2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము

Table of Contents

20 - శ్రాద్ధకల్పము

బృహస్పతి రువాచ :-

ఇత్యేతే పితరో దేవా దేవానామపి దేవతాః ।

సప్తస్వేతే స్థితా నిత్యం స్థానేషు పితరోఽవ్యయాః ॥

ప్రజాపతిసుతా హ్యేతే సర్వేషాం తు మహాత్మనామ్ ।

ఆద్యో గణస్తు యోగానమనుయోగవివర్ధనః ॥

ద్వితీయో దేవతానాం మ తృతీయో దానవాదిసోమ్ ।

శేషాస్తు వర్ణినాం జ్ఞేయా ఇతి సర్వే ప్రకీర్తితాః ॥

దేవాశ్చైతాన్యజంతే వై సర్వజ్ఞానేష్వవస్థితాన్ ।

ఆశ్రమాశ్చ యజంత్యేనాంశ్చత్వారస్తు యథాక్రమమ్ ॥

సర్వే వర్ణా యజంత్యేకాంశ్చత్వారస్తు యదాగమమ్ ।

తథా సంకరజాత్యశ్చ మ్లేచ్చాశ్చాపి యజంతి వై ॥

పితౄంస్తు యో యజేద్భక్త్యా పితరః ప్రీణయంతి ।

పితరః పుష్టికామస్య ప్రజాకామస్య వా పునః ॥

పుష్టిం ప్రజాం చ స్వర్గం చ ప్రయచ్ఛంచి పితామహాః ।

దేవకార్యాదపి తథా పితృకార్యం విశిష్యతే ॥

దేవతానాం హి పితరః పూర్వమా ప్యాయనం స్మృతాః ।

నహి యోగగతిః సూక్ష్మా పితౄణాం జ్ఞాయతే నరైః ॥

తపసా హి ప్రసిద్ధేన కిం పునర్మాంసచక్షుషా ।

సర్వేషాం రాజతం పాత్రమథవా రజతాన్వీతమ్ ॥

పావనం హ్యుత్తమం ప్రోక్తం దేవానాం పితృభిః సహ ।

యేషాం దాస్యంతీ పిండాం స్త్రీన్భాంధవా నామగోత్రతః ॥

భూమౌ కుశోత్తరాయాం చ అపసవ్యవిధానతః ।

సర్వత్ర వర్తమానాస్తే ఫిండాః ప్రీణంతి వై పితృన్ ॥

యదాహారో భవేజ్జంతురాహారః సోఽస్యజాయతే ।

యథా గోష్ఠే ప్రణష్టాం వై వత్సో విందతి మాతరమ్ ॥

తథా తం నయతే మంత్రో జంతుర్యత్రావతిష్ఠతి ।

నామ గోత్రం చ మంత్రం చ దత్తమన్నం నయంతి తమ్ ॥

బృహస్పతి ఇట్లు చెప్పిను.

