1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
11 - ఋషి సృష్టి వర్ణనము
సూత ఉవాచ:-
సూతుఁడిట్లు పలికెను :
భృగువలన ఖ్యాతికి ఇరువురు పుత్రులు ఒక పుత్రిక కలిగిరి. ఆ కుమారులిరువురు సుఖ దుఃఖములు కలిగించుటకు ప్రభువులు. వారే సర్వ ప్రాణులకును శుభాశుభముల నొసంగువారు. వారిరువురు ధాత, వీధాతలు. ధాత సంవర్థకుఁడు, విధాత శుభా శుభముల నొసంగువాఁడు. వారు మన్వంతరము నందుండిరి. అందు సంచరించిరి. వారీ అక్క జ్యేష్ణ భగిని శ్రీదేవి. ఆమె లోకములను పవిత్రీకరించునది, ఆమెకు బలము, ఉన్మాదము - అను ఇరువురు పుత్రులు నారాయణుని వలనఁ గలిగిరి. బలము యొక్క పుత్రుడు తేజము. ఉన్మాదము యొక్క పుత్రుఁడు సంశయము. ఇతరుల నేకులు మానస పుత్రులతనికి పుట్టిరి. వారు ఆకాశ సంచారులు. వారు దేవతల యొక్క పుణ్యకర్మల యొక్క విమానముల వహించెదరు (నడిపెదరు) (5) ఆయతి, నియతి యనువారు మేరువు పుత్రికలు, ఆయతీ. అనఁగా భవిష్యత్తు. నీయత అనఁగా నీగ్రహము. ఆయతి నియతులు ధాతృ విధాతృ భార్యలుగో స్మరింపఁబడిరి. దృడప్రతులయిన ప్రాణము, మృకండుడు వారి కుమారులు. వారు సనాతనులు. బ్రహ్మకోశులు (వేదకోశములు). (6) మనస్విని యందు మార్కండేయుడుద్భవించెను. ఇతఁడు మృకండుని పుత్రుఁడు. ఆతని కుమారుఁడు వేదశిరసుడు. ఇతడు మార్కండేయునకు ధూమ్ర పతివలనఁగలిగెను. వేద శిరసునికి పీవరి యందు కలిగిన పుత్రులు వంశకరులుగా గణింపం బడిరి. వేద పారగులయిన ఋషులు మార్కండేయులుగా సమాఖ్యాతులయిరి. (8) ప్రాణునకు పుండరీకయందు ద్యుతీమంతుఁడను కుమారుల డు కలిగెను. ద్యుతిమంతున కిరువురు పుత్రులు, ఉన్నతుఁడు, స్వనవాతుఁడు.
వారిరువురకు భార్గవ వంశంజులతోడి పరస్పర సంబంధ బాంధవములచే పుత్రులు పౌత్రులు గలిగిరి. వారు స్వాయంభువ మన్వంతరమున మరణించిరి. ఇంక మరీచి యొక్క సంతానమును గూర్చి వినుము. (10) ప్రజాపతియైన మరీచిపత్ని సంభూతి, ఆమె పూర్ణమాసుండను కుమారునిఁగనెను. అంతీయేకాక ఈ కుమార్తెలను గూడ కనెను. అని యెఱంగుము. కృషి, వృష్టి, త్వష, శుభంకరురాలయిన ఉపచితీ, పూర్ణమాసుడు, సరస్వతి యందు ఇరువురు పుత్రులగనెను. వారిరువురు ధర్మిష్ణుఁడయిన విరజుఁడు, పర్వశుఁడును. విరజుని కుమారుడు సుధాముఁడు. అతఁడు లోకవిశ్రుతుడు. (13) వీరజగౌరుల కుమారుఁడయిన సుధాముఁడు తూర్పుదిక్కును సమాశ్రయించెను. ప్రాక్టిశాపాలకుం డు అయిన సుధాముఁడు ధర్మాత్ముఁడు, ప్రతాపవంతుఁడు. మహాయశస్వియైన పర్వశుఁడు పర్వగణన క్రియయందు ప్రవిష్ణుఁడయ్యెను. పర్వశుఁ డు పర్వశయందు కుమారద్వయమును కనెను. వారిరువురు ధీమంతుఁడయిన యజుర్దాముఁడు, స్తంభకాశ్యపుఁడు. వారికిరువురు పుత్రులు. వారు సన్యాసుఁడు నీశ్చితుండు. వీరు వారి గోత్ర వృద్ధికరులయిరి. అంగీరసుని పత్నీ స్మృతీ నలుగురు కూతుండ్రను, ఇరువురు కుమారులను గనెను. ఆ నలుగురు కూతులు లోకమున మిక్కిలి విశ్రుతలు. వారు సినీవాలి, కుహు, రాక, అనుమతి యనువారు. భరతాగ్ని కీర్తిమంతులు కుమారులు.
