1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
23 - ధ్రువచర్యాకీర్తనము
సూత ఉవాచ :-
సూతుఁడు చెప్పెను.
ఆ రథము దేవతలచే, ఆదిత్యులచే, మునులచే, గంధర్వులచే, అప్సరసలచే గ్రామణులచే, సర్పములచే, రాక్షసులచే అధిష్టితమై యున్నది. (1) వీరు సూర్యునియందు ఒక్కోక్కరు క్రమముగా రెండేసి రెండేసి మాసములు నివసింతురు. ఈ క్రింద నుదాహరింపఁబడిన వారు సూర్యుని యందు అవిచ్చిన్నముగా చైత్ర వైశాఖ మాసములలో నివసింతురు - ధాత, అర్యముడు, పులస్త్యుఁడు, పులహుడు; ప్రజాపతి, సర్పములయిన వాసుకి, ఐరావతము, కంసుఁడు, భీముఁడు; (వీరిరువురు), రథకృత్తు; రథోజసుఁడు - ఈ యిరువురు యక్షులుగా చెప్పబడిరి. (3) గంధర్వులుతుంబురుఁడు, నారదుఁడు; దేవతా వేశ్యలు - సుస్థల, పుంజికస్థల; (రక్షక - రాక్షసులు) హేతీయు, ప్రహేలీయు - వీరిద్దరు యాతు ధానులలో పేర్కొనబడిరి. (2,5) ఈ క్రింది పోరు సూర్యనిలో శుచి, శుక్రమాసములలో అనఁగా జ్యేష్ణాషధములలో, నివసింతురు; దేవతలయన మీత్రావరుణులు; మునిత్రయమయిన అత్రియు ప్రఖ్యాతుఁడు, పసిష్ణుండు; అప్సరసలైన సహజన్య, మేనకలు; పౌరషేయుఁడు, వధుఁడును; వీరిరువురు రాక్షసులుగా ప్రఖ్యాతిగనిరి; హాహా హాహూ అను గంధర్వులు; (యజుఁడుకాదు) యక్షుఁడు; రథస్వనుఁడు, రథచిత్రుఁడు, వేటికఁడు నాగసాక్షకుఁడు (నాగయను తక్షకుఁడు?) మరియు రంభకుఁడు (56) ఇతర దేవతలు కూడ సూర్యునియందు నివసింతురు. ఈ క్రింది దేవతలు ఇతరులు శ్రావణ భాద్రపద మాసములలో సూర్యునియందు నీవసింతురు. (దైవములు) ఇంద్రుఁడు, వివస్వంతుఁడు; అంగిరుడు, భృగువు (సర్పములు) ఐలపత్ర, శంఖపాలుఁడు; (గంధర్వులు) విశ్వావసు, ఉగ్రసేనుఁడు, శ్వేతుఁడు, అరుణుండును? (అప్సరోద్వయము) ప్రసిద్ధులు ప్రమోచ, అనుక్షౌచము (యాతుధాను లిరువురు) సర్పుడు, ప్యోతుఁడును. (10)
పవిత్రులయిన యితర దేవతలు ఆశ్వయుజ కార్తీకములందు శరద్రుతువున సూర్యునియందు వసింతురు. దేవతలు-పర్జన్యుఁడు, పూష మునులు-భారద్వాజుఁడు గౌతమునితో సహా; గంధర్వులయిన పరవసుడు, సురుచియును. అప్సరసలు - విశ్వాచీ ఘృతాచియు; వీరుభయులు శుభలక్షణులు. ప్రసిద్ద సర్పములు - నాగుడు ఐరావతము, విశ్రుతుడు మరియు ధనంజయుఁడును. సేనానులయిన శ్యేనజిత్తు సుషేణుఁడును; మరియు గ్రామణులు (సేనాధిపతులు) ఆపుఁడు, వాతుఁడు అను రాక్షసద్వయము. వీరందరు సూర్యుని యందు ఆశ్వయుజ కార్తీక మాసములందు వసించెదరు. (12,15) హేమంత ఋతువులో రెండు మాసములు ఈ క్రిందివారు సూర్యునిలో వసింతురు. వారిద్దరు