1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము

Table of Contents

2 - ద్వితీయాధ్యాయము

తపోధనులయిన యా మునీశ్వరులు సూతుని గూర్చి మరల నడిగిరి- “అద్భుతక్రియా సంపన్నులయిన వారి సత్రయాగము ఎక్కడ జరిగినది? ఎంతకాలము జరిగినది? ఏ విధముగా జరిగినది? వాయదేవుఁడయిన (ప్రభంజనుఁడు) ఆ పురాణము ఎట్లు చెప్పెను. (2) దానిని వినవలయునని మాకు చాల కుతూహలముగా నున్నది”. ఆని ప్రచోదింపబడి మంగళకరమయిన వాక్యమునీట్లు పలికెను. (3) ఆ బుద్దిమంతులెల్లరేచ్చట యజ్ఞము నాచరించుటయుత్తమమయి నదీగాఁదలఁపోసిరో, ఎంత కాలమాయాగము జరిగినదో, అయ్యాగమెట్లు ప్రవర్తమానమైనదో వినుఁడు. (4) పూర్వము బ్రహ్మ విశ్వమును సృజింపదలచి సత్రయాగమును సహస్ర వంపూర్ణ సంవత్సరములు చేసెనో యది ఆతీ పుణ్యమయినది. (5) అచ్చట బ్రహ్మ స్వయముగా తపో గృహపతి యాయెను (యజమాని యయ్యెను) 'ఇడ' పత్నీత్వ మొందెను, బుద్ధిమంతుఁడయిన బ్రహ్మ మృత్యువును శామిత్రము నొనర్చెను. (శామీత్రమనఁగా యజ్ఞమున పశువును బంధించుట, లేదా యజ్ఞసంబంధమయిన యొక పాత్ర). (6) ఆ మహాత్ముల యజ్ఞమునందు దేవతలు (విబుధులు) సహస్ర సంపూర్ణవర్షములుండిరి. (7) భ్రమించుచున్న ధర్మచక్రము యొక్క నేమి (పట్టా) యెచ్చట పడెనో అయ్యదియే మునిజన పూజిత మయిన ప్రఖ్యాత నైమిషమయినది. (8)

సిద్దులచే చారణులచే సేవితమైన పుణ్యప్రదమైన గోమతీ యుండెనో స్వసుతతో గూడిన రోహిణి యచ్చట గోమతిగా క్షణములో నయ్యెను. (9) మహాత్ముడు, ఉత్తమ తేజస్వి యయిన వశిష్ఠునకు అరుంధతివలన శక్తి యాత్రాదానముగా జ్యేష్ట సుతుడుగా నయ్యెను. (10) ఇంద్రుని యొక్క శక్తితో నేచ్చట కల్మషపాద నృపతికీ వైరము కలిగెనో యచ్చటనే విశ్వామిత్ర వసిష్ఠులకు వైరము కలిగెను. (11) అదృశ్యంతి యందు ఎచ్చట పరాశరముని పుట్టెనో అక్కడ వసిష్ఠునకు జ్ఞానమున పరాభవము కలిగెను. (12) బ్రహ్మవిదులు నైమిషము నందు శైలము నొకదానిని తలంచిరి. నైమిషమున పొరుండిరి. అందుచేతనే తరువాత నైమిషేయులు అని గుర్తింపబడిరి. (13) పరాక్రమవంతుఁడయిన పురూరవుడు భూమిని పాలీంచుచుండ, ఆ నైమిషీయులను మహాత్ములకు పండ్రెండువత్సరములు అచ్చట సత్రము జరిగెను. (14) పురూరవుడు అష్టాదశ సముద్రముల యందలి ద్వీపముల ననుభవించుచు, రత్న లోభమువలన సంతోషము పొందలేదని మేము వింటిమీ. (15) దేవదూత ప్రచోదితమయిన యూర్వశీ ఆ మహారాజును కామించేను. ఊర్వశితో కూడీ యాతఁడే సత్రమును హరించేను. (16) నైమీషీయులు నరపతీ మయన పురూరవునితో సత్రమాచరించిరి. పావకుని వలన గంగ ప్రకాశవంతమయిన బిడ్డను గనెను. (17) కొంత శుక్షమును పర్వతకూటము నందుంచెను. తత్తుల్య యయిన హిరణ్యము కలిగెను. తరువాత విశ్వకర్మ. యజ్ఞవాటిని హిరణ్మయముగా చేసెను. స్వయంభు వుఁడు, లోకభావనుఁడు విశ్వకర్మ (బ్రహ్మ) ఆ తేజస్వంతుల యొక్క యజ్ఞమును ప్రవేశించీ

