1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము

Table of Contents

12 - అగ్నివంశము

సూత ఉవాచ:-

స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మ మానసపుత్రుఁడు అగ్నియొక్క అభిమాన దేవతగా స్మరింపఁబడును. ఆయగ్ని వలన స్వాహకు ముగ్గురు పుత్రులు కలిగిరి. వారు పవమానుఁడు (గార్హపత్యము) పావకుఁడు, శుచి, అనువారు.. (శుచినే యగ్నియందురు) పవమాన వహ్ని అరణిని మథించుట వలన నుత్పన్నమయినది. పొవకార్నీ విద్యుత్తు నుండి కలిగినది. శుచి సూర్యుని వలన కలిగిన అగ్ని దీనిని సౌరాగ్ని అందురు. వీని నగ్నిచయ మందురు. (3) పావకాగ్ని నీటిని తదుత్పత్తి స్థానముగా గలిగినది. అయ్యది (పావకాగ్ని) విద్యుత్తు నుండి పుట్టును అరటి, సూర్యుడు, విద్యుత్తు క్రమముగా వాని పుట్టిన స్థానములు. పవమానుని కుమారునిగా కవ్యవాహనుని చెప్పుదురు. సహరక్షుఁడు పావకుని కుమారుఁడు. హవ్యవాహనుఁడు శుచికుమారుఁడు. హవ్యవాహనుఁడు దేవతాగ్ని : కవ్యవాహనుఁడు పితరులకు సంబంధించిన అగ్ని; సహారక్ష రాక్షసుల యొక్క (అసురులయొక్క) అగ్ని, అందుచే నీ ముగ్గురు దేవతలకు పితరులకు రాక్షసులకు సంబంధించిన అగ్నులు. వీరి కుమారులు, మనుమలు కలిసి నలుబది తొమ్మండు. (4,6) వారి విభజనమును నామములతో సహితముగా వేఱువేఱుగా పేర్కొందును. ప్రథితుఁడయిన లౌకికాగ్ని బ్రహ్మగారి మొదటి కుమారుడు. (7) బ్రహ్మదగ్ని అనఁగా బ్రహ్మకు సమర్పించిన అగ్ని. బ్రహ్మదత్తాగ్నిని సత్పుత్రుం డు వైశ్వానరుఁడు. ఆతఁడు శత సంవత్సరములు హవ్యమును (అగ్నిని) వహించెను. (8) పూర్వమే ఏధితి (నాముకాగ్ని) పుష్కరమను సముద్రము నందు అధర్వణునిచే సంపాదింపఁబడినది. అందుచే లౌకికాగ్ని ఆధర్వణాగ్నిగా స్మరింపఁబడుచున్నది. ఈ యధర్వణుని పుత్రుఁడు దర్పహుఁడు,

