1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము

Table of Contents

5 - ప్రపంచోత్పత్తి

శ్రీసూత ఉవాచ:-

సూతుఁడిట్లనెను :

పృథివీ తలమంతయు ముందుగా నీటిచే నిండియుండెను, వాతములు ప్రశాంతము లైయడంగెను. అప్పుడీ దృశ్యమాన ప్రపంచమంతయు నీటిలో లీనమయి యుండెను. సర్వము నశించెను. ఏమియును దెలియకుండెను. (1) స్థావర జంగమములన్నియు ఏకార్ణవమున నష్టములు కాగా సహస్రాక్షుఁడు, సహస్రపాదుడునయిన ప్రభువు బ్రహ్మ (2) సహస్ర శీర్పుఁడు, పురుషుఁడు, బంగారు వర్ణము కలవాఁడు, అతీంద్రియుఁడు, నారాయణాఖ్యుఁడు నయిన బ్రహ్మ ఆ నీటియందు నిదురించేను. (3) సత్వోద్రేకము లేనందున నారాయణుఁడు సర్వము శూన్యమగుటను కనుగొనెను. నారాయణుని గూర్చి యీ శ్లోక ముదాహరింపబడుచున్నది. [4) ఆపస్సులు అనఁగో నారములు. నారములు నీళ్ళు, నరసూనులందరు ఆపస్సులే. ఆ నీరములాతనికి నివాసములగుట నారాయణుఁడయ్యెను. (5) యుగసహస్రకాల పర్యంము స్వచ్ఛమయిన కమల పత్రతలమున బ్రహ్మత్వా దర్శ కారణమున ఆత్మనాత్మ వీక్షించుచు నారాయణుఁడట నిద్రించేను. (6) ఆ నీటియందు బ్రహ్మ (నారాయణుడు) శాంతవచో వీలాసుఁడయి ప్రావృట్కాలమున (పర్షకాలమున) రాత్రీయందు ఖద్యోతము (మిణుగురు పుడుగు - జ్యోతిరింగణము) వలె నుండెను. (7) అంత, సలిలము నందున్న భూమి నెటింగి, అనుమానంబున కొంతకాలముండి సారాయణుఁడు భూమి నుద్దరింప తలంచెను. (8) ఓంకారముతో కూడిన అష్టతనువయిన ఈశ్వరునీ తనువులలో నొకటయిన భూమిని, పూర్వకల్పముల యందున్నట్లుగా నుద్ధరింప మహాత్ముడయిన నారాయణం డు దివ్యరూపమును తలపోసెను. (9) నీటి యందు మునిగియున్న భూమిని జూచి 'నేనే మహా రూపమును దాల్చి భూమీనీ సలిలముల నుండి యుద్దరింపవలెను" అని నారాయణుఁడు తలపోసెను. (10)

సర్వభూతముల కదృశ్యము, బ్రహ్మ సంజ్ఞితమునైన పొజ్మయమై, దశయోజన విస్తీర్ణము, శత యోజన మాయతము, నల్లని మేఘము వంటిది, మేఘ గర్జనముల వంటి నిస్స్వనము గలది, మహాపర్వతము వంటి శరీరముగలది, శ్వేతము, తీవ్రము, ఉగ్రమునయిన తేజస్సు గలది, బలిసినది, వృత్తాకారమున నున్నదియునగు స్కంధము గలది, విష్ణుని సంబంధమయిన విక్రమమును పొందినది, బలిసినది, ఉన్నతమయినదియు నగు కటి భాగము కలది, తీక్ష దంష్టలు గలది, విద్యుదగ్నితుల్యము, సూర్యుతో సమానమైన తేజము గలది, జలక్రీడా సముచితము, నగు పోరాహ రూపమును నారాయణుడు స్మరించెను. (11,12,13,14) అతుల రూపమయిన పోరాహ రూపమును నారాయణుడు పొంది, పృథీవీని నుద్ధరించుటకు రసాతలము నాతండు ప్రవేశించేను, (15) ఆ వారాహ లక్ష రూపుడయిన హరి దీక్షా సమమైన యిదండ్రుఁడు యజ్ఞదంతుం డు, జుహూముఖుఁడు, అగ్నిజిహ్వుఁడు, దర్భరోముఁడు, బ్రహ్మశ్రుండు, మహాతపస్వి, వేద స్వరూప భుజస్కంధుఁడు, హవిర్షంధుఁడు, హవ్యకవ్యాది వేగవంతుఁడు, ప్రాగ్వంశకాయరుచిరుఁడు, నానాదీక్షలతో గూడినవాఁడు (17) దక్షిణా హృదయుఁడు, యోగవంతుఁడు, శ్రద్ధావంతుఁ డు, సత్త్వమయుఁడు, ఉపాకర్మ రుచి, ప్రవర్ణావర్త భూషణ భూషితుఁడు, సోనా ఛందోరూపగతిపధుఁడు, గుహ్యోపనిషదాసనుండును, మాయా పత్నీ సహాయుండును, పర్వతశృంగతుల్యమయిన యుచ్ఛయము కలహాఁడు, అహోరాత్ర నేత్రధరుఁడు, వేదాంగములు, శ్రుతీభూషణములుగా గలవాడు ఆజ్యరూప గంధుఁడు, సువరూపకలీతతుండభాసితుఁడు, అత్యధికమయిన సొమవేద ఘోష కలవాఁడు. (18,19,20).

