1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
30 - యజ్ఞక్రియా ప్రవర్తనము యొక్కఆరంభము (యజ్ఞనిరసనముచే వసురాజుయొక్కపతనము)
శాంశపాయనీ రువాచ :-
శాంశపాయనుఁడిట్లు చెప్పెను :
త్రేతాయుగారంభమున స్వాయంభువ మన్వంతరమున పూర్వము యజ్ఞములయొక్క ఆరంభమెట్లు జరిగినది. దానిని నాకు యథావత్తు చెప్పుము. (సంధ్య - రెండు యుగముల మధ్యకాలము) కృతయుగముతో సంధ్య అంతర్షితము కాగా (జరిగిపోగా) త్రేతా యుగారంభమున ‘కాలాఖ్య’ము ఆరంభముకాగా, వర్షము యొక్క సృష్టి ఆరంభమయి ఔషధముల యొక్క మొక్కల యొక్క పుట్టుక ఆరంభమగుడు వ్యవసాయము కృషి పూర్తిగా సంస్థాపితమయినది. ప్రజలు గృహస్థాశ్రమమున ప్రతిష్ఠితులయిరి. వర్ణాశ్రమ విభజనము ప్రవృత్తముయ్యెను. అట్టి సమయమున సర్వ సంభారములను సమకూర్చుకొని యెట్లు యజ్ఞమారంభమయ్యెను? (4) దానిని విని సూతుఁడిట్లు చెప్పెను. ఓ శాంశపాయనా ! త్రేతా యుగము యొక్క ఆరంభమున యజ్ఞమెట్లు ప్రవర్తితమయ్యెనో వినుము. (5) పూర్వము స్వాయంభువమన్వంతరమున యజ్ఞమెట్లు ఆరంభమయినదో అనుపూర్వకముగ చెప్పెదను. రెండు యుగముల మధ్య కాలము అయిన సంధ్య సాగిపోయెను. త్రేతాయుగారంభమున ‘కాలాఖ్య’ వర్తింప ప్రారంభమయ్యెను, వర్షము యొక్క సృష్టి జరిగెను; ఔషధాదుల యొక్క పుట్టుక సంభవించెను. వ్యవసాయము కృషీవలత్వము సంపూర్ణముగా ప్రతిష్ఠితములయ్యెను. గృహస్థాశ్రమమునకు ప్రజలనురక్తులయిరీ. వర్ణవిభజనము, ఆశ్రమవిభజనము జరిగిన తరువాత, మంత్రములు సంతతములయ్యెను. చక్కగా సమకూర్పఁబడెను. పారా మంత్రములను ఇహాముత్ర సుఖప్రదములగు కర్మలయందు ప్రయోగించిరి. అప్పుడు వీశ్వభుక్కయిన ఇంద్రుఁడు యజ్ఞములను ప్రవర్తింపఁజేసెను. (9) దేవతలతో సహితముగా సర్వయజ్ఞసంభారములను సంభృతము చేసికొని యజ్ఞముల (ప్రజలు) ఆరంభించరీ. మహర్షులు విస్తృతమయిన యశ్వమేధము గొప్పగా ప్రవర్తింపఁబడ వచ్చిరి. (10)
అచ్చటకు సమాగతులైన పోరెల్లరు యజ్ఞయాగ్య పశువులతో యజ్ఞము చేయుచున్న వాని నడిగ్రీ. ఋత్విక్కులందరు యజ్ఞ సంబంధమయిన కర్మలయందు వ్యగ్రులైయుండిరి. సామగానముల సామగులు అందరు సుస్వరముతో నిమగ్నులయి యుండిరి, ఆధ్వమ్యులు వెంటనే క్రియా కలాపముల నారంభించిరీ, యజ్ఞమునకు సంపాదింపఁబడిన అర్హమైన పశుసంతతి అంతయు ఖండింపఁబడి కొట్టఁబడగా, అగ్నిహోత్రులయిన బ్రాహ్మణులచే హవిః ప్రదానములు జరుపఁబడుచుండ యజ్ఞభాగముల గ్రహించుటకు క్రమముగా దేవతలందరు ఆహూతులయిరి. ఇందీ యాత్మకులయిన దేవతలందరు యజ్ఞభాగముల స్వీకరించుచుండిరి. (ఇంద్రియాత్మికులు శబ్ద స్పర్శ రస రూప గంధముల కధిదేవతలగు వారందరు). కల్పము యొక్క ఆదియందున్న దేవతల నెల్లరను వీరు (ఋత్విక్కులు - యజ్వులు) పూజించిరి. అధ్వర్యులు, మహర్షులు, సోమరసమును పిండు. (పైషకాలే) కాలమున లేచి నిలువఁబడిరి. దీనములయిన పశుగణములను చూచి, వారందరు (అధ్వర్యులు) సమకూడి “కోఽయం యజ్ఞ విధిస్తవ) ఓ యింద్రా ! నీ యజ్ఞవిధి యెట్టిది అని యడిగిరీ. ఇదీ అధికమైన అధర్మము. పాపయుతము. ఈ యజ్ఞము అహింసాధర్మము నందుఁ గూడిన కోరికచే వ్యాప్తమయినది. ఓ సురోత్తమ ! నీ యజ్ఞము పశువధతో కూడి యున్నది. (17) ఈ పశుహింసచేతను ధర్మము విఘాతము చేయుటకు అధర్మయజ్ఞము ఆరఖమయినది. ఇది ధర్మము కాదు. ఇది అధర్మము. హింస ఎన్నడును ధర్మముగా చెప్పబడదు. (18) ఓ పూజ్యుం డా ! ఆగమము ననుసరించి నీవు యజ్ఞమాచరింపగోరితివేని, విధినిర్దిష్టములయిన విధానములకు వ్యతిరిక్తము కాకుండ యజ్ఞ మాచరింపుము. వేదముల యందు నిర్ణయించిన విధులకనుగుణముగా యజ్ఞము నాచరింపుము. (19) ఓ దేవత శ్రేష్ఠుఁడా! మూడు సంవత్సరముల కాలము యజ్ఞ బీజముల ఉంచవలయును.