భరతాగ్నియే అగ్ని) షర్టన్యుని సద్వతీ అగ్నికి గనెను. హిరణ్యరోముఁడయిన పర్జన్యుఁడు మరీచి యందు పుట్టెను, ఇతఁడు వేడొకఁడు. హిరణ్యరోముఁడయిన పర్జన్యుఁడు). (19) ఇతఁడే లోకపాలుఁడు. ప్రళయాంతమండునట్టివాఁడు కీర్తిమంతునకు చరిష్ణువు, ధృతిమంతుఁడను సిరువురు పవిత్రులు, పుత్రులు, వీరిరువురును అంగీరస వంశమున మిక్కిలి యుత్తములు. వారి పుత్రులు, పౌత్రులు సహస్ర సంఖ్యకు మించిరి, వారందఱు గతించిరి. [21] అనసూయ ఆత్రి వలన అకల్మషులయిన యైదుగురు ఆత్రేయులను కనెను. ఆమె యొక కూతును కూడకనను, ఆమె పేరు శ్రుతి. ఆ శ్రుతి కుమారుఁడు శంఖపాదుఁడు. ఆమె {ఆశ్రుతి) పౌలహుడు, ప్రజాపతియునైన కర్గమునిపత్ని. ఆ యైదుగురు ఆత్రికుమారులు - సత్యనేత్రుఁడు,హవ్యుఁడు, ఆఫోమూర్తీ, శనైశ్చరుడు, సోముఁడు. వీరందరు స్వాయంభువ మన్వంతరమున యామదేవులతో సహితము గతించిరి. (24) మహాత్ములయిన ఆత్రేయులకు (ఆత్రసంతతులు) పుత్రులు పౌత్రులు వందలు, సహస్రములు కలరు. వారును స్వాయంభువ మన్వంతరమున గతించిపోయిరి. (25) పులస్త్యుని భార్య ప్రీతి. ఆమే సుతుఁడు దానాగ్ని ఆతని పూర్వజన్మలో స్వాయం భువ మన్వంతరమున అగస్త్యుడుగా స్మరింపబడుచున్నాఁడు {26) పులస్త్యునకు ముగ్గురు కుమారులు. మధ్యముఁడు దేవబాహువు. మూఁడవవారం డు ఆత్రీనామకుఁడు. (మొదటిపొండు దాణాగ్ని నాయకుఁడు) పారికొక చెల్లెలున్నదీ, ఆమె సద్వతి' ప్రసిద్ధురాలు. ఆమె శుభ వంతురాలు. పవిత్రురాలు. భరతాగ్ని పత్ని. పర్జన్యునీ తల్లి.
