వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము

అధ్యాయము 20

ప్రాచీన కాలంలో దర్వి నాలుగు సముద్రాలను వెలయించాడు. వానిలో ఒక్కొక్క దానిలో స్నానం చేసిన వానికి గోసహస్ర దానఫలం లభిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తములారా! ఆ తీర్థాలలో చేసిన తపస్సు ఎంత స్వల్పమైనను ఎంతటి దుష్టుడు చేసిననూ పరిపూర్ణమవుతుంది. అక్కడే శతసాహశ్రిక శతికతీర్థాలు కూడా ఉన్నవి. ఆరెంటిలో స్నానం చేస్తే వేయి ఆవులు దానం చేసిన ఫలం దక్కుతుంది. అక్కడే సరస్వతీ తీరాన ఉన్న సోమతీర్తంలో మునిగినవాడు రాజసూయ యాగఫలం పొందుతాడు. రేణుకాశ్రమాన్ని సేవించిన శ్రద్దాళువు జితేంద్రియుడు మాతృసేవ చేసిన ఫలం పొందగలడు. బ్రహ్మ సేవితమైన ఋణమోచన క్షేత్రాటనం చేసిన పుణ్యుడు దేవర్షి పిత్రుఋణా లనుండి ముక్తుడౌతాడు. ఓజసతీర్థంగా వినుతిగాంచిన కుమారాభిషేక తీర్థాన మునిగినవాడు యశస్విఅవుతాడు. అచ్చట శ్రాద్ధ మొనరించినచో కుమారపుర ప్రాప్తి కలుగుతుంది. అక్కడ చైత్రశుద్ధ షష్టినాడొనర్చిన శ్రాద్ధం గయాశ్రాద్ద ఫలం యిస్తుంది. అంతేకాదు సన్నిహిత క్షేత్రంలో సూర్యగ్రహణవేళ చేసిన శ్రాద్దఫలం గూడ లభిస్తుంది. సందేహంలేదు. ఓజస క్షేత్రంలో చేసిన శ్రాద్ధం. అక్షయ ఫలమిస్తుందని పూర్వం వాయుదేవుడు చెప్పాడు. కనుక ఎలాగైనా ప్రయత్నించి అక్కడ చైత్ర షష్టినాడు చేసిన స్నానం పితరులకు అక్షయమైన ఉడక ప్రాప్తి కలుగజేస్తుంది.

అక్కడ ముల్లోకాల్లో ఖ్యాతిగాంచి యోగమూర్తియైన మహాదేవ నివాసమైన పంచవట తీర్థముంది. అక్కడ స్నానంచేసి మహేశ్వరుని అర్చించినచో గాణపత్యం సిద్దించి దేవతలతో కలిసి సుఖిస్తాడు. ఓ బ్రాహ్మణోత్తములారా ! అక్కడే భూమిదున్నుటకై కురురాజు ఘోరతపస్సు చేసిన కురుతీర్థం ఉంది. ఆయన చేసిన ఉగ్రతపస్సుకు సంతోషించి “రాజర్షీ ! నీ తపస్సుకు సంతోషించాను. ఈ కురుక్షేత్రంలో ఇంద్రయాగం చేసినవారు పాపరహితములయిన సుకృతిలో కాలము పొందుతారన్నాడు. అంతట నవ్వుతూ ఆ ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. అలాగే ఇంద్రుడు నవ్వుతూ మాటిమాటికి వస్తూ వెళ్తూ కురుతో మాట్లాడుతూ గడిపాడు. చివరకు తీవ్రమైన తపస్సు చేసి కురు తనదేహం పవిత్రం గావించికొనగా ఇంద్రుడు సంతోషంతో వచ్చి నీకేం కావలెనో కోరుకొనుమని ప్రేమతో అడిగాడు.

 “యీ తీర్థంలో శ్రద్దా భక్తులతో నివసించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలగాలి. ఈ తీర్థంలో స్నానం చేసిన వారలెక్కడ ఏ పాపాలు చేసినా పంచ పాతకాలు చేసినా సరే ముక్తులై పరమపదం పొందవలె. కురుక్షేత్రంలోని తీర్థాలన్నింటిలో కురుతీర్థం పవిత్రమైనది. బ్రాహ్మణులారా! దాని దర్శనమాత్రాన్నే పాపముక్తులై పరమపదం పొందుతారు. కురుతీర్థంలో స్నానం చేసినవాడు ముక్త పాపుడై కురువు అనుగ్రహంతో పరమపదం పొందుతాడు.

తర్వాత శివద్వారంలో ఉన్న స్వర్గద్వారానికి వెళ్ళాలి. అక్కడ శివద్వారంలో స్నానం చేస్తే పరమపదం లభిస్తుంది. అచట నుంచి ముల్లోకాలలో పేరొందిన అనరక తీర్థాన్ని చేరుకోవాలి. అక్కడ తూర్పు దిక్కున బ్రహ్మ దక్షిణాన మహేశ్వరుడు పశ్చిమాన రుద్రపత్ని ఉత్తరంగా పద్మనాభుడు ఉంటారు. మధ్యభాగాన అనరకమనే దుర్లభమైన తీర్థం ఉంది. అక్కడ స్నానం చేస్తే మహాపాతక ఉపపాతకాలన్నీ పోతాయి. వైశాఖషష్టి మంగళవారంనాడచట స్నానం చేసి పాపవిముక్తులు కాగలరు. అక్కడ నాలుగుపాత్రలలో అన్నము, అప్పాలతో నింపిన కలశాన్ని దేవతలకు ప్రీతిగా సమర్పించాలి. సర్వపాప నాశనానికి కలశదానం చేయాలి. ఈ విధంగా ఎవరు స్నానం చేస్తారో వారు సర్వపాపముక్తులై పరమపదానికి వెళ్తారు. షష్టితో కూడిన మంగళవారంరోజున యితరత్రాకూడా యీ విధంగా చేస్తే ముక్తి లభిస్తుంది. ఓ బ్రాహ్మణులారా! తీర్థాల్లో ఉత్తమ మైన ఈ తీర్థంలో స్నానం చేసిన నరుడు సర్వదేవానుమతుడై పరమపదం పొందుతాడు. పుణ్యదాయి అయిన కామ్య కవనంలో ప్రవేశించినంతనే సర్వపాతకాలు నశించి మానవుడు ముక్తి పొందుతాడు. ఆ వనంలో సూర్యుడు పురుషుడనే పేరుతో విరాజిల్లు తున్నాడు. ఆయనను దర్శించి నంతనే ముక్తి కలుగుతుంది. ఆదివారంనాడచటస్నానం చేయు నరుడు విశుద్ధదేహుడై మనోరథాలన్నీ సఫలంగావించుకుంటాడు.

అధ్యాయము 20 complete