1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము

Table of Contents

20 - అధోలోక వర్ణనము

సూత ఉవాచ :-

సూతుఁడు చెప్పెను :

భూమియొక్క వాయువుయొక్క ఆకాశముయొక్క నీటియొక్క యైదవదయిన అగ్నియొక్క ప్రమాణముల నెరుంగుము. మును ముందు వాని ప్రమాణములను చేప్పెదను. (ఇవీ యింతకు పూర్వమే సప్రమాణముగా చెప్పబడినవి). ఈ భూతములు అనేకములయిన (అనంతమయిన) ధాతువులతో గూడినవి, అవి సర్వ వ్యాపకములుగా చెల్లుచున్నవి. జీవించుచున్న సర్వజీవులకు (సత్త్వములకు) తల్లి భూమీ అయ్యది సర్వ జీవులను భరించును; సర్వ జంతువులను భరించును. ఈ భూమి సానా విధములయిన జనపదములచే ఆకీర్ణమై యున్నది. అట్లే పత్తనములతో, కూడియున్నది. దానియందు ననేక విధములయిన నదనదీ శైలములున్నవి; అనేకములయిన జాతులతో నిండియున్నది. (3) దేవతా స్వరూపయయిన పృథివి బహువిస్తరయనుచు, నదీనద సముద్రములు గలిగి నదనియు, అవి క్షుద్రాశ్రయములతో గూడియున్నవనీయు అనంతగా కీర్తింపం బడినది. (4) జలములు కూడననంతములనీయే యెఱుంగవలెను. నదులలోని నీరు, సెలయేళ్లలోని నీరు, సముద్రములోని నీరు, గుంటలలోని నీరు, పర్వతోపరిభాగమున నున్న నీరు, ఆకాశము నందున్న నీరు, అంతర్భూమి గత జలములు అనంతములని గ్రహింపవలెను. అట్లే అగ్నిభూతము అది అన్నీ లోకముల ఆవరించియున్నది. ఇయ్యది సర్వ సంభవమై, సర్వా వ్యాపకముగా చెప్పబడినది. (5) అట్లే ఆకాశముకూడ, వర్ణింపశక్యము కానిది, రమ్యము, నానాశ్రయముగా అనంతముగా స్మరింపఁబడినది. (6) ఆకాశము నుండి వాయువు పుట్టినదీ, జలములు భూమియందు భూమ్యుపరీయందు నున్నవి. భూమి జలములయు పరీభాగమునున్నదీ. (7) ఆకాశము కంటే పెద్దదేదియును లేదు. తరువాత పెద్దది భూమి; తరువాత నీరు. భౌతికముల విషయమై అనంతమైన స్థితి యొండు లేదనెడి అభిప్రాయము కలదు. (8) భూతముల యొక్క పరస్పర సంబంధమున భూమి ఉపచీయమాన మగును. (వృద్ధి పొందును). భూమి, ఆపస్సు, ఆకాశముల యొక్క ఆయా పరంపర తెలిసినదియే సప్తమ రసాతలములో నీ స్థితి ప్రఖ్యాతమైనది. (9) రసాతలము దశసహస్ర యోజనముల దూరము భూమిని గలిగియున్నది. (10)

రసాతలము ఒకదానికంటే నోకటి వీరోలతరమైనదని సాధువులు పరిగణించిరి. మొదట రసాతలము అతలము తరువాత విద్యాతలము. అది బహు విస్తృతమైనది, తరువాతీది తలాతలము, అతలము (ఎతలం?) చాల విస్తీర్ణము కలది. దానికి క్రిండంగా తల (రసాతల) మున్నది (ఇదీ మహాతలము కానోపు) దాని తరుపోత రసాతలమున్నది. అది పాతాళము అని పాంపవలేను. వానిలో ప్రథమమైన భూమి భాగము నల్లని భూమిగా కృష్ణభూమిగా) ప్రకీర్తితము. (13) రెండవది పాండుభూమి. నాలుగవది పీతభూమి; ఇంక నైదవది గులకరాలతో గూడిన శర్మరా భూమి. (14) ఆవది శిలామయము. ఏడవది సౌవర్ణభూమి. ఇంద్ర శత్రువు అసురేంద్రుఁడు సయిన నముచీ యొక్క మందిరము ప్రథమమున రసాతలమున నున్నదీ. (15) మహానాథుని యొక్క మందిరము, శంకుకర్ణుని యొక్క నగరము, కబంధుని భవసము - ఇవి మొదటి రసాతలమున నున్నవి. (16)