సత్యధర్మమయుఁడు, శ్రీమంతుఁడు, కర్మ పరాక్రమము చేతను సత్కరింపబడినవాఁడు, ప్రాయశ్చిత్తనఖుఁడు, భయంకరుడు, పశువుల వంటి మోకాలు గలవాడు, మహాయజ్ఞవంతుఁడు, (21) ఉద్ఘాతాంత్రుఁడు, (యజ్ఞము నందు సామవేద తంత్రమునడుపువాడు ఉద్గాత - ఉద్గాత యనేడు ప్రేగులు గలవాఁడు), హోమలింగుఁడు, ఫలబీజమహౌషధి, పాద్యంతరాత్మ, నాసికాసోమశోణితుఁడు (22) భక్తులు యజ్ఞ వరాహాంతులు, నీట మరల ప్రవేశించేను. అగ్నిచేతను ఆచ్ఛాదింపఁబడిన భూమిని సమముగా చేయగోరి, ప్రజాపతిని చేరి, సముద్రము నందుండు వానిని సముద్రములందు, నదులయందుండు వానినీ నదులయందు, వేరువేరుగా నుంచి, ఆ ప్రజాపతీ పృధీవి యందు పర్వతమును. వృద్ధిపరచెను. (24) సృష్టికిఁబూర్వము సంవర్తకాగ్నిచే దహింపబడుచుండగా, ఆ యగ్నిచే పర్వతములు భూమియందు నెల్లెడలను విలీనములయ్యెను. (25) ఆ సమయమున సర్వము నేకార్ణవముకాగా, వాయువుచే కూడినవై యెచ్చటెచ్చట తడుప చల్లబడినవో అచ్చటచ్చట నయ్యవీ పర్వతములయ్యెను. (26) ఆ విధముగా లోకమనెడు సముద్రమున గిరులట్లు ప్రకీర్ణములు కాగా, కల్పాదులందు, విశ్వకర్మ, మరల మరల, వానిని విభజించును. (27) ఆ విశ్వకర్మ ససముద్రము, సపర్వతము, నయి ససప్తద్వీపమయిన పృథ్విని, భూర్భువస్సువరాది నాలుగు లోకములను మరల కల్పించెను. (28) లోకములను కల్పించి యాతఁడు ప్రజా సముదాయమును సృజించెను. స్వయంభువు, బ్రహ్మ భగవంతుడైన యాతఁడే స్వయముగా వివిధ ప్రజా సముదాయమును సృష్టింపకోరెను. (29) పూర్వమందు కల్పాదుల యందెట్లున్నదో యట్లే తత్ఫృథివీ ప్రజారూపమును సృష్టించెను. బుద్ధి పూర్వకముగానే ఆతఁడా సృష్టిని అభిధ్యానించెను, (30)

