1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
29 - యుగచక్రము యుగస్వభావములు
ఋషిరువాచ :-
సూత ఉవాచ :-
స్వాయంభువ మన్వంతరమునకు పూర్వముకల చతుర్యుగముల స్వభావమును గూర్చి తత్త్వమును గూర్చి విస్తరముగా వినఁగోరుచున్నాను. సూతుఁడిట్లు ప్రత్యుత్తర మొసంగెను. పూర్వము పృథివ్యాది ప్రసంగపశమున నే చెప్పిన విషయములో చతుర్యుగముల గూర్చి యున్నది. నేనదీ మరల చెప్పెదను. వినుఁడు తెలిసికొనుఁడు. (2) నాలుగు యుగములఁ గూర్చి చెప్పునప్పుడందు ఆరు విషయములున్నవి, యుగము, యుగభేదము {యుగములలోని తార తమ్యము) యుగధర్మము (యుగముల యొక్క ప్రత్యేక లక్షణములు) యుగసంధ్య (యుగముల సంధీ) యుగాంశకము (యుగము యొక్క భాగము) యుగసంధానము (రెండు యుగముల కలయిక) వీనిని యథార్థముగా (తత్త్వతః) వివరముగా విస్తరించెదను. ప్రతి విషయము వివరించెదను, అంతియేకాక పోని వాని సరియైన సంఖ్యను కూడ (లెక్క గణనము) ఎచ్చటేచ్చట నవసరమో అందు చెప్పెదను. (4) లౌకిక గణనము ననుసరించి మానుష సంవత్సరమును లెక్కించిన తరువాత, నాలుగు యుగములను మానుష సంఖ్యా గణనమున చేప్పెదను. (5) కాష్ఠ ఒక్క రెప్పపాటు కాలము. కాష్ట (కాలగణన మానమున అల్పిష్టమైనది) ఒక లఘ్వక్షరము నుచ్చరించుటకు పట్టుకాలము కూడ కొష్టముగానే గ్రహింపవలయును 15 నిమేషములు ఒక కాష్ఠము, 50 కాష్ఠములు ఒక కల 30 కలలు ఒక ముహూర్తము. పగలు రాత్రి కలిసి ముప్పది ముహూర్తములు, అవి రెండును ఒండొంటికి సమానముగా నుండును. (6) మానుష లౌకికములయిన దివారాత్రములను సూర్యుఁడు విభజించును. (7) అందు కర్మలాచరించుటకు పగలు, రాత్రి నిద్రకును కల్పింపబడినవి. పితరుల యొక్క పగలు, ఒకరాత్రి ఒక (మానుష) మాసమగును. మరల వానిలోని ప్రవీభాగము నీతీరున నుండును. కృష్ణపక్షము వారికి పగలు; శుక్లపక్షము వారికి రాత్రి. (ఆ రాత్రి వారి నిద్రకు) ముప్పది మానవుల మాసములు పితరుల కొకమాసము 360 మానవ మాసములు పితరుల కొక సంవత్సరమగును, (10) మానవ గణనమును బట్టియయిన యొక వంద సంవత్సరములు పితరులకు మూడు సంవత్సరముల పదమాసములు. కాలగణన ప్రమాణము అల్పమైన కాలగణనము కొష్ఠము. అది ఒక రెప్పపాటు కాలము.
15 నిమేషములు - ఒక కాష్ఠము. 30 కాష్ఠలు = ఒక కల
30 కలలు ఒక ముహూర్తము. 30 ముహూర్తములు ఒక పగలు, ఒక రాత్రి
30 రోజులు ఒక నెల; ఇది పితరులకు ఒక పగలు. ఒక రాత్రి
30 మానవ మాసములు - పితరుల కొక నెల
360 మానవ మాసములు - పితరుల కొక సంవత్సరము.