ప్రహృష్ట జనములతో నిండిన నిష్కలాదుని పురము, రాక్షసుఁడయిన భీముని భవనము, శూలదంతుని భవనము, లోహితాక్షుల కాళింగుల భవనము, శ్వాపదుని యొక్క నగరము, ధనంజయుని యొక్క మహాత్ముఁడయిన నాగేంద్రునియొక్క నగరము, కాళీయునీ నగరము, కౌశికుని నగరము, (కలవు) ఇట్లే సాగుల యొక్క దానవుల యొక్క రాక్షసుల యొక్క నగరములు సహస్ర సంఖ్యలో కృష్ణ భూమియైన మొదట రసాతలము నున్నవనీ యెఱుంగవలయును. (19) రెండవ రసాతలమయిన సుతలమున (ఓ బ్రాహ్మణులారా) దైత్యులకు రాక్షసులకు మొదటి ప్రభువైన మహాజంభుని నగరము, హయగ్రీవుడయిన కృష్ణుని నగరము నికుంభుని మందిరము, శంఖ నామకునీ, గోముఖుని యొక్క పురము, రాక్షసులయిన నీలుని యొక్క మేఘుని యొక్క కదనుని యొక్క పురము, కుకుపాదుని యొక్క ఆలయము, మహోషీషుని యొక్క ఆలయము, కంబలుడు అను సర్పము యొక్క నగరము, అశ్వతరుని నగరము, మహాత్ముడయిన కద్రుని కుమారుఁడయిన తక్షకుని నగరము, ఇట్లే ఓ బ్రాహ్మణులారా! సర్పములకు, దానవులకు, రాక్షసులకు సంబంధించిన నగరములు. వేలాదిగా పాండు భౌమ వర్ణము గల నేల గల రెండవ రసాతలమున కలవు. తృతీయ రాసాతలమున మహాత్ముఁడయిన ప్రహ్లాదుని నగరము అనుహ్లాదుని నగరము, అగ్ని ముఖుని నగరము, తారకాఖ్యుని నగరము. అట్లే శ్రీశిరసునీ నగరము, శిశుమారుని పురము, త్రిపురుని నగరము, దైత్యుఁడయిన పురం జనుని నగరము - ఇవి యన్నియు హృష్టపుష్ట జనాకులములు (27) రాక్షసుఁడయిన చ్యవనుని పురము, కుంభీలుని ఖరుని పురము, కలవని యుంగవలేను. (28)

ఉల్కాముఖుని నగరము, క్రూరుడైన విరాధుని నగరము, హేమకుడయిన నాగుని పురము, అట్లే పాండురకుని పురము, మణినాగుని పురము, కపిలునీ మందిరము, సర్పరాజయిన నందకుని నగరము, విశాలాక్షుని మందిరము. (30) ఓ బ్రాహ్మణులారా ! ఇట్లే నాగదానవరాక్షసుల వేలకొలది నగరములు నీలపృథ్వీతో గూడియున్న తృతీయ రసాతలమున కలవు. (31) ఇక నాలుగవ రసాతలమున, దైత్యులలో సింహుఁడు మహాత్ముఁడగు కాలనేమి యొక్క గజకర్ణుని యొక్క కుంజరునీ యొక్క నగరములు. (31) రాక్షసేంద్రుఁడయిన సుమాలుని పురము బహు విస్తారమయినది. లోకనాథుఁడయిన ముంజుని యొక్క పురము, వృకవక్రుని పురము, వైనతేయుని యొక్క పురము. బహు పక్షులతో కూడినదీ, బహు యోజనవిస్తీర్ణమును కలది. ఇవి యన్నియు చతుర్థ రసాతలమున కలవు, ఇక పంచమ రసాతలమున, గులకరాలతో ఇసుకతో గూడిన బహుజన విస్తీర్ణమునమన్న భూమియందు బుద్ధిమంతుఁడు దైత్యసింహుఁడునయిన విరోచనుని యొక్క నగరము కలదు. (35) అంతియేకాక విద్యుదగ్నిజిహ్వలు కలిగిన హిరణ్యాక్షుని ఆలయము, రాక్షసేంద్రుఁడు ధీమంతుఁడును నయిన విద్యుజిహ్వుని యొక్క నగరము. (36) సహమేఘుని పురము, రాక్షసేంద్రుఁడయిన మాలినీ యొక్క పురము, నాగుండయిన కిర్మీరుని యొక్క స్వస్తికుని యొక్క జయుని యొక్క పురములు కలవు. ఈ విధముగా నాగదానవ రాక్షసుల యొక్క వేయి పురములు గులకరాలతో ఇసుకతో గూడిన భూమిగల పంచమ రసాతలమున గలవని యెఱుంగ వలయును. (38) ఇక ఆఱవ రసాతలమున నగరోత్తమమయిన కేసరి నగరము కలదు. ఆ కేసరీ దైత్యుల కధిపతి సుపర్వణుని యొక్క పులోముని యొక్క మహిషుని యొక్క మహాత్ముఁడు రాక్షసేంద్రుఁడు నయిన సురేషుని యొక్క నగరము కలదు. అచ్చటనే శతశీర్పుఁడు అయిన సురమాపుత్రుఁడు సంతోషముగా నుండును. (40) నాగరాజయిన వాసుకి శ్రీమంతుఁడు మహేంద్రుని యొక్క స్నేహితుఁడు అందే యుండును. (41) ఇట్లు నాగదానవ రాక్షసుల యొక్క వేలాది సగరములు విఖ్యాతము శీలాభూమియునయిన షష్ణరసాతలమున నుండును.