దేవతలు - అంశుఁడు, భగుండు; ఇద్దరు మునులు - కశ్యపుఁడు, క్రతువు; రెండు సర్పములు మహాపద్ముఁడు, కర్కోటకుడును. ఇరువురు గంధర్వులు, చిత్రసేనుఁడు ఉష్ణాయువును; ఇరువురు అప్సరసలు, ఊర్వశి, పూర్వచిత్తీయు; సేనానులు, గ్రామణులు (సేనాధ్యక్షులు) తార్యుఁడు, అరిష్టనేమియు; యాతుధానులనఁబడు ఇరువురు విద్యుత్ఫూర్జుఁడు, శతాయువు; వీరందరు సూర్యునియందు మార్గశిర పుష్యముల యందు వసింతురు. (16, 19) ఈ క్రింది వారు శిశిర ఋతువులోసూర్యుని యందు వసింతురు. వారు దేవతలు త్వష్ట, విష్ణువు; మునులు - జమదగ్ని, విశ్వామిత్రుఁడును. సర్భద్వయము, కంబలుఁడు, అశ్వతరుఁడు. వీరిరువురు కర్రూతనయులు.
గంధర్వద్వయము : ధృతరాష్ట్రుఁడు, సూర్యవర్చసుఁడు. (21) దేవతా వేశ్యలు - తిలోత్తమ, రంభయును బ్రహ్మాపేతుఁడను రాక్షసుండు, ఇఁక విఖ్యాత రాక్షసుఁడయిన యజ్ఞా పేతుండును. గంధర్వులుగా చెప్పఁబడిన ఋతజిత్తు, సత్యజిత్తును. ఓ ముని సత్తములారా ! వీరందరు మాఘ ఫాల్గుణముల యందు సూర్యునీయందు వసింతురు. (23) ఓ ద్విజులారా ! పితరులను, దేవతలను, మనుష్యాదులను, పిల్లప్పుడు పోషించుచు, దీవానీశలకు కారణమయిన సవిత పరివర్తనము చేయుచుండును. (24) ఆ దేవతలు సూర్యునియందు రెండేసి మాసములు క్రమముగా నివసింతురు. ఏడుగురు చొప్పున గణముగా నున్న పండ్రెండు గణములు స్థానాభిమానులు తమ స్థానములయందు పదవులయందు అభిమానము కలవారు. (25) వారందరు సూర్యునియొక్క యుత్తమమైన తేజస్సును వారి తేజోమూలమున వృద్ధి పరచెదరు. వారిచే గ్రథితములయిన {రచింపఁబడిన) - ప్రార్థనలచే - మునీశ్వరులు సూర్యుని స్తోత్రము చేయుదురు. (26) గంధర్వులు అప్సరసలు నృత్యములచే గీతములచే సూర్యునువాసింతురు. గ్రామణులు యక్షులు భూతములు సూర్యకిరణముల పూజనారంభింతురు. (27) సర్పములు సూర్యుని వహించును. రాక్షసులాతని ననుసరింతురు. సూర్యోదయము నుండి అస్తమానము వరకు, వాలఖిల్యులు ఆతనిని పరీవర్తించి ముందునకు బోవుదురు. (28) ఆ దేవతల యొక్క వీర్యము ననుసరించి, తపస్సు ననుసరించి ధర్మము ననుసరించి, యోగము ననుసరించి, సత్యము ననుసరించి, బలము ననుసరించి వీరందరి అధిపతియయిన సూర్యుఁడు కాంతిమంతముగా ప్రకాశించును. వీరందరు సూర్యుని యందు రెండేసి మాసము లుందురు. (29, 30)