 అధర్వుని వలన భృగుడదయించేను. ఆయగ్ని ఆధర్వణాగ్నిగా (అధర్వణుని కుమారునిగా) స్మరింపఁబడినది. అందుచే లౌకికాగ్ని దధ్యజుం డు. ఇతఁడే అధర్వుని కుమారుఁడు. (10) అధర్వణుని కుమారుఁడయిన పవమాన్యుడు మథనముచే పొందఁదగిన వాఁడని విజ్ఞులందురు. అయ్యదియే గార్హపత్యాగ్నియని యేరుంగవలయును అతనికిరువురు సుతులు. వారు శంస్యుఁడు, శుకుడు. శంష్యుఁడు ఆహవనీయాగ్ని, ఆతనిని హవ్యవాహనునిగా జ్ఞప్తి యందుంచుకొనవలెను. రెండవ కుమారుడు శుకుఁడు. అతఁడు (శుకుఁడు) అగ్నిని సంగ్రహణము చేయును, వహించును, (12) శంష్యునకు సవ్యాపసవ్యులిద్దరు కుమారులు. హవ్యవాహనుఁడయిన శంస్యుఁడు షోడశనదులను ప్రేమించేను. (13) ఆ హవనీయునిగా స్మరింపఁబడు, శంష్యాగ్నిని బ్రాహ్మణులు అభిమాని ఆగ్నిగా గుర్తించిరి. బ్రాహ్మణులీ షోడశ (16) నదుల నభిమానించిరి. ఆ 16 నదులు - కావేరి, కృష్ణవేణి, నర్మద, యమున, గోదావరి, వితస్త, చంద్రభాగ, ఇరావతి, విపాశ, కౌశికీ, శతద్రు, సరయు, సీత, సరస్వతీ, హోదీని, పావని - అనునవి. ఆతఁడు (శంష్యుఁడు) తన్ను షోడశ ధామములుగా విభజించుకొనెను (ధామము - ఉండుచోటు - నీవాసము). ఆ ధామముల యందోతఁడు తన్ను నిక్షేపించుకొనెను. (అగ్నులు ధిష్టులు) లేదా అగ్నిధామములు. ఆ దిష్ణులను అగ్నులు కృత్తికాచారిణులు. ఆ ధిష్టులకు పుత్రులు కలిగిరి. అందుచే ఆ బిడ్డలు ధీష్ఠులు అని పిలువబడిరి. ఇట్లు నదులకు దిష్ణులయందు (అగ్ని స్థానముల యందు) కుమారులుదయించిరి. వారు ధీష్ఠులుగా కీర్తిగనిరి. వీరిని నదీ పుత్రులనుగా నెఱుంగదగును." (14,18) వీనిలో కొన్ని అగ్నులు విరహణీయములు. (తీసికొని పరువం దగినవి లేదా పరిత్యక్తావ్యములు). మిగిలినవి 'ఉపగ్గేయములు. (ఉంచదగినవి). అవి పురోగాములు. వానిని గూర్చి వినుము. సంక్షిప్తముగా చెప్పెదను. క్రింద చెప్పబడువారు శంస్యాగ్ని సుతులు. వీరినందరినీ బ్రాహ్మణులు ఉపస్థయాగ్నులుగా స్మరింతురు. విభుఁడు, ప్రవహణుఁడు, అగ్నీధ్రుఁడు, మొదలగువారు ధిష్ణులు (ఆహితాగ్నులు). వీరందరు వారివారి యర్ఘ స్థానములలో, సోమరసము పిండిన దినమున యజ్ఞమున నుంపబడుదురు. (20).

అనుద్దేశ్యమున (ఏ నిర్దేశమీయక చేయబడిన యజ్ఞము) నుంచబడు అగ్నుల క్రమము నాలకింపుము. సమ్రాడగ్నితో నారంభించి అష్ణాగ్నులను బ్రాహ్మణులు పూజింతురు. అయ్యది సమ్రాడగ్న్యాదులు రెండవది కృశానుఁడు. ఇది వేదికాంతరమున నుండును. మూఁడవదీ పరీషతవమానాగ్ని ఇదీ అనుద్దిశ్యమే. నిర్దేశించిన విధమున వ్రేల్చబడును. (21,22) వేటొక్క అగ్ని ప్రతలము. దానినే నభోగ్ని అందురు. - అయ్యది చత్వరమున భావింపఁబడును, చత్వరమున చతురస్రమే సమతలమై యజ్ఞము కొఱకై సిద్ధము చేయబడిన ప్రదేశము. ఘృతముతో సంస్పృష్టము కానీ హవ్యము అగ్నిలో శామిత్రమను పాత్రమున భావింపఁబడును. యజ్ఞమున నుపయోగింపఁబడు ఒకానొక విధమయిన పాత్రము 'శామీత్రము' (23) తరువాత అగ్ని ఋతుధామమనునది. దానినే సుజ్యోతి యనియు, ఔదుంబర్యమనియు, విశ్వవ్యచస్సనియు కీర్తింపం బడును. ఇది సముద్రాగ్నీ దీనిని బ్రహ్మ స్థానమున కీర్తింతురు. బ్రహ్మ జ్యోతియైన వసుర్ధామమునే బ్రహ్మ స్థానము నందు చెప్పుదురు. ఉపగ్గేయమయిన అజైకషాదాన్నీ సాలా సుఖీయక మైనది. అహిర్భుధ్యుము అనుద్దేశ్యాగ్ని అయ్యదియే 'గృహపతి' అగ్నిగా స్మరింపఁబడును. (27) ఇక విహరణీయులను వాసియెనమండ్రు కుమారులను గూర్చి చెప్పెదను. విభుఁడు, ప్రపోహనుఁడు, అగ్నీధ్రుడు - మొదలగువారు. ధిష్ఠులు వారి వారి స్థానముల (20వ శ్లోకము పునరుక్తము). సోమ యజ్ఞమున విధింపఁబడినది. హవ్యవాహనాగినీ హోత్రీయాగ్నిగా స్మరించిరి. (28)