వంద మానవ సంవత్సరములు పితరులకు మూడు సంవత్సరముల పదిమాసములు
మానవ ఉత్తరాయణము = (6 మాసములు) = ఇది దేవతల కొక పగలు
మానవ దక్షిణాయనము = (6 మాసములు) = దేవతల కొక రాత్రి
ఒక మానవ సంవత్సరము = దేవతల ఒక పూర్తి రోజు (ఒక పగలు = ఒక రాత్రి)
30 మానవ సంవత్సరములు = దేవతలకొక మాసము
360 మానవ సంవత్సరములు = దేవతల కొక సంవత్సరము
3030 మానవ సంవత్సరములు = ఒక సప్తర్షి సంవత్సరము
9090 మానవ సంవత్సరములు = ఒక ధ్రువ సంవత్సరము
360000 మానవ సంవత్సరములు = దేవతలకు వేయి సంవత్సరములు
లౌకిక గణనమును బట్టి యేదీ క మానుష సంవత్సరముగా స్మరింపఁబడునో, అయ్యది దేవతలకొక పగలు ఒకరాత్రేయును. ఈ విధముగా శాస్త్రములయందు నిశ్చయింపఁబడినది. దీవ్యమైన (దేవతా సంబంధమైన) ఒక పగలు, ఒక రాత్రియు కలిసి ఒక సంవత్సర మగును. వానిలోను ఇంకను విభాగములు కలవు. అవి యిట్లుండును. (13) సూర్యుని ఉత్తరగమనము పగలు, దక్షిణ గమనము రాత్రీ యగును. ఇది దేవతలకు దేవతల దివారాత్రములం గూర్చిన లెక్కలివిధముగా నుండును. (14)
ముప్పదీ మానుష సంవత్సరములు ఒక దేవతల మాసము. ఒక వంద మానుష సంవత్సరములు మూఁడు దేవతా మాసములు, పదీదేవ దీనములకు సమానమని తెలియనగును. దీనినే దేవతా గణన మానముగా జ్ఞాపక ముంచుకొనవలెను. మానవుల లెక్కలను అనుసరించి, 360 సంవత్సరములు ఒక దివ్య సంవత్సరముగా ప్రకీర్తితము. (15, 16) 3030 మూడు వేల ముప్పది మానుష సంవత్సరములు ఒక సప్తర్షి సంవత్సరముగా భావింపఁబడినది. [17) మానవ ప్రమాణములను లెక్కలను బట్టి తొమ్మిదివేల తొంబదీ (9090) సంవత్సరములు ఒక ధ్రువ సంవత్సరముగా స్మరింపఁబడినది. (18) మానుష సంబంధమైన షడ్వింశతి సహస్ర వత్సరములను (26000) ఒక వంద సంవత్సరములకు సమానముగా తెలియవలయును. ఇయ్యదియే దేవతా గణనముగా నేలుంగవలయును. (19) 366000 అయిన మానుష వరములు ఒక వేయి దేవతా సంవత్సరములు. ఏవం విధమయిన గణనముతో పరిచయము గలవారీట్లు చెప్పుదురు. (20,21) ఈ విధముగా దేవతాసంవత్సర గణనమును గూర్చి ఋషులు కీర్తించిరి. ఇంక యుగ సంవత్సర ప్రమాణమును దేవతా గణనము ననుసరించి చెప్పెదను. (22) కవయః - పండితులు, బుధులు) (భారత వర్షమునందే యీ యుగ సంఖ్యను నియమించుట ఆశ్చర్యముగా నున్నది.) భారత వరమున నాలుగు యుగములు గలవని విద్వాంసులు చెప్పిరి. అవి (1) కృతయుగము (2) త్రేతాయుగము (3) ద్వాపరయుగము (4) కలియుగములు. మొదటిది కృతయుగము తరువాత త్రేతాయుగము చెప్పబడినది. తరుపోత ద్వాపరకలియుగములు. వీనిని యుగములుగా లెక్కింపవలెను. (24) కృతయుగమునకు 4000 సంవత్సరములు. నాలుగు వందల కృతయుగములు ఒక సంధ్య. సంధ్యతో సమానమైనదే సంధ్యాంశము.