ఇడ కుమారుఁడు పూర్వరవుడు. వేటకై చరించుచు ఆ ప్రదేశమును చేరెను, ఆశ్చర్య కారణము హిరణ్మయము నయిన యజ్ఞవాటికను చూచీ, విజ్ఞానము నశించగా లోభగుణముచే ఆ హీరణ్యమును గ్రహింప నా రాజు ప్రారంభించెను. నైమిషీయులయిన మహరులు ఆ రాజు నేడ నధికముగా కోపించిరి. (21) తపస్సు నందు నిష్ణులయినవారు బుద్ధిమంతులు దేవచోదితులు నయిన మునులు క్రుదులై కుశవజ్రములచే నా రోజును చంపిరి. (22) కుశవజ్రములచే చితుకగొట్టబడి యారాజు తనువును వీడెను. తరువాత ఊర్వశీ పుత్రులు మునులతో భువీయందు యుద్ధము చేసిరి. (28) ఎవనిని నహుషుని మహాత్ముడైన తండ్రిగా చెప్పుదురో ఆతఁడు ధర్మశీలుఁడు, మహీపతి; అనేకములయిన యజ్ఞము లొనరించి అవభృథస్నానములనేకము లాచరించినవాడు. (24) (ఆయువు - పురూరవునకు ఊర్వశీకి పుట్టిన కుమారుఁడు). ఆతడచ్చటికి , వచ్చెను. ఊర్వశీ కుమారులు భయపడి పలాయనము చిత్తగించిరి. రాజును శాంతపరచి, తరువాత బ్రహ్మవిదులయిన, మహర్పులు (25) పృథ్వీ వలె వత్సాత్మభూతులయినవారు, సత్రము నాచరించుటకు ఆరంభించిరి. ఆ మహాత్ముల కాయాగములో బ్రహ్మచర్యము కలిగెను. (26) పూర్వము విశ్వమును సృజించు కోరిక గలిగిన వీశ్వసష్టలవలె వైఖానసులతో, ప్రియ సఖులతో, వాలఖిల్యులతో, మరీచులతో, అజులతో, మునులతో నచ్చట సూర్యునియొక్క అగ్నియొక్క ప్రభవం కాంతి పుట్టెను. (27) పితృదేవతలు, అప్సరసలు, సిద్దులతో, గంధర్వులతో, ఉరగులతో, చారణులతో, భారతులతో, రాజు దేవేంద్రుఁడు వెళ్లినట్లే ప్రకాశించెను. స్తోత్ర శస్త్రములచేత గృహములచేత దేవతలను, పితృకర్మలచే పితరులను, ఆయా జాతులను గంధర్వులను వారివారి జాత్యుచిత విధిని ఆరాధించిరి. ఆరాధనమునకు తరువాత కర్మాంతరముల యందును వారినిస్మరించిరి.