ప్రధానముతో సమకాలముననే తమోమయము ప్రాదుర్భవించెను. తమము, మోహము, మహామోహము, తామిస్రము, అన్నియు అంధసంజ్ఞితములు. చీకటికి పేర్లు. (31) అది అవిద్య ఆదియే పంచవిధములు. (ఐదు పర్వములు కలది). అభిమాని, మహాత్ముఁడు నయిన ఆ బ్రహ్మ ధ్యానించుచుండ నయ్యది యైదు విధములుగా సృష్టి ప్రాదుర్భవించెను. (32) అంతటను తమస్సు వ్యాప్తమై యుండెను. తమస్సుచే బీజకుంభలతలు ఆవరింపఁబడియున్నవి. వెలుపలను లోపలను ప్రకాశరహితము సంజ్ఞారహితమై యుండెను. (33) దేనివలన వారియొక్క బుద్ధి, దుఃఖములు, కరణములు చేయబడినవో, దానివలననే పర్వతములు, వృక్షాదులు సంవృతములై యుండి ప్రకీర్తితములయినవి. (34) ఆత్మ సంభవుఁడయిన బ్రహ్మ సృష్టియందు ఉద్భూతమయిన దానిని చూచి, ఆప్రతీతమనస్కుడై తదుత్పత్తిని గూర్చి యాలోచించెను. (35) అట్లు ధ్యానము చేయు నతనికి వేటిక తిర్యక్రేతమయ్యెను (ప్రోతము = ప్రవాహము} {అగుపించేను) ఏ కారణముచే నది తిర్యక్కురో వంకరగా, అడ్డముగా తిరిగెనో ఆ కారణముచే నది తిర్యక్రేతమని - స్మరింపఁబడినది. (36) తమస్సు బహుళముగా నుండుటచే వారందర జ్ఞానమధికముగా గలవారుగా స్మరింపఁబడిరి. ఉత్పాద్య గ్రాహిణులెల్లరు అజ్ఞానమునందు తమ్ముజ్ఞానవంతులమనియే భావించుకొనెడువారు, పోరు అహంకారయుతులు, అహంగర్వీతులు, (37) వారు ఇరువది యేమ్మీది రకముల వారు; ఏకాదశేంద్రీయ వీధులు, అత్మాదులు నవవిధములు. (38) తారకాదులేన మండ్రు. వారినీ శక్తివధులందురు. వారందరంతఃప్రకోశులు; బాహ్యమున వారెల్లరు మరల అజ్ఞానముచే సావృతులు (39) వశ్యాత్ములయిన త్రిసంజ్ఞకులు తిర్యక్ స్రోతసులుగా (ప్రపోహములుగా) చెప్పబడుచున్నారు. (40) రెండవ విశ్వమయిన తిర్యక్ స్రోతస్సును జూచి బ్రహ్మకు ఒక యభిప్రాయము కలిగినది. (41)

అట్లు ధ్యానము చేయునాతనికి అంత్యమున పుట్టిన సాత్త్వికసృష్టి తృతీయమయిన యూఢ ప్రోతస్సు; అందుచేతనే యది ఊర్ధ్వమందున్నది. (42) అదీ దూరముననున్నదగుటచే (ఎక్కువజ్ఞాన వ్యాప్తిచే) నది ఊర్ధ్వప్రోతస్సని పేరొందినది. అందలి ప్రజలు సుఖులు, ప్రీతిబహుళులు, బాహ్యమున అంతరమున వ్యాపించియున్నారు. (43) బయటకు వెలుపలను కూడ ఊర్థ్వ ప్రోతస్సునందలి ప్రజలు ప్రకాశవంతులుగా సంస్కృతులు. వారు నవధాజాదులు, తుష్టాత్ములు, బుధులుగా ప్రశస్తులు. (44) తృతీయమయిన ఊర్ద్వసోతస్సు సర్వము వైదీక సహితముగా దేలియబడు చున్నది. దేవతల యందు లో ఊర్థ్వప్రోతస్సు సృష్టింపఁబడగా అప్పుడాతఁడు ప్రభువయ్యెను. (45) బ్రహ్మ ప్రీతిమంతుఁడయ్యెను.. తరువాత వేటిక దానీని తలపోసేను. కొనివేథోక సర్గమును ఈశ్వరుఁడు (బ్రహ్మ) సృజింపగోరెను. అయ్యదియే సాధకము (46) సర్గమును అభిధ్యానము చేయు నా సత్య సంకల్పునకు భూత సృష్టి ప్రాదుర్భవించెను; అదీ ఆర్వాక్ గ్రోతస్సును సాధించినది. (ఆధ్వాక్ ముందునకు అభిముఖముగా వచ్చునది) అర్వాక్కుగా (అభిముఖముగా వచ్చుటచే) వచ్చిన ప్రోతస్సు (47) అగుటచే నది ఆర్వాక్ గ్రోతస్సయినది. వారు అధికమయిన ప్రకాశము కలవారు. తమస్సుచే జుష్టమయిన రజస్సు యొక్క ఆధిక్యము కలవారు, (46) అందుచేవారు బహుదుఃఖములు కలవారు; వానినే మరల మరల చేయువారు. బహిరంతముల ప్రకాశించువారు వారే మనుష్యులు. వారే సాధకులు. (49) నరకాదులయిన లక్షణములచే వారు ఎనిమిది విధములుగా నున్నారు. వారు సిద్దాత్ములు, మనుష్యులు, గంధర్వులతో సమానమయిన ధర్మములు కలవారు. (50) ఐదవ సృష్టి అనుగ్రహము. ఇదీయు నాలుగు తెరగులు. ఈ మనుష్యులు విపర్యయమున (వ్యత్యాసమున) నాశంబును, శక్తిచే స్థితిని గాంచుచుందురు. (51) వారు ఉత్పాదకులు నాశకులు. వినాశమొంది మరల మరల పునర్భవము నొందుదురు. అంతియేకాక భూతాదీకముల సృష్టి ఆరవది యనంబడును. (52)

