర్వలోక సంధారణార్థము ఈ మాయ పరమేశ్వరునిచే నిర్మింపబడినది. (17) ఈ మాయంచేతనే సచరాచరమయిన మూడు లోకములు వ్యాపింపఁబడినవి. సూర్యుడు విశ్వేశుఁడు ఆతఁడే లోకముల సృజించెను. సహస్రనయనుఁడై యాతడే ఈ సర్వ ప్రపంచమునకు ప్రభువు. సృష్టికర్త. ఆతఁడే ప్రజాపతి, ఆకాశమున సోముని నుండి సంసవించిన నీరు ఐయలువెడలును. సర్వప్రపంచమునీరు యావత్ర పంచము సోముడు (చంద్రుడు) ఆధారముగా గలిగినది. ఇది తధ్యము. సత్యముగా ప్రకీర్తింపఁబడినది. సూర్యుని నుండి ఉష్ణము సోమునివలన శీతము (చల్లందనము) ప్రసరించును. (20)
శీతోష్ణవీర్యులయిన చంద్రసూర్యులు వారిరువురీయొక్క సంయుక్తిచే (సంయోగముచే) ప్రపంచమును పాలించుచున్నారు ధరించు చున్నారు, సోమాధారమైన గంగానది పవిత్రమయినది. (21) విమలోదకములు గలది. ఓ బ్రాహ్మణులారా! భద్రసోమ నదితో ప్రారంభించి పురోగమించిన మహానదులు సర్వభూతముల యొక్క (చరాచరములయిన) శరీరములందు ప్రవహించు నీరములు అగును. చరాచర పదార్థములు సందహ్యమానములు కాగా నవి సర్వత్ర పొగలై అంతట నీటిని వెలువరచును. (23) దానివలన మేఘములు పుట్టును. స్థానమయిన జలము అభమయము (మేఘమయమని) గ్రహింపవలయును. (నీరంతయు మేఘమయమనుట), సూర్యుడు తన కిరణములతో సర్వభూతముల నుండి నీటిని గ్రహించును. (24) వాయు సంయోగముచే సముద్రము నుండి సూర్య కిరణములు నీటిని వహించును. (గ్రహించును.) ఆ నీరమే సస్యములకు సంజీవనము ప్రాణములనిచ్చునది అదియే అమృతోపముము. (25) అంత, ఋతువు సకాలమున రాగా సూర్యుఁడు నీటిని తీయ్యని జలముగా మార్చి మేఘములకు తన శుక్లాలి శుక్ల కీరణముల ద్వారా యొసంగును. (26) వాయు ప్రేరితములై మేఘములు వానియందుంచబడిన నీటిని క్రిందకు విడుచును (వర్షించును). సర్వభూతములపోతమునకై వాయుమిశ్రములై యా మేఘములు అంతటవ్యాపించును. (27) సర్వభూత వివృద్ధి కొఱకు (అభ్యుదయము కొఱకు) ఆరు మాసములు వర్షించును. పిడుగుల వంటి మేఘగర్జనము వాయు సంబంధమైనది. విద్యుత్తు అగ్నివలన కలిగినది. మేఘశబ్దము తడుపు అను నర్థముగల మీదో అనే ధాతువు వలన నేర్పడుచున్నది. భ్రంశమును జెందవు గాన బుధులు (విద్వాంసులు) మేఘము నభ్రముగా నేఱుంగుదురు. ఏలయన నీరు క్రిందకు భ్రంశము కాదు. కనుక ! మేఘముల యుత్పత్తి మరల త్రివిధము వాని యొక్క జన్మ స్థానమును బట్టి అవి మూడు విధములు. అవి ఆగ్నేయములు, బ్రహ్మజములు, పక్షజములు - అనునవి పృథగ్విధములు. (30)
త్రివిధమయిన మేఘముల గూర్చి చెప్పఁబడినది. వానీయొక్క యుత్పత్తిని గూర్చి వచించెదను. ఆగ్నేయములు ఉష్ణము నుండి అనబడినవి. అయ్యవి ధూమమును ప్రవర్తింపఁజేయును. (ధూమము = ఆవిరి). (31) చల్లనిగాలులు, దుర్దినము (మేఘచ్చన్నదీనము) లందలి గాలులు - పై వాని గుణములు. అయ్యవి మహిషముల యొక్క అడవి పందుల యొక్క మత్తమాతంగముల యొక్క ఆకారములను పొందును. ఆ రూపములను దాల్చి భూమి కరుదెంచీ, క్రీడించును. అందందు సంచరించును. వానిని జీమూతములందురు. ప్రాణికోటి ఈ జీమూత మేఘముల నుండి సంభవించును. (33) విద్యుద్గుణవిహీనములు జలధారచే క్రిందకు వ్రేలాడును, అయ్యవి శబ్దింపవు. మూక