వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము
అధ్యాయము 1
కురుజాంగల క్షేత్రంలో సరస్వతీ దృషద్వతీ వదులమధ్య ఆసీనుడైన రోమహర్షణ మునిని బ్రాహ్మణులా పవిత్ర సరోవర ప్రభావం తెలుపవలసినదిగా అర్థించారు. మహర్షే! ఆ సరోవర ప్రమాణం, అందలి తీర్థాలు, వాటి ప్రమాణం, అందలి దేవతల వివారంతో బాటు వామనుని జనన వృత్తాంతం కూడ తెలియజేయనగును. బ్రాహ్మణుల మాట విని ఆనందంతో దేహం గగుర్పాటు చెందిన రోమహర్షణుడు ప్రణమిల్లి యిట్లనియెను.
కమలాసీనుడైన బ్రహ్మకు లక్ష్మీసహితుడగు నారాయణునకు రుద్రదేవునకు నమస్కరించి బ్రహ్మసరోవర మహిమను చెప్పుచున్నాను. బ్రహ్మ పూర్వం, రంతుకం నుంచి ఔజసం వరకు పావనం నుంచి చతుర్ముఖ పర్యంతం వ్యాపించి సరస్సును సంనిహిత సరోవరమని చెప్పియున్నారు. ద్వాపరకలియుగాల మధ్య కాలంలో మహాత్ముడైన వ్యాస భగవానుడు సరోవర ప్రమాణం చెప్పియున్నాడు. అది వినండి. విశ్వేశ్వరం నుంచి ఆస్థిపురం వరకు జరద్గవికన్యనుండి ఓఘపతి వరకు సన్నిహిత సరస్సు వ్యాపించి ఉన్నది. నేను వామనపురాణం నుండి తెలుసుకున్న ప్రమాణ వివరాలు పరమ పుణ్యప్రదాలు. అవి కొద వినండి. విశ్వేశ్వరం నుండి దేవవరం, నరపావనం నుండి సరస్వతీ, వీనికి మధ్య విస్తరించిన అర్ధయోజన సరస్సే సంనిహితం. దాని నాశ్రయించుకొని దేవతలు ఋషులు తదితరులు స్వర్గమోక్షప్రాప్తికై ఆ పావన తీర్థాన్ని సేవిస్తారు. సృష్టి కార్యం సాగించుటకై యోగానిష్టుడై బ్రహ్మ దీనిని సేవించాడు. స్థితి కార్య నిర్వహణకై విష్ణువు యిచట తపించాడు. రుద్రుడీ సరోవర మధ్య భాగంలో ప్రవేశించి మహాతేజోవంతమైన స్థాణుపదాన్ని సంపాదించాడు. మొదట దానిపేరు బ్రహ్మవేది. తర్వాత రామహ్రదం. అనంతరం కురుమహారాజు దున్నినందున కురుక్షేత్రమైంది. ఆ కురుక్షేత్రం తరంతుక అరంతుక, రామహ్రద చతుర్ముఖాల మధ్య భాగాన విస్తరించి ఉంది. దానినే కురుక్షేత్ర సమంత పంచకమనీ, బ్రహ్మ ఉత్తరవేది అనీ అంటారు.