ఋషులు, దేవగంధర్వులు, పన్నగులు, అప్సరోగణము, గ్రామణులు, యక్షులు, ముఖ్యముగా యాతుధానులును వీరందరు తపించెదరు వర్షించెదరు; ప్రకాశించెదరు; వీచెదరు; సృజించెదరు,ప్రకీర్తింపఁబడి ప్రాణులయొక్క అశుభంకరమైన కర్మను తోలఁగగొట్టెదరు, (32) వీరు దురితాత్ముల యొక్క శుభ యోగమును తొలగించేడను. కొన్నీకోన్నీ చోట్ల వారు సుచరితుల యొక్క పాపములను తొలగింతురు. (33) దీవసానుగులై వీరందరు సూర్యునితోసహా భ్రమణము చేయుదురు. వారు ప్రజలపై వరింతురు, ఎండచే మార్చెదరు, మరల వారల నానందపరచదేరు. (34) మనువు క్షయించువరకు వారు సర్వభూత జాలములను రక్షించేదరు. మన్వంతరములందు కూడ భవిష్యత్తున భూతమున వర్తమానమున స్థానాభిమానులైన వారికిది (రవి) స్థానము. వీరు ఏడుగురు / ఏడుగురు చొప్పున పదునాలుగు వర్గముల సూర్యుని యందు పదునాలుగు మన్వంతరములందు నివసించెదరు. (36) సూర్యుఁడు గ్రీష్మమున ఉష్ణశక్తిని విమోచనము చేయును; వర్షకాలమున సూర్యుఁడు వర్షమును వెదజల్లును; ఆతఁడే పగళ్ళను రాత్రులను చేయునట్టివాఁడు; ఆతఁడు ఋతువుల ననుసరించి చుట్టుబడిన కిరణములు గలవాడై పయనించును. దేవతలను పితరులను, మానవులను తన కిరణముల ననుకూలముగా వహించి తృప్తి పరచును. (37) సూర్యుడు దేవతలను అమృతముచే చంద్రుని తృప్తి పరచును, సుషుమ్నా యనేడు కిరణములచే సూర్యుడు శుక్లపక్షములో చంద్రుని దీవసక్రముమన పూర్ణునిగా జేయును. ఆ చంద్రుని వృద్ధి చేయుట పున్నమి నాటికి పూర్తిచేయును. దేవతలు ఆయమృత చంద్రుని కృష్ణ పక్షమున దివసక్రమమున త్రాగుదురు. (38) చంద్రునీ యమృతము త్రాగబడిన వెనుక చంద్రుఁడు కృష్ణపక్షమున ఒక్కటి తక్క మిగిలిన కళలను పొగొట్టుకొనును. కృష్ణపక్షము పూర్తికాగా, చంద్రుఁడు తన శిష్ట కిరణము నుండి సుధామృతమును ప్రసరించును. దేవతలు, పితరులు, సౌమ్యులు, కావ్యులు, ఆ సోమామృతమును త్రాగుదురు. (39) ఇంక మానవులు, వర్షముచే నభివృద్ధి పరుపఁబడినట్టివి సూర్యునిచే సముద్ధృతములైనవియునగు ఓషధులచే అన్నపానములచే ఆకలిని జయించెదరు. (40)
శుక్లపక్షమున దేవతలు సుధచే తృప్తి నొందుదురు. ఇంక పితృదేవతలు కృష్ణపక్షమున సుధచే తృప్తి నొందెదరు. సూర్యుఁడు ఎల్లప్పుడును మర్యులను అన్నముచే తృప్తి పరచును. తనకిరణములచే సూర్యుఁడు వారిని ఎండచే తపించి చక్కగా రక్షించును. (41) సూర్యుఁడు హరీ దశ్వములచే మోయబడును. తన హరిణ వర్ణకిరణములచే నీటిని (ఆవిరిగా) హరించును; నీటిని వదులు సమయమున నీటిని విసర్జించును. ఈ విధముగా చేతనాచేతనములయిన చరాచరమును సూర్యుఁడు భరించును. (42) పచ్చని గుఱ్ఱములచే సూర్యుఁడు మోయబడిపోవును. పచ్చని కిరణ సహస్రములచే సూర్యుఁడు నీటిని త్రాగును. హరిదశ్వములచే సముహ్యమానుఁడై తరువాత జలముల ప్రమోచనము