అయ్యవి అంకురింపఁకూడదు. (మొలకలు రాగూడదు). అప్పుడు యజ్ఞ మాచరించవలయును. అట్టి బీజముల యందు ప్రాణ నష్టముండనందున హింస యుండదు. ఓ మహాప్రాజ్ఞ, ఇది పూర్వము విరించీ విహిత ధర్మము. తత్య దర్శులయిన ఋషులీ విధముగా విశ్వభుక్కయిన ఇంద్రుని అడిగిరి, (21) అప్పుడు ఇంద్రునకు మహర్పులతో నొక పెద్ద వివాదము జరిగెను. జంగముల చేతను స్థావరముల చేతను (చరాచర జీవులచే) ఏ విధముగా యజ్ఞము జరుపఁబడవలయును? (22) తత్త్వమును వివరించి ఆ మహర్షులు వివాదము చేత మిక్కిలి ఖిన్నులైరీ. ఇంద్రునితో నొక అంగీకారమునకు వచ్చి వారు (ఆ ఋషులు) ఆకాశచరుఁడయిన వసు మహారాజునడిగిరీ. (23) ఓ మహారాజ ! ఓ మహాప్రాజ్ఞ ! యజ్ఞవిధి యెట్లు నీచే చూడఁబడినది? ఓ ప్రభూ ! ఉత్తానపాద కుమార ! వివరించి మా సంశయమును రూపు మాపుము, (24) వసువు ఆ ఋషుల వాక్యములను వినెను. ఆ వసువు బలాబలములనుం మంచి చెడ్డలను విమర్శింపకుండగనే, వేదశాస్త్రములను మను స్కృతులను అనుసరించి, యజ్ఞతత్త్వమును గూర్చి చెప్పెను. (25) పార్థివుఁడయిన వస్తువు ఇట్లు చెప్పెను. యథోపవీతములయిన (తీసికొని రాబడిన) వస్తువులచే యజ్ఞ మాచరింపవలెను. మేధ్యములయిన పశువులచే లేదా బీజములతో లేదా ఫలములతో యజ్ఞ మాచరించ వలయును. (26) ‘యజ్ఞమునకు హింస సహజము’ ఇది నా ధర్మ నిర్ణయము, అంతీయే కాదు, దర్శన గ్రంథములు ఆగము గ్రంథముల యందు చెప్పం బడినదీదీయే. దేవతలు ఎట్లో అట్లే మంత్రములు కూడ హింసా లింగములు (హింసా సంజ్ఞలు). ఇదియే దీర్ఘకాలము తపసా యుక్తులయిన మహరులచే, హరి దర్శన గ్రంథముల బట్టి తారక గ్రంథముల ననుసరించి, ఇతర మంత్రములను బట్టి చెప్పఁబడినది. (27,28) దాని నాధారముగా ప్రమాణముగా గ్రహించి చెప్పఁబడినది. అందుచే ఓ బ్రాహ్మణులారా ! ఆ మంత్రములను వారి వాక్యములను మీరు ప్రమాణముగా గ్రహించినచో ఓ ఋషులారా ! యజ్ఞములను ప్రవర్తింపనీయుఁడు. అన్యథా యైనచో మీ వచనములసత్యమగును. (29) ఈ విధముగా కృతోత్తరులై, యుక్తాత్ములు, తపోధనులు అవశ్యము జరుగవలయుననుట యెంచి, వాదించుట మానిరి. (30)
ఇట్లు పలికిన వెంటనే వసు నృపతి రసాతలము ప్రవేశించెను. ఊర్ధ్వచారియైన రాజు రసాతల చరుఁడయ్యెను. (ఈ పురాణము ననుసరించి, జంతుహింసను బలపరచుటచే రాజు రసాతలము ప్రవేశించుట జంతుహింస యెంతగా నిషేధింపఁబడినదో వ్యక్తమగుచున్నది.) ఆ వాక్యముచే వసుధాతల వాసియతఁడుయ్యెను. ధర్మవిషయ సంశయముల నిర్ణయించు వసురోజు అధోమోసియ రసాతలగతుఁడయ్యెను. (32) అందుచే, బహు విషయములతో నొకఁడు పరిచితుఁడైనను బహుజుఁడయినను, సంశయ విషయమున నొక్కడేదియును చెప్పరాదు. ధర్మము బహు ద్వారములు గలది, ధర్మము యొక్క సూక్ష్మభావగ్రహణము అవశ్యమైనదీ. (33) అందుచే నొక్కనిచే