మేఘములు. అయ్యవి ఆవహమనెడి ఒకానొకవిధవాయు వశము నందుండును. అవియొక క్రోశ మాత్రమే క్రోశార్థ మాత్రమే వర్షించును. అవీ పర్వత శిఖరముల యందు వర్షించును. గర్జించును. (35) ఆ మేఘములకు బ్రహ్మజములని పేరు. అవి బ్రహ్మయొక్క నిశ్వాసము నుండి పుట్టినవి. అవి బలాకలను నోకజాతి కొంగలకు గర్భమును గలిగించును. అయ్యవి (బలాకలు). గర్భమును ధరించును. (36) అవి విద్యుద్దడో పేతములు. ప్రియములైన గర్జనలను చేయునట్టివి. ఆ మేఘముల యొక్క నీరంతర ప్రణాదముచే (గర్జనచే) భూమి తనయందు పుట్టిన మొక్కలు మొలకలను రోమాంచము నొందును. (37) రాజ్యాభిషిక్తురాలయిన రాజ్ఞవలె (భూమి) పునర్యౌవసము నందును, ఆ వర్షా కాలపు మేఘముల యందాసక్తయే భూమి సర్వజీవీతములకు జీవితకారణమగును. (38) ఆ మేఘములు ప్రవహమను రెండవ విధమయిన, వాయువు నాశ్రయించును. ఈ మేఘములు 12 నుండి 18 కిలో మీటర్ల వరకు (యోజనము, యోజనార్థము) వర్షించును. (39) పుష్పరావర్తకము లను నామము గల మేఘములు వాయువు. నుండి పుట్టినవి. వాని వృష్టి. గర్భము అది త్రివిధము. నిరంతరధారాపాతముగ నుండును. (40)
మిక్కిలి శక్తిమంతములు, యధేచ్చగా పోవు శక్తి గలవీ, మిక్కిలి వృద్ధి పొందినవియునగు పర్వతము లేవికలవో వాని రెక్కలు భూతములకు శుభముగోరు ఇంద్రునిచే ఛిన్నములయినవి. పుష్కరములను పేరుగల యా మేఘములు (ఈ రెక్కల నుండి పుట్టినవి). అవి నీటితో మాత్సర్యము వహించి స్వరూపమున వృద్ధి పొందినవి. అందుచేతనే యవి పుష్కరావర్తకములని పేరొందినవి. (భ్రమించు పుష్కరములు జలములు). (42) అవి నానా రూపములను ధరించినవి. అవీ మహాఘోరముగా గర్జించును. కల్పాంతమందు కుంభవృష్టి నయ్యవి సృష్టించును. అయ్యవి సంవర్తాగ్నిని నియమించును. (ప్రపంచమును దహించు అగ్ని సంవర్తాగ్ని). (43) ఆ మేఘములు యుగాంతమునందు వర్షించును. అవి తృతీయములైన మేఘములుగా గణింపఁబడినవి. వానికనేక రూప సంస్థానములు గలవు. అయ్యవీ ప్రపంచమునంతటిని ముంచెత్తును. (44) అవి వాయువును ముందుగా వహించిపోవును. అట్లుండి అవి కల్పసాధకములు. అండకల్పములు భిన్నమయిన భూమ్యండము యొక్క ముక్కలు. (ప్రకృతి నుండి ఆవిర్భవించినవి). అవి బ్రహ్మాండము భిన్నముగాగా సముత్పన్నములు. చతుర్వక్రుఁడు స్వయంభువుఁడునయిన బ్రహ్మ అందుద్భవమొందెను. ఆ విశ్వాండము యొక్క భిన్నములయిన కపాలములు మేఘములుగా కీర్తింపఁబడినవి. (46) వాని కన్నింటికిని ధూమము సంవృద్ధికి అనుకూలమయినది, ఈ ఆనుకూల్యమున భేదము (విశేషము)లేదు. వానిలో మిక్కిలి శ్రేష్ఠమయినదీ పర్జన్యము, దిగ్గజములు నాలుగు ఏనుగులు, మేఘములు, సర్పములు, పర్వతములు వేరువేరయినను, వీనియొక్క కులము యోని (జన్మస్థానము) జలముగా నేుంగవలెను. (47,48) సస్య ప్రవృద్ధికి ఆదేశింపఁబడి, (మొక్కలు చెట్లు వృద్ధి పొందుటకు) పర్జన్య మేఘములు దిగ్గజములు హేమంతమున శీతసంభవములై తుషారమును వర్షించును. (49) వానీకి ఆరవదీయైన పరీవాహ నామక వాయువు ఆధారము. భగవద్రూపమైన యీ వాయువు ఆకాశ గంగను భరించును. ఆ యాకాశ గంగ యొక్కటీయే అమృత తుల్యమయిన నీరములు గలిగిన పవిత్రనది.