చేయును. (43) ఇట్లు ఏకచక్రము గలిగీ తొందరగా పోవు రథముచే అన్ని దిక్కులందు సూర్యుండు సంచరించును. ఆ గుఱ్ఱములు భద్రములు (అపూర్వములైనవి). వానీ క్రమము ఆశ్చర్యకరము. (44) సూర్యుఁడు ఒకే చక్రము గల రథము మీఁద అహోరాత్రములు సప్తద్వీపసప్తసముద్రాంతమైన, సప్తహయములతో తిరుగును. (45) సూర్యరథము ఏడుగుఱ్ఱములచే పూంచబడినది. అయ్యవి వైదికమయిన ఛందోవిభాగములు అశ్వరూపములను ధరించినవి. చక్రమున్నచో నా గుఱ్ఱములు. అవి కామరూపులు. కోరిన రూపమును పొందును. మనోవేగములు. ఒక్కమారే రథమునకెడమ వైపున పూనబడినవి. (46) అయ్యవి హరిత వర్ణములు; అవి నాశములేనివి; ఈశ్వరములు పింగళవర్ణములు బ్రహ్మవాదులు వారీ ననుసరింతురు. ఒక సంవత్సర కాలములో 83 వందల మండల భ్రమణములఁజేయును. (47) ఆ గుర్రములు దివసక్రమమున బాహ్యాభ్యంతర మండలముల భ్రమించును. కల్పారంభమున నవి రథమునకు కట్టఁబడినవి. అవీ సర్వభూత ప్రళయము వఱకు ఆ రథమును వహించును. (48) రాత్రిళ్లు పగళ్లును నవి వాలఖిల్యులచే ఆవృత్తములై భ్రమించును; సూర్యుఁడు ఋషులచే కూర్చబడిన ఉత్తమ ప్రార్థన స్తోత్రములతో స్తుతిజేయబడును. (49) అట్లు పరిభ్రమించుచు సూర్యుడు గీతములచే నృత్యములచే గంధర్వులచే అప్సరసలచే, పతంగములచే పతగములచే సేవింపఁబడును. (50)
సోముని రథమునకు మూడు చక్రములు. ఆతని గుఱ్ఱములు కుందపుష్పనిభములు. అవి కుడి ఎడమల యందు పూంచబడినవి. వీని మూలముననే చంద్రుడు సంచరించును. (51) వీధ్యాశ్రయములయిన (ఆకాశ పథముననున్న) నక్షత్రములను దాటియని (గుఱ్ఱములు) పోవును. ధ్రువాధారముచే నవి రయమును గనును. చంద్రుని యొక్క కీరణముల యొక్క ప్రస్వత్వము వృద్ధిత్వము సూర్యుని కిరణముల వృద్ధి క్షయముల వంటివేయని యెఱుంగవలయును. (52) చంద్రుని రథమునకు ఇరుప్రక్కల గుట్టములతో మూడు చక్రములు. ఆ రథము. గుఱ్ఱములతో సారథితో కూడ అపాంగర్భము నుండి (నీటి గర్భము నుండి) ఉత్పన్నమయినది. (53) ఆ రథమునకు మూడు చక్రములు, ఒక వంద ఆకులు. ఆ రథమునకు ఉత్తములైనవి తెల్లనయినవియునగు పది గుఱ్ఱములు. పూంచబడినవి. ఆ గుఱ్ఱములు కృశీభూతములు (సన్ననైనవి) దివ్యములైనవి. అసంగములు మనోజవము గలవి. (54) అవి యొకే యొకసారి పూంచబడినను యుగక్షయము పర్యంతము దానిని వహించుచునే యుండును. ఆ చిన్ని రథము నందు (సంగృహీత రథమున తెల్లనీ సర్పములు రథమును చుట్టుకొని కలవు? సమాన వర్ణముగల అశ్వములు శంఖధవళములు చంద్రుని వహించును. యజుడు, చండమనసుడు, వృషుడు, వాజి, నరుఁడు, హయుఁడు, ప్రసిద్ధములయిన గవిష్ణుఁడు, హంసుఁడు, వ్యోముం