ఆ భూతములు భోజన విహారములు కలిగియుండును. శీలరహితములై యుండుట యెఱుంగవలయును. బ్రహ్మయొక్క మొదటి సృష్టి మహాసర్గము. (53) పృధివ్యాది తన్మాత్రంబు ద్వీతీయము. అదియే భూతసర్గమనంబడును. వైకార్తీకము (వికారవంతమయినది) తృతీయసృష్టి అయ్యది యేంద్రీయ సృష్టియనంబడును, (54) ఇవి బుద్దపూర్వకముగా నుత్పన్నములయిన ప్రాకృతసృష్టులు, ముఖ్య సృష్టి నాలుగవది. ముఖ్యములనఁగా స్థావరము. (55) తిర్యక్ గ్రోతస్సర్గము పంచమము. (తైర్యగ్యోన్యస్తు) ఊర్దస్రోతస్సర్గము ఆరవది. దీనిని బుద్దిదైవత మందురు. (56) అందు (ఊర్ద్వసోత స్సర్గములో) సప్తమము మానుష సర్గము. అష్టమమయిన సర్గము అనుగ్రహమను సర్గము. అదీ మరల సాత్త్విక తామస భేదమున ద్వివిధముగ నున్నది. (57) (సాత్త్విక తామస పరిమిళితము) వీనియందైదు వైకృతములు, మూఁడు ప్రాకృతములనియు వ్యవహరింప బడును. ప్రాకృతములు మూడు బుద్ధిపూర్వకములు. ఈ మూడును వైకృతము. ప్రాకృత వైకృత భేదమగు కౌమారము తొమ్మిదవ సర్గము. (58) ప్రాకృతములు వైకృతములు రెండును బుద్ధిపూర్వక సర్గములే. వాని వర్గములే బ్రాహ్మణులు నయిరి. (59) ఇవి యన్నియు విస్తరించి చెప్పబడినవి కదా. సర్వభూతములయందు సాల్లువిధములనీ చెప్పఁబడినది.

మరల వీనిలో విపర్యయము, శక్తి, బుద్ధి, దైవములని నాలుగు విధములు. స్థావరంబుల యందు విపర్యయంబును, తిర్యగ్యోనుల యందు శక్తియు నొప్పుచుండును. (61) మనుష్యులయందు సిద్దాత్ములు, దేవతలయందు పుష్టియు నుండును. అంత బ్రహ్మ ఆత్మ సమానులయిన మానసతనయులను సృజించెను. (62) మహాత్ములయినవారు మువ్వురు జ్ఞానవైవర్య మెలింగి సృష్టి కార్యమునుండి నివృత్తులైరి. (63) వారు ప్రతిసర్గము ప్రజాసర్గమును గావింపకయే విరక్తులైన బ్రహ్మ తదనంతరము తత్సృష్టికై ఇతరులయిన సాధకులను (దేవతలను) సృజించెను. (64) దేవతలు స్థానాభిమానులు, బ్రహ్మానుశాసనమున భూతములకెట్టి యవస్థలుండునో వానీనీ వారికి లేకుండుట వివరించెద వినుము. (65) నీరు, అగ్ని, పృథివి, వాయువు, అంతరిక్షము, దీవము, స్వర్గము, దీకులు, సముద్రములు, నదులు, వనస్పతులు. (66) ఓషధుల యొక్క వృక్షముల యొక్క లతల యొక్క వాని వానియొక్క లతలు, కాష్ట్రములును, కలలు, (కళలు - కాలపరిమాణము) ముహూర్తములు, సంధులు, రాత్రులు, పగళ్లు (67) అర్ధమాసములు, మాసములు, అయనములు, సంవత్సరములు, యుగములు - మున్నగు వానిని సృజించెను. (68) ప్రోతస్సులు, స్వభిమానములు, స్థానాఖ్యములు కూడ స్మరింపఁబడినవి.