బలీయొక్క నగరము సప్తమరసాతలమున సున్నదని యెఱుంగ వలెను. ఇదియే తుది రసాతలము. (42) ఇయ్యది యన్ని ప్రపంచములకు చివరనున్నది. ఇయ్యది ఆనంద పరిపూరితులయిన నరనారీగణసమాకులము. ఇదీ అసురలతో నాగములతో కూడి యున్నది. సుఖులైన దేవశత్రువులతో గూడినది. (43) అందే దైత్యుఁడయిన ముచికుందుని గొప్ప పురము కలదు. అయ్యది అనేకులయిన దితిపుత్రులతో విరాజమాన మయిన నగరములతో, అట్లే కాంతి మంతము లయిన వేలకొలదీ నాగవరుల యొక్క దైత్యుల యొక్క దానవులయొక్క సముదీర్ణములయిన నగరములతో ప్రకాశములయిన అనేక రాక్షసావాసములచే సమాకులము. ఓ విప్రేంద్రులారా! బహు యోజనముల వరకు విస్తీర్ణమైన పాతాళాంతము (46) అందు మహాత్ముఁడు నాగములకు రాజును నయిన శేషుఁడు వసించును. అతఁడు రకారవిందాక్షుఁడు. జరామరణములు లేనివాఁడు; ఆతనీ శరీరము కడుగబడిన శంభోదరము వంటిది. ఆతఁడు నీలవసనముల ధరించును. ఆతఁడు మహాబలుడు. (47) ఆతని భౌతిక శరీరము చాల పెద్దది. ఆతఁడు ద్యుతీమంతుఁడు; వీవీధ వర్ణములు గల పూవుల మాల్యములను ధరించును. మిక్కిలి ఐలవంతుఁడు. బంగారు పర్వత శృంగమువలె తెల్లనైన, ప్రకాశవంతమయిన ముఖముతో విరాజిల్లును. (48) ఆ నాగ ప్రభువు ముఖ సహస్రములతో శోభించిన కుండలి (సర్పము). ఆతఁడు చలించునట్టి అగ్నిజ్వాలల వంటి జిహ్వామాలలచే ప్రకాశవంతుఁడు. (49) ఆతఁడు ద్విసహస్ర నేత్రములతో జ్వాలామాలలచే ఆ వృతమయిన కైలాసమువలె కనఁబడును. బాల సూర్యునితో తుల్యమయిన తామ్రవర్ణముతో, నేత్రములు శోభిల్లును. చంద్రుని వలెను శరీరము మల్లెవలె విరాజిల్లును. (51) ఆ నేత్రములతో నతఁడు బాలసూర్యుల మాలవలె శ్వేతపర్వత శిఖరమున ప్రకాశించును.

ఆతనికి అధికమయిన శరీరము కలదు. ఆ శరీరముతో తన శయనమున పండుకొని, ఆతఁడు భూమిపై అతి విస్తీర్ణము గలిగిన సహస్ర శిఖరములు గల పర్వతము వలెదోచును. ఈ మహానాగము, తాను స్వయముగా మహాతేజస్వి యయ్యు, మహ-విజ్ఞానవంతులు, మహా భోగములు (పడగలు) కలవారు, మహానాగులు నైన మహాత్ములచే సేవింపఁబడు చుండును. ఆతఁడే సర్వ నాగములకు రాజు. ఈతఁడు అనంతుఁడు, శేషుఁడు. అనంతద్యుతిమంతుఁడు. (54) అయ్యది విష్ణుని వ్యవహృతి (గొప్పకార్యము). అదియే పాతాళమునకు సుస్థాపితమయిన అవధి (హదు. ఈ విధముగా వర్ణించుటకు వీలయిన సప్త రసాతలములు చెప్పబడినవి. (55) అందు (ఆ రసాతలముల) దేవతల, అసురులు మహా నాగములు మరియు రాక్షసులు నివాసము చేయుచున్నారు. ఇంతకుమించి సిద్ధులకు సాధువులకు తెలియదు. (56) అయ్యది దేవతలకు కూడ తెలియదు. వ్యవహార వివక్షచే ఓ బ్రాహ్మణులారా ! మాచే భూమ్యాది పంచ భూతముల గోప్పందనము నిస్సందేహముగ వివరింపఁబడినది. తన్మహత్వము ఋషులచే నీ విధముగా వర్ణింపఁబడినది, అందు సంశయములేదు. ఇక ముందు సూర్యచంద్రుల యొక్క గతిని (గమనమును) చెప్పెదను.

ఇది వాయుప్రోక్తము, మహాపురాణమునయిన బ్రహ్మాండ పురాణమందలి పూర్వభాగమునందలి ద్వితీయానుషంగ పాదమున అధోలోక వర్ణనమను నిరువదవ అధ్యాయము.