డు, మృగుఁడు అను గుఱ్ఱములు పదీయు చంద్రుని గుఱ్ఱములు (57) ఈ గుఱ్ఱములు దైవమయుని చంద్రుని (శ్రద్దగా) భద్రముగా వహించును. సోముఁడు దేవతల చేతను పితరులచేతను పరీవృతుఁడై పోవును. (58) కృష్ణపక్షాంతమున, శుక్లపక్షారంభమున సూర్యుఁడు పరదిక్కులో (ఎదుటిదశలో) స్థిరముగా నుండ, చంద్రుఁడు దీవసక్రమమున నింపబడును. (59) దేవతలచే సోముని యొక్క శరీరము త్రాగబడగా పదునైదవ దినమున చంద్రుడు ఒకే యొక కళతో అలసిపోవును. సుషుమ్న అనెడు కిరణముచే చంద్రుని యొక భాగమును సూర్యుఁడు (కళతరువాత కళ) ప్రతిదినము నింపును. ఈ విధముగ సుషుమ్న మనెడు కిరణముచే ఆపూర్యమాణములై శుక్లకిరణములు వృద్ధినొందును. (61)
కృష్ణ పక్షములో కళలు తగ్గుచువచ్చును. శుక్లపక్షములో కళలు వృద్ధి పొందును. సూర్యుని యొక్క వీర్యముచే, శక్తిచే, చంద్రుఁడీ విధముగా వృద్ధిపొందును. (62) పూర్ణిమనాడు చంద్రుఁడు కాంతిమంతముగా సంపూర్ణమండలమున కానబడును. శుక్లపక్షమున నీవిధముగా చంద్రుఁ డు దినదినము దినక్రమున వృద్ధి నందును. (63) కృష్ణపక్షమున విదియ నుండి చతుర్దశి వరకు దేవతలు జలసార మయిన చంద్రుని రసమయిన అమృతమును ఆస్వాదింతురు. ఆ పదార్థము రసాత్మకము. ద్రవరూపమయిన చంద్ర సంబంధీ అమృతమును సేవించుచు, దేవతలు సంతోషింతురు. సూర్యుని తేజస్సుచేతనే అమృతరసము (సుధామృతము) మాసార్దములో సంభృతమగును (కూటబెట్టఁబడినదగును). (65) చంద్రుని సుధారసము ఆ దేవతల ఆహారము. సర్వదేవతలు పితరులు సర్వఋషీశ్వరులతో ఒక్కరాత్రి పూర్ణిమ దీనమున దీనిని అనుభవింప సేవింతురు. (66) కృష్ణపక్షారంభమున క్రమముగా పితరులచే, దేవతలచే ఆస్వాదింపఁబడి సూర్యునికభిముఖముగా నున్న చంద్రుని యొక్క కళలు క్రమముగా ప్రక్షీణత్వము నొందును. (67) (ఇది స్పష్టముగా లేదు) ముప్పది ముగ్గురు, మూఁడు వందలు (?) మూగురు, మూడువేలు, మూగురు దేవతలు సోమరసమును త్రాగుదురు. (68) ఈ విధముగా త్రాగబడి కృష్ణపక్షపు కళలు శుక్లపక్షమున వృద్ధిపొందును. అందుచే శుక్లకళలు హెచ్చును. కృష్ణకళలు తగ్గును. (69) ఈ విధముగా చంద్రుడు ప్రతిదినము దేవతలచే త్రాగబడును. ఒక మాసార్థ మీంవిధముగా ఆస్వాదించిన తరువాత దేవతోత్తములు అమావాస్యనాడు వెడలిపోవుదురు. తరువాత పితరులు అమావాస్యనాఁడు చంద్రుని చేరెదరు. అప్పుడు పదియైదవ రోజున, కొద్దిగా కళలు మిగులగా పితృదేవతలు మిగిలిన ఆ శేషమును అపరాష్ట్రమున పొందుదురు. ద్వీలవకాలము (శిష్టమును) శిష్టములయిన చంద్ర కళలను పితృగణములు త్రాగుదురు.