స్థానాత్ములను ఆతఁడు సృజించీ యనంతరము ఇతరుల నాతఁడు సృజించెను. దేవతలను, పితృదేవతలను సృజించెను. వారి వలననే ప్రజలు వృద్ధి పొందిరి. (69) భృగువును, అంగీరసుని, మరీచిని, పులస్త్యునీ, పులహునీ, క్రతువును, దక్షుని, అత్రిని, వశిష్టుని, కూడ నాతఁడే సృజించెను. వీరందరు నవ (తొమ్మండుగురు) మానసులు. (70) ఈ విధంగా వీరు నవబ్రహ్మలని పురాణములో నీశ్చయింపబడినారు. బ్రహ్మ ఆస్వరూపంగల యోగులందరకు సృష్టికర్త. (71) వీరు తొమ్మండుగురు. నవబ్రహ్మలుగా పురాణములయందు (పూర్వము) నిశ్చయింపఁబడిరి. ఆత్మస్వరూపులు బ్రహ్మ యోగులయిన వీరందతీకి బ్రహ్మయే మూలము. తరువాత రోషాత్మ సంభవుఁడయిన రుద్రుని బ్రహ్మ మరల సృజించెను. ఎల్లరకు సంకల్పమును ధర్మమును పర్వతములుగా నతఁడే సృజించెను. (72) సుఖాత్మకము బ్రహ్మభూతమునయిన వ్యవసాయమును (ప్రయత్నశీలతను) అతఁడు సృజించెను. ఆ యవ్యక్తయోని యయిన పరమేశ్వరునకు సంకల్పమునుండి సంకల్పము పుట్టెను. (73) దక్షుఁడు (బ్రహ్మ) ప్రాణము వలన వాక్కును సృజించెను. నేత్రద్వయము నుండి మరీచిని, శిరస్సు నుండి ఆంగిరసుని, తరువాత శ్రోత్రము వలన అత్రిని, ఉదానము (పంచ ప్రాణములలో నొకటి) నుండి పులస్త్యుని, వ్యానము నుండి పులహుని, సమానము నుండి వశిష్టునీ, అపానము నుండి క్రతువును నిర్మించెను. వీరు బ్రహ్మ పుత్రులు : శ్రేష్ఠులు; సంఖ్యకు పండ్రెండుగురు.(76)

భృగ్వాదులు సృజింపఁబడిరి. వారు బ్రహ్మవాదులు కారు, (77) వారందఱు ప్రాచీనులు. బ్రహ్మయొక్క సుతులు. గృహమేధులుగా నెఱుంగఁదగినవారు. వీరు పండ్రెండుగురు. ద్విజులు, రుద్రునితో కూడ పుట్టిరి. (78) క్రతువు, సనత్కుమారుఁడు - వీరిరువురు ఊర్వ రేతస్కులు వీరందఱికంటె. పూర్వమే యుదయించిరి. అందుచే వీరు పూర్వజులు. (79) వారతీతులు : లోక సాధకులు : పురాణులు ఏడవ కల్పము నందు లోకమున తమ తేజస్సుచే ప్రచోదితులయి ప్రకాశించిరి. (80) వారిరువురు యోగధర్మపరులు. తమ్ము ఆత్మలో నారోపించుకొని (ఆత్మ స్వరూపులయి) మహాతేజో బలవంతులయిన వారిరువురు ప్రజాధర్మమును కొమమును వర్తించిరి. (81) పుట్టినప్పుడే యతఁడు కుమారుని వలెనుండిను. అందుచే తరువాత నతనికి సనత్కుమారుఁడను నామము సుప్రతిష్ఠితమయ్యెను. వారివి ద్వాదశవంశములు. అవి దీవ్యములు, దేవగణాన్వితములు. ఆ వంశములు సంతానవంతములు, క్రీయాకరణ సమర్థములు, మహర్షులచే నలంకృతములు. (83) ప్రాణముల నుండీ పుట్టిన ద్వాదశ వంశీయులయిన సర్వగుణ ప్రధానులను బ్రహ్మ చూచి, తరువాత ఆ ప్రభువు దేవతలను, అసురలను, పితరులను, మనుష్యులను సృజించెను. ముఖము నుండి దేవతలను, వక్షస్థలమున నుండి పితరులను, జననేంద్రియముల నుండి మనుష్యులను, జఘనము నుండి అసురులను బ్రహ్మ పుట్టించెను.

