1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

27 - భక్ష్య భక్ష్య పదార్థముల వివరణ

నారద ఉవాచ- నారదుడు ఇట్లు పలికిను-

ఓ ప్రభూ బ్రాహ్మణులు, గృహస్థులు, సన్యాసులు, వైష్ణవులు వీధవలు, బ్రహ్మచారులు తినతగిన వస్తువులు, తినతగనివి ఏవి? అట్లే ఏది చేయదగినది? ఏదీ చేయదగినది. ఏది అనుభవించతగినది? ఏది అనుభవించతగనిదీ, సర్వేశుడు ఎవరు? సర్వకారణమేదీ? వీటినన్నిటిని విస్తరముగా నాకు తెలుపవలసినది.

మహేశ్వర ఉవాచ- మహేశ్వరు డిట్లనెను-

 ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై తపస్వి కావచ్చును. అట్లే మరియొక ముని గాలిని మాత్రమే ఆహారముగా స్వీకరింపవచ్చును. ఇంకొకడు ఫలములను మాత్రమే ఆహారముగా తీసికొనవచ్చును. ఒక గృహస్థుడైన బ్రాహ్మణుడు భార్యతో కలిసి కాలనియమములతో అన్నమును తినవచ్చును.

ఈవిధముగా ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్క విధముగా నుండవచ్చును.

గృహస్థులైన బ్రాహ్మణులకు హోమమునకు సంబంధించిన అన్నము (హవిష్యానము) మిక్కిలి ప్రశస్తమైనదీ. నారాయణునకు నైవేద్యముగా పెట్టిన అన్నముకూడ శ్రేష్టమైనది. కాని నైవేద్యము పెట్టని అన్నము మాత్రము తినతగినది కాదు. విష్ణుమూర్తికి నైవేద్యమిడక తిన్న అన్నము, పానీయము మలమూత్రములవంటివి. అట్లే హరివాసరమైన ఏకాదశినాడు తిన్న ఆన్నము, త్రాగిన పానీయము కూడ మలమూత్రములవంటివే. ఏకాదశినాడు భోజనము చేసినవాడు ముల్లోకములందున్న పాపములనన్నిటిని అనుభవించును. ఏకాదశినాడు గృహస్ధాశ్రమముననున్న బ్రాహ్మణులు ఎట్టి పరిస్థితిలోను అన్నమును భుజించరాదు. జ్ఞానములేని బ్రాహ్మణ గృహస్థు, శైవుడైనను, శాక్తేయుడైనను ఏకాదశినాడు అన్నము తినినచో నరకమునకు పోవును. అచ్చట పదునలుగురు ఇంద్రుల కాలమువరకు క్రిమికీటముచే బాధింపబడును. మలమూత్రములను అనుభవించును.

అట్లే శ్రీకృష్ణాష్టమి దినమున, శ్రీరామనవమి, శివరాత్రి దీనములలో అన్నమును భుజించినవాడు ఏకాదశినాడు భుజించినవానీకన్న రెండురెట్లు అధికపాపమును పొందును.

ఫై దినములలో ఉపవాసము సంపూర్ణముగా చేయలేనివాడు పండ్లను, గడ్డలను, జలములను త్రాగవచ్చును. ఉపవాసముచేయు సామర్థ్యములేనివాడు బలవంతముగా ఉపవాసముచేసి చనిపోయినచో ఆత్మహత్య చేసికొనిన వాడగును.

విష్ణునివేదితాన్నమునుగాని, హవిష్యానమునుగాని ఒక సారి మాత్రము తననిచో ఆతనికి పాపమంటదు. పైగా అతడు ఉపవాసముచేసిన ఫలమును పొందును,

ఏకాదశీ దినమున ఆహారము తీసికొనని గృహస్థుడు బ్రహ్మదేవుడు బ్రతికియున్నంతవరకు వైకుంఠమున శ్రీహరి సన్నిధిలో నివసించగలడు. ఇది శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, యతులు, బ్రహ్మచారులు అనుసరించవలసిన పద్ధతి.

ప్రతిదినము శ్రీహరికి నివేదితమైన అన్నము తీను వైష్ణవుడు శ్రీవిష్ణువే యగుచున్నాడు. అతడు ప్రతి వంద ఉపవాసములు చేసినవారితో సమానమైన ఫలమును, జీవన్ముక్తుని ఫలమును పొందును. అట్టి పుణ్యవంతుని స్మర్శను పొందవలెనని సమస్త పుణ్యతీర్థములు, సమస్త దేవతలు కోరుకొందురు. ఆతనిని చూచినను, ఆతనితో మాట్లాడినను సమస్త పాపములు తొలగిపోవును.

రెండుమార్లు ఉడికించిన అన్నము (వేపుడు బియ్యము?) అటుకులు కొన్ని ప్రాంతములలో పరిశుద్ధమే ఐనను బ్రాహ్మణులు తినుటకుగాని భగవంతునకు నైవేద్యము పెట్టుటకు గాని పనికిరావు. అట్లే బ్రహ్మచారులకు, యతులకు, విధవలకు పై వస్తువులు పనికిరావు. బ్రహ్మచారులు మొదలైనవారు తాంబూలమును తిన్నచో ఆదీ గో మాంసభక్షణముతో సమానమైనదీ. అందువల్ల బ్రహ్మచారులు, సన్యాసులు, విధవలు తాంబూలమును తీసికొనకూడదు.