గంధర్వులు సోమములను పాడిరి; అప్సరోగణములు నృత్యము చేసిరి. చిత్రములయిన అక్షరములతో పదములతోగూడి శుభంకరమైన వాచమును మునులు చెప్పిరి. (31)అచ్చట విద్వాంసులు మంత్రాదులను పరస్పరము జపించిరి; ప్రతీవాదులను వితండవచనములచే చంపిరి. (52) ఋషులును విద్వాంసులు, వ్యాకరణ శాస్త్రము నందు న్యాయ (తర్క శాస్త్రము నందు విద్వాంసులు. అచ్చటేదియును దొంగలింపబడలేదు; మతి' బ్రహ్మరాక్షసులు ప్రవేశింపలేదు. (33) యజ్ఞమును హరించెడు దైత్యులు లేరు; వాజముఖలయిన స్త్రీలు లేరు. ప్రాయశ్చిత్తముకాని యెట్టి వస్తువు యొక్క అభావము కాని యిచ్చట లేదు. (34) శక్తి, ప్రజ్ఞ, క్రియ, యోగము మొదలయిన వివిధములయిన ఆశీస్సులు అనుష్ఠింపబడినవి. ఆ మహా మేధావుల యజ్ఞము/పండ్రెండు సంవత్సరములీ విధముగా వృద్ధిపొందినది. (35) పృష్ఠగమనాః : అనుసరించవచ్చువారు అయుత దక్షిణాః - (Undesturbed) అచంచల ప్రజ్ఞకలవారు : పూర్వమీంద్రునికివలే, నైమిషారణ్యమందలి ఋషులకు, పండితులు, పాండిత్య వృద్దులు, ఆద్యులు, వీరులు, ఋత్విజుల యిరి; వారు సుప్రతిష్ఠిత ప్రజ్ఞగల వారలను జ్యోతిమ మాచరించిన వారలను వేరువేరుగా వారి ననుసరించు నట్టి వారినిగా జేసిరి. (37) యజ్ఞము సమాప్తమయినది; అమితాత్ముడు (సర్వజ్ఞుడు) మహాధీపుఁడు, నయిన వాసుదేవునిట్లు వారడిగిరి “స్వవంశాల్డమీ ద్విజుఁడు మీచే ఏ కారణమున ప్రచోదింపబడియెనో వివరింపుమని, ప్రభువయిన వాసుదేవుఁడు చెప్పెను. (38) స్వయంభువుడయిన శిష్యుడు, సర్వము ప్రత్యక్షముగా దర్శించువాఁడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు. అణీమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము మొదలుగా గల సూక్ష్మములయిన అష్టాంగములతోఁగూడి యున్నవాఁడు (33) చరాచర ప్రపంచము నంతటిని సప్తవిధ స్వకీయ రశ్ములను బంధించి యుండువాడు, ప్రతికూల పవనములచే సర్వలోకములను వర్షములచే భరించువాఁడు, భూతవ్యూహత్రయమును సర్వేంద్రియ వ్యాప్తిచే ధరించువాడు.

            శరీరులకు తేజస్సంబంధి యుపాయములను కలుగజేయుపొండు, పంచ ప్రాణములను తమతమ వ్యాపారములచే నియమించువాఁడు పంచ ప్రాణవాయువులచే శరీరంబుల నింపి శరీరుల కాధారుడైనపోఁడు, శబ్దస్పర్శములను గుణద్వయముచే నౌకాశయోనీయే (43) శబ్ద శాస్త్రవేత్తలచే వాచోరణి యని. పీలువబడును. (44) మధురము మంజులము నయిన పొక్కుచే సర్వమునులను సంతోష పరచు వానివలె పురాణజులకు, దేవతలకు, పురాణము నాశ్రయించిన యుక్తులు (పలుకులు) కోరువారికి, పురాణ నియతులకు, విప్రులకు, ద్విజసత్తములకు పూర్వము జరిగినట్టిది ఉత్తమమైనది, ఋషులకు లోకతత్వము ననుసరించినది, బ్రహ్మచే జ్ఞానప్రదమయినదీ పూర్వమేట్లు చెప్పబడినదో, దేవతలకు, ఋషులకు సర్వ పాపప్రమోచమయినట్టిది, పూర్వము జరిగిన క్రమము ననుసరించి, ఆ కథలను నేను. మీకు చెప్పెదను, అని వాయువు పలికెను.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున ప్రథమ ప్రక్రియాభాగమున నైమిషాఖ్యాన కథనమను పేరుగల ద్వితీయాధ్యాయము.