ఇతర యుగముల సంధ్యలలోను సంధ్యాంశలలోను ఒకే సిద్దాంతములలోను సహస్రములు శతములు వర్తించును. (26) త్రేతా ద్వాపర యుగములు క్రమముగా మూఁడువేల వత్సరములు రెండు వేల వత్సరములు, మూడు వందల యేండ్లు రెండు వందల యేండ్లు క్రమముగా , సంధ్యా సంధ్యాంశలు కలిగియున్నవి. సంధ్యా సంధ్యాంశలు సమానములు: ద్విజోత్తములు కలియుగము ఒక వెయ్యి సంవత్సరములు అని చెప్పుదురు. దాని సంధ్య ఒక వంద సంవత్సరములు. సంధ్యాంశ సంధ్యతో సమానము. (28) నాలుగు యుగముల యందలి సంవత్సర సంఖ్యకలిసి, 12000 పండ్రెండు వేల దివ్యవత్సరములుగా చెప్పబడినది. ఆ నాలుగు యుగములు కృత త్రేతా ద్వాపర కలియుగములు.(29) ఈ విషయములో సంవత్సరములు మానుష ప్రమాణము ననుసరించి సరిచూడబడినవి. కృతయుగము యొక్క సంవత్సరములు చెప్పెదను. వానిని తెలిసికొనుము. (30) కృతయుగము 1440,000 మానుష సంవత్సరములు, త్రేతాయుగమునకు 1080,000 మానుష సంవత్సరములు, ద్వాపరయుగమునకు, 720,000 మానుష సంవత్సరములు. అట్లే కలియుగమునకు 360,000 మానుష సంవత్సరములు (34) ఈ పురాణము ననుసరించి యుగముల వత్సరపరిమితి
యుగము మానుష వత్సరములు
కృతయుగము 1440,000
త్రేతాయుగము 1080,000
ద్వాపరయుగము 720,000
కలియుగము 360,000
సంధ్యా సంధ్యాంశములతో మొత్తము 360,000 వత్సరములు
సంధ్యా సంధ్యాంశలతో 4320,000 సంవత్సరములు. (35, 36) ఈ విధముగా కృతవ్రేతాది నాలుగు యుగముల సంఖ్యను 71 మన్వంతర మందురు. (37)
మన్వంతర వర్ష సంఖ్య నెజుంగుఁడు. ఒక మన్వంతరములో మానుష గణనమును బట్టి 306,720,000 (ముప్పదికోట్లు అరవదియేడు లక్షల యిరువది వేల సంవత్సరములు). ఇంతకంటే నధికముగా లేదు. ఈ మన్వంతర ప్రమాణ గణనము, సంఖ్యా గణనముతో పరిచితులైన బ్రాహ్మణులచే స్మరింపఁబడినది. ఈ విధముగా మన్వంతరకాల సంఖ్య యుగములతో సహా కీర్తింపఁబడినది. (38,40) (మొదటి త్రేతాయుగమున, ఆ మంత్రములు తారకముతో (ఓంకారముతో) ఇతర నిదర్శనములతో వాని యంతట యవియే అబుద్ధి పూర్వకముగా, ఎట్టి ప్రయత్నము లేక సప్తర్షులకు, మనువునకు అభివ్యక్తము లయ్యెను. ఇది యంతయు, వారాచరించీన ప్రాకృతమయిన కృతయుగము నాలుగువేల సంవత్సరములతో యుక్తమయినది. ఇక మిగిలిన త్రేతాయుగ ద్వాపరయుగ కలియుగముల గూర్చి చెప్పెదను. (4) ఈ విషయము యుగపత్ (ఒకేసారి) చెప్పు వీలుకాదు. ఈ విషయము రెండు విధముల (ద్వీధా) చెప్పఁబడుటకు వీలులేదు. అదీ సంప్రదాయాను గుణముగ, క్రమముగా, యుగద్వయము ముందే నాచే చెప్పంబడలేదు, (42) నేను ఋషివంశ ప్రసంగముతో వ్యాకులముగా నుండుటచే అయ్యదీ చెప్పబడలేదు. త్రేతాయుగారంభమున ! మనువు, సప్తర్షులు వివిధ ధర్మములు చెప్పిరి. బ్రహ్మచే ప్రబోధితములయిన శ్రాతధర్మమునుఁ (శ్రుతులలో వేదములలో చెప్పఁబడిన ధర్మములు), సప్తరులు చెప్పిరి. అవి పెట్టిన పోరాగ్నిహోత్ర సంబంధములు; ఋక్ యజుస్సామ సంహితములు. (ఇవి శ్రేత ధర్మములుగా లక్షితములు). వీనిని సప్తర్షులు చెప్పిరి, పరంపరాగతధర్మము ఆచారలక్షణము, వర్ణాశ్రమాచార యుతములు స్వాయంభువుడైన మనువు చెప్పెను. వీనినాతఁడు సత్యముతో బ్రహ్మచర్యముతో శ్రుతితో అనుష్టానములతో సహితముగా చెప్పెను. (46)