సామవేదమున ఆహ్నిక విషయమున శ్రీహరి చెప్పిన బ్రాహ్మణులు తినకూడని వస్తువులను నారదా! తెలిసికొనుము.

రాగిపాత్రలో పోసిన పాలు తాగినచో, తిని వదలివేసిన అన్నములో నేయి వేసికొని తీన్నదానితో సమానము. అట్లే పాలలో ఉప్పువేసికొని తాగినచో, అది గోమాంసమును తిన్నదానితో సమానము. కంచుపాత్రలో, రాగిపాత్రలో నున్న కొబ్బరినీరు, రాగిపాత్రలో పోసిన చెరుకురసము కల్లుతో సమానమైనవి.

ఎడమచేతితో నీళ్ళుత్రాగు బ్రాహ్మణుడు కల్లు తాగినవానితో సమానుడు. శ్రీహరికి నివేదితముకాని అన్నము, తినగా మిగిలిన అన్నము (భుక్త శేషము), త్రాగగా చెంబులోనో ఇతర పాత్రలోనో మిగిలిననీరు, ఆవుమారసముతో సమానమైనవి. - కార్తీక మాసములో వానీంగణ ఫలము మాఘమాసములో గడ్డకూరలు, ఆషాడమాసములో బచ్చలికూర తినకూడదు. ఆదేవిధముగా తాటిపండ్లు (ముంజలు). చీరు సెనగలు, చేపలు ఆన్నీ కాలములందును, అన్ని ప్రదేశములలోను, తినకూడదు. చేపలను తిన్న బ్రాహ్మణుడు మూడుదినములుపవాసముండి ప్రాయశ్చిత్తము చేసికొన్నగానీ పరిశుద్ధుడు గాలేడు.

ప్రతీపద (పాడ్యమి) తిథినాడు గుమ్మడికాయ, విదియనాడు బృహతీ పత్రములలో భోజనము, పొట్లకాయ తృతీయనాడు, చవితినాడు గడ్డకూరలు, పంచమినాడు . మారేడు, షష్ఠినాడు వేపపువ్వు తినుట, సప్తమినాడు తాటిపండ్లు తినుట, అష్టమినాడు కొబ్బరికాయ తినుట, నవమినాడు సొరకాయ, దశమినాడు తీగబచ్చలి. ఏకాదశినాడు పెసర్లు మినుములవంటి ధాన్యములు. ద్వాదశినాడు పూతిక, త్రయోదశినాడు వంకాయ, చతుర్దశినాడు మినుములతో చేసిన వస్తువులు, అమావాస్యా, పౌర్ణిమలలో మాంసము తినకూడని వస్తువులు.

గృహస్తులు పైన తెల్పిన దీనములు కాక మిగిలిన దీనములలో మాంసము తినవచ్చును. ఉదయము స్నానము చేయగానే పార్వణ శ్రాద్ధమున, వ్రతములనాడు ఆలనూనె లేదా పక్వము చేసి తీసిన నూనె ప్రశస్తమైనది.

అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి దినములు, అష్టమీ చతుర్థశీతిథులు, ఆదివారమునాడు, శ్రాద్ధదినము, వ్రతదినములలో స్త్రీ సహవాసము, మావులనూనె పనికిరానివి.

మాంసము, ఎఱ్ఱని కూరగాయలు, కంచుపాత్రలో భోజనము, ఇతర స్త్రీల పొందు, తాబేటిమాంసము నిషిద్ధములు. అట్లే అన్ని కులములవారు పగటిపూట తన భార్యతోనైనా సంగమము చేయరాదు. అదేవిధముగా రాత్రిపూట పెరుగుచేసికొని తినుట, పగటిపూట, ప్రాతః సాయంకాల సంధ్యలలో నిద్రపోవుట కూడనివి. ముట్టిన సీసంగమము పూర్తిగా వదిలి పెట్టవలెను. ఆది నరకమునకు కారణమగుచున్నది.

రజస్వలయైన స్త్రీయొక్క అన్నము, జారస్త్రీ పెట్టిన అన్నము, యాజకాన్నము, శూద్రాన్నము, శూద్రస్త్రీని ఉంచుకొనిన బ్రాహ్మణుని అన్నము, ధనమప్పుగానిచ్చి దాని వడ్డీ వలన బ్రతుకువానీ అన్నము, కరణముయొక్క అన్నము తినరానివి.

అట్లే ఆగ్రదాని లేక అత్యాశకుపోయి తొలుతనే దానము తీసుకొను బ్రాహ్మణుని అన్నము, వైద్యుని అన్నముకూడ భుజించకూడదు.

మూలానక్షత్రమున మృగశిరనక్షత్రమున, భాద్రపదమాసమందును మాంసము భుజింపరాదు. అది ఆ దినములలో గో మాంస సమమై ఉండును.

అమావాస్యనాడు, కృత్తికా నక్షత్రమునాడు ద్విజులు క్షారముచేసికోనకూడదు. క్షారము చేసికొనిన తరువాత, సీసంగమము తరువాత దేవతార్చన, పితృతర్పణము చేయకూడదు.

నారద! గృహస్థులు చేయతగిన పనులు, చేయతగని పనులు, తినతగినవి, తిన తగనివీ అన్నిటిని నీకు చెప్పితిని, ఇంకను వినవలసినవి ఏమైన ఉన్నచో అడుగుము.

శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణమున సౌతీశానకుల సంవాదముగల బ్రహ్మఖండమున నారదునకు శివుడుపదేశించిన భక్ష్యాభక్ష్యముల వివరణగల ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.