ధర్మ విషయమున నిశ్చయమిది యని చెప్పుటకు దేవతలకు ఋషులకు శక్యము కాదు. ఈ విషయమున స్వాయంభువ మనువోక్కడే అపవాదము, (34) (జంతు హింసతోఁ గూడిన యజ్ఞాదుల కర్మమార్గము కంటే జ్ఞానము మార్గము యొక్క శ్రేష్ఠత్వము చెప్పఁబడుచున్నది.) అందుచే ధర్మమునకు ద్వారము అహింసయని మహరులచే చెప్పబడినది. సహస్ర కోటీ మహరులు స్వకీయమయిన తపస్సులచే స్వర్గమున కరిగిరి. (35) అందుచే మహార్పులు దొనమునుగాని యజ్ఞమునుగాని ప్రశంసింపరు. తపోధనులు, ఉంఛవృత్తితో సంపాదించిన మూలములను, ఫలములను, శాకములను, ఉదకపాత్రను వారీ శక్త్యనుసారముగా నిచ్చి స్వర్గలోకమున వారు సుప్రతిష్ఠితులయిరి. అద్రోహము, అలోభము, తపస్సు, భూతదయ, దమము, బ్రహ్మచర్యము, సత్యము, అనుక్రోశము (డాలీ) క్షమ, ధృతీ ధైర్యము) ఇవియన్నియు సనాతన ధర్మమునకు మూలములు. వానిని సాధించుట కష్టము. (38) చాలామంది అనఘులు బ్రాహ్మణక్షత్రియాదులు తపస్సిద్ధులున్నారని వినబడుచున్నది (తెలియుచున్నది). వారు ప్రియవ్రతుఁడు, ఉత్తానపాదుం డు, ధ్రువుఁడు, మేధాతిథి వసువు, సుధాముఁడు, విరజుఁడు, శంఖుఁడు, పాండ్యజుఁడు, ప్రాచీనబర్షి పర్జన్యుఁడు, హవిరానుఁడు మొదలగు రాజులు. (40)
వారి వారి తపస్సులచే దీవమును పొందిన వారెందరో ఉన్నారు. వారు రాజర్షులు, మహాసత్త్వులు. వారి కీర్తి సుప్రతిష్ఠితము. (41) అందుచే అన్ని కారణములచే, తపస్సు యజ్ఞము కంటే శ్రేష్ఠము. తపస్సు చేతనే బ్రహ్మచే ఈ సమస్త విశ్వము పూర్వము సృజింపఁబడినది. (42) అందుచే యజ్ఞము తపస్సు ననుసరింపదు. ఈ ప్రపంచమంతయును తపో మూలము. యజ్ఞ సంభారములు, మంత్రములు యజ్ఞమునకు మూలములు. (ద్రవ్యమంత్రాత్మకము. యజ్ఞము). తపస్సు అనశనాత్మకము. (ఆహార విసర్జన మనశనము). (43) యజ్ఞము నాచరించుట వలన దేవతలను పొందును. తపస్సు వలన ‘వైరాజ’ మొందును, కర్మ సన్న్యాసము వలన (సర్వ కామ్య వస్తు పరిత్యాగము) బ్రాహ్మకర్మ సాధింతురు. ప్రకృతి యొక్క విజయము వైరాగ్యము వలన గలుగును. (44) జ్ఞానము వలన కైవల్యము నొకడు పొందును. ఇది ఐదుగతులు మార్గములు చెప్పఁబడినవి. ఈ విధముగా దేవతలకు ఋషులకు మధ్య యజ్ఞమునుగూర్చీ పెద్ద వివాదము జరిగెను. పూర్వము స్వాయంభువ మన్వంతరమున నీ వివాదము జరిగెను. ఋషీశ్వరులు వసురాజును చూచిరి. ధర్మ బిలముచే సాతఁడు హతుఁడాయ్యెను. ముని సంఘములు వెడలిపోయెను. దేవతలు యజ్ఞమాచరించిరి. స్వాయంభువమన్వంతరమున నీ రీతిగా యజ్ఞము ప్రారంభమయ్యెను. యుగ క్రమమున నీ యజ్ఞము వివర్తితమయినది. పరిణామమును పొందినది.
ఇదీ పొయుప్రోక్తమయిన శ్రీ బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున ద్వితీయానుషంగపాదమున యజ్ఞారంభమనెడి ముప్పదవ అధ్యాయము.