దేవదేవుఁడయిన బ్రహ్మ మరల మానుషాత్మమయిన జ్యోత్స్న నుండి రాత్రిని, సుధ నుండి పితరులను సృజించెను. (86) తరువాత ముఖ్యులు అముఖ్యులునునయిన దేవతలను సురలను, మనస్సు నుండి మనుష్యులను, పితరులవలే మహా పితరులను బ్రహ్మ సృజించెను. (87) విద్యుత్తు నుండి పిడుగులతోడి మేఘములను లోహిత వర్ణముగల ఇంద్ర ధనువులను, ఋక్కులను, యజస్సులను, సామములను, బ్రహ్మ యజ్ఞ సీద్దీ కొఱకు నిర్మాణించెను. (88) నానా విధములయిన భూతములు ఆ బ్రహ్మ మహస్సు నుండి పుట్టెను. దేవతలు ఋషులు పితరులు, మానవులు బ్రహ్మయొక్క ప్రజాసృష్టియైనది. (89) మల బ్రహ్మ, చరాచరములయిన భూతములను యక్షులను, పిశాచములను, గంధర్వులను, అంతటను అప్సరలను, నరులను, కిన్నరులను, రాక్షసులను, పక్షులను, పశువులను, మృగములను, సర్పములను, వ్యయము అవ్యయము నయన స్థావర జంగమ వస్తు ద్వయమును సృష్టించెను. (90-91) స్వయంభువుడయిన బ్రహ్మ సృజనమునకు పూర్వము వానికే యే కర్మలున్నవో, మఱల మఱల సృజింపబడి ఆయా కర్మలనే యవి పొందుచున్నవి. (92) హింసాత్మకములు, అహింసాత్మకములు, మృదువులు క్రూరములు, ధర్మాధర్మములు, చేయబడినవీ చేయబడనీవీ (కృతాకృతములు) వానికి వేఱువేఱుగా కనబడినను విభజింపబడని త్రివిధ భేధలక్షణములు కలిగినవని యెంటుంగవలయును. (94) సత్త్వస్టులయిన సమదర్శినులు, అట్టిది, అట్టిది కానిదీ, ఉభయమైనదీ, ఉభయము కానీదీయు కర్మ విషయమని వక్కాణింతురు. (95) తను నామములచే పంచ భూతముల వాని విస్తృతిని, దివ శబ్దముచే ఆమహేశ్వరుఁడు సృజించెను.

ఏయవి యార్ష నామములు దేవతల యందు సృష్ణులో, అవి రాత్రియందు పుట్టవు : మటల ప్రభువయిన బ్రహ్మ వానీ కొఱకు వహించెను. (96) ఈ విధముగా స్వయంభువుని వలన మహత్తు మొదలుకొని విశేషాంతము వణుకు, ప్రాకృతములయిన వికారములు స్వయముగా లోక సర్గము కారణము నుండి యుద్భూతమయినవి. (97) చంద్రసూర్యరుచిభాసురమై, గ్రహనక్షత్ర శోభితమై సహస్ర సంఖ్యాకము లయిన నదులతో, సముద్రములతో పర్వతములతో (98) వివిధములు రమ్యములు, ప్రకాశవంతములు నయిన పురములతో, జనపదములతో బ్రహ్మ ప్రాకృత సృష్టి యొప్పెను. దీనిని బ్రహ్మవనమందురు. ఈ బ్రహ్మవనమునందు అవ్యక్తుఁడు, సర్వవిదుఁడునైన బ్రహ్మ సంచరించును. (98) అవ్యక్త బీజప్రభవమై ఆతనీ యనుగ్రహమున స్థితినొంది, బుద్దిరూప స్కంధములు గలిగి, ఇంద్రియాంతర కోట రంబై తనరి (100) మహా భూత ప్రకాశమై, విశేష పత్రములతోగూడి, ధర్మాధర్మ పుష్ప యుతమై సుఖదుఃఖ ఫలోదయమై (101) సర్వభూతములకు జీవసాధనంబయి, సనాతనమై బ్రహ్మ వృక్షములలరారును. ఇయ్యది బ్రహ్మాండమను వనమునందొప్పి యున్నది. (102) అవ్యక్తము కారణమయి, నిత్యమయి, సదాసదాత్మకమై యియయ్యది యుండును. తత్త్వ చింతకులు దీనినే ప్రధానమని, ప్రకృతియని, మా యయని చెప్పుదురు. (103) ఇట్లు ఈ సృష్టి బ్రహ్మయొక్క అనుగ్రహమని బ్రహ్మనిమిత్తమాత్రుఁడని యెరుంగ వలయును. వృద్ధి రహితములు ప్రాకృతములు నయిన సృష్టులు మూడు. (104) వీనిలో ముఖ్యాదులయినవి ఆరు. ఇవియు వైకృతములు బుద్ధిపూర్వకములు. ఇవియన్నియు వికల్పముగా బ్రహ్మ నుండి ప్రవర్తించును.