బ్రహ్మర్షియైన పౌలస్త్యునకు ప్రీతికిఁ గలిగిన ధీమంతుఁడయిన పుత్రుఁడు దోసగి సుజంఘి దానాగ్నీ భార్య, హరిరువురకు పెక్కురు పుత్రులు. వారందరు పౌలస్త్యులనీ విఖ్యాతి నొందినారు. వారందరు స్వాయంభువ మన్వంతరమున వసించి యుండిరని స్మరింపఁబడుచున్నారు. (29) పులహ ప్రజాపతి వలన 'క్షమ' పెక్కురు పుత్రులను బడసెను. (పులస్త్య అని యున్నది. ఇది తప్పు. పులహ అని యుండవలెను) వారందరు త్రేతాగ్ని వర్చస్వంతులు. వారి కీర్తి లోకమున సుప్రతిష్ఠితము. (30) వారు మువ్వురు - కర్గముఁడు, ఉర్వరీవంతుడు, సహిషుఁడు. కనకపీరుం డును. ఋషియును క్షమాసుతుఁడే. వారికొక యందమైన కూతురు. ఆమె పేరు మీనరి. (3}} అత్రి కూతురు శ్రుతీ, శ్రుతి కరముని భార్య. ఆ - శ్రుతి కుమారుఁడు శంఖపాదుఁడు, కుమార్తె కామ్య' (32) శంఖపాదుఁడు (పదుఁడు) లోకపాలుఁడు. ప్రజాభర్త. అతడు దక్షిణ ఊగ్రత్యుడు కామ్య ప్రియవ్రతునకు భార్యగా నీయఁబడెను (33) కామ్య ప్రియవ్రతుని వలన స్వాయంభువసములయిన పదిమంది పుత్రులను, ఇద్దరు కుమార్తెను గాంచేను. వీరి వలన క్షత్రియ సంతతి సంప్రవర్తితమయ్యెను. (34) సుమధ్యమయయిన యశోధర కనకవీరుని వలన విశ్రుతుండయిన సహిష్ణుని కనెను. ఆమె కామదేవుని కూడ కనెను. (35) సన్నతి క్రతువు వలన క్రతు సమానులయిన యోగ్య పుత్రులను గనెను. వారికీ భార్యలు లేరు పుత్రులు లేరు. వారూర్వ రేతస్ములు. బ్రహ్మచారులు. (46).
వారందరు అరువది వేలమంది. వారందరు వాతాఖిల్యులని ప్రఖ్యాతి వహించిరి, వారు దివాకరుని ప్రదక్షిణింఛి అరుణునకు ముందుగా పోవుచుందురు. ($7) ప్రపంచముసకు సంపూర్ణ సంప్లవము (వినాశము) వచ్చు వీణకు వారు శాశ్వతముగా సూర్య సహచరులు. వారికి ఇద్దరు చెల్లెండ్రు - వారు పుణ్య, సత్యవతి అనువారు, 18) వారు పర్వశుని కోడండ్రు పర్వశుఁడు పూర్ణమానుని పుత్రుడు. (39) వాసిషులు ఏడుగురు. వీరు వసిష్ఠుని కుమార్తెలు. వీరు ఊర్ణయందు వసిష్టునికి కలిగిరి. వారిలో సౌందర్యవతి సుమధ్యమ పుండరీకు ఈమె ద్యుతిమంతుని తల్లి. ఆ పుండరీక “ప్రాణుని" ప్రియపత్ని (40) పుండరీకకు తమ్ములు ఏడుగురు, వీరు వాసిషులు లోక విశ్రుతులు, చారు - రక్షుఁడు, గర్తుం డు, ఊర్ధ్వబాహుఁడు, ప్రషనుఁడు, సషనుండు, (పావనుఁడు), సుతపసుఁడు, శంకుఁడు అనువారు. వారందరు సప్తర్షులుగా స్మరింపబడుచున్నారు. యశస్వినియైన మార్కండేయి (మార్కండేయుని కూఁతురు వరాంగీ రత్నుండను కుమారునామె కనెను. ఆతఁడు రాజు) పశ్చిమ దిక్కునకు ప్రభుపు, ఆతఁడు ప్రజాపతియగుటచే కేతు మంతుఁడను పేరుగాంచెను మహాత్ములయిన వసిష్ఠనంతతుల గోత్రములు స్వాయంభువ మన్వంతరమున గతించి పోయినవీ. (43) ఇక 'అగ్ని' సంతతుల గూర్చి వినుము. ఈ విధముగా ఋషీశ్వర సృష్టి అనుబంధముతో సహితముగా ప్రకీర్తింపం బడినది. ఇంక పిమ్మట అగ్ని సంతతులను ఆనుపూర్వముగా విస్తరించి చెప్పెదను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమున పూర్వభాగమున ద్వితీయాసుషంగ పాదమున ఋషి సృష్టి వర్ణనమను ఏకాదశాధ్యాయము సమాప్తము.