స్వధామృతము అమావాస్యనాఁడు సూర్యుని కిరణముల నుండి స్రవించును. ఆ సుధను తృప్తిగా ఒక మాసము రోజుల త్రాగి పితరులు వెళ్లిపోవుదురు. (73) సుషుమ్న యందు ప్రత్యక్షమయిన ఎండచే చంద్రుఁడు తపింపఁబడును. ఆ విధముగనే కృష్ణపక్షమున చంద్రుని సుధామృతమును సురలు త్రాగుదురు. (74) మూడు విధములయిన పితరులు సౌమ్యులు, బర్హిషదులు, అగ్నిష్వాత్తులు అని కలరు. కావ్యులని యేవరెవరు పిలువం బడిరో వారందరును పితరులే. (75) కావ్యులు సంవత్సరులు; వారే బ్రాహ్మణులచే ‘పంచాబులు’ అని స్మరింపఁబడుదురు. సౌమ్యులను ఋతువులనుగాను, బారిషదులను మాసములుగాను నేఱుంగవలయును. (76) ఓ బ్రాహ్మణులారా ! అగ్నీష్వాత్తులు ఆర్తవులు, వీరు పితృదేవతల సృష్టి. పితరులచే త్రాగబడి, పదీయైదవరోజున, పదునైదవ భాగమయిన చంద్రుని యొక్క కళ, అమావాస్యనాడు తగ్గిపోవును. మరల వచ్చెడు పక్షమున నయ్యది పరిపూర్ణమగును. (78) చంద్రునియొక్క వృద్ధి, క్షయము, పదీయారవ రోజున, పక్షపు ఆరంభముగా గణింతురు. ఈ విధముగా చంద్రుని యందు వృద్ధిక్షయములు సూర్యుని వలనఁగలుగును. (79) ఇక ముందు మరల తారల యొక్క గ్రహముల యొక్క రాహువు యొక్క రథములను వర్ణించెదను. చంద్రుని కుమారుఁడయిన బుధుని రథము తోయము యొక్క తేజస్సుతో కూడినది. ప్రకాశవంతమయినది. (80) భార్గవుని రథము శ్రీమంతము, తేజస్సుతో సూర్యసన్నిభము దానికి మేఘము యొక్క నిస్స్వనము కలదు. దానికొక పతాకము కలదు. ధ్వజము కలదు. ఇతరములయిన పరికరములును కలవు. (81) అయ్యదీ భూమినుండి సంభవములయిన వివిధములయిన వర్ణములతో నొప్పిన గుఱ్ఱములచే పూంచబడినది. దానికీక్రింది పది గుఱ్ఱములు యుక్తములయినవి - శ్వేతవర్ణమయినవి, పిశంగవర్ణము, సారంగవర్ణము, నీలవర్ణము, పీతవర్ణము, విలోహితవర్ణము, కృష్ణవర్ణము, హరితవర్ణము, పృషతవర్ణము, ప్రశ్నివర్ణము. ఆ గుఱ్ఱములు పది, మహాభాగ్యము (అందమైనవి కళ్యాణ లక్షణకలితములు; కృశీభూతములు (చురుకైనవి) (చిక్కినవి కావు); వానికి వాయుజవము గలదు. (83)
కుజుని (భౌముని) యొక్క రథము ఉత్తమమయినది. శ్రీమంతము బంగారుతో జేయబడినది. దానికి అష్టాశ్వములు. అవి సర్వత్ర నిరాఘాటముగ పోగలిగినవియు, అగ్ని సంభవములయినవియు, లోహిత వర్ణములు గలిగినవియునగు కుజుని గుఱ్ఱములు. (వాని రథమున) కుజుఁడు సంచరించును. ఆ గుఱ్ఱములకు ఋజుమార్గముతో సహా వక్రగతి, అనువక్రగతీ (సవ్యము, అపసవ్యములగు గతులు) కలిగినవి. ఆంగిరస వంశమునకు చెందిన బృహస్పతి, విద్వాంసుఁడైన దేవతాచార్యుండు. అంబువుల