ఇట్లు ప్రాకృతములు వైకృతములని సృష్టులు తొమ్మిది విధములు. ఇవి పరస్పరోత్పన్నములు. పరస్పరము కారణములని బుధులు తలంచుచున్నారు. (106) అచింత్యాత్ముఁడు భూతసృష్టికి కారణమయిన మహాత్మునకు, మూర్ధము వేదమయ్యెను. ఆకాశము నాభియయ్యెను. సూర్యచంద్రులు నేత్రద్వయమైరి. దిక్కులు శ్రోత్రములు, పాదములు భూమి,యునయ్యెను. (107) ఆ మహాత్మునీ వక్షము నుండి బ్రాహ్మణులు, వక్ష స్థలము నుండి క్షత్రియులు, ఊరుద్వయము నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు, శరీరము నుండి (తనువు నుండి) సర్వవర్ణములు ప్రసవించిరి. (108) అవ్యక్తుఁడైన నారాయణు నుండి బ్రహ్మాండమ వ్యక్త సంజ్ఞితముగా నుద్భవించెను. బ్రహ్మాండమే స్వయముగా బ్రహ్మ ఆతనీ వలననే లోకములు స్వయముగా సృజింపఁబడినవి. (109) అందు పదికల్పముల కాలముండి, ఆత్మభవుఁడు అఖిలలోకులు మరల సత్యమను పేరనొప్పు లోకమునకు పోవుదురు. అది బ్రహ్మలోకము. అందు వారుపునారవృత్తి లేని గతినందుదురు. తిరిగి జన్మనొందరు. (110) ఆధిపత్యమొక్కటి తక్క ఆ బ్రహ్మ లోకమున వారందరు సర్వైశ్వర్యముతో బ్రహ్మతో తుల్యత్వమొంది రూపమున ఘనతత్త్వ చింతనమున సమానులై యుందురు. (111) అచ్చట వారు ప్రీతియుక్తులై స్వసంయుతులై, శక్తిసంపన్నులై యెప్పుడే యది చేయవలయునో దానినొనరించుచు నుందురు. (112) నిద్రించు సమయముల అబుధ్ధిపూర్వకమయిన బోధకలుగునట్లు, వారందరు సానొకార్యకలాపముల సంబంధము కలిగియుండియు తత్కాల భావితములయిన క్రియలలో నిమగ్నులయ్యు, స్వబుద్ధి పూర్వకమగు విజ్ఞానమును గలిగియే యుందురు. (113) తత్తత్కాల భావితమయిన జ్ఞానము వారల కుండును. వారు శుష్ములు. అగ్నివత్ పరిశుద్ధులు. వారికి భేదబుద్ధులుండవు. (114) ఆ బ్రహ్మలోకమున నివసించునట్టివారు, నాసాత్వ దర్శినులునునయిన వారివలన కార్యములు కారణములు ప్రవర్తిల్లును.

విగతవికారులు, తమ తమ ధర్మమునందు సంస్థితులు నయినవారు, బ్రహ్మతో తుల్య లక్షణములు పొందినవారు, శుభాత్ములు, దోష రహితులు; తమ ప్రకృతీ లక్షణములు కరణములు గలిగి, తమ స్వభావ స్థితులై, యుందురు. నిజమునకు తమ ప్రకృతి స్థాపన ప్రకృతులయి స్థాపించుట లక్షణము. (117) అన్య పురుష బహుత్వముచే ప్రతీతి కలుగదు. వారు వారి యొక్క ఆకార సదృశులైనవారి సృష్టిచే మటల సర్గము ప్రవర్తించును. (118) తత్త్వదర్శినులకు, సమాధి స్థితులకు సంయోగము (ప్రకృతి భావముతోని సంసర్గము) కలిగినచో నది స్వప్రకృతిచే దేలీయదగినది. వారొక వర్గమునకు చెందినవారు. తిరిగి జన్మ సంబంధమయిన భారమును వహించువారు కారు. (119) శాంతించిన అగ్నులకుం వోలే వారికి మరల జన్మము లేకపోవుట సత్యము. తరువాత నచ్చట నుండి త్రైలోక్యము కంటినూర్థ్వమున కరిగి సంతోషాత్ములై యుందురు. (120) పొరలతో మహర్లోకము అసాసాదితమయినది. వారి శిష్యులు ఎవ్వరచ్చట నుండిరో, ప్రళయ మందలి కల్పాన్నీ సన్నిహితము కాగా గంధర్వాదులు, పిశాచులు, మనుష్యులు, బ్రాహ్మణాదులు, పశువులు, పక్షులు, స్థావరములు, ససరీసృపములు, పృథివీతల వాసులు నుండగా, (నవీయన్నీయు) సహాస్ర సంఖ్యగా వెలయు సూర్యరశ్ముల యొక్క కారణముగా నశించును. (123) ఆ యగ్నులు సప్తరశ్ములయి యొక్కొక్కటీ యొక సూర్యసదృశమై పుట్టును. క్రమముగా నవి శతమాన సంఖ్యనొందును. మూడు లోకములను దహించును. (124) అనావృష్టిచే పూర్వమేవ్వీ - జంగమ పదార్ధములు స్థావరములు, నదులు, సర్వపర్వతములు శుష్కములయినవోయవ్వి యా భయంకర సూర్య రశ్ములచే తప్తములై యొప్పినవీ.