తపస్సు చేతను వారియొక్క ఆర్షధర్మ క్రీయాచరణాదుల పురస్కారము చేతను నయినది. (47,48) ఆసిద్దులు (ఆధ్యాత్మిక శక్తులు, తత్ఫలితములు) మొదటి కల్పమున తమంతటతామే దేవతలకు సాక్షాత్కరించినట్టివి, సప్తర్షులకు మనువునకు ప్రాదుర్భవించెను. "పూర్వపు సిద్దులు ప్రణాశనము చెందినవి. ఇతర సిద్దులు ఫలింప ఆరంభమైనవి. గతించిన కల్పముల ఆవిర్భవించిన మంత్రములు, మరల నయ్యవి (మంత్రములు) వారి ప్రతిభతో సముపస్థితములయినవి. (49,50) ఋగ్వేద మంత్రములు, యజుస్సులు, సామవేదమంత్రములు మరియు ఆధర్వణమంత్రములు సప్తర్షులు వచించిరి. (ప్రోక్తములు, చెప్పుఁబడినవి). స్మార్త ధర్మమును (స్మృతియందు చెప్పబడిన ధర్మమును) మనువు వివరించెను. (51) త్రేతాయుగము యొక్క ఆరంభమున, అవిభక్తములయిన వేదములు (వేద సంహితలు) కేవలము ధర్మసేతువులు. (ధర్మము నకు ప్రమాణములు). వానీ యొక్క సంక్షేపణమున అనంతకాలమున ద్వాపరాదులయందు అవి పరిత్యక్తములు. (52) ద్వాపరాదీ యుగములలో ఋషులు వారియొక్క తపోబలముచే వేదముల నధ్యయన మాచరించిరి. వేదములు అనాదులు. ఆదిలేనివి. శాశ్వత సిద్దములు, అవి అవినాశనములు. అవి దివ్యములు. అవి స్వయంభువుఁడైన బ్రహ్మచే పూర్వము ఆవిర్భవింపఁబడినవి (సృష్టములు - ఇది విరుద్దము). (53) ఆ వేదములు సధర్మములు సవ్రతములు సాంగములు ధర్మాను గుణముగా ఋషులచే నధ్యయనము చేయబడుచుండెడివి. యుగాను గుణముగా సమానార్థము లైనను వేదవాదములు మారుచుండెను. క్షత్రియులు ఆరంభ యజ్ఞులు, వైశ్యులు హవిర్యజ్ఞులు. శూద్రులు పరిచారమే యజ్ఞముగా గలవారు. ద్వీజోత్తములు జపయజ్ఞము కలవారు. (55) అప్పుడు, త్రేతాయుగమున, అన్ని వర్ణముల వారు సంతుష్టులు. వారందరు ధర్మపాలితులు. ధర్మమును రక్షించినవారు. (పొలిత ధర్ములు), వారు క్రీయావంతులు (ధర్మక్రియల నాచరించిరి) సంతాన వంతులు, సంపత్సమృద్దులు; సౌఖ్యవంతులు. (56) క్షత్రియులు బ్రాహ్మణుల ననుసరించిరి. క్షత్రియులను వైశ్యులు అనుసరించిరి. వైశ్యులను శూద్రులనువర్తించిరి. ఒండొరులు పరస్పర అనుప్రతులుగా నుండిరి. (57) వారీ కార్య కలాపములు శుభవంతములు, అట్లే వారీ వర్ణములు ఆశ్రమములు శుభవంతములు. వారు మనసా కర్మణా వాచా పరిశుద్దులు. (58) త్రేతాయుగమున కర్మారంభములు ఫలరహితములు కావు. సిద్దిప్రదములు; ఆయుర్దాయము, మేధాబలము, సౌందర్యము (రూపము) ఆరోగ్యము, ధర్మశీలము అందరికీ సర్వ సాధారణ విషయములు. ఆ త్రేతాయుగమున వివిధ వర్ణాశ్రమముల వ్యవస్థను బ్రహ్మ యొనరించెను. (60)