నుండి పుట్టిన ఎనిమిది దివ్యములయిన గుఱ్ఱములు పూంచబడిన కాంచన స్యందనములో సంచరించును. ఆ గుఱ్ఱములు దీవ్యాశ్వములు, పానికీ వాయువు యొక్క జవము కలదు. ఒక సంవత్సరము నక్షత్రకూటమున నుండి సంవేధయై యా రథముతో ముందునకు సాగిపోవును. (?) (84,86) శని, నల్లని, కార్షాయసముతో (ఇనుముతో) చేయబడిన స్యందనము నధిరోహించి, సంచరించును; ఆ కాలాయస రథమునకు ఆకాశము నుండి పుట్టిన బలీయములయిన గుఱ్ఱములు కలవు. రాహువు యొక్క రథమునకు ఎనిమిది నల్లనైన రంగు కలిగిన గుఱ్ఱములు. అవి మనోజవము కలిగినవి. రాహువు యొక్క రథము తమోమయము. ఆ రథమునకు ఒకేసారి గుఱ్ఱములు కట్టఁబడినవి. ఆ గుఱ్ఱములే చివరి వరకు రథమును వహించును, సూర్యుని నుండి నిస్సృతుఁడై రాహువు పర్వములందు (అమావాస్యా పూర్ణిమల యందు) చంద్రుని కడకుపోవును. చంద్రుడు సారపర్వములయిన యమావాస్యలందు సూర్యునిజేరును. (సూర్యేందుసంగమము అమావాస్య). (89) కేతువు యొక్క రథమునకు ఎనిమిది గుఱ్ఱములు, వానీకి వాయువు యొక్క జవము కలదు. వాని వర్ణము పలాల ధూమ వర్ణము (గడ్డిపొగరంగు). అవి చాల బలవంతములు. అవీ గాడిదవలే ఈషదరుణవర్ణములు. ఈ విధముగా గ్రహముల యొక్క వాహనములు రథములతో సహా వర్ణింపఁబడినవి. (91) ఇవియన్నియును ధ్రువునికీ వాయురశ్ములతో కట్టం బడినవి. అవి సమగ్రముగా ప్రవృద్దములు. భ్రమణములాచరించుచునవి ఇవి ప్రజ్వలముగ భాసించును. అవి స్వయోగానుకూలముగ తిరుగును. (92) కనబడని వాయుకిరణములచే అవి చక్కగా వృద్ధిపొందినవి. వీనిచే ధ్రువునకు కట్టబడి చంద్రుఁడు సూర్యుఁడు, గ్రహములు ఆకాశమున సంచరించును. (పునరుక్తి) (93)
జ్యోతిర్గణములు భ్రమించు ధ్రువుని అనుసరించి తీరుగును. నదిలో నదీ వేగముతో పడవ నీటిచే తీసికోని పోబడినట్లు ఈ దేవతా స్థానములు (గ్రహములు) వాయు కిరణములచే తీసికొని పోవంబడును. ఆకాశమున సంచరించు నీ గ్రహములు అగుపించవు. (95) నక్షత్రములున్నంత విరివిగా (అధికముగా) వాయు పాశములు కలవు, అవియన్నియును ధ్రువునికే అనుబంధింపఁబడినవి. ఆ గ్రహములు తాము తిరుగును. ఇతరములయిన వానిని కూడ భ్రమింపఁజేయును. (96) నూనెగానుగ యొక్క చక్రము తాను తిరుగుచు లోని వస్తువులను ఎట్లు తిరుగఁజేయునో, ఆ విధముగనే ధ్రువునకు కట్టఁబడిన జ్యోతిర్గణము అన్నివైపుల వాయురశ్ములచే ధ్రువునకు కట్టబడి సర్వత్ర తిరుగును. (97) ఆ జ్యోతిర్గణము ఆలాత చక్రమువలె (నిప్పువలయమువలె) వాత చక్రముచే ప్రేరేపింపఁబడి, తిరుగును. వాయువు జ్యోతిర్గణము వహించెడి