అప్పుడు స్థావరములు జంగమములయిన సర్వపదార్ధములు వీవశములై సూర్యరశ్మిచే దగ్గపటలములైనవి. అయ్యవి దగ్గములయిన దేహములతో విధూతములు ప్రక్షాళితములయిన పాపములతో, యుగాంతమునందు వీఖ్యాతములయినవి. తాపముల నుండి వినిర్ముక్తములయినవి. శుభాశుభకర్మ బంధముల నుండి విడివడినవి. (127) అంత, అవ్యక్త జన్ముఁడయిన బ్రహ్మ సంబంధ మయిన ఒకరాత్రి కాలము వారు (అవీ) యుండి, తమతో సమానమయిన రూపములు గల జనులతో కలిసికొందురు. మరల వచ్చెడు జన్మములో వారందరు బ్రహ్మమానస జన్ములగుదురు. అంత, మూఁడు లోకముల యందు నివసించుచున్నట్టి వారు జనులతో గలిసిపోయిన తరువాత (129) మూఁడు లోకములు సప్తసూర్యులచే దగ్గములయిన వేనుక, భూమి యంతయు వివిక్త ప్రదేశముల యందు సముద్రములయందు వర్షముచే పరిస్లావితముకాగా (130) సముద్రములు, మేఘములు, భూమియందలి నీరములు, శరప్రవాహములవలె ముందునకు ప్రవహించుకోనుచు పోవును. అయ్యవి పర్వతములచే పిలువబడిపోవునట్లు “సలిలము”లని పేరు పొందును. (131) ఇట్లు ప్రవహించేడీ, ప్రవహింపక నిలిచిపోయి యున్న నీరములు భూమిని కప్పి ఆచ్చాదీంచి యుండును. అందుచే 'అర్ణవ' మను పేరు దానికి కలిగెను. (132) అంతకు పూర్వం వచ్చినది, రాబోవునది అయిన అధికమయిన జలము ఈభూమినీ కప్పివేసి సముద్రముగా అయినది. ఇచ్చట 'భా' అన్నది కాంతి, ప్రకాశమను నర్థమున వాడబడినది. అంత నొ నీరము సర్వమును వ్యాపించినది. అన్నియును నందు విలీనమయి నవి. ఆ జలము పృథివి అంతటను విస్తరించి, వ్యాపించినది యగుట 'అతను' అయినది. 'తనోతి' ధాతువు. వ్యాపించుట; అందుచే నీటికి అపతనువను పేరు వచ్చినది. (134) ‘సర’ అను పదమునకు 'శీర్ణ' అను అర్ధము కలదు. శీర్ణము చెదరిపోయినది. ఈ ధాతువున కెన్నియో యర్ధములున్నవి. ఆయనంత జల విస్తృతిలో జలము శీర్ణము కాలేదు. అందుచే 'నారము' లయినవి. (135)

ఆ నీటిలో సహస్రయుగముల యనంతరము, బ్రహ్మయొక్క దినప్రమాణము సమాప్తము కాగా, అంతటి ప్రమాణమే కలిగిన బ్రహ్మ యొక్క రాత్రి కాలము నీటిలో కలుగగా, అప్పుడు నీటియందు గల భూమీయందు అగ్ని చల్లారును. అప్పుడు ప్రశాంతములయిన గాలులలో అంధకారములో, వెలుతురే మాత్రముండదు. (137) ప్రపంచమున ఆధ్యక్షము వహించిన బ్రహ్మ మరల లోకమును విభజింపఁదల పోసెను. (138) ఏకార్ణవ మయి నీరములచే వ్యాప్తమై యున్న ప్రపంచమున చరాచరములయిన సర్వము నశించినవి. అప్పుడు సహస్రాక్షుఁడు సహస్రపాదుఁడు సహస్రశీరుఁడు, రుక్మవర్లుఁడు, అతీంద్రియుఁడు నైన బ్రహ్మ నారాయణాఖ్యుండు ఆ జలముల నిద్రించెను. (139,140) మరల సత్వోద్రేక మున నాతండు మేల్కొనెను. సర్వ ప్రపంచమును దిలకించెను. శూన్యమైయుండుట కొంచెను. దీనితో బ్రహ్మాండ పురాణము యొక్క ప్రథమ పాదము పరికీర్తితమయినది.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమున ప్రథమభాగమున ప్రక్రియా పాదమునందు లోక కల్పనమను పంచమాధ్యాయము సంపూర్ణము.