మరల, ప్రజలు తమ అవివేకము (మోహము) వలన, పరస్పర విరోధభావమున ధర్మములనాచరించిరి. వారు మరల మస్తువును సమీపించిరి. (61) స్వాయంభువ మనువు, ప్రజాపతి. (ప్రజల కధిపతి). ఆతఁడు తల్డితీయొక్క యాథాతథ్యమును ఉన్న విధానమును చూచి, ధ్యానించెను. శతరూప యందు ఇరువురు పుత్రులను గనెను. (62) వారు ప్రియవ్రతుఁడు. ఉత్తానపాదుడును. వారు ప్రథమముగా రాజులు (మహీక్షితిద్వయము). అది మొదలు రాజులుదయించిరి. వారు దండ ధారులు. న్యాయ ధర్మముల పాలించిరి. (63) ప్రజారంజనము వలన పోరు నృపులయిరి. వారు ప్రజలను రంజించిరి. తుష్టి పరచిరి. ప్రచ్ఛన్న (రహస్య) పాపులయిన వారినీ ఆ నరాధిపులు వశవర్తులను చేసికొన శక్తులు కాలేదు. (64) వైవస్వతుఁడు (సూర్యసుతుఁడు) అయిన యముఁడు ధర్మరాజు. ఆతనిని పొరలు ధర్మనియంతగా (శాస్తగా) తలంచిరి. వర్ణముల యొక్క విభజనము త్రేతాయుగమున చెప్పబడినది. (65) అప్పుడే బ్రహ్మ సుతులయిన ఋషులు మంత్రములను సేకరించిరి. అప్పుడే యజ్ఞములు దేవతలచే ఆరంభింపఁబడినవి. (ఆచరింపఁబడినవి). (66) స్వాయంభువమన్వంతరమున సర్వసాధనములను సమకూర్చుకోనీ వానితో దేవతలు పూర్వము యజ్ఞమారంభించిరి. ఈ యజ్ఞ సాధన సామాగ్రి యమునిచే శుక్రునిచే, విశ్వభుజునిచే, శక్తిమంతుఁడైన దేవేంద్రునిచే సంపాదింపఁబడినవి. సత్యము, మంత్రము జపము, తపస్సు, ధర్మము (దానము) అనునది త్రేతాయుగ ధర్మములు. ధర్మ సహస్రాంతమున (యజ్ఞములు ఒకవేయి చేసిన తరువాత) అహింసా ధర్మము ప్రవర్తింప ఆరంభమగును. అప్పుడే శూరులు ఆయుష్మంతులు, మహాబలులు పుట్టుదురు. (69) ఆ మహాభాగులు వ్యస్తదండులు. ఎట్టి దండన రూప శిక్షలు లేనివారు. వారందరు ధర్మిష్ఠులు, బ్రహ్మవాదులు, పద్మపత్రాయతాక్షులు, విశాలమయిన వక్ష స్థలములు కలపోరు, పోరి యవయవములు (ఇంద్రియము) లన్నియును సుపుష్టములు, సుందరములు. (70)
త్రేతాయుగమున చక్రవర్తులు సింహములకే భయమును గలిగించు శక్తిమంతులు వారు శౌర్యవంతులు మత్తమాతంగ గాములు, మహా ధనుర్ధరులు. చక్రవర్తులు సర్వ లక్షణ సంపూర్ణులు; మఱి చెట్టంతటి శరీరపు చుట్టుకొలత గలవారు. మచెట్టంతటి బాహువులు గలవారు. మట్టిచెట్టంతటి వక్షస్థల వైశాల్యము గలవారు. (72) వారి యెత్తు మఱిచెట్టు వైశాల్యముతో సమానము. కాగా సమానమైన యెత్తు వైశాల్యము (చుట్టుకొలత) గల మట్టిచెట్టువలె పోరుందురని తెలియపలెను. (73) చక్రము, రథము, మణి, భార్య, ఐశ్వర్యము (నిధి) అశ్వము, ఏనుగు. ఇవీ సప్త రత్నములు. సర్వ చక్రవర్తుల రత్నములు (74) (ప్రపంచములో) ప్రాణహీనములయిన చక్రము, రథము, మణి, ఖడ్గము, శ్రేష్ఠ కవచము, పతోక, నిధి అను నీయేడును చక్రవర్తుల రత్నములుగా చెప్పుదురు, (75) ప్రాణీమంతములయిన భార్య, పురోహితుఁడు, సేనాని రథముల చేయుపోడు (రథకృత్) మంత్రి, అశ్వము, గజము (ఏనుగు) అను నేడును. చక్రవర్తుల రత్నములుగా చెప్పబడినవి. (76) ఈ రత్నములు దివ్యములు, మహాత్ములచే పొందఁబడినవి. (సుహాత్ములకు స్వయం సిద్దములు) ఈ పదునాలుగు రత్నములు చక్రవర్తుల కందరకు సమకూర్పదగినవి. (విధిగా కల్పింపబడఁ దగినవి) (77) పృథివి యందు చక్రవర్తులు విష్ణ్వంశమున పుట్టుదురు. జరిగిన మన్వంతరముల రాబోవు మన్వంతరముల నీది సత్యము. (78) చక్రవర్తులు గడచిన మన్వంతరముల పట్టిరి. వర్తమానమున నుండిరి. భవిష్యత్తున నుండగలరు. (79)