(వేదకాలములో పితృదేవతలు మూఁడు తరములవారు. కాని పురాణ కాలమున వారు వసువులుగా, రుద్రులుగా, ఆదిత్యులుగా విభజింపం బడిరి (తండ్రి, తండ్రితండ్రి, తండ్రితాత). తరువాత పురాణములలో పితృదేవతల సంఖ్య 7కు పెరిగినది. వారు ప్రజాపతి సుతులు. మహాత్ములందరియందు, మొదటి వర్గము (గణము) యోగుల యొక్క యోగశక్తిని వృద్ధిపొందించును. ద్వితీయగణము దేవతలది; మూఁడవ గణము దానవాదులది. మిగిలిన వారు వర్ణుల గణముగా నెఱుంగవలెను. ఈ విధముగా వారందరు చెప్పఁబడిరి, (3) సర్వజ్ఞానావస్థితులయిన పితరులను దేవతలు పూజింతురు. నాలుగు ఆశ్రమములు యధాక్రమము పితరుల పూజింతురు. ఆగమ విధానము ననుసరించి (శ్రుతీపద్దతిని) సర్వవర్ణములవారు పితరులను పూజింతురు. అట్లే మిశ్రమ జాతులవారు మ్లేచ్చులు కూడ వారిని పూజింతురు. ఎవరు ఏతరులను భక్తియుతులై పూజింతురో, పితరులు వారిని ఆనందపెట్టెదరు. సీతరులు, పితామహులు వారికి పుష్టినిచ్చెదరు; సంతాన మొసంగెదరు. అంతీయేకాక పుష్టికామునకు ప్రజోకామునకు స్వర్గము నొసంగెదరు. దేవకార్యముల కంటే పితృకార్యములు విశిష్టములయినవి. (7) దేవతల కంటే ముందుగా పితరులను తృప్తి పరుపవలయునని స్మృతులు వచించును. పీతరుల యొక్క యోగగతి చాల సూక్ష్మమయినది. ప్రసిద్ధమయిన తపస్సుచే నయినను దానినీ నరులు తెలిసికొనలేరు. (8) అట్టి పరిస్థితులలో చర్మనేత్రముచే పితరుల యోగగతిని తెలిసికొనుటకు సాధ్యమా ! దేవతలగుదురుగాక పితరులగుదురుగాక అందరికీ, వెండిపాత్రగానీ వెండిపాత్రతో గూడిన పాత్రగాని ఉత్తమమైనది. పవిత్రీకరించునది. బంధువులు మూఁడు పిండములను, తమ గోత్రములను నామముల నుచ్చరించుచు ఆరజత పాత్రలతో నొసంగెదరు. శాస్త్ర విధి ననుసరించి, నేలను దర్భలతో పరచి భూమి మీఁద కూడ పిండములను నీయవచ్చును. ఆ పిండములను పెట్టునప్పుడు అపసవ్యముగా యజ్ఞోపవీతము నుంచి మరి పెట్టవలయును. అట్లు పిండముల నెందు పెట్టినను పితరులు సంతోషించెదరు. (11) పితరులకు కల్పించు ఆహారము ఆ కర్తయొక్క ఆహారమే యగును. తప్పిపోయిన ఆవుదూడ (వత్సము) తిరిగి తల్లి కడకు గోష్టమునకే (గోశాలకే) వచ్చి చేరునో, అట్లే పితరులకు అర్పింపఁబడిన ఆహారము పితరులకే వచ్చి చేరును. ఆ జంతువు (ఆ వీతరుఁడు) ఎక్కడ నున్న నచ్చటకు ఆ మంత్రమే అర్పింపఁబడిన ఆహారమును తీసికొనిపోయి చేర్చును. నామగోత్రముల యుచ్చారణము ఆయాహారమును పితరులకడకు తీసికొనిపోవును. (13)

అపి యోనిశతం ప్రాప్తిస్తృప్తిస్తానను గచ్ఛతి ।

ఏవమేషా స్థితా సత్తా బ్రహ్మణః పరమేష్టినః ॥

పితృణామాదీసర్గే తు లోకానామక్షయార్థినామ్ ।

ఇత్యేతే పితరశ్చైవ లోకా దుహితరస్తథా ॥

దౌహిత్రా యజమానాశ్చ ప్రోక్తాశ్చైవ మయాఽనఘ ।

కీర్తితాః పితరస్తే వై తవపుత్త్ర యథాక్రమమ్ ॥

 శంయురువాచ :

అహో దివ్యస్వయా తాత పితృసర్గసు కీర్తితః ।

లోకా దుహితరశ్చైవ దౌహిత్రాశ్చ శ్రుతస్తథా ॥

దానాని సహ శౌచేన కీర్తితాని ఫలాని చ ।

అక్షయ్యత్వం ద్విజాంశ్చైవ సర్వమేతదుదాహృతమ్ ॥

అద్యప్రభృతి కర్తాఽస్మి సర్వమేతద్యథాతథమ్ ।

 బృహస్పతి రువాచ :