కారణమున నా వాయువునకు ‘ప్రవహ’ మని పేరు. (98) ఈ విధముగా ధ్రువునకు సంబద్దమయిన జ్యోతిర్గణము సంచరించును. శిశుమారము ధ్రువుఁడు - అదీతారామయమని యెఱుంగవలయును. పగలు ఆచరింపఁబడిన పాపము, రాత్రియందు ధ్రువుని చూచిన పోవును. ఆతఁడు ఆకాశమున ఎంతకాలము నక్షత్రములు శిశుమారముచే ఆశ్రితములై యుండునో అంతకాలము జీవించును.(100) ఆకాశము నందలి శిశుమారము దానీ భాగములతో నెఱుంగవలయును. (శిశుమారము యొక్క అంగాంగ విభాగము తరువాత వర్ణింపఁబడినది). (101) (ధ్రువుడు ఉత్తానపాదుని కుమారుఁడు.) ఔత్తానపాదుండా శిశుమారము యొక్క ఉత్తరహనువుగా నెఱుంగ వలయును. ‘యజ్ఞ’ము రెండవహనువుగా దేలియవలయును. ధర్మము దాని మూర్గమును ఆశ్రయించియున్నది. నారాయణుఁడు హృదయమున వెదికి తెలిసికొనవలెను. (సాధ్యః) అశ్వనీద్వయము ముంగాళ్లతో సాధ్యులు (తెలియగలవారు). వరుణుండు అర్యముఁడు ఆ శిశుమారము యొక్క పశ్చిమ స్థలము (వెనుక భాగపు తోడలు). దాని శిశ్నము (పెరిస్) సంవత్సరము, మిత్రుండు అపావము నాశ్రయించియుండును. మహేంద్రుఁడు మారీచుఁడు, కశ్యపుఁడు, ధ్రువుఁడు, పుచ్ఛభాగమున నుందురు. (104)
శిశుమారము (నక్షత్రచక్రము) (పాలపుంత? మిల్కీవే)? శిశుమారము నందలి నాలుగు నక్షత్రములు ఎన్నడును అస్తమింపవు. నక్షత్రములు,చంద్రుఁడు, సూర్యుఁడు, గ్రహములు, తారాగణములతో సహా కొన్ని ఉన్ముఖములుగను, కొన్ని పరాజ్ముఖములగును, ఇతరములు వక్రీభూతముఖములును ప్రక్కకు త్రిప్పిన ముఖములు గల వానిగను). అన్నియు వక్రీభూత ముఖముగను, ఆకాశమున స్థాపింపఁబడినవి. అవియన్నియు ధ్రువునిచే నధిష్ఠితములు. అయ్యవి ధ్రువునే ప్రదక్షిణము చేయును. (106) ధ్రువుఁడు ఆకాశమున కేంద్ర స్థానము, ఆతఁడే శ్రేష్ఠుడయిన పరమేశ్వరుఁడు ధ్రువుని, అగ్నీ, ఇంద్రుఁడు, కశ్యపుఁడు వీరి మువ్వురీ తరువాత నాలుగవ వానినిగా (తుదివానిగా) స్మరింతురు. (107) మేరు పర్వత శిఖరమున ధ్రువుఁడు) ఆతఁడొక్కడే భ్రమించును. ఒంటిచేతి మీఁద ఆతఁడు జ్యోతిశ్చక్రము నంతటిని అధోముఖులుగా చేసి తీరుగును. మేరువు సాతఁడు హద్దుగో చివర (పరిమితీగా) గమనించి, దాని చుట్టును పరిభ్రమించును. (ప్రదక్షిణము) చేయును. (ఈ వర్ణనము ఇంత స్పష్టముగా లేదు. జాగ్రత్తగా శ్రమపడి పెద్దల నడిగి తెలిసికొనిసంత పట్టు మూలానుగుణముగా వ్రాసితిని).
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమందలి పూర్వభాగమందు, ద్వితీయానుషంగపాదమున ధ్రువచరిత్ర కీర్తనమను ముప్పదిమూడవ యధ్యాయము.