రాజుల విషయములో ఈ క్రింద చెప్పఁబోవునవి అత్యద్భుతముగాను శ్రేష్ఠములుగాను నుండవలయును. బలము (సైన్యము, శక్తి) ధర్మము (యోగ్యత గుణము) సౌఖ్యము, ధనము. (80) అర్థము, ధర్మము, కామము, యశస్సు, విజయము పరస్పరము విరోధము లేకయే నృపులచే పొందఁదగినవి. ఐశ్వర్యము చేతను, అమామహిమాద్యష్టసిద్దులచేతను, ప్రభుశక్తి చేతను, శ్రుతేన (విద్యాధిక్యము చేతను) తపస్సు చేతను రాజులు మునులను కూడ అధిగమించెదరు. (82) వారు (నృపులు) దేవతలను, దానవులను మానవులను బలము చేతను తపస్సు చేతను, కోరత్వము చేతను మీంచెదరు. వారు అమానుషములయిన శరీర స్ధములయిన లక్షణములచే కూడ జన్మించెదరు. (83) హరి శిరోజములు మృదువులు. లలాటములున్నతములు; ప్రమార్జనీ లక్షణము (పరిశుద్ధత్వము కలిగిన) జిహ్వ ఓష్ఠము నేత్రములు తామ్రప్రభ కలిగియుండును; వక్ష స్థలము శ్రీవత్స లాంఛితము; రోమములు (జగత్తు) పైకెగసి. యుండును. (84) వారు ఆజానుబాహువులు (మోకాళ్లనందుచేతులు గలవారు) హస్తములు తామ్ర వర్ణములు; నడుము భాగము సన్నము, న్యగ్రోధ పరిణాహము శరీర ఫౌల్యము. చేతులు పొడవుగా నుండును. వారు సింహ సంధులు; వారి మేహనము సింహమేహన తుల్యము. (85) వారీ గమనము (గతి) గజేంద్ర తుల్యము, పొరీ దవడలు (హనువులు) పెద్దవి. పాదములయందు చక్ర రేఖలు, మత్స్యరేఖలు కలవారు. హస్తముల యందు శంఖ పద్మ రేఖాలాంఛనులు. (86) ఎనుబదియైదువేల సంఖ్యగల రాజులున్నారు. ముసలితనములేకయే వారు ప్రకాశింతురు. చక్రవర్తుల గతులు ఆకాశమున, సముద్రమున, పాతాళమున, పర్వతములందు అడ్డులేనట్టివి. యజ్ఞాచరణము, దానము, తపము, సత్యము, ధర్మము రాజులకు త్రేతాయుగమున ప్రసిద్దములు. ధర్మము వర్ణాశ్రమ పద్దతిని అనుసరించి ప్రవర్తిల్లును. మర్యాదా స్థాపనార్థము దండనీతి ప్రవర్తించును. (87)
ప్రజలందరు సంతుష్టులు. ఆనందవంతులు. బలవంతులు; రోగరహితులు, ఆనంద పూర్ణమానసులు. త్రేతాయుగమున-వేదమొక్కటి. నాలుగు పాదములు కలిగినది. ఆ కాలమున మానవులు మూఁడువేలసంవత్సరములు ఆయుర్దాయము కలవారు. పుత్ర పౌత్రులను గలిగినవారు. ఆయుః క్రమము ననుసరించి మరణించువారు. ఇదీ త్రేతాయుగ ధర్మమని యెఱుంగునది. ఇఁక త్రేతాయుగమున సంధ్యను గూర్చి యెఱుం గుఁడు. త్రేతాయుగములలో సంధ్య నాలుగవ భాగమే ప్రవర్తిల్లును. ఇంకను త్రేతాయుగ సంధ్యాంశలో సంధ్యా లక్షణములలో నొక పాదమునకు దీగంజారినవి.
ఇదీ వాయుప్రోక్తము, మహాపురాణమునయిన బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున ద్వితీయానుషంగపాదమున సంఖ్యావర్తనమనెడి ఇరువదితొమ్మిదవయధ్యాయము.