ఇత్యేతదంగిరాః పూర్వమృషీణాముక్తవాన్ ప్రభుః ॥

గతాని తత్ర వర్షాణాం పంచాశచ్చ శతాని వై ।

శ్లోకాశ్చాత్ర పురా గీతా ఋషిభిర్ర్బహ్మవాదిభిః ॥

దీక్షితస్య పురా సత్రే బ్రహ్మణః పరమాత్మనః ।

తత్రైవ దత్తమన్నాగం పితృణామక్షయార్థినామ్ ॥

లోకానాం చ హితార్థాయ బ్రహ్మణా పరమేష్ఠినా ।

సూత ఉవాచ :-

ఏవం బృహస్పతిః పూర్వం పృష్టః పుత్త్రేణ ధీమతా।

ప్రోవాచ పితృసర్గం తు యశ్చైవ సముదాహృతః ॥

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయోపోద్ఘాతపాదే శ్రాద్ధకల్పో నామ వింశతి తమోఽధ్యాయః॥

సమాప్తాశ్చాయం శ్రాద్ధకల్పః.

ఆ పితరులు శతయోనులలో శత సంఖ్య జన్మల నెత్తినను, వారిని తృప్తి అనుసరించును. పితరుల యొక్క ఆదీ సృష్టి యందు, 'అక్షయ' లోక స్థితిని అర్థించు పితరులకు పరమేష్టియయిన బ్రహ్మ యొక్క శక్తి యది : ఓ యనఘా ! ఈ విధముగా ఈ పితరులు, లోకములు, కుమార్తెలు, దౌహిత్రులు (మనుమలు యజమానులు (శ్రాద్ధము నాచరించువారు) నాచే వివరింపఁబడిరి, ఓ పుత్ర ! పితరులు నీకు యథా క్రమము వివరింపఁబడిరి. (16) శంయువు ఇట్లు చెప్పెను. అహో ! ఓ తండ్రీ ! దివ్యమయిన పితృసృష్టి యంతయు నీచే కీర్తింపఁబడినది, లోకములు, వారి కుమార్తెలు, వారి మనుమలు - అందరిని వింటిని. దానములు శౌచ విధాన సహితముగా పోనీ ఫలితములతో గూడ కీర్తింపఁబడినవి. ద్విజుల యొక్క అక్షయ్యత్వము సర్వము యథాతథము ఉదాహృతమయినది. నేఁడు మొదలుకొని వీనినీ యథాతథముగా చేయుదును. (కర్తనగుదును)

బృహస్పతి యిట్లనెను :

ఈ విధముగా పూజ్యుడయిన అంగీరో ఋషి పూర్వము ఋషులకు చెప్పెను. అప్పటి నుండి 5000 సంవత్సరములు గతించినవి. బ్రహ్మవాదులయిన ఋషులచే శ్లోకములు పఠింపఁబడినవి. వెయ్యేండ్లు సాగిన సత్రయాగమందు సంశయములను తీర్చుటకు వారలచే (ఆ ఋషులచే) యడుగబడి ఆ ఋషి చెప్పెను. ఆ సత్రమున సదసస్పతి (అధ్యక్షుఁడు) పరమాత్మయైన బ్రహ్మ. ఆ సత్రయాగమున బ్రహ్మ అగ్రేసరత్వము వహించెను. శాశ్వత లోకప్రాప్తినోరు పితరులకు అచ్చటనే ఆహారము (అన్నము) ఒసంగబడెను.

సూతుఁడిట్లనెను,

ధీమంతుఁడయిన తన కుమారునిచే అడుగబడి బృహస్పతి పితరుల యొక్క సృష్ట్యాదిని కూర్చి వివరించెను. అయ్యదియే ఇప్పుడు నాచే సముదాహృతమైనది.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమందలి మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమను ఇరువదవ అధ్యాయము సమాప్తము.