రెండవ యగ్ని ప్రచేతసుఁడు. అది ప్రశాంతాగ్ని. తరువాత వైశ్వానరాగ్ని కలదు. దానీనీ బ్రాహ్మణులు 'శంసి’ యందురు. (29) ఉసికన్నీ కలదు. దానికి కవి అని పేరు. దానినే పోతోగ్నిగా భావింతురు. దీనినే ఆవారిరగ్నిగా, భారీ అగ్నిగా, వైఫీయాగ్నిగా భావింతురు. (30) అవస్ఫూర్జాగ్నినీ వివస్వంతుఁడని, ఆస్థానాగ్నియని చెప్పుదురు. ఎనిమిదవది సుద్యురగ్నీ దీనిని 'మార్జాలీ' యాగ్ని యందురు. (31) ధిష్ట్యాగ్నులను, విహరణీయా గ్నులను సౌత్యేహ్నేజ్యంతమున (సోమరసమును పిండు దినమున) ద్విజులు పూజింతురు. సుద్యురగ్నీ నీటిని జన్మ స్థానముగా గలది (యోని) నిజముగా నయ్యది నీటియందే భావింపఁబడినది. (32) పావకాగ్ని నీటి నుండి పుట్టినదీ. ఇదీ అబ్దము. (నీరే యోగుట) ఈ అగ్నినే అవభృథాగ్నీగా నెఱుంగవలయును. (యజ్ఞాంత తర్పణమవబ్బథము). ఇయ్యది వరుణునితో సహా పూజింపఁబడును. (33) హృచ్ఛయుఁడు (హృదయమున శయనించుపోఁడు) అనునగ్ని పావకుని సుతుఁడు. మానవ హృదయమందలి ఆహారమున జీర్ణింపఁజేయునట్టి జఠరాగ్ని ఇదీయే. (పావకుఁడు - హృచ్ఛయుఁడు - మృత్యుమంతుఁడు - సంవర్తకుడు - సహరక్షుడు - క్షాముఁడు - క్రవ్యాదుఁడు) మృత్యుమంతుఁడు జాఠరాగ్ని యొక్క విద్వాంసుఁడయిన సుతుఁడు, (34) పరస్పరోళితమయిన అగ్నీ ఇచ్చట నన్ని భూతములను దహించును. భయంకరుండైన సంవర్తకాగ్ని మృత్యుమంతుని కుమారుఁడుగా గ్రహింపవలెను. (35) అయ్యది నీటిని త్రాగును. సంద్రమున వసించును. దానికి బాడబశ్రీ బ్రహ్మాండ మహాపురాణమ్ (ఆడగుపు) ముఖము కలదు. సహరక్షుఁడు సముద్ర పోసేయొక్క పుత్రుడు. (36) సపోరకునీ కుమారుడు క్షోముఁడు. అతఁడు మానవుల గృహములను దహించును. ఆతని కోమరుఁడు క్రవాదుఁడు. ఇతఁడు మృతశధీరములను దీనును.