గంగానది ఆకాశమున స్వాతిపథమున మూఁడుపాయలుగా నున్నది. దీగ్గజములు తమ పృథువులైన (పెద్దవియైన) తొండములతో గంగనుండి నిష్యందములయిన తోయములను గ్రహించి, వానిని నీటి తుంపరలుగా వెదజల్లును, వానినే నీహార బిందువులని యందురు. (50,52) దక్షిణ మండలమున హేమకూటమను ఒక పర్వతము కలదు. హిమాలయములకు ఉత్తరమున ఉత్తర దక్షిణములకు విస్తరించియున్న యొక నగరము పుండ్లకమనునదికలదు. (53) దానిమీఁదపడు వరము తుషారబిందువులు కలిగినది. అంత ‘వహ’ (ఆవహ) అను వాయువు హిమాలయములపై ఆ మహా పర్వతముపై నీటిని వెదజల్లుచు వీచును, తన ప్రయత్నము చేతనే (ఆత్మయోగేన) ఆ పర్వతము నయ్యది తన స్వాధీనములోనికి తీసికొని వచ్చును. హిమాలయములను దాటిన తరువాత మిగిలిన వర్షపు నీటిని పశ్చిమ భాగము యొక్క అభివృద్ధి కయ్యదియుప యోగించును. (54,56) ఈ విధముగా ద్వివిధములయిన వర్షములు ద్వీవిధములయిన సస్యముల వృద్ధి కొఱకు సమాఖ్యాతములయినవి. మేఘములు వివిధ వస్తు సమృద్ధికి సలుపు వ్యాపారము కీర్తింపఁబడినది. సూర్యుడే వృష్టికి స్రష్టగా నిరూపింపబడుచున్నాఁడు. (57) వర్షజలము సూర్యమూలమై సూర్యునిచే కలుగుచున్నది. ఇదీ ధ్రువునిచే నధిష్ఠితము. సూర్యుఁడు వృష్టి కొఱకు ప్రవర్తించును. (58) ధ్రువునిచే నధిష్టితమయిన వాయువు మరల వృష్టిని ఉపసంహరించును. గ్రహము సూర్యుని నుండి వచ్చును, యావత్ నక్షత్రమండలమునను చరించును. తుదిని ధ్రువునిచే సమధిష్ఠితమయిన సూర్యుని ప్రవేశించును. అప్పటి నుండి సూర్యునియొక్క రథ సన్నివేశమును అవగాహనము చేసికొనుము. (60)
భగవంతుఁడైన సూర్యుఁడు హిరణ్మయమయిన రథమున బయలుదేరును. దానికి ఒకే చక్రము; ఆ చక్రమునకు (అరలు) ఆకులు ఐదు; మూఁడు నాభులు; ఆరువిధములైన ఒకే పట్టా. ఆ పట్టాకు ఆరు నోములు; ఆ రథపు గుఱ్ఱములు. ఆకుపచ్చనివి, ఆ రథము అష్టాపదము (బంగారము)చే నిర్మితము. మిక్కిలి కాంతితో ప్రకాశించును. (62) ఆ రథము యొక్క ఆయతనము (పరిధి) దశ సహస్ర యోజనముల విస్తారము. (ఒక యోజనము 12 కి.మీ) దాని ధ్వజము (ఈషాదండము) యొక్క ప్రమాణము రథమునకన్న రెండింతలు! (63) ఆతని రథము దివ్యము కాంచనయుతము. వాయువుతో సమాన వేగముగల గుఱ్ఱములు దానికి పూన్చబడినవి. దాని కెచ్చటను అడ్డంకి లేదు. అదీ నిరాఘాటగతి కలిగినది. అయ్యది బ్రహ్మచే నొక ప్రత్యేక ప్రయోజనముద్దేశించి సృజింపఁబడినది. (64) ఛందస్సులు (వేదముల గాదులు శ్లోకశిల్పము) స్వయముగా నశ్వరూపములు ధరించినవి. చక్రమున్నదీశకే స్థితములు. వరుణుని రథ లక్షణములతో సదృశమయిన లక్షణము లీస్యందనమునకు కలవు. (65) ప్రకాశవంతమయిన యీ రథము యొక్క సహాయమున సూర్యుడు ఆకాశమున ప్రయాణించును. క్రింద వివరింపఁబడునవి ఆ రథము యొక్క ప్రత్యంగములు. దాని భాగములన్నియు సంవత్సరావయములతో చేయబడినవి. ఒకరోజు సూర్య రథము యొక్క యొక ఇరుసుగా (నాభిగా) గణింపఁబడినది. పంచ ఋతువులు (ఆర్తవములు) దాని (బండి ఆకులు) అరలు. ఆరు ఋతువులు దాని యొక్క పట్టా, దానిని రథము యొక్క అంతరాసనముగా స్మరింతురు. రెండు అయనములు రెండు (67,68) ముహూర్తములు నోగళ్లు రమ్యములై బంధురములైన కళలు కొష్ట దానియొక్క నాసిక, దానియొక్క అక్షదండము క్షణము. (69) నిమేషము అనుకరము లవములు దానియొక్క కూబరములు. రాత్రి దాని కర్ర కవచము. ధర్మము దాని యొక్క ఎత్తైన ధ్వజము. (70)
యుగము, అక్షకోటి అర్థకామములుగా స్మరింపఁబడినవి. ఇవి కాడి యొక్కయు ఇరుసు యొక్కయు కొనలు, సప్తాశ్వరూపమున నున్న వేదచందములు వామభాగము నుండీ ధ్రువమును (కాడిని) వహించును. (71) సప్తచ్ఛందములు - గాయత్రీ తిష్టుభ్, అనుషుప్, జగతి, పంక్తి, బృహతి మరియు ఉషిక్. (72) చక్రము అక్షము నందు నిబద్ధీంపఁబడినది; అక్షము ద్రుపము నందు సమిరతము; అక్షము చక్రముతో సహా భ్రమించును. మరి ధ్రువము అక్షముతో సహ పరిభ్రమించును. (73) ధ్రువముచే ప్రచోదింపఁబడీ ఇరుసు వెంటనే (అనుసరించి) చక్రము భ్రమణము చేయును. ప్రత్యేక ప్రయోజనమును బట్టి ఇట్టేది రథము యొక్క సన్నివేశము (నిర్మాణము) (74) ఆవిధముగనే సంయోగ భావముతో భాసురమయిన రథము కూర్పఁబడినది. ఆ ప్రకాశవంతమయిన రథముచే భగవానుఁడగు సూర్యుఁడు ఆకాశము నంతటిని ప్రయాణించును. (75) ఆ రథము యొక్క ఇరుసునకు, కాడియొక్క రెండు చివరలకు కట్టబడి రెండు పగ్గముల రశ్ములు కలవు. ఆ రెండు పగ్గములు ధ్రువము నందు తిరిగి, రెండు చక్రముల కార్యమును నాచరించును. (76) ఆకాశమున వలయములుగా పరిభ్రమించు, రథము యొక్క ఇరుసుదండము, ఇరుసుల యొక్క చివరలు, ధ్రువముచే గట్టిగా పట్టుకొనఁబడి యుండును. ఆ రెండు పగ్గముల త్రాళ్లు ఇరుసుపై తీరుగును, అవి ధ్రువము ననుసరించును. ఆ ధ్రువుఁడు కూడ తీరుగును. (77,78) రథము యొక్క ఇరుసు ఇరుసు దండము యొక్క తుదిభాగముల, ఒక గసికకు (మేకునకు) పగ్గములతో కట్టఁబడిన త్రాటివలే అంతటను భ్రమణము చెందును. (79) ఉత్తరాయణమున ఆ పగ్గముల వంటి త్రాళ్లు పొడవునందు తగ్గును. దానికి కారణమయ్యవి వలయములలో తిరుగుట. దక్షిణాయనమున వాని పొడవు హెచ్చును. (80)
యుగమునకు అక్షకోటికిఁ గట్టఁబడిన పగ్గములు రెండుఁ (రెయిన్ కోర్ట్స్) దృఢముగా ధ్రువముచే పట్టుకొనఁబడి యుండును. ఆ రెండు పగ్గములు సూర్యుని నడిపించును. ధ్రువునిచే సమధిష్టితము అయినప్పుడు, ఆ రెండు పగ్గముల వంటి త్రాళ్లు లాగబడును. అప్పుడు, తన మండలములను సూర్యుఁడు వలయాకారముగ పరిభ్రమించును. (82) కొష్ఠముల మధ్యనున్న అంతరము అశీతి మండల శతము. ధ్రువునిచే ఆ పగ్గపు త్రాళ్లు వదులు చేయబడినప్పుడు (విడువబడినప్పుడు) తనమండలమునకు బాహ్యమున సూర్యుఁడు మరల నొకసారి వలయములలో భ్రమించును. అయ్యది చుట్టును వేగమును పెంచుచు వలయములలో తిరుగును.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ పురాణములో పూర్వభాగమందు, ద్వితీయానుషంగపాదమున దేవగ్రహానుకీర్తనమున ఇరువది రెండవ అధ్యాయము