వీరు పావకానీ పుత్రులు. ప్రకీర్తింపబడిరి. తరువాత సొరుదు అయిన (సూర్య సంబంధియైన) అగ్ని శుచి. దీనినే గంధర్వులు ‘ఆయువు' అందురు. (38) అరణీయండు మథింపఁబడిన యగ్నీ ఇతరాగ్నులను ప్రజ్జ్వలింపజేయును. ఈ యగ్నియొక ప్రదేశము నుండి వేడొక ప్రదేశమునకుఁ దీసికోనీ పోవఁబడును. ఈ అగ్ని ఆయువుగా ప్రఖ్యాతుఁడు, (39) ఆయువు పుత్రుఁడు మహిషుఁడు, ఆతని కుమారుని నామము సహసుఁడు. ఈ సహసుఁడు పాక యజ్ఞమునందభిమాని. (పచన యజ్ఞమునందు ప్రీతిమంతుఁడు). (40) ఈ సహసుని కుమారుఁడు అద్బుతుఁడు. ఇతఁడు మహా యశస్వి 'ఏవీధి’ అద్భుతుని యొక్క కుమారుఁడు. అతఁడు చాలా గొప్పవాఁడు. (41) ఈ అగ్ని (వివిధి నామకుం డు) ప్రాయశ్చిత్తముల యందభిమానీ అగ్నిలో ఆహుతీగావింపఁబడిన హవిస్సుల నీతఁడు సదా భుజించును. 'అర్కుడు' వివిధీ యొక్క కుమారుం డు. ఈ క్రింది వారు అర్మాన్ని సుతులు. (42) 1. అనీక వంతుఁడు; 2. వాజసృక్కు 3, రక్షోహా, 4, యష్టికృత్తు, 5. సురభి, 6. వసువు, 7. అన్నాదుఁడు, 8. ఆప్రవిష్ణుండు, 9, రుక్మరాట్టు (43) వీరందరు 'శుచి' యొక్క పదునలుగురు కుమారులు, వీరందరు యజ్ఞములయందు పవిత్రీకృతులు. (44) స్వయంభువమను మొదటీ మన్వంతరములో అభిమానులయిన యీ అగ్నులు సురోత్తములయిన “యాము”లతో వ్యతీతులయిరీ (గడచిపోయిరీ) (45) పర్వము, లోకమున, హవ్యవాహనాగ్నులు చేతనాచేతసాభిమానులయిన విహరణీయాగ్నులతో హరి స్థానముల నభిమానులయి యుండిరి. (46)

ఈ యగ్నులు పవిత్రములయిన యజ్ఞకర్మల యందు అవస్థితములు. వారు కొమ్యకర్మలు, నైమిత్తిక కర్మలును. (ఫలితమును గోరునట్టివీ కామ్యములు. నిమిత్తము కలిగినప్పుడప్పుడప్పుడుపయోగింపబడునవి నిమిత్త కర్మలు). అయ్యప్ శుక్రములతో యాగములతో పూర్వము మన్వంతరమున అతీతములయినవి గతించి పోయినవి) (41) మొదటి మనువు యొక్క మన్వంతరమున, పుణ్యులు, మహాత్ములు, నయిన దేవతలతో వారు చనిది. ఈ స్థానికుల యొక్క స్థానములు నాచేనభివర్ణితము లయినవి. (46) జరిగిపోయిన మన్వంతరములందు, భవిష్య నన్వంతరములందు జాతవేదులనంబడు అగ్నుల లక్షణములు అన్నియును పోనీ వలన నభివర్ణింపఁబడినవి. (49) వారందలు తపస్వినులు, వారందరు బ్రహ్మభృత్తులు. (బ్రహ్మజ్ఞానమును చపోంచినపోరు}. వారందఱు ప్రజాపతులు. వారు జ్యోతిషంంతముల స్మరింపఁబడిరి. (50) (ప్రకాశించు జ్యోతి స్వరూపులుగా గమనింపఁబడిరి). వీరందరు ఇప్పుడు స్వారోచిషాదులయిన ఏడుగురు మన్వంతరములతో ఆరంభించి, సావర్ణ్యమనువుతో సమాప్తమొందు మనువుల సోమములతో రూపములతో వర్తమానులయిన అగ్నులు "యామా”గ్నులతో సహా నుండిరి. అనాగతులయిన అగ్నులు (భవిష్యదగ్నులు) భవిష్యద్దేవతలతో సహా యుందురు. (52) ఈ విధముగా "అగ్నీ నిచయము క్రమముగా నభివర్ణింపం బడినది. ఇంక విస్తరించి పితృసంబంధి యగ్నివంశము అభివర్ణింపఁబడును. (53)

ఇది వాయుప్రోక్తమగు శ్రీ బ్రహ్మాండ మహాపురాణమందు పూర్వభాగమున ద్వితీయానుషంగ పాదమున 'అగ్ని నిచయ"మను పండ్రెండవ యధ్యాయము సమాప్తము.